కౌలు రైతుల క‌ష్టాలు

తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. భూమిని కౌలుకు తీసు కొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన ఏ మేలు అందుకోలేక పోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు,పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో, రికార్డు లలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. -గునపర్తి సైమన్‌
భారతదేశంలో 60శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35లక్షల మంది కౌలు రైతులు ఉం టారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70శాతం సాగు భూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో,రికార్డులలో పేరో ఉం టేనే ఏమేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతుల్షు నష్టపో తున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలు దారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు – సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970,80దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగా లకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో,పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంప న్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80శాతం వెనుకబడిన తరగతులు,దళిత కుటుంబాలకు చెందిన వారే.ఈసామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడిరది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి,ఇన్‌పుట్‌ సబ్సిడీ,పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి.ఈచట్టం ద్వారా 2011లో5లక్షల మందికి,2012లో నాలుగు లక్షల మందికి, 2016లో4లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో40శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి.ఈరుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజ మాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ఆరుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం,రాజకీ య సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయాలు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈచట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూయజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35లక్షల మంది కౌలు రైతులుఉండగా,ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతు లకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సికౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు.ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు ‘ఇ-క్రాపింగ్‌’ కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలు దారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు – వివిధ కమిటీలు

  1. మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని…2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
  2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం,సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని…నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ…అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
  3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
  4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
    రాష్ట్రంలో ఏం జరగాలి?
    ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80శాతం కౌలురైతులపై ఆధారపడి ఉన్నది.కౌలు రైతు లకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.ఈ నేపథ్యంలో భూ యజమానులు కౌలుపెంచి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ 425 తెచ్చి పేదలు సాగు చేస్తున్న దేవాలయ భూములకు బహిరంగవేలం పెట్టి ఎకరాకు రూ.30 వేల నుండి 60 వేలు పెంచారని పేర్కొన్నారు. దేవుని పేరు చెప్పి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన నూతన కౌలుచట్టం సబ్సిడీ పథకాలు పొందడానికి అవకాశం లేకుండా చేసిందని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులే పంట రుణాలు పొందుతున్నారని వివరించారు. కౌలు రైతులు ఎనిమిది లక్షల మంది ఉంటే రైతు భరోసా 50 వేల మందికి మించి ఇవ్వడం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకాలూ కౌలు రైతులకు వర్తింపజేయడం లేదని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయని తెలిపారు. ట్రాక్టర్‌ డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెరిగి సాగు ఖర్చులు గతం కంటే ఈ ఏడాది రూ.ఐదువేల నుండి రూ.ఏడువేలు అదనంగా పెరిగిందని వివరించారు. రైతులకు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని వివరించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ముందుగా కౌలు చెల్లించిన వారికి వచ్చే ఏడాదికి జమచేసుకునే విధంగా చూడాలని కోరారు.
    రుణాలకు బ్యాంకుల విముఖత
    కౌలు రైతులు కష్టాల కడలిలో ఎదురీదు తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభు త్వాల సాయం అందక పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. కష్టాలకోర్చి పంటలు సాగు చేసినా చివరి దశలో ప్రకృతి కన్నెర్ర చేయడం, మద్దతు ధర లభించకపోవడం, ధాన్యం విక్ర యాల్లో ఇబ్బందులు ఎదురవడం వంటివి కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టా దారులకే వరంగా మారాయి.కౌలు ధరలు కూడా పట్టాదారు రైతులకే లాభాలు చేకూరు స్తున్నాయి. భూ తల్లిని నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం ఆర్థిక భరోసా లేక దిగుబడిపై నమ్మ కంలేక ప్రకృతిపై భారం వేసి సాగుబడి చేస్తు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 60 వేల మందికిపైగా కౌలు రైతులు ఉపాధి పొందుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వ పథకాలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందని పరిస్థితి. దీంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇస్తున్నారు. కనీసం కౌలు ధరలు కూడా తగ్గించడం లేదు. ఏటా పెంచుతూనే ఉన్నారు. భూమి, నీటి వసతిని బట్టి కౌలు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కౌలు విధానం కూడా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు ధరలతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు వరికోతలు, పత్తి ఏరడం, కలుపు తీయడం వంటి సమయాల్లో కూలీల కొరత అదనపు భారంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టాన్ని చవిచూసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
    ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా కౌలు రైతులకు నోటికి.. చేతికి దూరం తగ్గడం లేదు. కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్భాలే ఎక్కువ. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌) కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసంగా అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌ కార్డు ఉండాల్సిందే. వీటన్నిటికి ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకు అర్హత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైందని… ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమకు సీపీఆర్‌ కార్డులు అందుతాయని కౌలు రైతులు అంటున్నారు.
    సకాలంలో అందేనా?
    జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు మొదలయ్యాయి. సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలకు తోడు, ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా చేదోడుతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. వారికి ఏ ఆసరా లేదు. ప్రభుత్వం ఏటా వారికి అందించే సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్‌ చేయించు కోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రా లను కౌలు రైతులు సమర్పిస్తే వీఆర్వో ఆమో దంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగి కార్డులు అందేసరికి జూన్‌ ముగిసిపోవడం ఖాయం. దీని వల్ల కౌలు రైతుల సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందదు. సొంత భూమి ఉన్న రైతులే ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతోంటే సీసీఆర్‌ కార్డులు లేని కౌలు రైతుల కష్టాలు ఊహించవచ్చు.
    అవగాహన లేకపోవడమే..
    సీసీఆర్‌ కార్డులు అందరికీ అందకపోవడానికి కారణం భూ యజమానులకు వీటిపై అవగాహన లేకపోవడమే. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సీసీఆర్‌ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 10 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
    ఏటికేడు తగ్గుతున్న కౌలు రైతులు..
    వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. దీని వల్ల కౌలు రైతుల సంఖ్య జిల్లాలో బాగా తగ్గిపోతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. తీరా ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించాల్సిందే! మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది కౌలు వ్యవసాయం చేయడానికి సాహసించడం లేదు.
    అంతంత మాత్రంగానే..
    జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 25 నుంచి 30 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో సీసీఆర్‌ కార్డులు చాలా కొద్ది మందికే ఉన్నాయి. గత ఏడాది ఉమ్మడి జిల్లాలోనే ఈ సంఖ్య 35 వేలు దాటలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో. సీసీఆర్‌ కౌలు రైతుల కష్టాలన్నింటినీ తీర్చే సంజీవని అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే అందించే బీమా…దిగుబడు లకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ లింకు తప్పనిసరి. గత ప్రభుత్వంలో ఈ మెలిక లేకపోవడంతో కౌలు రైతులకు కొన్ని ఫలాలు అందేవి. రైతు సంక్షేమమే తమ ధ్యేయ మని వల్లె వేసే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ప్రక్షాళనల వల్ల కనీ సంగా కూడా తమను మేలు జరగడం లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.