భారత రత్నం
డా ॥ బి.ఆర్‌. అంబేద్కర్‌

(భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.)
ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతీయ సమాజాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాలను చర్చించారు. అంబేద్కర్‌ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్‌ సమగ్ర అధ్యయనం సాగలేదు. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాం తం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయ డానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. – Saiman Gunaparthi
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. సోక్రటీస్‌,ప్లేటో, అరిస్టాటిల్‌, బుద్ధునితో పోల్చదగిన పాత్ర. అంబేద్కర్‌కు ముందు భారతదేశంవేరు, అంబేద్కర్‌ తరువాత భారతదేశం వేరు. అంబేద్కర్‌ ఆలోచన, కార్యాచరణ ద్వారా ఆయన భారతదేశ స్వరూపాన్ని మార్చగలిగాడు. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది. గొప్ప హేతువాది. గొప్ప కరుణశీలి.తన జీవితంలో ఎదురైన అస్పృ శ్యతను, కులాన్ని నిర్మూలించడం కోసం ఆయన అహరహం కృషి చేశారు.అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని సామాజిక మానవ తావా దంగా పునర్నిర్మించి నవయాన బౌద్ధాన్ని ప్రపంచానికి అందించాడు. అంబేద్కర్‌ బౌద్ధప్రబోధంలో జఠిలత్వాన్ని తగ్గించి గాంభీర్యాన్ని పెంచాడు. అంబేద్కర్‌ సామాజిక, రాజకీయ సిద్ధాంతాలన్నీ బౌద్ధంలో ఉన్న మైత్రీ భావంతో ముడిపడి ఉన్నాయి. ఆయన తన విద్యాసంపన్నతను, మేథోవిస్తృతిని అహం కారానికి,ఆధిపత్యా నికి, నియంతృత్వానికి దారి తీయకుండా కరుణ,ప్రేమ,ప్రజ్ఞలతో కూడిన నూత్న భారతాన్ని ఆవిష్కరించడానికి రాజ్యాంగ నిర్మాణం లో లౌకిక, ప్రజాస్వామ్య, సమతా భావాలను సమన్వయించాడు. భారతదేశంలో కులం నిర్మూలించబడటం వలన స్వేచ్ఛ, స్వాతం త్య్రం,సౌభ్రాతృత్వం ప్రజల్లో వెల్లి విరుస్తుందని,అప్పుడు కులభావం లేకుండా ప్రతిభనుబట్టి,జ్ఞానాన్ని బట్టి, క్రియను బట్టి ప్రజలకు విద్యా, పారిశ్రామిక,ఉద్యోగ వ్యవస్థల్లో స్థానం లబి స్తుందని ఆయన తన ఉపన్యాసాల్లో బోధించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరని వర్ణము,కులము ఇవన్నీ కూడా ఒకానొకనాడు రూపుమాస్తాయని అంబేద్కర్‌ సిద్ధాంతీకరించాడు.అంబేద్కర్‌ పోరాట యోధుడు.అణగారిన ప్రజలకు ఆయన బోధి స్తూ ‘మన హక్కులను అన్యాయంగా అపహరించిన వారి నుండి తిరిగి పొందడానికి నిరంతర పోరాటమే శరణ్యమని ‘నవసమాజ నిర్మాణం ప్రార్థనలతోను, నినాదాలతోను జరగ దని,దానికి విప్లవమే శరణ్యమని ఉద్భోదిం చాడు.ఆయన ఆర్థిక, వాణిజ్య ధర్మశాస్రాల్లో పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టాలు పొందిన మేథావి. అందుకే ఆయన ‘యుగయుగాలుగా దాస్య శృంఖలాల తో మగ్గిపోతున్న పీడిత వర్గా లను నా జీవితకాలంలో పాలకులుగా చూడాలి, అదే నా జీవితలక్ష్యం అని తన జీవితలక్ష్యాన్ని వెలుగెత్తిచాటిన రాజకీయ,సామాజిక దార్శ నికుడు.ఆయన ఒక్క దళితుల కోసమే కాదు, మొత్తం భారతదేశంలోని అన్నివర్గాలకోసం పోరాడాడు. ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లా డుతూ స్త్రీలను బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చేయాలంటే మనోవికాసం కలిగిన మహిళలంతా హిందూ మతం నియమించిన మూర?సిద్ధాంతాలపైన తిరుగుబాటుచేయాలి. వివాహం చేసుకున్న స్త్రీ, భర్తతో సమానంగా ఉంటూ భర్త స్నేహి తురాలిగా వ్యవహరిస్తూ, అతని బానిసగా లోబడకుండా జీవించాలి. అప్పుడే స్త్రీలు తమ గౌరవాన్ని పొందగలు గుతారు. స్త్రీజాతి అభివృద్ధిలోనే సమాజాభివృద్ధి ఉందని నా విశ్వాసం. గర్భవతిగా ఉన్నశ్రామిక స్త్రీకి విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనపైన ఉంది. నేను ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు ముఖ్యో ద్దేశం ఇదే. స్మృతులు స్త్రీలకు కల్పించిన హక్కులనే పొందుపరచి ఈ హిందూకోడ్‌ బిల్లును రచించాను.స్త్రీలసాంఘిక పురోగతికి అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాల అడ్డంకి తొలగిం చడమే ఈబిల్లు ధ్యేయం. సంపదపైనే స్వాతంత్య్రం ఆధారపడి ఉంది.కాబట్టి స్త్రీలు సంపాదనాపరులై హక్కులు సాధించుకొని తమ స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలనిస్త్రీ విముక్తి దాతగా ఆయన ప్రజ్వలించారు.1951 ఫిబ్రవరి5వతేదీన హిందూ కోడ్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకువచ్చింది.అప్పటి కేంద్ర మంత్రి అయినఎన్‌.వి. గాడ్గిల్‌ ఈ బిల్లుద్వారా భారతదేశంలో స్త్రీలకు రాబోతున్నవిప్లవాత్మ కమైన భవిష్యత్తుకు కారణం డాక్టర్‌బి.ఆర్‌. అంబేద్కర్‌ అని,ఆయన భారతదేశంలో స్త్రీ సంస్కర్తలు ఎవరూ చేయలేనిపని చేశారని కొని యాడారు. దుర్గాభాయ్‌దేశ్‌ముఖ్‌ హిందూ కోడ్‌ బిల్లును సమర్ధిస్తూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్త్రీ దాస్య విమోచకుడని పేర్కొనడం జరిగింది. ఈ రోజున స్త్రీలు అనుభ విస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు,విద్య,గౌరవం,ఉద్యోగోన్నతులన్నీ అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లు ద్వారా తెచ్చినవే. హిందూకోడ్‌ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయి నప్పుడు అంబేద్కర్‌ ఎంతో ఆవేదన చెందారు. ఆయన తన న్యాయమంత్రిత్వ పదవికి ఈ కార ణంగా 1951 సెప్టెంబర్‌ 27న తేదీన రాజీనా మా చేశారు.అదికూడా భారతదేశంలో సంచల నాత్మక విషయమైంది. ఆ సందర్భంగా ఆయన ఎంతో ఆవేదన చెందాడు.ఎంతో మనోవేదనతో ఆయన హిందూకోడ్‌ బిల్లును త యారు చేయడంలో ఎంతో శ్రమకులోను కావాల్సి వచ్చింది.1947 ఏప్రిల్‌ 11వ తేదీన ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాను. 1949 ఏప్రిల్‌ 19న తేదీన ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారు. 1950 ఫిబ్రవరి వరకు ఈబిల్లు నిర్లక్ష్యం చేశారు.1950 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును వాయిదా వేశారు. 1951 ఫిబ్రవరి సమావేశంలో ఈ బిల్లులోని ఒక్కొక్క అంశం మీద చర్చించి 1951వ సంవత్సరం చివరకు బిల్లును అస్తిపం జరంలా చేసి చివరకు ఆమోదించలేదు. అందుకు నేను మనస్తాపం చెంది, స్త్రీలకు స్వేచ్ఛ కలిగించని ఈ పార్లమెంట్‌లోని క్యాబినెట్‌ మినిస్టర్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆయన దళితుల కోసం ఎంత చేశాడో స్త్రీల విముక్తి కోసం కూడా అంతే చేశాడు. అంబేద్కర్‌ శూద్ర కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నోచట్టాలను తీసుకు వచ్చారు. ఆయన శూద్రులకు, అతి శూద్రు లకు ఇద్దరికీ తమ కులబానిసత్వాల నుండి బయట పడటం కోసం బౌద్ధ స్వీకారాన్ని ప్రబోధిం చారు. ఆయన నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని పోగొట్టడం కోసం గొప్ప ప్రబోధనలు చేశారు. నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని నాశనం చేయాలంటే కులాం తర వివాహాలు తప్ప వేరే మార్గం లేదు. గుర్తుంచుకోండి, కులాంతర వివాహాలు జరిగితే ఉపకులాలు వాటంతట అవే నాశనమైతాయి. అంటరానివారు సాంఘిక వెలిని ఎలా అంత మొందించగలరు? అందుకున్న ఒకే ఒక మార్గం కులతత్వం లేని ఇతర వర్గాలతో సోదరత్వాన్ని, బంధుత్వాన్ని పెంచుకొని వారిలో లీనమవ్వ డం. ఈ సమాధానం చాలా తేలికైనది. కాని ఈ సమాధానపు విలువను చాలామంది ఒప్పు కోరు. కారణమేమిటంటే అతి తక్కువ మందికి మాత్రమే బాంధవ్యపు విలువ, ప్రాధాన్యత తెలుసు అని సమాజం మార్పును పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ప్రారం భిం చాడు. కులం అనేది ఎక్కడ చిట్టెంగట్టుకు పోయినా దానిని బద్ధలు చేయడం కష్టం. కులంనుంచి బయటపడ్డవాళ్లు విస్తృత మైన సమా జంలో ప్రతిభావంతులుగా ముందుకు నడుస్తారు. తమ పిల్లలకు మొత్తం ప్రపంచంలో నచ్చినవారిని పెళ్లి చేయగలుగుతారు. ప్రపం చం మొత్తంలో ఎక్కడైనా విద్య చెప్పించగలు గుతారు. ఈ స్వేచ్ఛ లన్నీ మనం అంబేద్కర్‌ ద్వారా పొందినా ఆయనను జ్ఞాపకం చేసు కోలేకపోతున్నాం. అంబేద్కర్‌ గొప్ప రాజనీతి జ్ఞుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ఆయన ప్రజాస్వామిక పునా దులను గట్టిపరిచాడు.ఆయన పరిపూర్ణ రాజ్యసిద్ధాం తాన్ని ప్రతిపా దించిన హాబ్స్‌,హెగెల్‌, బొసా న్క్వెట్‌ తదితరులతో ఆయన ఏకీభ వించలేదు. రాజ్య సమర్థుకులు భావించినట్లు రాజ్యమే అంతిమం అనే విధానాన్ని వ్యతిరేకించి రాజ్యం ఒక మానవ సంస్థగా భావించారు. ఎందు కంటే ఆలోచనకు ఆచరణకు రాజ్యమేగాక ఇతరంగా అనేకమైన మూలాలు ఉన్నాయని అంబేద్కర్‌ భావించారు. రాజ్యం ఒకసంస్థగా భావించి దాని లక్ష్యం ఈ విధంగా సూత్రీక రించారు. జీవనానికి, స్వేచ్ఛకు ఆనందంగా జీవించడానికి,స్వేచ్ఛగా మాట్లా డడానికి హక్కును కల్పించగలగాలి. సామాజిక, రాజకీయ,ఆర్థిక అసమానతలను తొలగించి అణచివేయబడిన వర్గాలకు చక్కని అవకాశా లు కల్పించాలి. భయం నుండి విముక్తిని కోరిక నుండి విముక్తిని అనుభవించే విధంగా ప్రతి వ్యక్తికీ అవకాశం కల్పించాలి. రాజ్యం మనిషినీ, సమాజాన్ని ఒక సేవకుడుగా సేవించాలే తప్ప యజమా నిలా ఆధిపత్యం వహించకూడదు. అందుకనే స్వాతంత్య్రానంతరం ఆయన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దృఢంగా నిల బడ్డాడు.ఆయన స్వతంత్రం కోసం మనషి నిరంతర పోరాటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ స్వతంత్రం మాత్రమేకాదు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతి క, సామాజిక, తాత్త్విక స్వతంత్రం ఉంటేనే స్వాతంత్య్రం ఉన్నట్లు భావించాలని ఆయన నొక్కిచెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో రాజ్యం అనేది మానవ్ఞల కోర్కెలను, ఆశయాలను సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికి, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు ఈ దిశలోనే ఉండాలని ఆయన భావించారు. అంబేద్కర్‌ తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌లో పరిశ్రమలను భూములను జాతీయం చేస్తే దేశ సంపద పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ భూమి లేనివారికి వ్యవసాయ భూమి కల్పించడం వల్ల వాళ్లు ఆ భూమిని ఎంతో శ్రద్ధగా చేసుకుని ఉత్పత్తిని పెంచుతారని కొంత మంది చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండడం వల్ల భూమి నిర్ల క్ష్యం అయ్యే ప్రమాదముందని అంబేద్కర్‌ ఆనాడే ప్రబోధిం చాడు. కానీ పాలకవర్గాలు నిరుపేదలకు భూమిని పంచటంలో ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నా యి.అందువల్ల ఎక్కువమంది వ్యవసాయ కూలీలు మనకు ఏర్పడ్డారు. వ్యవసాయ కూలీల్లో కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. అస్పృశ్యులను కూడా ఆయన మీరు ఇతరుల కంటే తక్కు వనే ఆత్మన్యూనతా భావాన్ని వదులుకోవాలని పిలుపునిచ్చాడు. మిమ్మల్ని అన్ని రంగాల్లోకి రావడానికి సంబంధించిన ద్వారాలను తెరుస్తున్నారు.మీరు ప్రతిభావం తంగా సమర్థవంతంగా వాటిలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అంబేద్కర్‌ దళితుల్లో ఉన్న తాగుడు వంటి దురా చారాలకు వ్యతిరేకంగా పోరాడాడు.మీలో వ్యక్తిత్వం రూపొందాలంటే మీరుబౌద్ధాన్ని స్వీకరిం చాలి.ఎటువంటి దుర్వ్యసనాలు లేకుండా మీ సంపదను పిల్లలకు విద్య నేర్పించడం కోసం ఉపయుక్తం చేయండని ఆయన పదేపదే తన ఉపన్యాసాల్లో చెప్పాడు. నేను ఒకతల్లి లేని పిల్ల వాడిగా ఎదిగి ఇవాళ వేల పేజీలు గ్రంథాలు రాయగలిగానంటే అక్షరం ఎవరి సొత్తు కాదు. అక్షరంద్వారా ఎవరైనా ప్రపంచ మానవ్ఞనిగా ఎదగొచ్చని ఆయన తన ప్రజలకు ప్రబోదం చేశాడు. అంబేద్కర్‌ తనప్రబోధాల్లో ప్రజలు భిక్ష గాళ్లుగా మార కూడదు. శ్రమద్వారా, ఆత్మ గౌరవం ద్వారా నిరంతరం ఉత్పత్తిలో పాల్గొ నడం ద్వారా మేథో సంపదను పెంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండని ఆయన బోధి స్తూ వెళ్లారు. ఆయనది ఆత్మ గౌరవ ఉద్యమం. మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం. కులంద్వారానో,మతంద్వారానో, అధి కారం ద్వారానో,అనువంశికంగా సంపాదించిన సంపద ద్వారానో మనిషి ఉన్నతం కాలేదు. పాలకులు, ప్రజలు రాజ్యాంగంలో రూపొం దించిన లౌకిక,ప్రజాస్వామ్య, సమసమాజ భావజాలంతో,మానవ తావాదంతో సామాజిక విప్లవ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన ప్రబోధించిన బోధనలను ఆచరించటం ద్వారా భారత దేశంలో సామాజిక పునరుజ్జీవన ఉద్య మంలో మనమూ భాగస్వాములు అవుదాం.
భారతరత్న జీవిత విశేషాలు
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’అన్న ఊరిలో) తల్లిదండ్రులు రాంజీ మలోజీ సాక్వా ల్‌,భీమాబాయ్‌ జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమ్‌ రావ్‌ రాంజీ అంబేద్కర్‌. చదువు కోవాలన్నా మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడిరది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ,వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొం దించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కొందరివాడు కాదు అందరి వాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావా ల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహానాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్పనాయకుడు అంబేద్కర్‌. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాం గంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అం శాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూ లన’, ‘మతమార్పిడి’,‘బౌద్ధమతం’, ‘హిందూ మతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కర ణలు-దళితులు’,‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా,అదనపు సంపదగా,అదనపు విలువగా,అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్‌ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగు నాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యం లో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది.1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్‌ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
బాబాసాహెబ్‌ ప్రత్యేకతలు-దక్కిన గౌరవాలు
బాబాసాహెబ్‌ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు.ప్రతి ప్రసంగం అత్యంత ప్రభా వితం చేయగలిగేవే. లండన్‌ యూనివ ర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్‌. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావు లలో బాబాసాహెబ్‌ ఒకరు. లండన్‌ విశ్వ విద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ పీహెచ్‌డీని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
అంబేద్కర్‌ విద్యాభ్యాసం
ా బీ.ఏ (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
ా ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
ా ఎమ్మెస్సీ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏకనామిక్స్‌, 1921)
ా పీహెచ్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)
ా డీఎస్‌సీ (లండన్‌ విశ్వవిద్యాలయం, 1923)
ా బారిష్టర్‌ ఎట్‌ లా (గ్రేస్‌ ఇన్‌ లండన్‌, 1923)
ా ఎల్‌ఎల్‌డీ( కొలంబియా విశ్వవిద్యా లయం, 1952, గౌరవపట్టా)
ా డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
కుటుంబ నేపథ్యం
మరాఠీ నేపథ్యం గల అంబేద్కర్‌ కుటుంబం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబేవాడ గ్రామంలో నివాసం ఉండేది. వీరి వంశీకులు మహార్‌ కులానికి చెందినవారు. తండ్రి రాంజీ బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదారు. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడ్డారు. మిగిలినవారు.. ఇద్దరు అక్కలు.మంజుల, తులసి,ఇద్దరు అన్నలు బలరాం,ఆనందరావు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన చిన్నతంలోనే అంట రానితనాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్‌ పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా,మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒకమూల కూర్చోబెట్టేవారు. నీళ్ళు తాగాలంటే ప్యూన్‌ మాత్రమే వచ్చి ఇచ్చే పరిస్థితి.బరోడా మహారాజు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఇచ్చిన 25రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ.పూర్తి చేశారు. విదే శాల్లో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందు కొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన అంబేద్కర్‌.1915లోఎం.ఏ.,1916లో పి. హెచ్‌.డి. డిగ్రీలను పొందిన అంబేద్కర్‌, 1917లో స్వదేశం వచ్చాక మహారాజా శాయా జీరావ్‌ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఇక అంబేద్కర్‌ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్‌ క్లాస్‌ కాంగ్రెస్‌, ఆలిండియా షెడ్యూ ల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ వంటి అనేక రాజకీయ పార్టీ లను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పగించిన నెహ్రూ..ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో విజయం సాధించారు. తరతరాలుగా బడుగు,బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవి తాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌. వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్‌..వారసత్వ,వివాహ చట్టా లలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించారు. హిందూ కోడ్‌ బిల్లు ముసా యిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబరు14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌..తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్‌ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు అంబేద్కర్‌. దళితుల హక్కులు,అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. (సేకరణ : థింసా ఎడిటోరియల్‌ డెస్క్‌)

అక్షరాలకు గుడి కట్టిన సవర తెగ గిరిజనులు

‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’
ఏదైనా ఆలయానికో,మందిరానికో వెళ్తే, అక్కడ దేవుడు, దేవత విగ్రహాలు,పటాలు కనిపి స్తాయి. వారికి పూజలు,భజనలు చేయడం కనిపిస్తుంది. కానీ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఆలయాల్లో అక్షరాలకు పూజలు చేస్తారు. వాటికి మందిరాలు కట్టి భజనలు చేస్తారు. అక్షరమంటే అంత ప్రేమ ఆ గిరిజనానికి.ఇంతకీ అక్షరానికి ఆలయం ఎందుకు? ఆ ఆలయాల ప్రత్యేకత ఏంటి?గిరిజన గ్రామాలకు వెళ్తే వింతైన ఆచారాలు, నమ్మకాలు, జంతు బలులు, గ్రామ దేవతల పూజలు ఇటువంటివే సాధారణంగా కనిపిస్తాయి.కానీ, ఇందుకు పూర్తిగా భిన్నమైన గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ అక్షరాలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు. ఇలా ఎందుకంటే తమ మాతృభాషని రక్షించుకునేందుకు అంటారు.
అక్షర బ్రహ్మ ఆలయాలు
అక్షరాలను ప్రతిష్టించి పూజించే ఆలయాలను ‘అక్షర బ్రహ్మ’ ఆలయాలు అంటారు. పెద్ద ఆలయాలు నిర్మించేందుకు అవకాశం లేని చోట, చిన్న మందిరాలు కట్టి అక్షరాలకు పూజలు చేస్తున్నారు. ఆ ఆలయాలు, మంది రాలు అన్నీ కూడా సవర గిరిజన తెగ నిర్మించుకున్నవే. తమ మాతృభాషను కాపాడుకోవడానికి ఇలా అక్షరానికి ఆలయం కట్టడం కంటే మంచి మార్గమేముందని వాళ్లంటున్నారు. ‘‘ఏపీ, ఒడిశా ఏజెన్సీల్లో సవర తెగ ఎక్కువగా కనిపిస్తుంది. మేం మాట్లాడే సవర భాష చాలా పురాతనమైనది. కానీ దానికి లిపి లేదు. అందువల్ల మా పూర్వీకుల సంప్రదా యాలు మాకు సరైన రీతిలో చేరలేదు. దాంతో, లిఖిత రూపంలో ఉన్న ఇతర గిరిజన సంప్రదా యాలనే సవర సంప్రదాయాలుగా అనుస రించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సవర సంప్రదా యాలను ముందు తరాల వారికి అందిం చాలంటే లిపి అవసరమని మావాళ్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సవర పండితుడు మంగయ్య గొమాంగో పన్నెండు సంవత్సరాలు కృషి చేసి 1936లో సవర భాషకు లిపి రూపం ఇచ్చారు. అదే మా మాతృభాష. ఈ లిపి ఇంటింటికి చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినవే అక్షర బ్రహ్మ ఆలయాలు’’ అని సవర తెగ గురువు సవర కరువయ్య తెలిపారు.
అక్షర చైతన్యం.. మాతృభాషా ఉద్యమం
గిరిజనుల్లో చైతన్యం నింపేందుకే గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించారు. అక్షరమే దైవం, దానికే మేం పూజలు చేస్తాం అంటారు గిరిజనులు. అక్షరాలకు దేవాలయాలు, మందిరాలు నిర్మించి వాటి ద్వారా సవర భాష లిపిని అందరికి నేర్పుతున్నారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’ అని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు.
‘అక్షరానికి పూజలు చేస్తే దేవతలకు పూజలు చేసినట్లే’
అక్షరమంటే ముక్కోటి దేవతలతో సమానమని సవర గిరిజన సమూహాలు భావిస్తాయి. అందుకే అక్షరానికి పూజలు చేస్తే దేవత లందరికీ పూజలు చేసినట్లేనని నమ్ముతారు. దేవతా రూపంలో విగ్రహాలు లేకున్నా, అక్షర బ్రహ్మ ఆలయాల్లో పండుగలు నిర్వహిస్తారు. ‘‘ఇలా అక్షరాలకు గుడి కట్టి పూజించే సంప్ర దాయం మరెక్కడ ఉండదు. అక్షరంలోంచే త్రిమూర్తులు పుట్టుకొచ్చారని పెద్దలు చెప్తారు. ఓంకారం అక్షరమే. అందుకే ఓంకార రూపం వంటి ఆకారం మధ్యలో సవర లిపి అచ్చులు, హల్లులు ఉంచి వాటికే పూజలు చేస్తాం. మా తెగలో అక్షరానికి తప్ప వేరే దేవుడు, దేవతల విగ్రహాలకు పూజలు చేయం. ఈ లిపికి, అక్షరానికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే’’ అని నౌగడ గ్రామ అక్షర బ్రహ్మ ఆలయ గురువు సవర వెంకటరావు చెప్పారు. ‘ఆయనే మా దైవం.. అక్షరమే మా ఆయుధం’ సవర భాషకు లిపిని అందించిన సవర పండిత్‌ మంగయ్య గొమాంగో తమ ఆరాధ్య దైవమని సవర గిరిజనం చెప్తారు. మంగయ్య గొమాంగో అందించిన అక్షరాలే సవర తెగకు ఆయుధాలని, వాటి ద్వారానే చైతన్యం పొందుతున్నామని సవర గిరిజన గురువులు అంటున్నారు. ‘‘అక్షరానికి గుడి కట్టి ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నాం. సవర లిపికి 24 అక్షరాలు ఉంటాయి. అందులో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. వీటిని రాతిపై చెక్కి దేవాలయాల్లో పెడుతున్నాం. అక్షరాలను గోడలపై చిత్రాలుగా వేసి, లేదా పటాలు కట్టి వాటికి మందిరాలు నిర్మిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం నౌగడ, ముత్యా లు,శంభాంలలోనూ,విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడల్లోనూ అక్షరబ్రహ్మ ఆలయాలు నిర్మించాం. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామాల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాల పేరున ప్రచార మందిరాలు ఏర్పాటు చేసుకున్నాం’’ అని సవర గురువు, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్‌ కరువయ్య చెప్పారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియాలతో పాటు సవర భాషను కూడా నేర్పించమని గిరిజన సంఘాలు ప్రభు త్వాన్ని కోరడంతో, కొన్ని పాఠశాలల్లో ఆ భాష ను చేర్చారు. ‘‘ఈ తరం పిల్లలు తమ మాతృభాషలోనే ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా వంటి భాషలను సవర భాష ద్వారా నేర్పుతున్నాం. మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఏదైనా సులభం అవుతుంది. పైగా మా సొంత భాషను వదిలి ఇతర భాషల పట్ల మోజు పెంచుకోవడం సరైనది కాదు. ఉపాధి,ఉద్యో గాల కోసం ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ మా మాతృభాష బతికుండాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. వలంటీర్ల సహాయంతో తరగతులు చెప్తున్నాం. అందరూ ఈ తరగతు లకు హాజరవుతున్నారు. సవర భాష అక్షరాలు, పదాలను చెప్తూ, వాటికి సమానమైన తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా పదాలు రాయడం నేర్చుకుంటున్నారు’’ అని కరువయ్య చెప్పారు.
‘వీడియోలు, స్టూడియోలు, పాఠాలు’
సవర భాషకు ప్రచారం కల్పిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. దాని కోసం సతివాడ గిరిజన గ్రామంలో చిన్న స్టూడియో కూడా ఏర్పాటుచేసున్నారు. పాటల ద్వారా మాతృ భాషకు ప్రచారం కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కొందరు అక్షర బ్రహ్మ మందిరాలకు వచ్చి సవర భాష నేర్పుతున్నారు. ‘‘నేను సవర భాష నేర్చుకున్నాను. నాకు తెలుగు కూడా బాగా వచ్చు. తెలుగు,ఒడియా,ఇంగ్లిష్‌ వంటి భాషల్లోని పదాలను సవర భాషలో బోధించి, అర్థాలు వివరిస్తాను. దీని ద్వారా మా మాతృ భాషను రక్షించుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోని వివిధ అంశాలను మా భాష ద్వారా నేర్పడాన్ని ఆస్వాదిస్తున్నాను. మాలో అందరికీ తెలుగు వచ్చు. కానీ సవర భాష అందరికీ రాదు. అందుకే మా మాతృభాషను అందరికి నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను, నాలాంటి వాళ్లు వచ్చి పాఠాలు చెప్తున్నాం’’ అని నూకా లమ్మ గూడ గ్రామానికి చెందిన సవర సుబ్బలక్ష్మీ చెప్పారు. ‘గిరిజనమే ఆదర్మం కావాలి’‘‘మాతృభాషకు మించినది ఏదీ లేదు. అది అమ్మ భాష. మాతృభాషని విస్మరిస్తే ఏ భాషైనా మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషలు అలాంటి ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడు కోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దేశంలోని అనేక గిరిజన తెగలకు లిపి లేదు. లిపి లేని భాషకు ఎక్కువ కాలం మనుగడ ఉండదు’’ అని ఏయూ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు అన్నారు. ‘‘తమ భాషను బతికించుకునేందుకు సవర గిరిజనం చేస్తున్న కృషి చాలా గొప్పది. అసలు అక్షరానికి ఆలయం కట్టడమనేదే చాలా గొప్ప ఆలోచన. ఇదే తరహాలో వారు సవర లిపిని వ్యాప్తి చేసి, సవర భాషకు మంచి గుర్తింపు తీసుకుని రావాలి. వారి స్ఫూర్తి తెలుగుతో సహా మిగతా భాషలకు ఆదర్శం కావాలి’’ అని ఆయన అన్నారు.(బీబీసీ సౌజన్యంతో) -లక్కోజు శ్రీనివాస్‌

పిల్లలు ఇక్కడ.. బడి ఎక్కడో..!

ఇంతకు మునుపు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, పిల్లలు దాని బారిన పడ్డారా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ,భౌతిక విద్యా బోధన విధానానికి మాత్రం ఆన్‌లైన్‌ విద్య ప్రత్యామ్నాయం కాదనే విషయం మనకు తెలుసు. పిల్లలు ముఖ్యంగా ప్రైమరీ,ప్రీప్రైమరీ చదివే చిన్నారులు…తోటి పిల్లలు,ఉపాధ్యాయులు, ఇతరుల నుంచి (హ్యూమన్‌ ఇంటరాక్షన్‌) నేర్చుకోగలగడంతో పాటు సామాజికంగా,మానసికంగా అభివృద్ధి చెంద గలరు.అయినా,పాఠశాలలు మూసివేయడం ద్వారా మనం వారి జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నాం. వీటి ఫలితాలు చాలా వినాశకరంగా ఉంటున్నాయి. సెప్టెంబర్‌, 2021 సర్వే నివేదిక ప్రకారం… పిల్లల్లోచదివే,రాసేసామర్థ్యంస్థాయి బాగా తగ్గిపో యింది. సగం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదవలేక పోతున్నారు. మూడో వంతు పిల్లలు చదువుకునే క్రమంలోనే లేరు.
కోవిడ్‌-19 మన జీవితాలు తలకిందు లు కాకూ డదనే విశ్వాసం అలాగే మిగిలి పోయిం ది. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ ఎక్కువగా వ్యాప్తి చెంది… తక్కువ ప్రభావం చూపుతున్నప్పటికీ…మనపై విధించిన ఆంక్షలు రోజువారీ జీవితాలపై మరొక సారి ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ రాత్రి కర్ఫ్యూలు, సరిహద్దుల్లో సోదాల లాంటి నిబంధ నలు ఇంతకు ముందున్న వేరియంట్‌ను కట్టడి చేయనట్లయితే…వేగంగా వ్యాప్తి చెందే వేరి యంట్‌ను కూడా ఆ నిబంధనలు కట్టడి చేయవనే విషయం వివేకవంతులకు స్పష్టమవ్వాలి.
లోపించిన హేతుబద్ధత
కానీ,ఇరవై నెలల పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినప్పుడే మన హేతు బద్ధతను వదిలేశాం. రాజకీయ నాయకులకు పాఠ శాలలు ఒకతేలికైన లక్ష్యాలుగా మారాయి. పాఠ శాలల మూసివేత,కోవిడ్‌ను కట్టడి చేసే ఒక సున్ని తమైన చర్య అనీ, దాని కోసం వారేదో చేస్తున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తుంది. కానీ ఇది, హేతు బద్ధతలో, వాస్తవంలో పాదుకొనని ఒక భావోద్వేగ ప్రతిచర్య. కోవిడ్‌-19 రెండవ వేవ్‌ ముందు కూడా, చిట్ట చివరికి మూసివేసేది, మొట్ట మొదట ప్రారం భించాల్సింది పాఠశాలలేనని అనేకమంది నిపుణు లు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన దేశాలలో భారత్‌ ఒకటిగా నిలిచింది. ఇదీలాగుంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానం గోరుచెట్టుపై రోకలపోటు చందంగా మారింది. ప్రక్షాళన కారణంగా ఎంతో మంది పేద పిల్లలకు విద్య దూరం కావడంతో దాని ప్రభావంతో తల్లిదం డ్రులకు భారంగా పరిణ మించింది. ప్రాథమిక పాఠశాలలు మూసివేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తర గతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172 విడుదల చేసింది. వచ్చేవిద్యా సంవత్సరంనాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యా ర్థులను ఉన్నత పాఠశాలలకు తరలించనుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్ప గించనుంది. అందుబాటు లోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠ శాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చిన మేరంగి హైస్కూల్‌లో2.25కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ, దాసరిపేట, తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠశా లలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి. ప్రతిపేటలో పిల్ల లు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడు లు పెట్టారు. వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగుదల,పరివర్తనలో తేడా వుంటుంది. అందు వల్ల చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరిలో ప్రైమరీ,హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ,పాడుతూ,ఏడుస్తూ బడికివెళ్లే ఆరేళ్ల పిల్లడు,13ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి…అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠ శాల నెలకొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏకపక్షంగా మూసేస్తోంది.
వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి. ‘అమ్మఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుంబంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి.లేదంటే పిల్లలను బడికి పంప డం ఆపేస్తారు.‘అమ్మ ఒడి’ శాశ్వత పథకం కాదు. ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’ వుండదు. ‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదండ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు. అందుకని సర్కారు బడులను సంరక్షించుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగ తుల పిల్లలకు తరగతి గదులున్నాయా? బెంచీలు, కుర్చీలున్నాయా? ఇతర మౌలిక సదుపాయాలు న్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట? గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
యువతకు తీరని అన్యాయం
ప్రపంచబ్యాంకు సలహాతో చంద్రబాబు ప్రారంభిం చిన విద్య ప్రైవేటీకరణను రాజశేఖ రరెడ్డి విస్తృత పరిచారు. ప్రైవేటు బిఇడి కాలేజీలకు విస్తారంగా అనుమతులు ఇచ్చి ట్రైనింగ్‌ పూర్తి చేస్తే టీచర్లు అవుతారనే భ్రమ యువతలో కల్పించారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి ట్రైనింగులు, ఆపైన కోచింగులు పూర్తిచేసి టీచర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఆశాభంగమే మిగిలింది. ప్రాథమిక పాఠశాలల మూసివేత మూలంగా ఖాళీగాఉన్న 25వేలు టీచర్‌ పోస్టులు భర్తీ చేయక పోగా మరో 75వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు తేలు స్తున్నారు. ఇపుడున్న 1:0విద్యార్థి,టీచర్‌ నిష్ప త్తిని1 :35 గా మార్చేశారు. గత రెండేళ్లు డీఎస్సీ లేదు.
ఎస్‌.సి,ఎస్‌.టి,బి.సిలుప్రభుత్వవిద్యను కాపాడుకోవాలి
వేల సంవత్సరాలపాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్‌.సి,ఎస్‌.టి బి.సి సామా జిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందు బాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువు కోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వనిర్ణయంతో తీవ్రంగ నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలుకూడా నష్టపో తారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిల వరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.పేద పిల్లలకు విద్య దూరం..తల్లిదం డ్రులకు భారంగా పరిణమించకూడదు.
విద్యకు సంబంధించిన సమస్యలు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తారనే ఒక నిరాధారమైన, అస్పష్టమైన హామీలను అంగీకరించినప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉం టున్నాయి. పాఠశాలలు మూసివేసినప్పటికీ, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పెరిగినట్లు బ్రిటన్‌ దేశపు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా,‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియా ట్రిక్స్‌’’ పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ‘’జాతీ య ఎమర్జెన్సీ’’గాపేర్కొంది.భారతదేశంలో, మాన సిక ఆరోగ్య సమస్యల్ని పక్కకు పెడితే, పాఠశాలల మూసివేత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలసమస్య మరింత అధ్వా న్నంగా తయారైంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరే కంగా కొన్ని దశాబ్దాలుగా సాధించిన ప్రగతి, పాఠ శాలల మూసివేత కారణంగా వెనుకపట్టు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం,10.1మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారని ఒక అంచనా. పౌష్టికాహార లోపాలు, బాల కార్మికులకు సంబం ధించిన రోజువారీసమాచారం మన దగ్గర ఉండి ఉంటే, బహుశా మనం భారతదేశం లోని పిల్లల బాధల పైన దృష్టి పెట్టేవారం.అంతే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు మూసివేసి ఉండేవాళ్ళం కాదు. ‘పిల్లలు పాఠశాలల నుండి ఇంటి దగ్గర ఉండే పెద్దలకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉంద’’ని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు అంటువ్యాధిని అడ్డుకోలేవనే విషయం తెలుసు కాబట్టి, పెద్దవారి ప్రయోజనాల కోసం, పిల్లల పాఠశాలలను మూసివేయడం అసం బద్ధమైన విషయం. పిల్లలకు శాస్త్రీయమైన పరీక్షల తర్వాత ఉపయుక్తమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు. ఇప్పటికీ పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్‌కు…విద్యను, పాఠశా లలను ముడిపెట్టడంలో అర్థం లేదు. పిల్లలకు కోవిడ్‌-19 ఎమర్జెన్సీ లేదు కాబట్టి వారికి వ్యాక్సిన్‌ అత్యవసరం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. వాస్తవానికి, రోగి నిరోధకశక్తికి సంబంధించి ‘’నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌’’ (ఎన్‌.టి.ఎ.జి) అభిప్రాయమిది. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వ ఆమోదం, ఎన్‌.టి. ఎ.జి అభిప్రాయాన్ని సవాల్‌ చేస్తున్నది. విద్య అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. పాఠశా లలను సుదీర్ఘకాలంపాటు మూస ివేయడం ద్వారా, ఒక బలహీనమైన ప్రత్యామ్నా యానికి అవకాశం ఇవ్వడంద్వారా,మనంపిల్లల హక్కులను ఉల్లం ఘనకు గురిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పిల్లల కోసం నోళ్ళు విప్పాలి. అంటు వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ శాస్త్రవేత్తలు,డాక్టర్లు, విద్యావేత్తలు ధృ వీకరించినట్లు‘పిల్లలకు 2022 సంవత్సరం సంతో షంగా ఉండాలని’ కోరుతూ మనలో ఒకగ్రూప్‌ ఓప్రయత్నాన్ని ప్రారంభించింది.2022 ఆ తరు వాత కాలం కూడా పిల్లలు అన్ని విధాలా సంతోష కరమైన పాఠశాల జీవితం,సంతోషకరమైన బాల్యా న్ని పొందాలని ఆశిద్దాం. (వ్యాసకర్త ఐ.ఐ.టి ముంబైలో (‘ద హిందూ’సౌజన్యంతో )(ప్రొఫెసర్‌.భాస్కరన్‌ రామన్‌/ఎం.కృష్ణమూర్తి)

మ‌హిళా నీకో వంద‌నం..!

ఆమె..శక్తి స్వరూపిణి. సృష్టికి మూలం. ఆది అంతానికి సంధానకర్త. కుటుంబానికి సారథి. బాంధవ్యాలకు వారథి. రెప్పల మాటున కన్నీటి చుక్కలు దాచుకుని కుటుంబంపై పన్నీటిని చల్లేందుకు ప్రయత్నించే ప్రేమమయి. ఆమె త్యాగం అజరామరం. ఇంటా, బయట వివక్ష, వేధింపులే బహుమానంగా ఇస్తున్నా అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అదే ఆమె స్థైర్యానికి చిహ్నం. మహిళ జన్మనే కాదు.. జీవితాన్నిస్తుంది. అవసరమనుకుంటే జీవిత భారాన్ని మోస్తుంది. తాను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. ఒక్కటేమిటి భారం మోసేది..బాధ్యతలు పంచుకునేది.. త్యాగానికి సిద్ధపడేది.. ఒక్క మహిళ మాత్రమే. అంతటి మాతృమూర్తిని చిన్నచూపు చూడటమా..? ఇది ఒకప్పటి మాట. ఆంక్షల చట్రాన్ని చీల్చుకుని అవకాశాల్లో క్షేత్రంలో విజయం కోసం పోరాడుతోంది నేటి మహిళ. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అని దూసుకు పోతున్న మహిళలు ఇప్పుడు యుద్ధక్షేత్రం లోనూ శత్రువుతో తలపడేందుకు సిద్ధమం టున్నారు. నింగి,నేల,నీరు..ఎక్కడైనా మేమున్నామని తమ శక్తియుక్తులు చాటు కుంటున్నారు. ఇలా అమ్మగా, అక్కగా, జీవన సహచరిగా బహుముఖ రూపంలో.. లాలనలోనూ, పాలనలోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, శ్రమైక జీవన యానంలోనూ, అవనిలోనూ, అంతరిక్షంలోనూ ఆమె చెరగని సంతకం లిఖించుకుంటోంది. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం.
అన్నింటా ఆమె..
ఆకాశంలో సగం..అవకాశం సగం.. ఇది పాత నినాదం. అన్నింటా మేము.. కాదు కాదు అన్నిటా మేమే.. ఇదీ ఈనాటి మహిళల తాజా గళం. పట్టుదల,క్రమశిక్షణ పెట్టుబడిగా నేటి మహిళ ఓర్పు, నేర్పు, తెగువతో రాణిస్తోంది. ఇంటిని చక్కదిద్దే తత్వవేత్తగా,ఉద్యోగం చేసే మేటి వనితగా,చట్టసభల్లో సంస్కర్తగా పురుషులకు ధీటుగా ముందుకెళ్తోంది. ఒడిదుడుకుల్లో వెనుకంజ వేయకుండా అద్వితీయంగా అడుగులేస్తోంది. జిల్లాలోని పలువురు మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. కన్నీటి కష్టంలోనూ,కడుపు తరుక్కుపోయే విషాదంలోనూ ధీర వనితగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉద్యోగ బాధ్యతలు చూస్తూనే కుటుంబాన్ని అద్వితీయంగా సాకుతున్నారు. ఇంకొందరు వ్యాపార రంగంలోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటులేదు. సాధించని విజయం లేదు.ఒకప్పుడు మహిళలంటే వంటిల్లు..సంప్రదాయాలు, కట్టుబాట్లకు మధ్య గడిపే జీవితమే జీవితం. ఇవాళ దాని అర్థమే మారిపోయింది. తమకున్న ఓర్పుని,సహనాన్ని పెట్టుబడిగా పెట్టి మరీ సాధించుకున్న విజయాలకు ప్రతినిధిగా నేటి మహిళ నిలుస్తోంది.
గృహిణి నుంచి పాలకురాలిగా..
సూర్యోదయానికి ముందే స్త్రి విధి నిర్వహణ ఆరంభమవుతుంది.ఆమెకు అతిపెద్ద బాధ్యత పిల్లల పెంపకం.పిల్లలను బడికి పంపడం తొలి విధి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యారేజీ ఉండదనో,స్కూలు బస్సు పోతుందనో భయం. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మిగిలిన పనులు చక్కబెట్టాలి. అందుకే సైకాలజిస్టులు గృహిణి పాత్రకంటే ఉద్యోగ జీవితం మేలు అంటారు. సాధారణ గృహిణి నుంచి ప్రభు త్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు,క్రీడలు, పాలనా..ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏ మాత్రం తీసుపోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది నాణానికి ఒకైపు. మరోవైపు వివక్ష, అడుగడుగునా ఇబ్బందులు ఉన్నాయి. స్త్రి విలాస వస్తువు కొందరికి,ఇంటి యంత్రం మరికొందరికి. ఆమె అభిప్రాయానికి విలువ లేదు. ఆమె సూచన పట్టించుకునే వారు లేరు. ఆమె ఇష్టాఇష్టాలకు గౌరవం దక్కదు. అయినా వెరవని ధైర్యంతో ముందుకు సాగుతోంది మహిళ. బయట మాట పక్కన పెడితే ఇంట్లో కూడా గౌరవాన్ని ఆశించే చాలామంది మహిళలకు నిరాశే మిగులుతోంది. బాల్యం నుంచే స్త్రి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పుడు ఆడపిల్ల ఆనే వివక్ష, యవ్వనంలో ఆకతాయిలు, పోకిరీల సమస్య, ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు, పెళ్లాయాక్కైనా ఆమె జీవితానికి ఆసరా లభిస్తుం దనుకుంటే అక్కడా ఇబ్బందులు పడేవారే అధికం.అత్తింటి ఆరళ్లు, భర్త వరకట్న వేధిం పులు.. ఇలా ఎన్నో సమస్యలు వెన్నంటే నడుస్తుంటాయి. ఇంటిల్లిపాదికి బండెడు చాకిరీ చేసినా సమయానికి అల్పాహారం తీసుకునే పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి. కనీసం మధ్యాహ్నమైనా సమయానికి తింటుందా అంటే ఆ అవకాశం కూడా ఉండటం లేదు. ఇంటిపని, ఆఫీస్‌ పని చేసుకునే మహిళలు తమకు తెలియకుండానే ఓ రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు 80శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి అన్నది నిపుణుల మాట. ఈ మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితం జరిపిన పోరాటం సాక్షిగా మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మొదలైంది.1911లో మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. నేటి స్త్రీ చదువుల్లో,ఉద్యోగాల్లో ముందుండి. ఏ రంగంలోనైనా నేను సైతం అంటున్న స్త్రీని సమాజం ఇప్పటికీ ఆమె వ్యక్తిత్వాన్ని, ఇష్టా ఇష్టాలను అభిప్రాయాలను గుర్తించడం లేదు.అనంతర పరిణామాల్లో భాగంగా 1975లో యుఎన్‌ఒ స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏదేశానికీ, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా సమానంగానే అణిచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. అప్పటి నుంచి 1975లోనే మార్చి 8వ తేదీని అంతర్జా తీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
ఆరోగ్యమూ అంతంత మాత్రమే..
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులు, మరెన్నో బాధ్యతలు..! క్షణం తీరికలేని ఈ నిత్య సమరం ముందు ఆమె తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. మహిళలు పనుల్లో పడిపోతున్నారని,ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది. అనారో గ్యానికి గురైనప్పుడే మాత్రమే రెగ్యులర్‌ చెకప ్‌లకు వెళుతున్నట్టు 63శాతం మంది మహిళలు అంటున్నారు.16మంది మాత్రమే రెగ్యులర్‌ చెకప్‌లకు వెళ్తున్నట్లు తెలిసింది.71 శాతం మహిళలు ఏడాదిలో ఒకటిరెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39శాతం మంది మహిళలకు మాత్రమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంలో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు,రక్తహీనత,హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు మహిళల్లో ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతు న్నారని ఒక నివేదిక తేల్చి చెప్పింది.
మహిళల స్థితిగతులు ఇలా
వ్యవసాయేతర ఉపాధిలో మహిళలు 20 శాతమే.పట్టణ శ్రామిక శక్తిలో మహిళలు 33.9 శాతం,గ్రామాల్లో 49.9శాతం ఉన్నారు.
ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు
ఆడపిల్ల పుడితే గుండెల మీద భారంగానే నేటికీ భావిస్తున్నారు. ఈ వివక్షే ఆడపిల్లకు కొనిచ్చే బొమ్మల దగ్గర నుంచి చదివించి పెళ్లిళ్లు చేసే వరకు కొనసాగుతోంది. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చిన్నవాడైన తమ్ముడిని తోడు తీసుకుని వెళ్లమంటారు. అప్పటి నుంచే నువ్వు బయటకి వెళితే భద్రత ఉండదని నేర్పిస్తారు. అలా ఒక ముందడుగు వేస్తే… రెండు అడుగులు వెనక్కి లాగుతారు తల్లిదండ్రులు. ఇంటి పనుల్లో సాయం చేయ మని కూతురిని అడుగుతారు. కానీ కొడుకును అడుగరు. ఇలాంటి ఎన్నో వివక్ష మూలాలు ప్రతి ఇంట్లో..ప్రతి బిడ్డా పురిటికందుగా ఉన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇక మంచి చెడులను విడమర్చి అర్థం చేసుకునే అవకాశం కూడ లేకుండా పోయింది దీంతో. తల్లి దండ్రు లు ఆడపిల్లలను ఒకే చట్రంలో బంధిస్తున్నారు.
భయపెడుతున్న గణాంకాలు
సాంకేతికంగా ఎంత అభివద్ధి చెందినప్పటికీ బాలికల, మహిళలు పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు చెబుతు న్నాయి. 2011జనాభా లెక్కల ప్రకారం. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్ల లకు కేవలం 914మందే ఆడపిల్లలు ఉన్నారు. 2001లో ఆరేళ్లలోపు మగ,ఆడపిల్లల నిష్పత్తి 1000:943 ఉండగా,పదేళ్ల అనంతరం ఆడ పిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళ నకర పరిణామం.2015 సెప్టెంబరు నాటికీ వెయ్యి మంది పురుషులకు 943 మంది ఆడపిల్లలున్నారు. అంతే కాదు, మహిళలపై జరుగుతున్న హింస కూడా పెరిగింది. ప్రత్యక్షం గా మహిళలు అన్ని రంగాల్లో ముందు న్నా సమానత్వం మాత్రం పూర్తిగా లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువయ్యింది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చట్టసభల్లో సమానత్వం ఉందని చెబుతున్నా ‘పేరుకే పెత్తనం’ అనే చందంగా వ్యవస్థ సాగుతోంది.
రాజకీయంగా రాణింపు
మహిళలు రాజకీయంగా సమాన అవకాశాలను పొందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా ల నుంచి శాసనసభ, పార్లమెంటుకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ/మండల/గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 564 మహిళా సర్పంచ్‌లు, 6117 మహిళా వార్డు మెంబర్లుగా గెలిచి గ్రామీణా భివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విద్యావంతులైన యువతలు చొరవ చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత
మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమిం చినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుక బడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదం డ్రుల ఆలోచనా ధోరణులు,మహిళలు స్వయం గా విధించుకునే పరిమితులు కారణమని చెప్పవచ్చు. పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో పోల్చితే తక్కువ వేతనాలు అందు తున్నాయి. ఆర్థికపరమైన అంశాలపై అవగా హన లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, వివాహపరమైన అవరోధాలు మహిళలు ఆర్థికంగా పురోగమించకుండా అడ్డు తగులు తున్నాయి. చట్టాల్లో కూడా వారి పట్ల వివక్ష అధికంగా ఉంది. ఈ అవరోధాలన్నీ దాటు కుంటూ వారు ఆర్థిక సాధికారత సాధించడం ఎలాగంటే.. ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం భారత మహిళలు ఆర్థిక బాధ్యతలు చేపట్టేం దుకు విముఖంగా ఉంటారు. దీనివల్ల వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పురుషులదే పైచేయిగా మారుతుంది. ఉద్యోగా లు చేస్తున్న మహిళలు కూడా తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను భర్తకు అప్పగిస్తుం టారు. దీంతో ఆర్థికపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు నిండే సమ యానికి పురుషుల సగటు జీవిత కాలం 77.2 సంవత్సరాలుంటే మహిళలకు 78.6 సంవత్స రాలుంది. అంటే పురుషులతో పోల్చితే మహిళలే సగటున ఎక్కువ కాలం జీవిస్తు న్నారన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అవివాహితలు,విడాకులు తీసుకు న్నవారు, భర్త లేని వారు, ఒంటరి మహిళల సంఖ్య 7.4 కోట్లుంది.ఇలాంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరం. పొదుపు పెరగాలిపురుషులతో పోల్చితే మహిళలు అందుకునే వేతనాలు తక్కువగా ఉండడం పరిపాటి. సమాన హోదాలో పనిచేస్తున్నప్పటికీ వారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. దీనికి తోడు మహిళలు ఆర్థిక వ్యవహారాలు సమర్థవం తంగా నిర్వహించలేరనే అపోహ కూడా సమాజంలో ఉంది. మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటున్న తరుణంలో సొంతంగానే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టు కోగల నైపుణ్యాలు సాధించడం,దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టడం అవశ్యం. వేతనాలు తక్కువ ఉన్నందు వల్ల పురుషుల కన్నా అధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. మహిళలు ఉద్యోగం చేసే కాలపరిమితి పురుషులతో పోల్చితే తక్కువ. మాతృత్వపు సెలవులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైతే వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడం వంటివి తప్పనిసరి.
భద్రత ప్రధానంకుటుంబ సంక్షేమంతో పాటు తమ సొంత భద్రతకు మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయడంతో పాటు తమ రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు విభిన్న పొదుపు సాధనాలను ఎంచుకోవడంతో పాటు వయసుల వారీగా కేటాయింపులు చేసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న మహిళలు తమ కోసం పొదుపు చేసుకునే మొత్తంలో 70 శాతం ఈక్విటీకి, 30 శాతం డెట్‌కు కేటాయించుకోవచ్చు. వీటిలో ఈక్విటీ ఫండ్లతో పాటు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి రక్షిత సాధనాలపైనా దృష్టి పెట్టాలి. పొదుపు ఒక్కటే కాదు.. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆదుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ ఖర్చులను తట్టుకోగల అత్యవసర నిధి సమకూర్చుకోవాలి. అంతేకాకుండా వార్షిక వేతనానికి 7 నుంచి 10 రెట్లు అధికంగా బీమా రక్షణ పొందాలి. జీవిత బీమాతోపాటు ఆరోగ్య రక్షణ ప్లాన్లు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లపై దృష్టి పెట్టాలి. ఒకేసారి ఇంత భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి తటపటాయించే ఆస్కారం ఉంది.
అత్తమామల కోసం పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించాలి. వయసు పెరిగే కొద్ది అనారోగ్యాల రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఆ రిస్క్‌ను తట్టు కోవాలంటే అత్తమామలకు బీమా ఉండి తీరాలి. అలాగే పిల్లల కోసం పెట్టుబడి పెట్టే తరుణంలో 18 ఏళ్లు నిండే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే నాటికి ఉన్నత విద్యాభ్యాసం, వివాహం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌)ను అనుసరించాలి.
నేరాలు…చట్టాలు…శిక్షలు…
ా సెక్షన్‌ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు,ఫొటో,వివరాలు ప్రచురించ కూడదు.
ా సెక్షన్‌ 354 – మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
ా సెక్షన్‌ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు అవుతుంది.
ా సెక్షన్‌ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
ా సెక్షన్‌ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచిఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్‌ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే సెక్షన్‌ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే. సెక్షన్‌ 376-బి కింద అందరికీ శిక్ష పడుతుంది. అత్యాచారం..ఐపీసీ 375 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు. అవమానపరిచి దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5నుంచి 7వరకు జైలు శిక్ష పడు తుంది. పెళ్లయినా కానట్లు మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం 7ఏళ్లు జైలు,జరిమానా తప్పదు. ఇలాంటి ఎన్నో కఠినమైన చట్టాలు,శిక్షణలు ఉన్నా మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు,వేధింపులు ఆగకపోవడం శోచనీయం. – సైమన్‌ గునపర్తి

మన పంచాయితీ..మనదే రాజ్యాం

‘‘పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు కావలసిన సౌక ర్యాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. వార్డు సభ్యులు పంచాయతీ సమావేశాల్లో, కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా తమ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయా లను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. దీంట్లో భాగంగా గ్రామసభ విధివిధానాలను పాటిస్తూ విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ గ్రామసభ సంర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. విశేషాధి కారులన్న పీసా చట్టంపై ప్రతి గిరిజన గ్రామం లోను గిరిజనులను చైతన్య పర్చడం, పంచా యితీకి ఆదాయవనరులపైన, గిరిజను లకు సమత తీర్పును అనుసరిస్తూ స్థానిక వనరులను కాపాడుకోవడం వంటి అంశాలను గ్రామసభలో తీర్మానించి ఆమోదించడం జరిగింది’’
బొర్రా గేటువలస పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయితీ పరిధిలో ఉన్న 15గ్రామాల నుంచి పంచాయితీ సభ్యులు,మరియు కొంతమంది గ్రామస్థులు,వివిధ శాఖల అధికారులు,మార్కెట్‌ యార్డ్‌ కమిటి డైరెక్టర్‌ దోనేరి పార్వతి, ఎం.పి. టి.సి.కురిసేలా అరుణ, పీసా ఉపాధ్యక్షులు దోనేరి డానియల్‌, మరియు బొర్రా స్కూల్‌ సిబ్బంది,ఉపాధి హామీ పధకం వి.ఆర్‌.పి సాంరెడ్డి గోపి,టెక్నీకల్‌ అసిస్టెంట్‌ జగన్‌,హెల్త్‌ సిబ్బంది,సచివాలయం సిబ్బంది హజర య్యారు.గ్రామసభలో పంచాయితీ సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లాడుతూ బొర్రా పంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు,ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యుల ఆమోదం,పంచాయితీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను రాబట్టేందకుగాను పీసా చట్టం ప్రకారం పలు అంశాలను తీర్మానిం చారు. బొర్రా గుహల వద్ద వాహన పార్కింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నుంచి పంచా యితీకి రావాల్సిన 20శాతం వాటా,వీధి దీపాలు ఆధునీకరణ,ఎన్‌ఆర్‌జీఎస్‌ పనిదినాలకు రావాల్సిన కూలీల సొమ్ములు, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలను తీర్మాణించడం జరిగింది. తర్వాత సర్పంచ్‌ జన్ని అప్పారావు స్వాగతం పలికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము ఆరోగ్య శ్రీ,రేషన్‌ కార్డు, పెన్షన్‌,పి.యం.కిసాన్‌, రైతు భరోసా మొదలగు పధకాల గురించి పంచాయతీ ఆఫీసు లో బోర్డు పెట్టియున్నాము. అది మీరు చదువుకొని ఏదైనా సమస్య ఉంటె మీరు సచివాలయం నకు పిర్యాదు చేయవచ్చు. అలానే మన సమస్యలు ఏమి ఉన్న ఇక్కడ చర్చించా వచ్చు. గతంలో మన గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు కొంతవరకు ఈ సమస్యను తగ్గించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కరెంటు కొరత ఉంది. గ్రామాల్లో కరెంటు స్తంభాలు వేయాలి. ఆ సమస్య కూడా ఎలెక్ట్రిసిటీ వారితో మాట్లాడతానని చెప్పారు. సర్పంచిగా నేను మాట్లాడటం కాదు…అన్ని శాఖలు నుండి గవర్నమెంటు వారు వచ్చారు కాబట్టి ఒకొక్కరిని మాట్లాడమని పిలవడం జరిగింది. సంవత్స రానికి మూడు, నాలుగు గ్రామసభలు జరుగు తాయి. ఒకటి సాధారణ సమావేశం,మిగతావి గ్రామసభ ఇందులో మనకి ఉన్న సమస్యలు గురించి చర్చించు కోవడం. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా బొర్రా కేవ్స్‌ పార్కింగ్‌ గురించి ఒకతీర్మానం చేయడం జరిగింది. డి.పి.ఓ. డి.ఎల్‌.పి.ఓగారికి కూడా లెటర్‌ ఇవ్వడం జరిగింది. ఈరోజూ ట్రయిల్‌రన్‌ చేసి పి.ఓ గారి ద్వారా ఓపెన్‌ చేయడం జరుగుతుంది. పార్కింగ్‌ ఫీజు పంచాయతీ వాసులు చేస్తది. వ్యాసకర్త : కె.సతీష్‌కుమార్‌,సమత ఫీల్డ్‌కో`ఆర్డినేటర్‌

ఉపాధి బ‌హుదూరం..పెరుగుతున్న నిరుద్యోగం!

స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ.నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి.
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవించడంతో ఉపాధి బహు దూరమైంది. ఈ సమస్య సమీప భవిష్యత్తులో ఓమహాఉద్యమంలా మారనున్నది. సిఎమ్‌ఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ) విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు పరీశీలిస్తే..దేశంలో ఎంతమంది ఉపాధిలేక రోడ్డున పడినట్టు తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం..2021 డిసెంబర్‌ చివరి నాటికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్టు వెల్లడిరచింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల నిరుద్యోగ రేటు పెరుగుతోందని, అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం నమోదు కాగా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. గత ఏడాది 2020-21ఏప్రిల్‌-జూన్‌ త్క్రెమాసికంలో దేశంలో ‘నిరుద్యోగ రేటు’ 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో ఇదే త్క్రెమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8శాతానికీ, స్త్రీలలో 21.2 శాతానికీ పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 21 శాతమైంది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి,ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటిదోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలు ఆట్టే ఆశ్చర్యం అనిపించవు. ఇంకా చెప్పాలంటే,ఈ లెక్కల్లో కనిపించని వ్యథార్థ జీవుల యథార్థ గాథలు ఇంకెన్నో అనిపిస్తుంది. పాలకుల తక్షణ కర్తవ్యమూ గుర్తుకొస్తుంది. ఎంచుకున్న శాంప్లింగ్‌ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్నిసార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలవుతాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ అందించే లెక్కలు, చేసే సర్వేల నుంచి అసలు సూక్ష్మం గ్రహిం చడం కూడా ముఖ్యం. ఏడాది మొత్తంగా తీసుకొని 2019 జూలై మొదలు 2020-21 జూన్‌ వరకు చూస్తే మాత్రం నిరుద్యోగ రేటు నిరుటి 5.8 శాతం నుంచి 4.8శాతానికి తగ్గినట్టు పైకి అనిపిస్తుంది. కానీ, కరోనా తొలి వేవ్‌ సమయంలో 70 రోజుల లాక్‌డౌన్‌ సమయం అత్యంత కీలకం. ఆ కాలాన్ని లెక్కించిన ఆఖరు త్క్రెమాసికం చూస్తే, పట్టణ ప్రాంతాల్లో ఐటీ సహా సేవారంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఫలితంగా గణనీయంగా నిరుద్యోగం పెరిగిందని అసలు కథ అర్థమవుతుంది. నిజానికి, నాలుగేళ్ళ క్రితం 2017 ఏప్రిల్‌ నుంచి ప్రతి త్క్రెమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబం ధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు’ (యూఆర్‌) ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మస్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడు తుంది. కానీ, ద్రవ్యోల్బణం,మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది. ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. నిరుటి జూలై నుంచి సెప్టెంబర్‌ త్క్రెమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరు గున ఉన్న బంగ్లాదేశ్‌ (30.5 శాతం), శ్రీలంక (33.7 శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళు గానే ఉపాధి పొందుతున్నారు. దురదృష్ట వశాత్తూ, ఈ రంగాలన్నీ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతినడం వారికి ఊహించని ఇబ్బందిగా మారింది. సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31శాతమే అని లెక్క. అదనుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండ వచ్చు. కానీ, దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్క్రెమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయింది. ఆ సంగతి ఆర్థికవేత్తలే తేల్చారు. 15 ఏళ్ళు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి29ఏళ్ళ లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్‌, ఆఫీస్‌లు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదు. ఇది నిష్ఠురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55లక్షల ఉద్యోగాలు పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సైతం అంచనా వేయడం గమనార్హం. నిజానికి, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో ఈ మార్చితో ముగిసిన ఆర్థిక వత్సరంలో భారతఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర కుంచించుకు పోయింది. స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ. నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనిం చాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్త లు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీకా అస్త్రంతో అందరికీ కరోనా నుంచి ఆరోగ్య సంరక్షణ నివ్వాలి. అప్పుడు జనం సత్వర ఉపాధి అన్వేషణలో పడతారు. ఆర్థికవ్యవస్థ పురోగతిలో భాగమ వుతారు.
ఉపాధి బహుదూరం.. కోట్లలో పని లేనివారు
మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు నిరుద్యోగులకు అక్కరకు రావడం లేదా?ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు,చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు! ‘ప్రపంచంలో ఉపాధి అవకాశాలు, సామాజిక కోణం సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన తాజా నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా…2018లో అది 1.86 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. 2019 నాటికి ఇది ఇంకా పెరిగి 1.89 కోట్లకు చేరు కుంటుందనే అంచనాకు వచ్చింది ఐఎల్‌వో. 2018లో ఈ పెరుగుదల శాతం 3.4గా ఉం డొచ్చని తొలుత అంచనా వేసినా అది 3.5 శాతం దగ్గరే కొనసాగవచ్చని అభిప్రాయ పడిరది. వాస్తవానికి మన దేశంలో 2012లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్య 2014 నాటికి 3.4 శాతానికి తగ్గింది. కానీ 2015లో 3.5కి చేరుకుంది. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతుండటం గమనార్హం.2017కి ముందు కూడా ఐఎల్‌వో ఈ అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2017 నాటికి 1.78 కోట్లు, 2018లో 1.80 కోట్లగా నిరుద్యోగుల సంఖ్య ఉంటుందని అంచనా వేసినా.. 2017లో అంచనాలకు మించి 5 లక్షలు ఎక్కువగానే నిరుద్యోగుల సంఖ్య ఉన్నట్లు గుర్తించింది. ఈ మధ్య చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 70లక్షల ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. పైగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయాడం లేదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. విచిత్రం ఏమంటే ప్రధాని చెప్పిన లెక్కలకు, ఐఎల్‌వో నివేదించిన అంశాలకు ఎక్కడా పొంతన లేదు.
మొత్తంగా కొంత ఊరట!
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం, నిరుద్యోగ సమస్య మూడేళ్లలో తొలిసారిగా కొంత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయంగా ఐఎల్‌వో పేర్కొంది.2017లో 19.27 కోట్లగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2018లో 19.23 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉపాధి కోసం ఎదురు చూసే వారి సంఖ్య 19కోట్ల దగ్గర స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం గా పేర్కొంది.
ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన
ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు.సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు. భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది. దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం7శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా.భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది అని ఇండియాస్‌ లాంగ్‌ రోడ్‌ పుస్తక రచయిత డాక్టర్‌ జోషి చెబుతున్నారు. కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువ మంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు. ఈ కారణాలతో తక్కువ జీతాలతో,ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది.
భారత్‌ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా
ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్‌, లెదర్‌ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్‌ ఎగుమతులు తగ్గిపోయాయి.తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు,నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం,తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఛీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిన శర్మ అన్నారు. చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్‌ శర్మ అభిప్రాయపడ్డారు.బహుశాఉద్యోగాల కల్పన విషయంలో భారత్‌ తనఅవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో? – ఎన్‌.వి.సోమేశ్వరరావు

మ‌హానీయ స్వామి వివేకానంద‌

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషా యాం బరాలు ధరించి, పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థని మీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మి కతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయా లను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిం చడం, ఆసౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింప చేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విషయాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.

Read more

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై జనాల్లో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి.డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూ హెచ్‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్‌ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్‌ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్‌ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్‌ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటా క్టులలో కనీసం ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. జూబ్లీహిల్స్‌లో ఒమిక్రాన్‌ పేషెంట్‌కు 3రోజుల పాటు ఫుడ్‌ సర్వ్‌ చేసిన హోటల్‌ సిబ్బంది లోనూ ఎవరికీ ఈ వేరియంట్‌ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్‌ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌కు స్పీడ్‌ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ,మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్‌ స్పీడ్‌ తగ్గిపోయిన సూచ నలు కన్పిస్తున్నయి.హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చెబు తున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో 40 మంది విదే శాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌గా స్ప్రెడ్‌ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్‌?గా ఇంకెవరికీ స్ప్రెడ్‌ కాలే దని చెప్తోంది.

Read more

రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

Read more

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌`26) సదస్సు ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్‌లో జరిగింది. ప్రతిఏటా 197దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈసదస్సు ప్రధానంగా చర్చిం చింది. ఇది వాతావరణ మార్పుల పై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వ ర్యంలో జరిగిన కన్వెన్షన్‌.పర్యావరణంపై మానవ కార్యక లాపాల ప్రభా వాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతిభూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నవంబర్‌ 1 నుంచి 12 తేదీల మధ్య ఈసదస్సు జరిగింది.కాప్‌ 26 ప్రాధాన్యత
కాప్‌ 26 సదస్సు 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధిం చింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం.పారిస్‌ ఒప్పందం ప్రాథమి కంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు1.5సెల్సియస్‌ పెరుగు తున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టి స్తాయి. ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?
మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్య లకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాదివాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచు కోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్‌ అవకాశం కల్పించింది.ఉదాహరణకు… మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా,ఇంటి దగ్గరఉండి పనిచేస్తే సరిపోదా,ఇది కర్బన ఉద్గారా లను తగ్గిస్తుంది కదా,పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా?లాంటి ఆలోచనలకు దారి తీసింది.
గతంలో ట్రంప్‌ రద్దు చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడంవల్ల ఆర్ధిక పరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావి స్తున్నారు. ఈసారి కాప్‌లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు,వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తు న్నాయి. ప్రస్తుత కాప్‌26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి. పర్యా వరణ సమస్యలపై చర్యలకు నిధులు,ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం,తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం,ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.75వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80శాతం మాత్రమే ఇవ్వగలిగాయి.వీటిలో ఎక్కువ భాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్‌ ఫైనాన్స్‌. కార్బన్‌ మార్కెట్లు, కార్బన్‌ క్రెడిట్‌ల వ్యవ స్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్‌ ఎకానమీలకు కార్బన్‌ క్రెడిట్‌ లను ఇచ్చే విధానం ఇది. పేద దేశాలకు సాయం అందించాలి చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి,ఇష్టారాజ్యంగా కాలు ష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక ఉదాహరణ...ఒకఅడవిని నాశనం చేసి నందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒకదేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు‘కాలపరిమితులు’అవసరం. ఈ సమస్య లకు పరిష్కారం చాలా సులభం అని అనుకుం టారు. కానీ అదినిజం కాదు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి. ఇది నిరంతర ప్రక్రియ.వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్‌ ఛేంజ్‌ అన్నది పెనుసవాల్‌ అని,అయితే క్లీన్‌ ఎనర్జీ ఎన్వి రాన్‌ మెంట్‌ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సౌరకూట మిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ప్రధాని మోడీ చెప్పారు. వాతా వరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణా మాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకు తాను,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌..2030 నాటికల్లా ఇండియా-యూఎస్‌ క్లైమేట్‌ అండ్‌ క్లీన్‌ ఎనర్జీకి సంబంధించిన లక్ష్య సాధన కోసం అజెండాను రూపొందించామని వెల్లడిరచారు. పలు ఇతర దేశాల్లోని కార్బన్‌ కాలు ష్యం కన్నా ఇండియాలో ఈకాలుష్యం 60 శాతాని కన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకుకృషి జరగాలని సూచిం చిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేశారు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై 40దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్‌గా ప్రధాని పాల్గొ న్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌,బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బ్రిటిష్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రెజిల్‌అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు. గ్లోబల్‌ హైబ్రిడ్‌ సమ్మిట్‌ద్వారా భారతదేశాన్ని స్వచ్చ Ûమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమా వేశం నిలవనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIూ) ఛైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ శిఖరాగ్ర సమావేశాలను ూనణ ఛాంబర్‌,చీIుI ఆయోగ్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, (జూIR),సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.శిఖరాగ్రసమావేశంలో, భారతదేశ హైడ్రో జన్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాయి. కాప్‌26 వాతావరణ సదస్సుతో పెరిగిన కాలుష్యం
వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమా వేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఈ ఈవెంట్‌ని ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది. కానీ,మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వ హణ సమయంలో జరిగాయని ఓకొత్త నివేదిక తెలిపింది.ఎక్కువ మంది ప్రతినిధులు,ఎక్కువ ఉద్గారాలు కాప్‌26సమావేశ సమయంలో విడు దల అయిన మొత్తం కార్బన్‌ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానంగా ఉండను న్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది. ఇది దాదాపు 10,000 యూకేగృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం. 2019లో మాడ్రిడ్‌లో జరిగినచివరి వాతావరణ శిఖరాగ్ర సమావే శంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే కాప్‌26 సమావేశా నికి అయిన ఉద్గారాలు రెట్టింపు. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో27,000 మంది పాల్గొనగా, కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో ఈ సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయ విమానాలు,ప్రైవేట్‌ జెట్‌లు
నివేదిక ప్రకారం కాప్‌`26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.విమానాల నుండి వచ్చే ఉద్గారా లను నియంత్రించడానికి,హాజరయ్యే వారు సాధ్య మైతే రోడ్డుమార్గంద్వారా ప్రయాణించాలని కోరారు. అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో వచ్చారు.
అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్‌ వాహనాలను, హెలీకాప్టర్‌లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు. నవంబర్‌ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగురోజుల్లో ప్రైవేట్‌ జెట్‌లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమా నాలు వచ్చాయని ఏవియేషన్‌ అనలిటిక్స్‌ కంపెనీ సిరియమ్‌ రియాలిటీ చెక్‌తో చెప్పింది. సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించ డానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది. వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయో గించడం,చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి. కార్బన్‌ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం ూAూ2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి కాప్‌ ఇదే అని యూకే ప్రభు త్వం చెప్పింది. ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడు దల అయినా ఇది కూడా ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా గుర్తింపు పొందింది.(బీబీసీ సౌజన్యంతో)
-రవీంద్రనాథ్‌ కె 
1 7 8 9 10 11 13