నాటి క‌ల‌ల నేటి క‌థ‌న‌ల శంఖాల‌-2020

‘చరిత్ర మనం కోరుకున్నట్టు నడవానుకుంటాం. కాని నడవదు’ అంటాడు ఇహెచ్‌.కార్‌.‘పరస్పరం సంఘర్షించిన శక్తులో చరిత్ర పుట్టెను’ అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాను 2000 నాడు హంగామా చేసిన 2020విజన్‌తో పోల్చి చూసుకుంటే చాలా అంశాు అర్ధమ వుతాయి. కలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకు కదన శంఖారావాతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తొగు రాష్ట్రాతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతా విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారు వాలాగా మారిన మోడీ02 తొలి చర్యతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాయాపై విద్వేష దాడు, సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అణచివేతు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పానా పరమైన సవాళ్లు చానట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి30న కేరళలో తొలి కరోనా కేసు బయ టపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అసత్వం ప్రదర్శించింది. ప్రజలోనైతే భయాందోళను మొదలైనాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళన కేంద్రంగా వున్న అదే ఢల్లీిలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలో…70లో 62 స్థానాు గ్చొకుని ‘ ఆప్‌ ‘ ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారి పోవడం అందులోనూ విద్యాధికు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢల్లీిలో ఓటమి తొలిదెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢల్లీిలో హిందూత్వ శక్తు దాడుకు ప్పాడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెరేగాయి. ఆందోళను తీవ్రమై ఢల్లీి స్తంభించిపోయింది. ఈ కల్లోం మధ్యనే మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికు వస్తున్నా ఖాతరు చేయ కుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వ్లెడిరచింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకా మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాు చేపట్టారు.కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోు పెడుతున్నా ముందస్తు చర్యు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటిం చాన్నారు.12 గంటు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యుకు ఇతరు పట్ల గౌరవ సూచకంగా పళ్లాు చప్పుడు చేయాని, చప్పట్లు కొట్టాని పిుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకు ఆగిపోయాయి. మొహాకు మాస్కు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవు ఉపాధి కోల్పోయారు. వస కార్మికు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథు జాతిని కచి వేశాయి. ఈ సమయం లోనే ఢల్లీి లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నె మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళా మధ్య ఉద్రిక్తతు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాపై కేంద్రం, బిజెపి, దాని అనుకూ మీడియాు కేంద్రీకరించాయి. కాని ఎ.పి,తెంగాణతో సహా కరోనా సవాు పెరిగింది. ఇదిచానట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాంలోనే మే7వ తేదీన విశాఖ పట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాు పెరిగి, ప్రజా జీవితాు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాు ఆర్డినెన్సుగా జూన్‌ 7న సంతకాు చేశారు. ఈ నెలోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20మంది సైనికు మరణిం చడం, చైనాయాప్‌ ను నిషేధించడం వంటి పరిణామాు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈనె లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాు ఫలించలేదు. ఆగష్టు నె దేశానికి అనేక విషాదాు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానా శ్రయంలో ప్రమాదం జరిగి 17మంది ప్రాణాు కోల్పోయారు. విజయవాడలో డాపపరమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11ప్రాణాు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైం భూగర్భ జవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వ్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వ్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజు, శ్రమజీవు రోజు గడవక నానా అవస్థ పావుతుంటే కరోనా మరణాు, చికిత్స సదుపాయాు లేక, నిబంధను కూడా తేక విషాదం తాండ వించింది. ఈ సమస్యతో గాని నిబంధనతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీమసీదు విధ్వం సం కేసులో నిందితుగా వున్న అద్వానీ తదిత రును సెప్టెంబరులో అహాబాద్‌ హైకోర్టు విడుద చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌..బిజెపి-జెడియు సర్కారును బంగా సవాు చేసింది. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వ్ల, మజ్లిస్‌ వంటి పార్టీు ఓట్లనూ ప్రజనూ చ్చీడంలో బిజెపి వ్యూహాకు తోడ్పడ్డం వ్ల కొద్దిలో తప్పిపోయింది. ఈ కామంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోు, గ్యాస్‌ వంటి వాటి ధరు తగ్గించే బదు పదే పదే పెంచుతూ ప్రజపై భారాు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాని వచ్చిన సూచను పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీన్నీ కురిపించింది. వీటివ్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షా ప్రతిఘటనపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువు హత్య వంటి వాటిపై లేనిపోని చర్చతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాు అము చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటి ప్రచారాు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీ యంగా వ్లెడైంది. ఇలాంటి ప్రచారా నేపథ్యంలో కేసు పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శు, వివాదాు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా. నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యక్ష్మి ఆయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆయ భూము, ఎ.పి లోనూ దేవాయా రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాంటే తెంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాకు రావసిన నిధు మంజూరు లోనూ విభజన సమస్య పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాు సూటిగా ఎదుర్కొనలేక పోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాు, ప్రాంతీయ పార్టీు లోబడిపోవచ్చుగాని…ప్రజు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతు దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ ప్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాకు వెళ్లవసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాు, లౌకిక పార్టీు, ఇతర పత్యామ్నాయ శక్తు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటు తున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే. నాటి కల 2020.. నేటి కదన శంఖా 2020..
` రచయిత : తెల‌క‌ప‌ల్లి ర‌వి. సీనియర్‌ పాత్రికేయు-(ప్రజాశక్తి సౌన్యంతో..)

అస్థిత్వం కోల్పోతున్న సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ

‘‘ ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి ’’- లోత సుబ్బారావు
ఉద్యమాల గెడ్డగా పేరుగాంచిన సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ పెదమల్లాపురం ఏరియా గిరిజనులు అస్థిత్వం కోల్పోతున్నారు. తరాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న శాసనసభ్యులకు తమ ఓట్లు వేసినా నేటికీ తమ బతుకులు మారడం లేదు. ఆదునిక సాంకేతిక యుగం వచ్చినప్పటికీ ఈ ప్రాంత గిరిజనుల జీవన సరళీలో మార్పు లేని దుస్థితి. స్వతంత్ర భారతంలో ఆదివా సీలకూ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకమైన, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి, ఎంతో విలువైన సహజ వనరులు, ఖనిజసంపదలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులూ నేడు పరాయికరణకు గురవుతున్నారు. సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతాలు నేడు ఆదివాసులకు తీరని శాపంలా పరిణమించాయి.
తూర్పు గోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలో నివాసముంటున్న గిరిజనులు దుస్థతి అగమ్యగోచరంగా మారింది. వారి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఐదు మైదాన ప్రాంతంలో ఉన్న శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండ ల్లాలో 59 గిరిజన గ్రామాలున్నాయి. సుమారుగా 1.18వేల మంది కొండకాపు, కొండరెడ్డి, కోయి, వాల్మికీ భగత వంటి గిరిజన తెగలు నివాసముంటున్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమౌతున్నారు. ఎలాంటి పనులేక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందక ప్రతి ఏడాది తీవ్రమైన కరువు ఏర్పడడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారు. తరతరాలుగా వివిధ దురాక్రమణదారుల దోపిడికి గురవుతున్నారు. అలాంటి అణగారిన ప్రజలు నేడు తమ అస్థిత్వం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ దళారీలు గిరిజన తండాలను ఆక్రమించి ఇక్కడ నివసించే గిరిజనుల జీవన విధానాలను నిర్వీర్యం చేస్తున్నారు. గిరిజన భూములు దురాక్రామణకు గురవుతూ రియల్‌ ఎస్టేట్‌గా మార్చేస్తున్నారు. స్థానిక గిరిజనులను అడ్డంపెట్టుకొని విలువైన వనరులు దోచుకొంటున్నారు. ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి. కొండలపై ఉన్న ఆవేల్తి, అనుమర్తి, పెద్దూరు, కిత్తమూరిపేట, ధార మల్లా పురం, జల్దాం వంటి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరిjైున మౌలిక సదుపాయాలు లేవు. ఆగ్రామాలకు నేటికీ సంపూర్ణమైన వైద్య సదుపాయాలు దక్కలేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత :
ఎంతో మంది గిరిజన చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతోనే కొట్టిమిట్టులాడుతున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆదుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే పౌష్టికాహారం లేకచిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. పెదమల్లాపురం ఆసు పత్రిలో సరిjైున వైద్యం అందడం లేదు. ఆసుపత్రికి అంబులెన్స్‌ లేదు. అత్యవసరం అయితే డోలు మోసుకోవాల్సిన దుస్థితి. వందలామంది చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే… ఐదు మండలంలో కొన్ని లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లడానికి అసలు రహదారులు లేవు. పోలవరం నుంచి జల్ధాంకు ఏర్పాటు చేసిన రహదారి అస్తవ్యస్థంగా ఉంది. రాఘపట్నం నుంచి మండల కేంద్రమైన రౌతులపూడికి వెళ్లాలంటే రోడ్డుంతా గతుకుల మయంగా మారింది. పెదమల్లారం నుంచి శంఖవరం చేరాలంటే రోడ్డుంతా అస్తవ్యస్థంగా మారింది. దీంతో కనీసం బస్సు ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. మాతయ్యపాలెం నుంచి రాఘపట్నం, సార్లంక చేరాలంటే కాలిమాటే గతి. కనీసం ద్విచక్ర వాహనాలు ఈ దారిలో వెళ్లే పరిస్థితి కన్పించట్లేదు. ఈ గ్రామాలకు రహదారి నిర్మించాలని దశాబ్దలుగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిరిజన ప్రాంతా లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది. ఏళ్లు గడుస్తున్న గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణాలు మాత్రం కలగానే మిగిలింది. ఎన్నోసార్లు రహదారుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి బుట్ట దాఖలయ్యాయి. గతంలో తమ గ్రామాలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలు బహిష్కరించడం కూడా జరిగింది. ఐదు మండలాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు ఇంత వరకు పాలకులుగాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోక పోవడంపై ఈ ప్రాంత వాసులు సందిగ్ధ పరిస్థితుల్లో నాయకులను ప్రశ్నంచలేక ఎవరికి ఓటువేయాల లేదా ఓటును బహిష్కరించాల అనే మీమాసంలో ప్రజలల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు ఇవి :
ె పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలి
ె ఉపప్రణాళిక ప్రాంతంలో ఉన్న 59 గిరిజనగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి
ె జీవో నెంబరు 3ని సవరించి సబ్‌ప్లాన్‌ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు న్యాయం చేయాలి.
ె అన్నీ రకాల ఉద్యోగాలు సబ్‌ప్లాన్‌ ప్రాంతంలో స్థానిక గిరిజన విద్యార్థులకు మంజూరు చేయాలి
ె నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలి. ఐటీడీఏ ద్వారా మంజూరయ్యే సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్‌ ఏరియా ప్రజలకు వర్తింప చేయాలి
ె ఎస్‌.టీ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు ఆటంకం లేకుండా ఎస్‌టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
ె గిరిజన గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరిచి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ె నైపుణ్యమైన విద్యను అందించడానికి జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి.
ె ప్రతి గిరిజన గ్రామంలోనూ సురక్షతమైన రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మించాలి.
ె ఫారెస్టు పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలిచ్చి హక్కును కల్పించాలి.
ె పెదమల్లాపురం వేళంగి, రాఘపట్నం, బురదకోట, జల్దాం గ్రామ పంచాయితీలో కమ్యూనికేషన్‌ కోసం సెల్‌టవర్లు నిర్మించాలి.

దేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యు శాస్త్రం

ఈ భూమి మీద ఆధునిక మాన వుడి కథ సుమారు రెండు లక్షల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడి నుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్‌తల్‌ మ్యాన్‌ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్‌ ఈస్ట్‌ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభై వేల ఏళ్ల క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారత దేశానికి పరిమితమైన వారు-ఉత్తర భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారత దేశానికి పరిమితమైన వారు-దక్షిణ భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయులను మూల వాసులుగా పరిగణించారు. ఈ దేశంలో క్రీ.పూ 1500 నుంచి క్రీ.శ 200 మధ్య కాలంలో మనుస్మృతి కుల వ్యవస్థను ద ృఢ పరిచింది. అంతకు ముందు రెండు వేల మూడు వందల ఏళ్లు మిశ్రమ జనాభా కొనసాగిన తర్వాత, మనుస్మ ృతి ప్రభావంతో కులగోత్రాల ఆధారంగా పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి. మనుస్మ ృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా సమానమే. కాని, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు బ్రాహ్మణులకు గౌరవ స్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాల వారు కూడా చేసిన పని అదే. కొలోనియల్‌ రూలర్స్‌ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బ తీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవిమధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం నిలుపుకోవ డానికి కల్పించి ప్రచారం చేసినవే. వేల వేల ఏళ్లుగా దేశంలో ఒక మిశ్రమ జనాభా కొనసాగుతూ వచ్చిన విషయాన్ని వారు కప్పి పుచ్చారు. మరొక పరిశోధకుల బృందం చెపుతున్న దాని ప్రకారం-భారతేదశంలో మిశ్రమ జనాభా తయారు కావడానికి 65 వేల ఏళ్ళ క్రితమే బీజాలు పడ్డాయి. ఆఫ్రికా మూలాలున్న సమూహాలు కొన్ని ఇతర ప్రాంతాల గుండా భారత్‌లో ప్రవేశించాయి. క్రీ.పూ ఏడు వేల ఏళ్ల క్రితం జగ్రోసియన్‌ హెడ్డర్స్‌ బెలూచిస్థాన్‌ చేరి తొలి భారతీయులతో సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఈ రెండూ కలిసి ఒక మిశ్రమ జాతిగా హరప్పా నాగరికతను ఏర్పరిచాయి. ఆ తర్వాత రెండు వేల ఏళ్లకు ఆర్యులు వలస వచ్చారు. అంటే ఇక్కడ జరిగిందేంటి? సంస్క ృతీ నాగరికతలు ఏక మార్గంగా అభివృద్ధి కాలేదు. బహు ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇది వాస్తవం! అందుకే ఈ దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఒకదానికొకటి సమాంతరంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇదే విషయం సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనమంతా భారతీయులమే అయితే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకుల పూర్వీకులు వలస వచ్చినవారే. అంటే మనమంతా వలస వచ్చిన వారికి వారసులమే. మనదంతా మిశ్రమ జనాభానే. ఏమయితేనేం మానవ జాతి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు. ఎగుడు దిగుళ్లూ లేవు. పవిత్రులమని, ఉన్నతులమని జబ్బలు చరుచుకునే వారు కూడా ఈ మిశ్రమ జనాభా నుంచి వచ్చినవారే…ఇంగితజ్ఞానం, వివేచన పెరిగినందు వల్లనే మనిషి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. దాని వల్లనే విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ వచ్చింది. ఫలితంగా మనిషి జంతువుల నుంచి విడివడి పరిణామం చెందుతూ వచ్చాడు. ఏ మత విశ్వాసాల వల్లనో మనిషి మనిషిగా ఎదగలేదు. సైన్సు వల్లనే ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ సైన్సు సహాయంతోనే తన గతాన్ని తవ్వి తీస్తున్నాడు. జర్మనీలో దొరికిన రెండు వందల వేల ఏళ్ల నాటి ఒక మానవుడి అస్థిపంజరం పరిశోధనలను ఆకాలానికి తీసుకుపోయి కొత్త సత్యాల్ని వెల్లడిరచింది.
లభించిన పురాతన డిఎన్‌ఎ ప్రకారం తెల్ల చర్మం వారు ఎక్కువని, నల్ల చర్మం వారు తక్కువని విదేశాలలో ఉన్న భావన తప్పు. ఒక కులం వాడు ఎక్కువనీ, మరో కులం వాడు తక్కువనే భారతీయుల భావనా తప్పే. ఓగోత్రం వాడు పవిత్రుడని మరో గోత్రం వాడు అపవిత్రుడని భావించే వారంతా మూరు?లు. కొంత సైన్సు, మరికొంత చరిత్ర తెలుసుకుంటే కళ్లకున్న అహంకారపు పొరలు తొలగి పోతాయి. తమని తాము మోసగించుకుంటూ, ఇతరులను మోసం చేసే వారికి జ్ఞానోదయం కావాలంటే మత గ్రంథాలు పక్కన పెట్టి వివేచనను నిద్ర లేపాలి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చు కోవాలి. పరిణతి చెందని వారంతా పరిణామ దశలోని తొలి మానవుడి దశలో వున్నారన్నమాట! ఆకారాలు మారాయి కాని, వారి మెదళ్లు ఇంకా మూడు వేల ఏళ్ల కిందటి భావజాలంతోనే ఉన్నాయన్నది నిజం. బలవంతుడు నిర్బలుడికి సహాయపడ్డట్టు- మేధోపరంగా ఎదిగిన వారు, ఎదగని వారికి చెపుతూనే ఉండాలి. అందుకే సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించే వారిపై ఎక్కువ బాధ్యత ఉంది. ఆలోచన లేనివాడు ఎలాగూ మూర?ంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆర్కియాలజీ శాఖ వారి తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలతో చరిత్రకారులు చరిత్ర రాశారు. దానికి ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం తోడయ్యింది. ఊహలకు, భావనలకు పరిమితం కాకుండా జన్యు శాస్త్రంతో మానవ పరిణామ చరిత్ర మరింత స్పష్టమౌతూ వుంది. దాంతో నేటి భారతీయ సంప్రదాయవాదులకు గుండెలు ఆగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ భారత ఖండంలోని గొప్ప సంస్కృతిలోని భాగంగా సంస్క ృత భాషని మన వాళ్లు నెత్తికెత్తుకొని ఊరేగారు. నిజానికి ఆ భాషకు మూలాలు మొదట సిరియాలో బయట పడ్డాయి. పురాతత్వ పరిశోధకులు, జీవ శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏమిటంటే-వారు ప్రస్తుతంలో నిలబడి గతంలోకి మెట్టు దిగుతున్నారు. పురాతన మానవ అస్థి పంజరాల నుంచి డిఎన్‌ఎ సేకరించి మరింత కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు. నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల వల్ల ఐదు వేల ఏళ్ల నాటి నాగరికత బయటపడిరది. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు ఇండస్‌ వ్యాలీకి సంబంధించిన సమాచారం లభించింది. ఈ ప్రాంతమంతా వ్యాపించిన వారు హరప్పన్లు. నేడు మన హిందూ సంప్రదాయవాదులు వాదిస్తున్నట్టుగా వీరికీ వేద సంస్క ృతికీ సంబంధమే లేదు. ఆర్యులు ఎక్కడి నుంచో వలస రాలేదని, మొదటి నుంచీ వారు ఈ పావన భారతావని లోనే విరాజిల్లారని, వేదాలు ఇక్కడే ఉద్భవించాయని చెప్పే వాదనలను పరిశోధనలు ఏమాత్రం బలపరచలేదు. హార్యానాలోని రాఖిగర్హి తవ్వకాలలో లభించిన పురాతన డిఎన్‌ఎ, ఇండస్‌ వ్యాలీ గూర్చి స్పష్టమైన సమాచార మిచ్చింది. ఆర్యులు వలస రావడం నిజమేనని ధృవపర్చింది. పైగా దక్షిణాసియా మూల వాసులు-ఇరాన్‌ దేశపు వ్యవసాయదారుల కలయిక వల్లే హరప్పన్లు ఏర్పడ్డారని తెలిసింది. అంటే, వేల వేల ఏళ్ల క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడిరది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకరజాతి లాంటి పదాలకు అర్థమే లేదు కదా! మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల, గోత్రాలకు విలువ వుంటుందా? జాత్యహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా చూస్తున్నాం. అంటే మానవ జాతి అంతా ఒక్కటే అని అర్థం. – డా.దేవరాజు మహారాజు

ఓటరు అనే నేను

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి.. ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఇటీవల జరిగిన సంభాషణ. ఆమె పేరు కవిత.
‘నీకు ఇక్కడే ఓటుందిగా?’ ‘లేదు మేడం.. ఓటు నమోదే చేయించుకోలేదు. ఇంతవరకూ నేను ఓటే వేయలేదు. అయినా, మనం వేయకపోతే- పోయేది ఏముంది? ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఏం ఒరుగుతుంది కనుకా.. ‘అంది నిర్లిప్తంగా…ఇలా ఒక్క కవిత మాత్రమే కాదుబీ ఇంకా చాలామంది అలాంటి ఆలోచనలతో, ఉదాసీనతతో ఉన్నవారు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. ఓటు మన బాధ్యత కదా! కానీ ఈ నిర్లిప్తత ఎందుకు వస్తుంది? నిజమే ఒక్కసారి ఆలోచిస్తే ఈదేశ పౌరులుగా మనం చేస్తుంది నిజంగా బాధ్యతా రాహిత్యమే. ఓటు వేయకపోతే శిక్షలు వేస్తారన్న భయంకాదు కానీ..రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం నిజంగానే క్షమించరాని నేరం.
నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేది. ఊరందరం ఒకే స్కూల్లో చదివేవాళ్లం. ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్య చాలాకాలంగా నిర్వీర్యం చేయబడిరది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించాలంటే- చాలా డబ్బులు పోయాలి. ఈ విద్యావిధానం ఇలా మారడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే అన్నది సమాధానం.. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది.. ఎన్నుకుంది మనమే కదా?! అంటే మన విద్యావిధానం ఇలా తయారుచేసే పాలకులను ఎన్నుకోవడం నాఓటుతోనే. దాన్ని మార్చాలన్నా నాఓటుతోనే సాధ్యం. అసలు ఓటు వేయకపోయినా మనలాంటివారి ఓట్లు పడక ప్రజానాయకులు ఓడిపోతు న్నారేమో? ఒక్కసారి ఆలోచించండి. ఆఓటు వేసే చైతన్యమే మనకు రావాలి. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లకు ఓ సదవకాశంగా భావించాలి. భావి భారత పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన పాలకులు ఎవరో నేనే నిర్ణయించగలనన్న మాట.. ఇలా అనుకుంటుంటేనే నాకెంతో శక్తి ఉందనిపిస్తోంది.
గ్రామీణ పరిస్థితులు..
మా తాతయ్యను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. కౌలుకు తీసుకునే.. వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదంతా కష్టపడతాడు గానీ, అప్పు తప్ప ఇంట్లోకి ఉప్పూ తేలేని పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఎన్నికల కోసం ఎదురుచూడటం అలవాటైపోతుంది. కానీ, ఈ కష్టాలన్నింటికీ.. ఈ వ్యవసాయ విధానం ఇలా కావడానికి ప్రభుత్వానిదేగా బాధ్యత. ఒక్కసారి కూడా దీన్ని ఆలోచించకపోవడం వల్లే..మన భవిష్యత్తును బాగుపరిచే వారికన్నా..తాత్కాలిక ప్రలోభాలకు, వాళ్ల మాయ మాట లకు లోనయ్యి, ఓమందు బాటిల్‌, రెండు పచ్చ నోట్లకు ఆశపడి కొందరు ఓట్లేసేస్తున్నారు. దాంతో మళ్లీ మన కష్టాలు అవే..వారి స్వార్థాలు వారివే…అందుకే మన ఓటుకున్న పవరేంటో చూపిద్దాం. ఆ పవర్‌తో పవర్‌లోకి ప్రజాపక్షం వహించేవారిని తీసుకొద్దాం.
దేశ సార్వభౌమత్వం..?
అంతెందుకు నేను ఇప్పుడు ఇంత చదువుకున్నా నా ఉద్యోగమేంటో.. నా సంపాదనేంటో..నేను ఏదేశం వెళ్లాలా? అందుకు డబ్బులెలా సంపాదించాలా? అక్కడికెళ్లి ఎంత సంపాదించాలా? అదీ కాకపోతే ఏకార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలో అన్నదే నాలాంటి వాళ్ల ఆలోచనగా ఉంది. అంతేకానీ, మన బతుకుల్ని, భవిష్యత్తునూ నిర్ణయించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న స్పృహ ఉండటం లేదు. అసలు ఓటు నమోదు చేసుకోవాలన్న విజ్ఞత ఉండటం లేదు. నాకు ఓటుందా? నేను ఓటేసే రోజుకు కచ్చితంగా వచ్చి, నా హక్కు నేను కాపాడుకోవాలనే ధ్యాస అసలే ఉండదు. పైగా ఆరోజు ప్రభుత్వం సెలవిస్తే దాన్నీ ఎలా ఎంజారు చేద్దామా? ఓటీ చేసి మరింత సంపాదిద్దామా? అనే ఆలోచిస్తున్నాం. విదేశాలకు వెళ్లేటప్పుడు, అక్కడుండాల్సిన పరిస్థితిలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలేనన్నది విస్మరించేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో దేశభ విష్యత్తు ను తాకట్టు పెట్టే విధంగా మన విదేశాంగ విధానాలున్నాయి. ప్రపం చంలో విశ్వమానవాళి అభిలషించే పక్షం కాకుండా వేరొకవైపు మొగ్గి ఉన్నామన్నది విస్పష్టం. ఈపరిస్థితికి కారణం మనం ఎన్నుకున్న పాలకుల విధానాలే కారణం. మనం ఇంత చదువుకున్న నాకు ఈ దేశ పౌరునిగా బాధ్యత లేదా? అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించు కోవాలి. ఈపరిస్థితి మారాలంటే నా ఓటేగా కీలకం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికీ నా నిర్లక్ష్యమేగా కారణం. అందుకే నేను ఓటు వేయాలి.
యుద్ధం..కారణం.. : అంతెందుకు ఈ రోజు దేశంలో యుద్ధ వాతావ రణాన్నీ రాజకీయా లకు ఉపయోగించుకునే కుత్సితమైన విధానాలు అనుసరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం వచ్చే పరిస్థితికి సృష్టికర్తలు ఎవరు? కాశ్మీర్‌ సమస్య అలాగే నేటికీ ఉండిపోవ డానికి కారణం ఎవరు? అక్కడి పౌరులపై సైనిక నిర్బంధాల్ని ప్రయోగి స్తూ పిట్టల్లా ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకు కారణం ఎవరు? ఈ అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది యువత ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారకులెవరు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ప్రశ్నించు కున్నా మా? ప్రశ్నించామా? ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ మారాలంటే ఓటునే ఆయుధంగా చేసుకుంటాం. మన నిర్లిప్తతవల్ల అంతమంది సైనికు లను, పౌరులను బలితీసుకున్నాం. వేడినెత్తురు ప్రవాహం నీకు తగిలే వరకూ నీలోచలనం లేకపోవడానికి బాధ్యత నీదేగా? అని ఇప్పుడు అనిపిస్తుంది. మనదేశ రక్షణకు, సమగ్రతకు మన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు ఉపయోగించాల్సిన అత్యంత శక్తివంతమైన వెపెన్‌ ఓటే! అలాంటి ఓటును ఏదో యథాలాపంగా.. ఏమాత్రం ఆలోచించ కుండా కొంతమొత్తానికి అమ్ముకోవద్దు.. మత్తులో తూగిపోవద్దు.. కుల, మతాల తూకంలో చేరిపోవద్దు. కొన్ని బహుమతులకూ ఆశప డొద్దు. నాలాంటి నిర్లక్ష్యం నిండుగా ఉండేవాళ్లు ఇప్పటికైనా దాన్ని వదిలి చైతన్యంతో ఓటేటస్తే సరి.
వ్యాపారం.. రాజకీయం..: పదవీ వ్యామోహాలతో..రాజకీయ వ్యా పారం జరుగుతున్న పరిస్థితులు నేడు గల్లీ నుంచి ఢల్లీి వరకూ జరుగు తున్నవే. అందుకోసం అవినీతితో అంటకాగడానికి ఏమాత్రం వెను కాడడం లేదు. ఈపరిస్థితి ఎందుకు వచ్చింది? మన చుట్టూనే మనల్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు రోజురోజుకు చుట్టుముడుతున్నా.. మనం పట్టించుకోని స్థితిలో ఎందుకున్నాం? ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనేంటీ, దేశ రాజకీ యాల్లోనేంటీ కుటుంబ పాలనలు.. రాష్ట్రాలు, దేశాలు వాళ్ల సొంత ఆస్తులన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని వారి వాణిజ్యాలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. అనేక నేరాలకు పాల్పడు తున్నారు. ఒక్క శాతం వద్దే దేశంలోని పెద్దమొత్తంలో డబ్బంతా పోగుబడి ఉంది. కానీ 99శాతం మంది పౌరులు పడరాని కష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక, వేసుకోవ డానికి బట్ట లేక. ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్నలు. మహిళలపై భ్రూణ హత్యలు, అత్యాచారాలు.. హత్యలు.. అఘాయి త్యాలు నిత్యకృత్యమై ఎందరో బలైపోతున్నారు. వరకట్న హత్యలకైతే లెక్కే లేదు. నిరుద్యోగసైన్యం పెరిగిపోయి, నిరాశ, నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడడం.. పెడదారులు పట్టడం.. ఉగ్రవాదులు గా తయారుకావడం.. ఇవన్నీ మనమందరం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. కానీ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాం. మనపాటికి మనం మూవీలూ, టీవీలూ చూస్తూ..అదీ కాకపోతే పోర్నోగ్రఫీల్లో ఓలలాడుతూ ఈ ప్రపంచానికి దూరంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాకిప్పుడు అనిపిస్తుంది నా ఓటుతోనే వీటన్నింటి మార్చే అవకాశం ఉందని. అది చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని. ఈదుస్థితికి నావంతు బాధ్యత నేను వహించాల్సిందే. నాజీవన ఆరాటంలో నేను ఓసరైన గమ్యంలో అయి నా ఉన్నానా అంటే అదీ లేదు. ఈ అగమ్య పరిస్థితులు ఒకవైపు ఉంటే.. మరోవైపు నాతర్వాత తరానికి మరింత దారుణమైన పరిస్థితు లు కల్పిస్తున్నాన్న విషయాన్ని విస్మరిస్తున్నా. ఇప్పటికైనా మనం మేలుకోవాలి.అంతా మేలుకోవాలి.. మన కర్తవ్యం ఓటు వేయడమే. ఓటు అనే ఆయుధంతో మన భవితను, దేశ భవితను సమూలంగా మార్చుకోగల ఓమంచి అవకాశం కోల్పోవద్దు.– శాంతిశ్రీ

తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించి నూతన విద్యావిధానాన్ని రూపొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గత రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు, న్యాయస్థానాలు, మేధావ్ఞలు, పదేపదే చెపుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి అవి మాటలకే పరిమితమవు తున్నాయి. ముఖ్యంగా పడిపోతున్న నాణ్యతగూర్చి న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఎత్తిచూపాయి. చివరకు ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నవారుకూడా సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ 2015 ఆగస్టు 18న తీర్పు ఇచ్చారు. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నవారు తమ పిల్లలను మాత్రం వాటిల్లో చదివించకపోవడాన్ని ఆయన ఆనాడే తప్పుపట్టారు.ప్రైవేట్‌ విద్యా వ్యాపారం పెరిగిపోతున్నా నాణ్యత విషయంలోమాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశా లల్లో ప్రధమ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంశాలను మంగళవారం వెల్లడిరచింది. భారతదేశంలోని 596 జిల్లాల పరిధిలో మూడు నుంచి పదహారేళ్ల వయస్సుఉన్న దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా బడిలో చేరని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే మూడు శాతం తగ్గినట్లు వెలుగుచూసింది. ప్రాథమిక స్థాయి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చేందుకోసమే మొగ్గు చూపుతున్నారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ క్రమేణా చదువ్ఞ మానేసేవారి సంఖ్య పెరిగి పోతున్నది. 2018లో ప్రైవేట్‌ పాఠశాలల్లో రెండో తరగతి చదువ్ఞతున్న విద్యార్థులు 54.4 శాతం ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 శాతంలోపే ఉన్నారు. ఇక పదాలు, వాక్యాలు చదవగలిగే వారి సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యూవల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ బయటపెట్టింది.ప్రైవేట్‌ పాఠశా లల్లో కూడా ప్రమాణాలు భారీగానే పడిపోతున్నట్లు చెప్పింది. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మూడోతరగతిలో కూడా తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగిందని 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 4.2శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య ముప్పై నాలున్నర శాతానికి పడిపోయింది. గణాంకాలు చేయలేని విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4శాతం ఉంటే, ఇప్పుడువారి శాతం 27.3 శాతానికి తగ్గింది.ఇక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థు లు 2016లో 54.9 శాతం ఉంటే ఇప్పు డు అది 48.7 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమా ణాలు పడిపోతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతంలోని ప్రైవేట్‌ పాఠశాలల పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న ధ్యాస%ౌౌ% న్యాణమైన విద్య అందించడంలో విఫలమవ్ఞతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రైవేట్‌ బడులు లేవ్ఞ. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడా ప్రైవేట్‌ బడులు నడిచేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కాదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఆవిద్యా సంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు వాటిని అరికట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే ప్రైవేట్‌ విద్యను అరికట్టేందుకు ఆనాడు చట్టాల అవసరం తలెత్తలేదు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందాయి. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపా రంలో రాజకీయ నాయకులు, కాంట్రా క్టర్లు, ఒకరేమిటి వ్యాపారాలు చేయాలను కున్నవారంతా ఈ విద్యా వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు ఇంగ్లీషు చదువ్ఞలపై మోజు పెరగడంతో దాన్ని ఆసరాగా తీసుకుని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చివేశారు. బీదా,బిక్కీ జనం కూడా ప్రైవేట్‌ విద్యకోసం ఆరాట పడుతున్నారు. ఏమాత్రం ఆర్థికవసతి లేక, మరోదారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్నారు. ఇంతకాలం గ్రామాలకు ప్రైవేట్‌ వ్యాపారం సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి వారుసైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు మారుమూల గ్రామాలకుసైతం ఈ విద్యావ్యాపారం వ్యాపించిపోయింది.ఇక రానురానూ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ అనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారుకులు ఎవరు? కారణాలు ఏమిటి? అనేది పాలకులకు తెలియంది కాదు. అందరికీ తెలుసు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పాలకులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటాయి.
కానీ ఆచరణ విషయం వచ్చేటప్పటికీ అసలు సమస్య మొదలవ్ఞతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవనోపాధికి ఉపయోగ పడేలా విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవశ్యకత ఉంది. కోట్లకొద్దిడబ్బు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా పాఠశాల విద్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈమధ్యనే ప్రథం సంస్థ విడుదల చేసిన సర్వే(అసెర్‌) వివరాలు విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని తేటతెల్లం చేసింది. 2005-2014 వరకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం ప్రథం సంస ్థసర్వే నిర్వహి స్తుంది. ఈ సర్వేలో మన ప్రభు త్వాలు విద్య కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాన్ని స్తున్నయో తెలియజేసింది. విద్యా ప్రమ ణాలు పెంచడంలో విద్యావ్యవస్థ విఫల మవుతున్నదని చెప్పడానికి ఈ సర్వే గణాంకాలే నిదర్శనం. ఈసర్వే ప్రకారం 5వ తరగతి చదివే విద్యార్థికి 2వతరగతి స్థాయి భాష, గణితసామర్థ్యాలు లేవని తేల్చిచెప్పింది. వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా పాఠశాలలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డా, విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడకపోగా ఇంకా తగ్గిపోయాయి. ఈసర్వే వివరాల ప్రకారం రెండవ తరగతి పిల్లల్లో 19.5శాతం పిల్లలు 0 నుంచి 9 అంకెలను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇదివరకు 17.6శాతంగా వుండేది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడటం అటుంచి అవి మరింత దిగజారిపో తున్నాయి. విద్యా పమాణాల దిగజార డానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది ఉపాధ్యాయుని పనితీరు, హాజరు. చాలవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ప్రశ్న? బోధన నిరంతరం జరుగుతున్నది కానీ అభ్యసన ఎంతమేరకు జరిగింది అన్నది ముఖ్యం. అందుకే ఇటీవల మోదీ విదేశీ తరగతి గదుల్లో అభ్యసన మాత్రమే జరుగుతున్నది, కానీ మనతరగతి గదుల్లో బోధన జరుగుతున్నది అన్నారు. మారుతున్న పరిస్థితులకు కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు ఉండటం లేదు.భావి ఉపాధ్యాయులను తయారుచేసే సంస్థల పనిత నం, వారు పాటిస్తున్న నిబంధనలు ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.ఉపాధ్యా యుల్లో లోపించిన జవాబుదారీతనం, అంకితభావానికి ఉపాధ్యాయ విద్యే బాధ్యత వహించాలి. పాఠశాలలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతవరకు వాటి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయనేది పర్యవేక్షకుల పనితీరు పైనే ఆధారపడి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నా వాటిని పర్యవేక్షించే అధికారుల లోటును భర్తీచేయలేకపోతున్నది. పర్యవేక్షక అధికారుల పనితీరు, ఉపాధ్యాయ ఖాళీలు ఇవన్నీ సర్కారీ బడులన్నీ ఖాళీ అవుతున్నాయి. గ్రంథాలయపుస్తకాలు, ప్రయోగపరికరాలు సరఫరా చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ూూA, RవీూA లద్వారా అందచేస్తున్న శిక్షణలు, వసతులపై పర్యవేక్షణ లోపాలున్నాయి.
విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యను పరిపుష్టం చేయాలి. ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా వుంటే విద్యావ్యవస్థ అంతపటిష్టంగా ఉంటుంది. విద్యాప్రమాణాల పెరగడానికి దోహదం చేస్తుంది. పర్యవేక్షకుల నియామకం చేపట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యుల పనితీరు మెరుగు పర్చవచ్చు. వీటన్నిటితో పాటు సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం అనేది విద్యాప్రమాణాల పెరుగుదలకు చాలా అవసరం. ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సమన్వయం విద్యా ప్రమణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తద్వార విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు వీటన్నింటిపైదష్టి సారించాల్సిన అవసరంఎంతైనా వున్నది.- జి.ఎన్‌.వి.సతీష్‌

రాక్షసత్వాన్ని మించిన ఉన్మాదమిది

‘‘ అమ్మకడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు దాపురించాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ హన్ముకొండ రాంగనర్‌లో చోటు చేసుకున్న దారుణం కారణంగా ఓ యువతి ఒక ఉన్మాది చేతికి గురైన విషయం సంచలనం సృష్టించిన విషయం విధేతమే. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది..? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారా..? ఒక వేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే కొన్ని సందర్భాల్లో సులభంగా తప్పించుకుంటున్నారు.’’-(దామోదర సాయిబాబా)
చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధి చెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణా జ్ఞానం పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామే మోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘ టనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 27న తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈదారుణాలను నిరోధించలేరా? ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒకఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు. దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రవళి చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందింది వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒకయువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈఅఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు.పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఢల్లీిలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్న గిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు. ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు. రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆతల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈవిషసంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడి స్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏయువతీ తాను వేధిం పులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేసి, భవిష్యత్తులో మహిళలు, యువతలపై ఇటువంటి అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.!

మహిళ నీకో వందనం

మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళలపట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివ ృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివ ృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివ ృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివ ృద్ధి చెందదు అన్నది నిజం. ఈవాస్తవాన్ని గుర్తించి స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురద ృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది పురుషు లకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఐదువందలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ గలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈపరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆపని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’ అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్‌ ల్యాండ్‌ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్‌ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత :
వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మనదేశాన్నే ఒకస్త్రీ మూర్తిగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తులుగా, మాతలుగా వ్యవ హరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీలపట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీఅనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత,సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటితరం మహిళలకు ఎంతో ఆదర్శం. ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీలపట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నేడు స్త్రీలపరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య,విద్య,విజ్ఞాన,రాజకీయ,క్రీడా,రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.
విద్యార్థినిగా, గృహిణిగా,ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ,పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి. తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలం దించి, మాతృత్వంతో సంసా రాన్ని పెంచే త్రిపాత్ర ధారిణి అనే విషయాన్ని తెలుసు కుంటు న్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతోపాటు స్త్రీలకు విద్య,సాది óకారిత, హక్కులు,అభివృద్ధిలో భాగస్వా మ్యం సమానంగా లభించి నప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధి స్తుంది. గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతు న్నాయో తెలిసిన విషయమే.
మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్ప థాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపి స్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించ డానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్బు Ûతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానా లను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓనివేదిక పేర్కొంది. ఒకస్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ,పురుషుల మధ్య సమా నత్వం,లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేత నాలు, సమాన ఆస్తి కల్పించాలి.-డా. దేవులపల్లి పద్మజ

క్షీణిస్తున్న ఉద్యోగులు..తగ్గుతున్న వేతనాలు

ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఉందని ఇప్పుడు చాలామంది నమ్ముతు న్నారు. అయితే అభివృద్ధి అంటే జీడీపీ వృద్ధి అని మాత్రమే కాదు. జీడీపీ వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఉపాధీ ఉద్యోగ అవకాశాలూ పెరగాలి 2014 ఎన్నికలప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్‌డీఏ హామీ ఇచ్చింది. జనవరి 2018లో ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో 70లక్షల మంది కొత్తగా పీఎఫ్‌ అకౌంట్లను తెరిచారని ఇది కొత్త ఉద్యోగాల సృష్టి గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తోందని అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ప్రధానమంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సహన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం యజమానులు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్‌ మొత్తాన్ని మూడేండ్లవరకూ చెల్లిస్తున్నది. ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఇదివరకే తమ వద్ద పీఎఫ్‌ చెల్లించకుండా పనిచేస్తున్న కార్మికులను కొత్తగా చేర్చుకున్నట్టు చూపి వారికి ప్రభుత్వపథకం ద్వారా పీఎఫ్‌ చెల్లిస్తున్నారు. ఇదివరకు ఉన్న ఉద్యోగాలని కొత్త ఉద్యోగాలుగా చూపిస్తూ కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2018, 2019 లో నిరుద్యోగపు రేటు భారతదేశంలో 3.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేయగా సీఎంఐఈ ఇది ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఆర్థిక అభివ ృద్ధి గురించి కాంగ్రెస్‌, బీజేపీలు నిరంతరం వాదులాడుకుంటూ ఉంటాయి. ఈ వాదనలలో మానవాభి వృద్ధి రేటు గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. మోడీ ప్రభుత్వం ఈమధ్య జీడీపీని లెక్కించే పద్ధతి మార్చి వేసింది. తమ హయాంలో యూపీఏ కన్నా ఎక్కువ వ ృద్ధి జరిగిందని చెప్పుకోడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఈ కొత్త పద్ధతి ప్రకారం వేసిన అంచనాలు వివాదాస్పదమయ్యాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ అనధికారికంగా చేసిన అంచనాల ప్రకారం ఎన్‌డీఏ కన్నా యూపీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉండగా సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ అధికారికంగా విడుదల చేసిన అంచనాలలో ఎన్‌డీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నది. ఈ విరుద్ధమైన అంచనాలు రెండు సంస్థలు చేసిన అంచనాల విశ్వసనీయతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. జీడీపీలో వృద్ధి జరిగినా అది ప్రజల జీవితాలలో గుణాత్మ కమైన మార్పు తీసుకురానప్పుడు ఆ వృద్ధివల్ల ప్రయోజనం ఏమిటి. జీడీపీలో వృద్ధి జరిగినా సమాజంలోని ఒక పెద్ద సమూహానికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు. భారతదేశంలో వృద్ధిరేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో అసమానతలు కూడా పెరుగుతున్నాయి. జతీవసఱ్‌ ూబఱంంవ రిపోర్ట్‌ ప్రకారం ఒక శాతంగా ఉన్న సంపన్నుల సంపద 2010లో మొత్తం సంపదలో 40శాతంగా ఉండగా 2016లో అది 50 శాతానికి పెరిగింది.10శాతంగా ఉన్న సంపన్నులు మిగతా 90శాతం ప్రజల కన్న నాలుగు రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ భారతదేశంలో ఉపాధి అవకాశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇన్‌ ఇండియా’ అన్న పేరు మీద ఈ నివేదిక విడుదల చేశారు. భారతదేశ లేబర్‌ మార్కెట్‌ను విశ్లేషిస్తూ వ్యవసాయరంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు కార్మికుల వలసపోతున్నారని నివేదిక తెలియజేసింది. ఉపాధి రహిత అభివృద్ధీ, వేతనాలు పెరగని అభివృద్ధీ సహజంగానే సమ్మిళితమైన అభివృద్ధికి దారితీయదని అది అసమానతలూ అంతరాలూ పెంచుతుందని నివేదిక స్పష్టంగా తెలియజేసింది.నూతన ఆర్థిక విధానాలు అమలైన గత 25 ఏండ్లలో జీడీపీకి,ఉపాధి కల్పనకూ ఉన్న సంబంధం రోజు రోజుకి బలహీనపడిపోతున్నది. 1970, 1980లలో జీడీపీ వృద్ధి 3 నుంచి 4శాతం ఉంటే ఉపాధిలో వృద్ధి సుమారు 2శాతంగా ఉండేది.1990 తర్వాత మరీ ముఖ్యంగా2000ల తర్వాత జీడీపీలో 7శాతం వృద్ధి ఉన్నా ఉపాధిలో వృద్ధి మాత్రం ఒకశాతం కన్నా తక్కువ ఉన్నది. జీడీపీలో వృద్ధీ, ఉపాదివృద్ధికీ మధ్య నున్న నిష్పత్తి 0.1 శాతం కన్నా తక్కువగా ఉన్నది. అంటే జీడీపీలో 10శాతం వృద్ధి ఉంటే ఉపాధిలో ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంటుందన్నమాట. 2013-15 మధ్య దాదాపుగా 70లక్షల ఉద్యోగాలు మాయమైపోయాయని నివేదిక తెలియజేస్తున్నది. నిరుద్యోగం 5శాతం కన్నా ఎక్కువైందని ఉత్తరాది రాష్ట్రాలలో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని నివేదిక వెల్లడిరచింది. ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులలో నిరుద్యోగం 16శాతంగా ఉందని నివేదిక తెలపడం చాలా ఆందోళన కలిగించేదిగా ఉంది. అండర్‌ ఎంప్లాయిమెంట్‌, తక్కువ వేతనాలు మాత్రమే సమస్యలుగా ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు ఈ నివేదిక పెరుగుతున్న నిరుద్యోగం మరి ఉపాధి కల్పన భారత దేశానికి పెద్ద సవాళ్లని తెలియజేస్తున్నది. దాదాపు అన్ని రంగాలలో వేతనాలు పెరుగుతున్నాయని చెప్తున్నా ఇది జీడీపీ వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. గ్రామీణ వేతనాలలో ఎలాంటి పెరుగుదల లేదు. సగటున వేతనాలలో వృద్ధి 3శాతంగా ఉన్నది. అయితే కార్మికుల ఉత్పాదకత 30ఏండ్ల కింది నాటికన్నా ఆరు రెట్లు పెరిగింది. సూపర్వైజరీ, మేనేజరియల్‌ ఉద్యోగాల్లో వేతనాలు మూడు రెట్లు పెరగగా కార్మికుల వేతనాలలో వృద్ధి మాత్రం ఒకటిన్నర రెట్లుగా ఉన్నది. ఇప్పటికీ మగవారిలో 82శాతం, స్త్రీలలో 92శాతం నెలకు 10 వేల రూపాయలు కన్నా తక్కువగా సంపాదిస్తున్నారు. సెవెంత్‌ సెంట్రల్‌ పే కమిషన్‌ నెలకు 18వేల రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీన్నిబట్టి చాలా పెద్ద సంఖ్యలోనే భారతీయులు జీవించడానికి కావలసిన వేతనాలకు (లివింగ్‌ వేజ్‌) చాలా దూరంలో ఉన్నారని అర్థమైపోతుంది. ప్రయివేట్‌ రంగంలో చాలా పరిశ్రమలు సెంట్రల్‌ పే కమిషన్‌ సిఫారసు చేసిన కనీస వేతనం కన్నా చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అందుకనే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటున్నది. అట్లాగే కార్మిక, పెట్టుబడి (లేబర్‌-క్యాపిటల్‌) నిష్పత్తి కూడా దారుణంగా పడిపోతున్నది. 1980లో కోటి రూపాయలు (2015 ధరలలో) పెట్టుబడి పెడితే 90ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 90బదులు 10 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. అట్లాగే ఉన్న ఉద్యోగాలలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మొత్తం ఉద్యోగాలలో 60శాతానికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటున్నారు. శాశ్వత ఉద్యోగుల పనులను ఇప్పుడు రకరకాల పేర్లు గల తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్నారు. పర్మనెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల కన్నా చాలా తక్కువ వేతనాలను వీరికి ఇస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తు ప్రయివేట్‌ యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన లింగ వివక్ష నెలకొని ఉన్నదని నివేదిక తెలిపింది. మేనేజర్లు, సీనియర్‌ అధికారులు, శాసనసభ్యులలో 2011లో 13శాతంగా ఉన్న మహిళల వాటా 2015 కల్లా 7శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడిరచింది. తయారీ రంగంలోని కార్మికులలో 22శాతం మహిళలు ఉండగా సర్వీస్‌ రంగంలో మహిళలు 16శాతంగా ఉన్నారు. టెక్స్టైల్‌ గార్మెంట్‌, టుబాకో, విద్య. వైద్య రంగాలలో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యలోనే కాక వేతనాలలో కూడా మహిళలు వివక్షకూ లోనవుతున్నారు. తాము చేస్తున్న పని, తమ విద్యార్హతలను బట్టి మహిళలు పురుషుల వేతనాలలో 35 నుంచి 85 శాతం వరకు పొందుతు న్నారు. అయితే ఈఅసమానతలు కొంత తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తు న్నాయి. తయారీరంగంలో మహిళల వేతనాలు పురుషుల వేతనాలలో 35 నుంచి 45శాతానికి పెరిగింది. రెగ్యులర్‌ వర్కర్స్‌, ఉన్నత విద్యావంతులైన మహిళలలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నది. శ్రామిక మహిళలు, ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళల శాతం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువగా ఉన్నది. ఇది ఇంకా తగ్గుతూ వస్తున్నది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల కన్నా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నది. సాంఘిక పరమైన కట్టుబాట్ల కన్నాఅవకాశాలు లేకనే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నది. గ్రామీణ ఉపాధి పథకం, ఆషా, అంగన్‌ వాడీ వంటి స్కీముల వల్ల మహిళల వాటా ఉద్యోగాల్లో కొంతమేరకు పెరిగింది.
ఉపాధిలో కులపరమైన వివక్ష, అసమాన తలు కొనసాగుతున్నాయి. తక్కువ వేతనాలు ఉన్న వృత్తులలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు చాలా ఎక్కువగా ఉండగా అధిక వేతనాలు కల ఉద్యోగాలు/ వృత్తులలో వారి సంఖ్య నామమాత్రంగా ఉన్నది. కుల వివక్షతను అలాగే నిమ్న కులాలకు గౌరవప్రదమై ఉద్యోగాలలో అవకాశాలు లేకపోవడాన్ని ఇది స్పష్టంగా చూపిస్తున్నది. రిజర్వేషన్లు సరిగా అమలైన చోట ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కొంత మెరుగైన ప్రాతినిధ్యం ఈవర్గాలకు లభ్యమయిందని నివేదిక తెలియజేస్తున్నది. గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపాదనలో/ వేత నాలలో మహిళల పట్ల ఉన్న తేడాల కన్నా కులపరమైన వివక్ష తేడాలే ఎక్కువ. ఉన్నత కులాలకు చెందిన వారి సంపాదనలో ఎస్సీ కులాల వారు 56 శాతం సంపాదిస్తూ ఉండగా, ఎస్టీ కులాలవారు 55శాతం అలాగే ఓబీసీకి చెందినవారు 72శాతం సంపాదిస్తున్నారని నివేదిక అంచనా.
వ్యవస్థాగతమైన మార్పులు చాలా మెల్లగా జరుగుతున్నాయని ఇవి వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నదని నివేదిక అభిప్రాయపడిరది. అలాగే ఉపాధి కల్పనకు ఒక సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నివేదిక భావించింది. అధిక వృద్ధిరేటు ఉద్యోగాల కల్పనను పెంచలేక పోయినందున అలాగే కార్మికుల పెరిగిన ఉత్పాదకత వారి వేతనాలను పెంచలేక పోయినందున ప్రభుత్వం ఒక జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించాలని నివేదిక సిఫారసు చేసింది. దీనికిగాను గ్రామీణ ఉపాధి హామీ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నివేదిక సూచించింది. కొన్ని రాష్ట్రాలలో విజయవంతంగా అమలు చేస్తున్న ఉపాధి పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించాలని అట్లాగే పారిశ్రామిక విధానాలను ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా, కార్మికులకు వేతన ప్రోత్సాహకాలను అందించేట్లుగా రూపొందించాలని నివేదిక ప్రభుత్వాలకు సూచించింది. గ్రామీణ ఆదాయాలను పెంచడానికి వ్యవసాయ రంగంలో పబ్లిక్‌ పెట్టుబడులను పెంచాలని, విద్య, వైద్యం, హౌసింగ్‌ పబ్లిక్‌ రవాణాలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని, పర్యావరణ రక్షణ, కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాలు సృష్టించాలని నివేదిక సిఫారసు చేసింది. సాంఘిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వ పథకాలు కీలకమని నివేదిక అభిప్రాయపడిరది. త్వరలోనే పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. కార్మిక సంఘాలు, అసమానతలను అంతరాలను తొలగించడానికి కృషి చేస్తున్న సంస్థలు, పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న సంస్థలు నివేదిక తెలియజేసిన అంశాలపై ప్రజాభిప్రాయం కూడగట్టి ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిని, అంతరాలను తగ్గించే సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సాంఘిక విధానాలను అవలంబించేట్టుగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది -వేణుగోపాల్‌

ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం

శాంతిదూత అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమజాతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈదీనావస్తలను ఎలా వర్ణించాలి. మనుషులుగా మా ఆదిమజాతులకు లేని భద్రత మా భాషలకు, సంస్కృతులకు ఎలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వలస పాలన ఆక్రమణల కారణంగా స్థానిక ఆదిమజాతులు రాజ్యాధికారానికి దూరం కావడం, తద్వారా సంస్కృతిలు, భాషలు అణిచివేతకు గురికావడం నిరంతరం జరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 90దేశాలలో సుమారు ఐదువేల తెగలు, సంస్కృతులు కలిగి 370మిలియన్ల జనాభా, ఏడు వేలరకాలకు పైగా భాషలు ఉన్నట్టు యునెస్కో (ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం జుసబషa్‌ఱశీఅaశ్రీ ూషఱవఅ్‌ఱటఱష aఅస జబశ్ర్‌ీబతీaశ్రీ ూతీస్త్రaఅఱస్త్రa్‌ఱశీఅ) గుర్తించగా, 2680 లకుపైగా ఆదిమ జాతులు మాట్లడే భాషాలు అంతరించి పోతున్న భాషాల జాభిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో 104 మిలియన్ల జనాభా కలిగి 700 తెగలు (యునెస్కో గుర్తింపు పొందిన) ఆదివాసులుండగా, 500 తెగలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. 1635భాషలు స్థానిక జాతుల వాడుకలో ఉంటే 197 భాషలు, 75 తెగలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదావస్తలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో తోటి, చెంచు, కొండ రెడ్డి, కులియా, దులియా మొదలైన తెగలు, కొలాం, సవర, కొండ భాషా వంటి భాషాలు ఇతర భాషాల ఆదిపత్యానికి లోనై కనుమరుగు కానున్నాయి. ఈ పరిణామాలు ఆదిమజాతుల మనుగడకు, విశ్వ మానవాళి వినాశానికి హెచ్చరికలుగా పరిణామీస్తున్న వేళ యునెస్కో 2019 సంవత్సరాన్ని ‘‘ప్రపంచ ఆదివాసీ భాషా సంవత్సరోత్సవం’’గా ప్రకటించడం ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రపంచ సమాజం భాద్యత అని గుర్తు చేయడం శుభపరిణామం.
ఆదిమజాతుల భాషా పరిరక్షణ అంటే మన సాంస్కృతిక వారసత్వం జ్ఞానమూలాల పరిరక్షణేనని సమాజం గుర్తించాలి. ఆదిమజాతుల నాగరికత సంస్కృతులతో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఆదిమజాతులది మాత్రమే కాదని, మన అందర బాధ్యత అని యునెస్కో గుర్తుచేసింది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ మనుగడ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమజాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే పురాతన సమాధుల త్రవ్వకాలు, సామాగ్రిని మ్యూజియంలలో భద్రపరచడం మాత్రమే కాదు. మా భాషా సంస్కృతిని, జీవన విధానాన్ని, సజీవంగా కొనసాగే అవకాశాలు కల్పించడమని వీలైనంత తొందరగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు సైతం భాషా అధ్యయనాల పేరిట పురాణ ఇతిహాసాలు, రాతప్రతులు, భాషా, అలంకారాలు, రంధ్రాన్వేషణలు మాని నిజాయితీగా వాస్తవ మూల భాషాజ్ఞాన అన్వేషణ ఇకనైనా మొదలు పెట్టాల్సి ఉంది. అధ్యయ నాలు అలంకారప్రాయాలుగా అనుకరణలుగా కాక, చారిత్రక వాస్తవ నిర్ధారణలు కావాలి. ఆదివాసి భాషాసంవత్సరం భాషల జనని సంవత్స రోత్సవంగా యూరివర్శిటీలు, భాషాపండితులు, అధ్యయనాలు, మేధో మధనాలు జరగాలి.
నిజానికి యునెస్కో ప్రయత్నం మొదటిదేమి కాదు. ముందడుగు అంతకన్నా కాదు. 2005లోనే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌Êట్రైనింగ్‌ (ఎన్సీఆర్టీ) సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజేస్‌ (సి.ఐ.ఐ.ఎల్‌) సంస్థలు మైసూర్‌లో సెమినార్‌ నిర్వహించి ‘‘ఆదివాసీ సమాజంలో భాషా పరిరక్షణ-విద్యావకాశాలు మరియు విద్య వెనుకబాటుతనానికి కారణాలు’’ అనేఅంశంపై సమీ క్షించి భాషఅవరోధం ఒకపెద్ద సమస్య అనిగ్రహించింది. ఆ అవరో ధాన్ని అధిగమించడానికి మల్టీ లింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (వీూజు) ప్రోగ్రాం ద్వారా మాతృభాషలో ప్రాధమిక విద్యాబోధన అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. ఆదివాసీ విద్యార్ధిని, విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం ద్వారా ఆదివాసీ సమాజంలో విద్యాభివృద్ధికి భాషా అవరోధంతో పాటు డ్రాపౌట్స్‌ శాతం తగ్గించడం ధ్యేయంగా పెట్టుకొంది. 2006 లో దేశవ్యాప్తంగా ప్రత్యేక మాతృభాషలు కలిగిన ఆదివాసీ సమూహాలు కలిగి ఉన్న రాష్ట్రాలను ఎన్నుకుని ప్రారంభించారు. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి గోండి (గోండిభారతి), కోయ (కోయ భారతి), కొలాం (కొలాం భారతి), సవర (సవర భారతి), కొండ దొర (కొండ భారతి), కోందు (కుంవి భారతి) వారి వారి మాతృభాషాల ద్వారా విద్యబోధన మొదలైయ్యింది. వాస్తవంగా సాధారణ విద్యార్ధికి మాతృభాషే విద్యాభాష, కాని ప్రత్యేక మాతృభాష కలిగిన ఆదిమజాతుల విద్యార్ధులకు మాత్రం స్థానిక విద్యా బోధన భాష పూర్తిగా తెలియని భూతమై కూర్చుంది. ఆభాష ఏంటో ఆ అక్షరాలేంటో అర్థమవ్వక బడికి రాకుండా పారిపోయే వారే ఎక్కువ. మిగిలిన కొద్ది మందికి మాతృభాషా పమస్య (మనకు తెలుగు)ఉంటుండగానే సెంకండ్‌ లాంగ్వేజ్‌ (హింది), థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీషు) అంటూ తెలియని భాషలు బలవంతంగా చొప్పించే ప్రయత్నం కారణం గానే అజ్ఞానులుగా, అనాగరికులుగా ముద్రపడే దౌర్భాగ్యం దాపురిం చింది. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్లే మల్టీలింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (ఎం.ఎల్‌.ఇ), ఆదిమజాతుల విద్యార్ధుల మాతృభాష వికాస కార్యక్రమ మైన ‘‘ఆనందలహరి’’ వంటి పథకాలు దీర్గకాలంగా కొనసాగించ కుండా మూడునాళ్ళ ముచ్చటగా మిగిలాయి. అదే కొనసాగి ఉంటే కొంతమేరకు భాషా పరిరక్షణకు దోహదపడి ఉండేది.
అభివృద్ధి ముసుగులో ఆదిమజాతుల మనుగడ ప్రమాదక రంగా మారిందన్నది. ఎంతవాస్తవమో విద్యా విధానాలవల్ల వారి భాషలు సంస్కృతులు అంతరించి పోవడానికి దారి తీసిందన్నది అంతే వాస్తవం. ఆదిమజాతుల సంస్కృతులు పాఠ్యాంశాలు కాకపోవడం, కనీసం వారి సమీప ఆవాస ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ పండగా లకైనా సెలవులు ప్రకటించి విద్యార్థిని విద్యార్థులకు సంస్కృతిలో భాగస్వా మం కల్పించక పోవడం కారణంగా తరువాతి తరాలు సంస్కృతికి దూరమైన కారణంగానే సాంస్కృతిక వారసత్వం పూర్తిగా అంతరించి పోవడానికి కారణమౌతుంది. మాఆదిమజాతుల విద్యార్ధులు మాది కాని భాషలో విద్యాబోధన కారణంగా,ే మాభాషలకు ప్రాధాన్యత గౌరవం సమాజంలో కానీ పాలన అవసరాలు కానీ, లేనందున విద్యా వంతులైన ఆదివాసీ కుటుంబాలు తరువాతి తరాలకు భాషను నేర్పించకపోవడం, వారి లాగే ఇతర కుటుంబాలు భాషకు దూరం కావటం జరుగుతుంది. ఇది ఏస్థితికి చేరుకుందంటే భృాణ హత్యాపాత కంలా తల్లి గర్భంలోనే మాతృభాషకు సమాధి కట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఆదిమజాతుల భాషలకు దాపురించింది. నిజానికి భాష బ్రతకడానికి, కొనసాగడానికి కావలసింది సామాజిక ఆదరణ, ఆచరణ, అవసరం. ‘‘సంస్కృతిభాష ఆధరంగా విస్తృతం అవుతుంది. భాషసంస్కృతి ఆధారంగా సంపూరణమ వుతుం ది’’. ఆచరణ సంస్కృతినిస్తుంది. సాంస్కృతిక పరిరక్షణే భాషను పరిరక్షి స్తుంది. సంస్కృతి భాష ఒకదానికొకటి పెనవేసుకుని సాంస్కృతిక కొనసా గింపు భాషతో, భాషా కొనసాగింపు సంస్కృతితో వారసత్వంగా అందు తుంది. దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. కొన్ని వేల సంవత్సరాలు గా ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతులు, భాషలు, మనుగడలో ఉన్నాయంటే సామాజిక, సాంస్కృతిక ఆమోదమే కారణం. కానీ పాలకుల తోడ్పాటు ఏ మాత్రం కాదు. ఆదివాసీ భాషలు అంతరించి పోవడానికి లిపి లేకపోవడమే! అనే పరిపక్వత లేని వాదన తెరమీదికి తెస్తున్నారు. అదే వాస్తవమైతే లిపి ఉన్న హరప్ప నాగరిక భాషేది? లిపి ఉండి దేవనాగరిక భాషేది? లిపి లేకుండా దేవనాగరి లిపితో మనుగడ సాగిస్తున్న సంస్కృతం, హింది,బోజ్‌పురి,మరాఠిభాషల పరిస్థితిఏమిటి? ఇంగ్లీష్‌ కే లిపి లేక పరాయి లిపితో వెలిగిపోతుంది. నిన్నటి వరకు అధికారిక భాషగా గౌరవం పొంది లిపి ఉండి అధికారిక ఆమోదం కోల్పోయాక మనుగడే ప్రశ్నార్థకమైన మహారాష్ట్ర ప్రాంత ‘‘మోది’’ భాష పరిస్థితి ఏమిటి ? లిపి ఉండి భావన(భాష) తెలియక అడివి కాచిన వెన్నెలైన హరప్పా జ్ఞానం అంతర్ధానం మరువరాదు. అందుకే ఆదిమ జాతుల భాషలకు లిపి అందించాలనే వృదా ప్రయత్నాల కన్నా ముందుగా ఆ భాషలను ఎక్కువ సమాజం చదవగలిగిన, వ్రాయ గలిగిన లిపిలో భవిష్యత్‌ తరాలకు, సమాజానికి అందే విధంగా గ్రంథస్థం చేసుకోవటం ఉత్తమం. అలాంటి అద్భుత ప్రయత్నమే మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌. ఎవరికీ తెలియని కొత్త లిపిలో మనకు మాత్రమే తెలిసిన భాషను లిఖించుకోవటం, గ్రంథస్థం చేయటం అంటే తుఫాను సమయంలో నడి సముద్రానికి చుక్కాని లేని పడవ ప్రయాణం లాంటిది. విశ్వ జ్ఞానమూలాల ఆధారాలను అన్వేషించడం అధ్యయనం చేయటం మాని అక్షరాల్ని వెతకడం ఆదిమ జాతుల భాషా పరిరక్షణకు ఇప్పుడంత అవసరం కాదు. పైగా ఇది ఆదిమ సమాజాన్ని మరింత అయోమయంలోకి నెట్టే కుట్రలో భాగమే. ఆదిమ జాతుల భాషా వారసులు విద్యావంతులు, పెద్దలు, ఆయా భాషల్లో సాహిత్యాన్ని, రచనలను విరివిగా విస్తరింప చేయటం తక్షణ అవసరం.
పాలకులు, మేధావులు, సమాజం, ఆదిమ జాతుల భాషా పరిరక్షణని ఆదివాసుల కోసమే అనే చిన్నచూపుతో లేదా సానుభూతితో కాక సామాజికభాద్యతతో పాటు జ్ఞాన దృష్టితో చూడకపోవడం పెద్ద అవరోదం. ఎందుకంటే భాష ఒక సామాజిక సమాచార మాధ్యమమో, సాంస్కృతిక జీవాధారమో, గుర్తింపో మాత్రమే కాదు. అంతకుమించి భాష అంటే జ్ఞానం. ఆది భాషాలంటే జ్ఞానభాండాగారాలు. ఎందుకంటే ఎంత గొప్ప నాగరికత అయినా మూలం మూలవాసీలతోనే మొదలవ్వాలి. ఈనాటి విజ్ఞానానికి నాంది మా ఆదిమజాతుల భారaా జ్ఞానబీజాలే. నేటి భాషలన్నిటికీ మాతృ భాష మా తొలి పలుకులే. ఎంతటి జ్ఞానం అయినా, ఆవిష్కరణ అయినా భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. భాషలోనే వ్యక్తమవు తుంది. భాషలోనే ప్రసారమవుతుంది. ఆ భాషా జ్ఞానం లేకనే ఈజిప్టు, హరప్పా నాగరికత జ్ఞాన వైభవం తెలియక శతాభ్దాలపాటు విశ్వ విద్యాల యాలతో పాటు జుట్లు పీక్కుంటున్నాం. అయినా ఈ పాలక మేథావులకు, యూనివర్సిటీలకు నిన్న మొన్నటి భాషలకు వ్రాత ప్రతులంటూ ప్రాచీన హోదాలు కవి సమ్మేళనాలు వంటి ఇగోలు, కాలక్షేపం తప్ప మూల జ్ఞానం, మూల వాసీల వద్ద మూల వాసీల భాషా రూపంలో నిక్షిప్తమై ఉందని ఆభాండాగారాన్ని మధించి శోధించి అభివృద్ది చేద్దాం. సమాజానికి మరింత వైజ్ఞానిక మూల జ్ఞానాలు పంచుదామనే ధ్యాస, దృష్టి, దృక్పథం ఏ కోశానా లేదు. భాష ముందా, అక్షరం ముందా అనే ప్రశ్న! చెట్టు ముందా, విత్తు ముందా అన్నంత సంక్లిష్టమేమీ కాదు. అక్షరాల కంటే ముందే అద్భుత విజ్ఞానాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నాయి మా ఆదివాసి భాషాసాగరాలు. అందుకు హరప్పా నాగరికతే సాక్ష్యం. హరప్పా ముద్రికల్లో భావాన్ని అర్ధంచేసుకోవటానికి వలసవిదేశీ భాషల్లో డీకోడిరగ్‌ ప్రయత్నాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలు సైతం సాగిస్తున్నాయి. ఈ హాస్యాస్పద తంతు మన ఇంటి బిడ్డ డి.యన్‌.ఎ మ్యాచింగ్‌ కోసం పక్కింట్లో వెతుకు లాడినట్లు సాగుతూనే ఉంది. పైగా పశుపతి ముద్రికల్లోని కొమ్ముల కిరీటం ధరించే ఆదివాసి సమాజం సజీవంగా ఉన్నా, ఆ భాషలు సమృద్దిగ ఉన్నా కాదని ఆ నాగరికతవారసత్వం అంతరించింది అని నిర్దారించటం అంటే బ్రతికుండగానే డెత్‌ సర్టిఫికేట్స్‌ ఇచ్చేంత గుడ్డితనమా? లేక ఆ వారస త్వాన్ని అంతం చేసే కుట్రలో భాగమా అనేది అర్ధం అవుతూనే ఉంది. జాతులనే కాక సంస్కృతుల్ని భాషల్ని కూడా అంతం చేసి, హైజాక్‌ చేసే కుట్రలు వలస వాద పాలనలో సర్వ సాధారణం, చారిత్రక విదితం. కానీ అంతం అయ్యేది మా ఆదిమ జాతులు భాషా సంస్కృలు మాత్రమే కాదు. విశ్వమానవాళి జ్ఞానం. ఎప్పటికీ అందక అంతుచిక్కని రహస్యాలుగా మిగిలి పోవటం ఏ సమాజానికి శ్రేయస్కరం?. పొరుగు భాష అయిన ఉర్దు, చాయ్‌, తహశీల్‌ వంటి పదాలతో హిందీ భాషకు తద్వారా ఈ దేశానికి ఎంతో మేలు చేసిందని కొనియాడే మేధావులు భాషా పండితులు ఈ దేశం మూల భాషల సమృద్ధతను, గొప్పతనాన్ని కొనియాడడం అటుంచి నేటివరకు గుర్తించనే లేదు. గంగ : అంటే నది పేరు మాత్రమే కాదని నీటి ప్రవాహం అనే అర్ధం ఉందని ఎంతమందికి తెలుసు. చేపల్ని మీన్‌ లేదా మీనా, నాగుపాముని నాగ్‌ లేదా నాగిని అని అనేక భాషల్లో వ్యవహరిస్తున్నారు. నిజానికిది ఈదేశ మూలవాసీలైన కోయభాషా పదాలు. అలానే తెలుగులో పొట్ట, పటేల్‌, పట్వారీ, పొద్దు, నెల, వెన్నెల, తళారీ, ఏరువాకలో ఏరు అనే పదాలు తమిళంలో కై, కాల్‌, కండ్‌, కుడిచే, వర, నల్ల వంటి పదాలు కోయభాష లోనివే. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడంలో 80 శాతం కోయభాషా పదాలతోను సంమృద్ధతను పొందాయి. సింప్‌ాసింహం, ఇంద్‌సముద్రం (హిందూమహా సముద్రము), ఇమ్‌మంచు (హిమాలయపర్వతాలు), ఒడిస్సేల్‌, ఒడిస్సి చెట్టు పదాల నుండి ఒడిస్సా అనే పదము ఉత్పత్తి అలానే చెన్నయ్‌ చెట్టు పదం నుండి చెన్నె (మద్రాసు) పట్టణం పేరు, శివంపూనకం (దేవర) నుండి శివుడు, శివతాండవం వంటి పదాలు ఉద్భవించాయి. తెలియదు అనే పదమే ‘కంగారు’ జంతువు పేరుగా స్ధిరపడిరదనేది విదితం. అలానే మడ, మర్ర, మార ` చెట్టు అనే పదం నుండి మడ అడవులు వంటి పదాల ఉత్పత్తులు ఆదిమభాషల నుండే ఉద్భవించాయి.
ఆదిమజాతుల భాషలన్ని చిన్నచూపు చూడడం సమాజపు తెలియనితనం. చిన్నతనమే కాని ఆ భాషల చిన్నతనం కాదు. ఉదాహరణకు ప్రపంచంలో గుర్తింపు పొందిన దాదాపు అన్ని భాషల్లో భర్త చనిపోయిన భార్యను వితంతువు అనే పదం మాత్రమే ఉంది. కానీ అండమాన్‌ దీవుల్లో ఒక ఆదిమతెగ భాషలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకు లందరిని ప్రత్యేకంగా సంబోధించే పదజాలం సమృద్ధిగా ఉంది. అంటే సాంకేతిక పదజాలంలో ఆదిమజాతుల భాషలు వెనుకబడి ఉండొచ్చు కాని సామాజిక పదజాలంలో మాత్రం భాషలన్నింటికి ఆదిమజాతుల భాషలు జన్మ నిచ్చాయని స్పష్టమవుతుంది. సంస్కృతి లాగే భాషలు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ సంమృద్ధతను, సమగ్రతను సాధించుకుంటాయి. అది నాగరికతా వికాసానికి వారధి. నిజానికి సాంకేతిక పదాలు కూడా ఇతర దేశాల మూల భాషాపదాలే. తెలియని ప్రాంతాలకు మాత్రమే అవి కొత్త పదాలు. అందుకే మాఆదిమ జాతుల నాగరికత సంస్కృతితో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన భాధ్యత కేవలం మా జాతులది మాత్రమే కాదు. విశ్వ మానవాళి భాధ్యతకూడా అని ‘‘ఆదివాసి భాషా సంవత్సరం’’గా యునెస్కో చాటి చెప్పింది. 2019 సంవత్సరంలో విశ్వవిధ్యాలయాలు ప్రత్యేక శ్రద్దతో మరింత నిశితమైన అధ్యాయనాలు సాగించాల్సి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆనంద లహరి, మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదివాసి భాషా సాహిత్యం అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ తోడ్పాటు అందించాల్సిందిగా మా ఆదివాసీల ఆకాంక్ష. – మడివి నెహ్రు

ఆదివాసీ దీనావస్థ

గిరిజన జీవితం అడవికే అంకితం. అడవిపైనే వారి బతుకు ఆధారపడి ఉంటుంది. అక్కడే భూములను సాగుచేసుకుంటారు. భూసారం క్షీణిస్తే మరోచోట అడవిని కొట్టి కొత్తగా భూములు సాగులోకి తెస్తారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ప్రభుత్వం కొన్ని విధా నాలతో అటవీ శాఖ సిబ్బందిచే దాడులు చేయించడంతో దాదాపుగా పోడు వ్యవసాయం తగ్గిపోయింది. ఉన్న భూముల్లోనే సంప్రదాయ వ్యవసాయం సాగిం చడం పరిపాటిగా వస్తోంది. కానీ ఆవ్యవసాయం చేసుకోడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వారు ఎక్కడ నివాసాలు ఏర్పరుచుకుని సాగు చేసుకొంటే అక్కడకు వెళ్లి వారి గూడే లను కూల్చివేసి పంటలను ధ్వంసం చేస్తుంటారు.
అటవీ సిబ్బంది ఆగ డాలకు అడ్డూఅదుపు ఉండదు. అడ్డు వచ్చిన వారిపై కేసులు పెడతారు. నిలదీసిన వారిని మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడ కుండా లాఠీలతో దౌర్జన్యానికి దిగుతుం టారు. విశాఖ ఏజెన్సీలో అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. తెలం గాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో అదే జరిగింది. అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్లు, బుల్‌డోజర్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. చట్టం తమ చేతిలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా పశుబలం ప్రదర్శించడం మానవత్వమా?అదివాసీల హక్కులను ఉక్కుపాదంతో తొక్కివేసే హక్కు ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయని, బంగారు తెలంగాణ సాక్షాత్కరి స్తుందని కలలు కన్న పీడిత తాడిత గిరిజనానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా? గత పదేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకొంటూ పోట్టపో షించుకొంటున్న గుత్తికోయల కుటుంబాలపై అటవీ శాఖ దాడులు జరిపివారి గుడెసెలను కూల్చివేయడం, గిరిజన మహిళలను చెట్టుకు కట్టివేయడం, అడ్డువచ్చిన వారిని లాఠీలతో చావమోదడం ఈబీభత్సకాండ దాదాపు రెండు గంటలపాటు సాగడం గిరిజన ప్రజల్లో నెత్తురును ఉడికిస్తోంది. అడవిని నమ్ముకునిజీవిస్తున్న అడవిపుత్రులపై దమనకాండ విభ్రాంతి గొల్పింది. లవ్వాల అటవీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం గొత్తికోయలు, అటవీ సిబ్బంది మధ్య రణరంగంగా మారింది. ఆప్రాంతం ఖాళీ చేయాలని మరోచోట నివాసం కల్పిస్తా మని రెండు నెలలుగా చెబు తున్నా నోటీసులు జారీచేస్తున్నా మొండి కెత్తడంతో దాడులకు పూను కోవలసి వచ్చిందని అటవీశాఖ సమర్థించు కుంటోంది.అయినా ఇంత దారుణంగా మూకుమ్మడిగా దౌర్జన్యానికి పాల్పడడం వారిని నిరాశ్రయులు చేయడం,పంటలను ధ్వంసం చేయ డం కేవలం బలదర్పమే తప్ప గిరిజనులకు మేలు చేయడానికి కానే కాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కొంతకాలంగా అడవ్ఞల్లోని గొత్తికోయ గూడేలను అటవీశాఖ బలవంతంగా ఖాళీచేయిస్తోంది.గత కొన్నాళ్లుగా గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతా ల్లో ఈ విధంగా తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఆదాడులన్ని టికన్నా ఈదాడి చాలా ఘోరం.
దాదాపు 125 కోట్ల జనాభా గల భారతదేశంలో గిరిజన, దళిత తెగలకుసంబంధించి రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూలు అంశాలను పొందుపరిచినా ఆదివాసీలకు తగిన న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణం, గనుల తవ్వకం,నగరీకరణ కారణం గా గిరిజనులు నిరాశ్రయులవు తున్నారు. ఆదివాసీలకు స్వయంపాలన కల్పించాలని కొన్నేళ్లుగా కొన సాగుతున్న డిమాండ్‌ నెరవే రకపోగా లాఠీలనురaుళిపించి మహిళలను చెట్లకు కట్టివేసి గూండాగిరి సాగించడం ఎంతవరకున్యాయం? ఐక్యరాజ్యసమితి ఆదివాసీల వారసత్వపు హక్కులు, అటవీవనరులు, ఇతర సమస్యలపై 1982 ఆగస్టు9న జెనీవాలో సదస్సు నిర్వహిం చింది. ఆదివాసీల సమస్యలపై చర్చించింది. అంతేకాదు ఒక కమి టీని నియమించి1992 నుంచి పదేళ్లపాటు అధ్యయనం జరిపిం చింది. సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 100 దేశాల్లో ఐదువేల తెగలకు చెందిన 50కోట్ల ఆదివాసీలు ఉన్నారని, భారతదేశంలో 461 ఆదివాసీ తెగలున్నాయని తేల్చిచెప్పింది. ఈ తెగల్లో 92 శాతం మంది ఆదివాసీలున్నా సమితి తీర్మానించిన విధానాలకు విరుద్ధంగా అత్యంత అమానుష విధ్వంసకాండకొనసాగుతోంది.ఆదివాసీలకు స్వయంపాలన హక్కు, స్వేచ్ఛహక్కు, మానవహక్కుల సంరక్షణ, సంస్క ృతి సంప్రదాయాల జీవన విధాన సంరక్షణ హక్కు, విద్య,వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర హక్కులపై సమితి సదస్సులో తీర్మానించినా ఎంతవరకు ప్రభుత్వాలు వీటిని ఆచరణలోఉంచుతు న్నాయో చెప్ప లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని యుగాల నుంచి సామ్రాజ్యవాదవిధానంపై బీర్సాముండా,గుండాదార్‌కాసు, సిద్ధు, కొమరం భీం,రాంజీనోండు తదితర విప్లవయోధుల పోరాట ఫలితం గానే రాజ్యాంగంలో 5,6వ షెడ్యూలుఏర్పాటయింది.
అయినా ఏంలాభం? ఈచట్టాలన్నీ చట్టుబండలవుతున్నా యి. అభివ ృద్ధి పథకాల పేరుతో ఆదివాసీలను అణచివేస్తున్నారు. సహజ వనరులు, ఖనిజ సంపద కార్పొరేట్‌ వర్గాల వరమవుతున్నాయి. స్వయం స్వాతంత్య్రంతో అడవ్ఞలే తమ ఆధారమని జీవిస్తున్న ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. ఆదివాసీలపై దౌర్జన్యాలు, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా పాలకవర్గాలు మౌనం పాటిస్తున్నాయి. మావోయిస్టులకు అండదండలు అందిస్తు న్నారన్న నేరారోపణతో సాయుధ బలగాలు దారుణాలకుపాల్పడు తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఆదివాసీలపై హింసలు ఆగడం లేదు. ఆంధ్రలోని విశాఖ మన్యంలో ఆదివాసీలపై మావోయిస్టుల ముద్రవేసిహింసించే సంఘటనలు ఎన్నోజరిగాయి.శ్రీకాకుళంలో కన్నె ధార కొండగ్రానైట్‌ మాఫియా చేతిలో ఆదివాసీలు బందీలైపోతున్న ఉదంతాలు ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షలమంది ఆదివాసీలు అడ్రసు లేకుండా పోతున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కొత్త గూడెంలో విమానాశ్రయం నిర్మిస్తే 1600 ఎకరాల భూమి అవసర మని 1/70, పీసా చట్టాలకు వ్యతిరేకంగా బలవంతంగా భూమిని సేకరిస్తున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో అటవీభూము ల్లో అంగుళం భూమయినా ఆదివాసీలకు దక్కకుండా 2006 అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ మొక్కలు నాటుతున్నారు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎదిరి స్తున్న వారికి సంకెళ్లు వేస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల కారణంగా ఉత్తర తెలంగాణ లోని ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 124 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఏజెన్సీలో స్వేచ్చగా పోడువ్యవసా యం, పండ్లతోటలు, కూరగాయలు,పండిరచుకుంటూ అభివృద్ధిచెం దుతున్న ఆదివాసీల జీవనం ఈఓపెన్‌ కాస్ట్‌ గనుల వల్ల చిన్నాభిన్న మయింది. ఈ విధంగా నిర్వాసితులైనవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి అవన్నీ మొక్కుబడి వ్యవహారంగానే మిగిలిపోతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన మండలమైన తిర్యాణిలోని గోలేటి, కైరిగూర్‌, ఓపెన్‌ కాస్టు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటైనా అక్కడ నీరు,విద్యుత్‌, తదితర కనీస సదుపాయాలు లేవుసరికదా ఉపాధిలేక ఎవరూ అక్కడ ఉండడం లేదు. ఇక ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి మరీ దారుణం. 2006 ఆగస్టు 20న విశాఖ జిల్లాలో కొండతెగకు చెందిన వారిని వాకపల్లిలో గ్రేహౌండ్స్‌ దళాలు అత్యాచారం చేస్తే ఇంతవరకు నింది తులకు శిక్షపడలేదు. వాకపల్లి ఆదివాసి అత్యాచార బాధితులు ఈ వ్యవస్థపై నమ్మకం పోయి నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ మహి ళలపై ఎన్నో వేధింపులు, లైంగిక హింసలు సాగుతున్నా పాలక వర్గం పట్టించుకోవడం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఇటుక బట్టీలు తయారు చేసే వారిలో 90శాతం ఆదివాసీ మహిళలే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌,ఒడిశా,మహారాష్ట్రల నుండి వీరిని రప్పించి ఈపనులు చేయిస్తున్నారు. తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎదురు తిరిగితే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిరక్షరాస్యులైన అమా యకపు ఆదివాసీలు తమ బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా న్యాయం జరగదన్న అభిప్రాయం వీరిలో బలంగా నాటుకు పోయింది.
సమాజంలో ఆదివాసీలవేతన అరణ్యరోదనగా మారింది. రాజ్యాంగంలో ని అయిదు, ఆరు షెడ్యూల్‌లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేఆదివాసీల స్థితిగతులు, కొంతవరకయినా మెరుగుపడతాయి. షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీస్థితిని సమీక్షించి ప్రత్యే కించి చర్యలు చేపట్టే అధికారాలు గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఉన్నాయి.- పి.వెంకటేశం

1 6 7 8 9