కొఠియా గ్రామాల వివాదంపై ఆంధ్ర‌-ఒడిశా జాయింట్ క‌మిటీ

ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలావేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి. దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్‌ కార్డులు, రెండు పింఛన్‌ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు. ఈ గ్రామాల కథేంటి? వీటిపై రెండు రాష్ట్రాలకూ ఇంత ప్రేమ దేనికి? అనే అంశాలపై సమగ్ర కథనం.!                                                                                                                        సర్వేతో మొదలైన సమస్య…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్‌ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ,అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించి నప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామా లు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీం కోర్టు ఓప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్‌ జిల్లా జడ్జి అధ్యక్ష తన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందు లో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు,న్యాయ వాదులు ఉన్నారు. కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్ల మెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచిం చింది.
ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు… మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కి చేరిందని కొటియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్‌ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు బీబీసీతో చెప్పారు. ‘1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ,ఒడిశా, మధ్య ప్రదేశ్‌,బిహార్‌ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయిం చేందుకు గిల్‌.జి అనే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహిం చారు. ఇందులో ఏపీ,ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా…కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చ లేదు. అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే…కోర్టు స్టేటస్‌ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరి ష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు. ఏపీ తరపున ఈ సమస్యపై పని చేసిన ఆర్జేడీ చనిపోయారు. కాకినాడకు చెందిన మరో సర్వే యర్‌ చలపతిరావు రిటైర్డ్‌ అయి పోయారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను,చలపతి రావు మాత్రమే ఉన్నాం’’ అని ఆయన తెలిపారు.
పథకాలు ఆంధ్రా…పనులు ఒడిశా…
గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్ని కల్లో ఓటేసిన ఈ గిరిజనం..ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును విని యోగించుకున్నారు.కొటియా,కురిటిభద్ర, మడ కార్‌,డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు….నేరేళ్లవలస,ఎగువశెంబి, దిగు వశెంబి,ధూళిభద్ర,మూలతాడివలస,పగులు చెన్నేరు,పట్టుచెన్నేరులు,సొలిపిగుడ,శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటా యి. మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.దీంతో ఏ రాష్ట్రా నికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆరాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశారాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది.ఎందుకంటే రోడ్లు వేయడంతోపాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు,ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా…తెలుగు భాషలో అరుదు గా బోర్డులు కనిపిస్తాయి. అయితే రెండు రాష్ట్రా ల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామా ల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభు త్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వా న్ని నమ్ముకుంటున్నారు.‘‘మమ్మల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయించింది. గత ఏడాది వరకు మా గ్రామాలకు ఎక్కడికి వెళ్లాలన్నా రాళ్లు రప్పులు తేలిన దారుల్లోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త తారు రోడ్లపై వెళ్తున్నాం. అలాగే ఒడిశా మాకు ఇళ్లు కూడా కట్టించింది. మాకు రెండు ప్రభు త్వాలు కావాలి. రెండు ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే…వాళ్లు ఏరాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటాం. అప్పటి వరకూ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తాం’’ అని కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు నివాసి బుట్రూ చెప్పారు.వివాదస్పద కొటియాలో రాజకీయాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యట నలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించ నున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనది కాని ప్రాంతంపై పట్టుసాధించేందుకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుటికే ఒడిశా సరిహద్దులోని అనేక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమించుకుంది. ఇది పూర్తిగా ఒడిశా ఇంటిలిజెన్స్‌ విభాగం వైఫల్యం. ఒడిశా ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి… కేంద్రం తో మాట్లాడి భూభాగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటీకే ఒడిశా సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిసింది. ఈ ప్రాంతాలను ఒడిశా సాధించే వరకు పోరాటం ఆపకూడదు. దీనికి పూర్తిగా సహకరిస్తుంది’’ అని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచా యతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021)హైకోర్టులో పిల్‌ నమోదైంది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్‌ వేశారు.
కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా…?
కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా…అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటి యా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభు త్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?ఈ ప్రాం తంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని…వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని… అందుకే ప్రభుత్వా లు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు. ‘‘ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహ స్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది. అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే… కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోక పోతే… ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా… భవిష్యత్తులో సమ్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని స్థానిక వామపక్ష నాయకులు కిల్లి సురేశ్‌ చెప్పారు. కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా అనే విషయంపై ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు వెల్లడిరచారు. ‘‘తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పు కున్నా…లేకున్నా…ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజా లున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకో వాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధి లోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము,లైమ్‌ కంకర,క్వార్జ్‌,గ్రానెట్కట్‌, రంగు రాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల,జంతుసంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్‌ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు చెప్పారు.
ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది’
మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు. ఏపీ ప్రభు త్వం కొటియా గ్రామాల విషయంలో పోరాటం చేయడం లేదని…అలాగే అక్కడ ఏపీ ముద్ర వేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి గురించి స్థానిక ఎమ్మేల్యే రాజన్నదొర తెలిపారు. ‘‘వివాదస్పద కొటియా గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోకి కొటియా ప్రాంతాలు వస్తాయి. బ్రిటిష్‌ హయంలో ఈ ప్రాంతాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేవి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాలు తమవని వాదించేది. అయితే దీనిని మద్రాస్‌ ప్రెడిడెన్సీ ఖండిస్తూ ఉండేది. బ్రిటిష్‌ హయాం నుంచి ఈ గ్రామాలను సాలూరు మండల పరిధి భూ భాగంలో చూపించారు. 1942లో జరిగిన గిల్‌ సర్వే ప్రకారం కూడా అదే వర్తిస్తుంది. గతంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహించవద్దని బీజేపీతో పాటు ఒడిశాలోని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం తరపున ఎన్నికలు జరగడం ఇదేమి కొత్త కాదు. నేను పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఏపీ గవర్నమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనికి సుప్రీం కోర్టు లేదా పార్లమెంట్‌ పరిష్కారం చూపాలి. ఒడిశా మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం కోసం….ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేసి మేమే వేశాం అని చెప్పుకుంటోంది. నిజానికి అక్కడున్న అపారమైన ఖనిజ సంపదను కొల్లకొట్టేందుకే ఒడిశా ఈ డ్రామాలు ఆడుతోంది’’ అని సాలూరు ఎమ్మేల్యే పీడిక రాజన్నదొర చెప్పారు.
‘కొటియా అభివృద్ధే లక్ష్యం’
‘‘ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. అంతా సజావుగా ఉంది. అధికారులు నిరంతరం గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసు కుంటున్నారు. ‘‘కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది.కోరాపూట్‌ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951 లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్ల మెంట్‌ ఎన్నికలు నిర్వహించింది. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొటియా మాది అనడం హాస్యా స్పదం. దీనిపై ఇటీవలే సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేసి చూపించాం. కొటియా గ్రామాల అభివృద్ధి,అక్కడి గిరిజనుల బాగోగుల కోసం కొటియా ప్రాంతంలో ఒడిశా అభివృద్ది పనులు నిరంతరం సాగుతూనే ఉంటాయి ‘‘అని ఒడిశా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మెన్‌ సంజయ్‌ దాస్‌ వర్మ మీడియాతో చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన పంచా యతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహి స్తోందని, అందులో మూడు పంచాయతీల పేర్లు మార్చారని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్‌ కాపీ అందించాలని సూచించింది.
ఆంధ్రాలోనే ఉంటాం
కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు. తాము ఏపీ పౌరుల మేనంటూ నినాదాలు చేశారు. ఒడిశా అధికా రులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టారు. విజయనగరంజిల్లా అధికారుల విశేష కృషి కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొటియా విలేజ్‌ గ్రూప్‌ గ్రామ ప్రజ లకు చేరువయ్యాయి. ప్రభుత్వ పథకాలపై మొదటి నుంచి అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ మేరకు సాలూరు వీూA పీడిక రాజన్న దొరను కలిసి ఏపీలోనే కొనసాగు తామని అంగీకారపత్రం ఇచ్చారు. ఒడిశాతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరంజిల్లా కలెక్టర్‌..కొటియా గ్రూప్‌ ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. కలెక్టరేట్‌లో వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథ కాలు వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ విషయంలోనే గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. పెద్దయెత్తున పోలీసులు కొటియా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధి కారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగ బడ్డారు. పగలుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమ వ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.
ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
ముఖ్యంగా కొఠియా గ్రామాల్లో సమస్యపై పరిష్కారంపై ఫోకస్‌ చేయనున్నారు. ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికా రులు తాజాగా సీఎం జగన్‌కు తెలియ చేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొ న్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందిం చే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దు భూ సమస్యలను పరిష్కారానికి వినతి..!! ఆంధ్ర`ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొల్లాపుట్టుపంచాయితీని చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ చైర్‌పర్సన్‌ రవి పర్యటన రెబ్బాప్రగడ రవి పర్యటించారు.ఇక్కడ సమస్యపై గిరిజనులు చైర్‌పర్సన్‌ రవికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కొల్లాపుటు గ్రామ పంచాయితీలో సరిహద్దు అంశంపై గ్రామసభలో తీర్మానించిన అంశాలను ఆయనకు స్థానిక గిరిజనులు అందజేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అంశంపై అధికారులు దృష్టికి తీసుకెళ్లడంపై చర్చించడం జరిగిందని,డెక్కపారు,బొడ్లమామిడి,నిట్టమామిడి,కొల్లాపుట్టు గ్రామ రెవెన్యూ,అటవీ హక్కుల పట్ట భూములు కొల్లాపుట్టు గ్రామ పంచాయితీకి చెందినవి అంటూ పలు అంశాలను గ్రామసభ తీర్మాణంలో తీర్మాణించారు.అలాగే ఒడిశావాసులు ఆక్రమించిన భూములను ఇప్పించాలని కోరారు.-శ్రీ‌నివాస్‌