ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత్రి డా:కపిలభారతి కలం నుంచి జాలువారిన ‘‘ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం’’- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

‘‘సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే కొన్ని పుస్త కాలు నుంచి విషయం తర్జుమా చేసుకుని వ్రాసే ఎత్తి పోతల పథకం’’అనే చిన్న చూపు ఉంది, కానీ ‘డా: కపిల భారతి‘తనదైన అధ్యాపక జీవనంసాగిస్తూ ఇష్టంతో కష్టం లేకుండా చేసిన పక్కా పరిశోధన గ్రంథం ‘ కొండరెడ్డి గిరిజనుల జీవనం’ భాషా సాహిత్యాలు’’
దీర్ఘకాల క్షేత్ర పర్యటనలు, బహుకాల అధ్యయ నంతో కలగలిపి చేసిన ప్రామాణిక పరిశో ధన ఈ గ్రంథం.గిరిజనుల జీవన విధానం సాంస్కృ తి సాంప్రదాయాల గురించి ఇప్పటివరకు చాలా పరిశోధనలు జరిగాయి, వీటికి భిన్నంగా మౌఖిక సాహిత్యం మాత్రమే గల గిరిజనుల యొక్క భాషా సాహిత్యాల గురించి పరిశోధన చేయడం నిజంగా ఒక సాహసమే.!!
భారతదేశంలోని భిన్నమైన గిరిజన తెగల్లో ఒకటైన’’కొండరెడ్డి’’గిరిజన తెగను తన పరి శోధన వస్తు వుగా ఎంచుకోవడంలో అంతరార్థం పరిశోధకురాలు జన్మభూమికి చేరువలో సంబంధిత గిరిజనతెగ ఆవాసాలుఉండటం,ప్రధాన కారణం, దరి మిల పరిశోధకురాలు స్వయంగా ఆ ప్రాంతా లు సందర్శించడమే కాక అక్కడి కొండరెడ్డి గిరిజను లతో మమేకమై వారితో తాత్కాలిక జీవనంచేసి వారి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి వంద లాదిఫోటోలు,అనేకపాటలు,సంభాషణలు, రికార్డుల రూపంలో భద్రపరచడంతో పాటు వారితో అనేక సార్లు చర్చలు జరిపారు. ఆయా సారాంశాలను కూడా జాగ్రత్త చేసుకుని తన పరిశోధనకు అవసర మైన సరంజామా సమ కూర్చుని,ఆత ర్వాత మార్గ నిర్దేశకుల సూచనలు అనుసరి స్తూ ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేసిన సంపూర్ణ ఆదర్శవంతమైన పరిశోధనాగ్రంథం ఇది. దీనిని మొత్తం ఐదుఅధ్యాయాలు విభజిం చారు మొ దటి అధ్యాయంలో సర్వసాధారణమైన గిరిజ నుల పరిచయం,పూర్వపరిశోధనలు, పద్ధతి, లక్ష్యాలు,తెలుపుతూ కొండరెడ్డి గిరిజనులఉనికి, నివాసప్రాంతాలు,జనాభా,తదితర ప్రామాణిక లెక్కలు పొందు పరిచి తద్వారా భావి పరిశోధ కులకు సమాచార కేంద్రంగా చేశారు. ఇక రెండవ అధ్యాయం మొద లుకొని పరిశోధకు రాలు అసలు కృషిప్రారంభమై భాష విశేషాలు గల ఐదవ అధ్యాయం వరకు కొన సాగుతుంది. ఒక రకంగా చెప్పాలఅంటే దీనిని ‘కొండరెడ్ల సంపూర్ణ మార్గదర్శి’అనాలి.కేవలం కొండ ప్రాం తాల్లో మాత్రమే నివసించేవారు కనుక వీరికి ఆపేరు వచ్చిఉంటుంది అనేభావంతో సరి పెట్టు కోకుండావారి జీవనవిధానంలో ప్రధాన భూమి క గల‘నాగలి రహితవ్యవసాయం’ అయిన పోడు వ్యవసాయం గురించి ప్రస్తావన తీసుకు వచ్చా రు.నల్లమలచెంచులకు,తూర్పు కనుమ ల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ఈకొండరెడ్లకు సారూప్యత కనిపిస్తున్న ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆధునిక సమాజం ద్వారా ప్రభావితం అవుతున్న గిరిజన తెగల్లో అతిఎక్కువ ప్రభావిత గిరిజన తెగగా ,‘కొండ రెడ్లను’ పేర్కొన్నారు పరిశోధకురాలు. కొండరెడ్ల సంస్కృ తిలో వారిఇంటి పేరు గోత్రాలకు ప్రధాన పాత్ర ఉంటుంది.సాధారణంగా వాహనాలకు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్నట్టుగానే వ్యక్తు లకు, కుటుంబాలకు,సమూహాలకు,ఇంట పేర్లు గోత్రాలు ఉంటాయి, పండుగలు పెళ్లిళ్లు చావులు సందర్భా ల్లో వీటి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది,కొండ రెడ్డి కుటుంబవ్యవస్థ,వివాహవ్యవస్థ,గ్రామ పాల న వ్యవస్థలతో ముడిపడిఉన్న వారి ఆచార సాంప్ర దాయాలు కూలంకషంగా వివరించారు. పుట్టుక నుంచి మరణంవరకు కొండ రెడ్ల జీవన వ్యవస్థ తీరుతెన్నులు,సంతృప్తికరంగా వివరించారు. అంతే కాక ప్రాంతాలను బట్టి ఆయా గ్రామాలు పంచాయ తీల వారీగా జనాభా లెక్క లు కూడా పొందుపరచ డం ఇందులోని ప్రత్యేక తల్లో ఒకటి. ఈ కొండ రెడ్ల జీవనంలోగల సంఫీు భావంగురించి చెబుతూ వారు వారి సమీప ఇతర తెగలైన ‘నాయకపోడు’ గిరిజనతెగల వారితో కలిసి చేసే‘కొర్రాజులకోపు’ వంటి ఉత్సవాలు,పండుగలు, గురించిన ప్రస్తావన కూడా చేశారు. పోడు వ్యవ సాయం,వేట,అటవీ ఉత్పత్తుల సేకరణ,ప్రధాన పను లుగా జీవనం సాగిస్తున్న వీరు ‘సంచారజీవన విధా నం నుంచి సాగు విధానం వైపు‘మళ్ళిన వారిలో మొదటి వారుగా పేర్కొనవచ్చు.వీరు అటవీ ఉత్ప త్తుల సేకరణలో అంతర్భాగంగా వైద్యానికి అవసర మైన మూలికలు కూడా సేకరించి వైద్యం చేస్తారు, దరిమిలా వీరిని వైద్యులుగా కూడా పరిగణించ వచ్చు.జీవన విధానం మూడవ అధ్యాయంతో ముగించి,నాలుగవ అధ్యాయంలో ఈ పరిశోధనకే శిఖరాయమానం అయిన ‘కొండరెడ్డి మౌఖిక సాహి త్య ప్రస్థానం’ప్రారంభించారు.దీనిలో కథలు, పాటలు,పొడుపు కథలు,సామెతలు,భాషాంశాలు, ప్రధాన సాహిత్య అంశాలుగా చెప్పారు. ‘సాతరా లు’ అని గిరిజనులు పిలుచుకునే కథల్లో కల్పన, భావ ప్రకటన, మానసిక సంఘర్షణకు,ప్రాధాన్యత ఇవ్వబడతాయి దయ్యాలు, భూతాలు,అడవి జంతు వులు,సర్వసాధారణమే!!ఇందులోని కథలను మొదట కొండ రెడ్లు మాట్లాడే మాండలిక భాషలో రాసి తరువాత అందరికీ అర్థమయ్యే తెలుగులో వివరణ అందించారు. దీనిద్వారాసాధారణ తెలు గు భాషకు, కొండరెడ్డి గిరిజనులు ఉపయో గించే తెలుగు భాషకుగల వ్యత్యాసం సారూప్యత తెలుసు కునే అవకాశం ఉంది, వీటి సేకరణలో పరిశోధ కురాలు చేసిన పరిశ్రమ అడుగడుగునా అగుపి స్తుంది.ఇది ఆదర్శనీయమైన పరిశోధనగా చెప్ప డానికి కారణం అవుతుంది. ప్రతి కథ కొండరెడ్ల తెలుగుభాష మాడలికంలో చెప్పి అనంతరం తేట తెలుగులో వ్రాసి ఊరుకోకుండా ప్రతి కథకు చక్కని విశ్లేషణ అందించడంలో కూడా పరిశోధకురాలు సఫలీ కృతురాలు అయ్యారు. వీరి‘సాతురాలు’అన్ని భూమికి,ప్రకృతికి,సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎక్కువ కథల్లో మనం అనేకసార్లు విన్న జానపద కదలే కనిపిస్తాయి. ఇక పాటలు విషయానికొస్తే కొండరెడ్లు శ్రమైక జీవన సారథులు, శ్రమను మరిపించేది పాట అలావారి శ్రమజీవనంలో పండుగలు,జాతర్లువంటి సామూహిక కార్యక్రమాల్లో పాటలు వారికి అంతర్భాగమై ఉంటాయి. ఈ పాట ల్లో కూడా జానపద బాణీలు కనిపిస్తాయి. సామూ హిక జీవనంలోని విలువలు చాటేవిగా ఈ పాట లన్నీ కనిపిస్తాయి. మన జానపద సాహిత్యంలో అనుభ వాలకు అద్దంపడుతూ ఆలోచింపజేసే ఒక రకమైన ‘అక్షరక్రీడ’ కొండరెడ్లు పొడుపు కథను వారిదైన మాండలిక ధోరణిలో ‘జిటేల్‌’అని పిలు స్తారు, వీరి జీవనశైలికి అద్దం పట్టే ఈపొడుపు కథల్లోని సంక్షిప్తీ కరణ చిత్రంగా ఉంటుంది. ‘ఎక్కలేని చెట్టుకు లెక్క లేని కాయలు’ అని అడవి మిరప చెట్టును ఉద్దేశించి చెప్పే పొడుపు కథ. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఈ చెట్టు ఎక్కలేము కానీ బోలెడు మిరపకాయలు కాస్తుంది.‘గనుపు లేని గంగ వెదురు’ కనుపులు లేకుండా తలపై పెరిగేతల ‘వెంట్రుక’ను ఉద్దేశించి ఈపొడుపుకథ చెబుతారు.ఇక కొండరెడ్ల సామెతలు కూడా వారి జీవనవిధానం నుంచిఆవిర్భవిస్తాయి. ‘విరిగినకత్తి కమ్మరింటికి-మనువు చెడితే పుట్టింటికి’ ‘అందిన వానికి ఆకు వెయ్యి అందని వాడికి కేక వెయ్యి’ వంటి సామెతలు వాడుతారు,అలాగే వారి జీవనంలో అంతర్భాగమైన నృత్యంకోసం ఉపయో గించేవాయిద్యాల గురించి చెబుతూ‘దామగు త్తులు’ అనే గొట్టికాయలతో గిరిజనులు మాత్రమే తయారు చేయగల వాయిద్య విశేషాన్ని సచిత్రంగా పరిచ యం చేశారు. చివరి అధ్యాయమైన ఐదవ అధ్యా యంలో కొండరెడ్డి గిరిజనులభాషా విశేషాలు వివ రణ చేశారు.సాధారణంగా వీరు మాట్లాడేది తెలు గు భాష అయినా అందులో ప్రాచీన తెలుగు పదా లు,శాసనాల్లో కనపడే భాషా పదాలు, కూడా వీరి భాషా మాలికంలో అడుగడుగునా అగుపిస్తాయి. ఈ భాషలో‘ట’కారం బదులు ‘త ’కారం పలకడం, అచ్చులు హల్లు వాడకంలో మార్పు మొదలైన విష యాలు రేఖామాత్రంగా చర్చించి విస్తృత పరిశోధ జరగాల్సిన అవసరాన్ని ఆవిష్కరింపజేశారు.
ఇలా సాధారణ గిరిజన జనజీవనం లోని ఈపరిశోధనలో అనేక అసాధారణ అపురూప విషయాలు ఆవిష్కరించబడి విలువైన పరిశోధన గ్రంథంగా రూపొందించబడిరది. ప్రస్తుతం పరి శోధన గ్రంథాలన్నీ ఎక్కువగా విశ్వవిద్యాలయ గ్రంథాలయ గదులకే పరిమితమై వాటి విలువలు నిర్వీర్యం అవుతున్న వేళ, వ్యయ ప్రయాసలకోర్చి పుస్తక రూపంలో ప్రచురించి అందరికీ అందు బాటులోకి తీసుకువచ్చిన పరిశోధక రచయిత్రి డా: కపిల భారతి కృషి అభినందనీయం ఆచరణీయం, కొండరెడ్డి గిరిజనుల జీవనం