భారత రత్నం
డా ॥ బి.ఆర్‌. అంబేద్కర్‌

(భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.)
ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతీయ సమాజాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాలను చర్చించారు. అంబేద్కర్‌ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్‌ సమగ్ర అధ్యయనం సాగలేదు. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాం తం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయ డానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. – Saiman Gunaparthi
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. సోక్రటీస్‌,ప్లేటో, అరిస్టాటిల్‌, బుద్ధునితో పోల్చదగిన పాత్ర. అంబేద్కర్‌కు ముందు భారతదేశంవేరు, అంబేద్కర్‌ తరువాత భారతదేశం వేరు. అంబేద్కర్‌ ఆలోచన, కార్యాచరణ ద్వారా ఆయన భారతదేశ స్వరూపాన్ని మార్చగలిగాడు. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది. గొప్ప హేతువాది. గొప్ప కరుణశీలి.తన జీవితంలో ఎదురైన అస్పృ శ్యతను, కులాన్ని నిర్మూలించడం కోసం ఆయన అహరహం కృషి చేశారు.అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని సామాజిక మానవ తావా దంగా పునర్నిర్మించి నవయాన బౌద్ధాన్ని ప్రపంచానికి అందించాడు. అంబేద్కర్‌ బౌద్ధప్రబోధంలో జఠిలత్వాన్ని తగ్గించి గాంభీర్యాన్ని పెంచాడు. అంబేద్కర్‌ సామాజిక, రాజకీయ సిద్ధాంతాలన్నీ బౌద్ధంలో ఉన్న మైత్రీ భావంతో ముడిపడి ఉన్నాయి. ఆయన తన విద్యాసంపన్నతను, మేథోవిస్తృతిని అహం కారానికి,ఆధిపత్యా నికి, నియంతృత్వానికి దారి తీయకుండా కరుణ,ప్రేమ,ప్రజ్ఞలతో కూడిన నూత్న భారతాన్ని ఆవిష్కరించడానికి రాజ్యాంగ నిర్మాణం లో లౌకిక, ప్రజాస్వామ్య, సమతా భావాలను సమన్వయించాడు. భారతదేశంలో కులం నిర్మూలించబడటం వలన స్వేచ్ఛ, స్వాతం త్య్రం,సౌభ్రాతృత్వం ప్రజల్లో వెల్లి విరుస్తుందని,అప్పుడు కులభావం లేకుండా ప్రతిభనుబట్టి,జ్ఞానాన్ని బట్టి, క్రియను బట్టి ప్రజలకు విద్యా, పారిశ్రామిక,ఉద్యోగ వ్యవస్థల్లో స్థానం లబి స్తుందని ఆయన తన ఉపన్యాసాల్లో బోధించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరని వర్ణము,కులము ఇవన్నీ కూడా ఒకానొకనాడు రూపుమాస్తాయని అంబేద్కర్‌ సిద్ధాంతీకరించాడు.అంబేద్కర్‌ పోరాట యోధుడు.అణగారిన ప్రజలకు ఆయన బోధి స్తూ ‘మన హక్కులను అన్యాయంగా అపహరించిన వారి నుండి తిరిగి పొందడానికి నిరంతర పోరాటమే శరణ్యమని ‘నవసమాజ నిర్మాణం ప్రార్థనలతోను, నినాదాలతోను జరగ దని,దానికి విప్లవమే శరణ్యమని ఉద్భోదిం చాడు.ఆయన ఆర్థిక, వాణిజ్య ధర్మశాస్రాల్లో పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టాలు పొందిన మేథావి. అందుకే ఆయన ‘యుగయుగాలుగా దాస్య శృంఖలాల తో మగ్గిపోతున్న పీడిత వర్గా లను నా జీవితకాలంలో పాలకులుగా చూడాలి, అదే నా జీవితలక్ష్యం అని తన జీవితలక్ష్యాన్ని వెలుగెత్తిచాటిన రాజకీయ,సామాజిక దార్శ నికుడు.ఆయన ఒక్క దళితుల కోసమే కాదు, మొత్తం భారతదేశంలోని అన్నివర్గాలకోసం పోరాడాడు. ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లా డుతూ స్త్రీలను బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చేయాలంటే మనోవికాసం కలిగిన మహిళలంతా హిందూ మతం నియమించిన మూర?సిద్ధాంతాలపైన తిరుగుబాటుచేయాలి. వివాహం చేసుకున్న స్త్రీ, భర్తతో సమానంగా ఉంటూ భర్త స్నేహి తురాలిగా వ్యవహరిస్తూ, అతని బానిసగా లోబడకుండా జీవించాలి. అప్పుడే స్త్రీలు తమ గౌరవాన్ని పొందగలు గుతారు. స్త్రీజాతి అభివృద్ధిలోనే సమాజాభివృద్ధి ఉందని నా విశ్వాసం. గర్భవతిగా ఉన్నశ్రామిక స్త్రీకి విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనపైన ఉంది. నేను ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు ముఖ్యో ద్దేశం ఇదే. స్మృతులు స్త్రీలకు కల్పించిన హక్కులనే పొందుపరచి ఈ హిందూకోడ్‌ బిల్లును రచించాను.స్త్రీలసాంఘిక పురోగతికి అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాల అడ్డంకి తొలగిం చడమే ఈబిల్లు ధ్యేయం. సంపదపైనే స్వాతంత్య్రం ఆధారపడి ఉంది.కాబట్టి స్త్రీలు సంపాదనాపరులై హక్కులు సాధించుకొని తమ స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలనిస్త్రీ విముక్తి దాతగా ఆయన ప్రజ్వలించారు.1951 ఫిబ్రవరి5వతేదీన హిందూ కోడ్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకువచ్చింది.అప్పటి కేంద్ర మంత్రి అయినఎన్‌.వి. గాడ్గిల్‌ ఈ బిల్లుద్వారా భారతదేశంలో స్త్రీలకు రాబోతున్నవిప్లవాత్మ కమైన భవిష్యత్తుకు కారణం డాక్టర్‌బి.ఆర్‌. అంబేద్కర్‌ అని,ఆయన భారతదేశంలో స్త్రీ సంస్కర్తలు ఎవరూ చేయలేనిపని చేశారని కొని యాడారు. దుర్గాభాయ్‌దేశ్‌ముఖ్‌ హిందూ కోడ్‌ బిల్లును సమర్ధిస్తూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్త్రీ దాస్య విమోచకుడని పేర్కొనడం జరిగింది. ఈ రోజున స్త్రీలు అనుభ విస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు,విద్య,గౌరవం,ఉద్యోగోన్నతులన్నీ అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లు ద్వారా తెచ్చినవే. హిందూకోడ్‌ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయి నప్పుడు అంబేద్కర్‌ ఎంతో ఆవేదన చెందారు. ఆయన తన న్యాయమంత్రిత్వ పదవికి ఈ కార ణంగా 1951 సెప్టెంబర్‌ 27న తేదీన రాజీనా మా చేశారు.అదికూడా భారతదేశంలో సంచల నాత్మక విషయమైంది. ఆ సందర్భంగా ఆయన ఎంతో ఆవేదన చెందాడు.ఎంతో మనోవేదనతో ఆయన హిందూకోడ్‌ బిల్లును త యారు చేయడంలో ఎంతో శ్రమకులోను కావాల్సి వచ్చింది.1947 ఏప్రిల్‌ 11వ తేదీన ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాను. 1949 ఏప్రిల్‌ 19న తేదీన ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారు. 1950 ఫిబ్రవరి వరకు ఈబిల్లు నిర్లక్ష్యం చేశారు.1950 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును వాయిదా వేశారు. 1951 ఫిబ్రవరి సమావేశంలో ఈ బిల్లులోని ఒక్కొక్క అంశం మీద చర్చించి 1951వ సంవత్సరం చివరకు బిల్లును అస్తిపం జరంలా చేసి చివరకు ఆమోదించలేదు. అందుకు నేను మనస్తాపం చెంది, స్త్రీలకు స్వేచ్ఛ కలిగించని ఈ పార్లమెంట్‌లోని క్యాబినెట్‌ మినిస్టర్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆయన దళితుల కోసం ఎంత చేశాడో స్త్రీల విముక్తి కోసం కూడా అంతే చేశాడు. అంబేద్కర్‌ శూద్ర కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నోచట్టాలను తీసుకు వచ్చారు. ఆయన శూద్రులకు, అతి శూద్రు లకు ఇద్దరికీ తమ కులబానిసత్వాల నుండి బయట పడటం కోసం బౌద్ధ స్వీకారాన్ని ప్రబోధిం చారు. ఆయన నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని పోగొట్టడం కోసం గొప్ప ప్రబోధనలు చేశారు. నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని నాశనం చేయాలంటే కులాం తర వివాహాలు తప్ప వేరే మార్గం లేదు. గుర్తుంచుకోండి, కులాంతర వివాహాలు జరిగితే ఉపకులాలు వాటంతట అవే నాశనమైతాయి. అంటరానివారు సాంఘిక వెలిని ఎలా అంత మొందించగలరు? అందుకున్న ఒకే ఒక మార్గం కులతత్వం లేని ఇతర వర్గాలతో సోదరత్వాన్ని, బంధుత్వాన్ని పెంచుకొని వారిలో లీనమవ్వ డం. ఈ సమాధానం చాలా తేలికైనది. కాని ఈ సమాధానపు విలువను చాలామంది ఒప్పు కోరు. కారణమేమిటంటే అతి తక్కువ మందికి మాత్రమే బాంధవ్యపు విలువ, ప్రాధాన్యత తెలుసు అని సమాజం మార్పును పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ప్రారం భిం చాడు. కులం అనేది ఎక్కడ చిట్టెంగట్టుకు పోయినా దానిని బద్ధలు చేయడం కష్టం. కులంనుంచి బయటపడ్డవాళ్లు విస్తృత మైన సమా జంలో ప్రతిభావంతులుగా ముందుకు నడుస్తారు. తమ పిల్లలకు మొత్తం ప్రపంచంలో నచ్చినవారిని పెళ్లి చేయగలుగుతారు. ప్రపం చం మొత్తంలో ఎక్కడైనా విద్య చెప్పించగలు గుతారు. ఈ స్వేచ్ఛ లన్నీ మనం అంబేద్కర్‌ ద్వారా పొందినా ఆయనను జ్ఞాపకం చేసు కోలేకపోతున్నాం. అంబేద్కర్‌ గొప్ప రాజనీతి జ్ఞుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ఆయన ప్రజాస్వామిక పునా దులను గట్టిపరిచాడు.ఆయన పరిపూర్ణ రాజ్యసిద్ధాం తాన్ని ప్రతిపా దించిన హాబ్స్‌,హెగెల్‌, బొసా న్క్వెట్‌ తదితరులతో ఆయన ఏకీభ వించలేదు. రాజ్య సమర్థుకులు భావించినట్లు రాజ్యమే అంతిమం అనే విధానాన్ని వ్యతిరేకించి రాజ్యం ఒక మానవ సంస్థగా భావించారు. ఎందు కంటే ఆలోచనకు ఆచరణకు రాజ్యమేగాక ఇతరంగా అనేకమైన మూలాలు ఉన్నాయని అంబేద్కర్‌ భావించారు. రాజ్యం ఒకసంస్థగా భావించి దాని లక్ష్యం ఈ విధంగా సూత్రీక రించారు. జీవనానికి, స్వేచ్ఛకు ఆనందంగా జీవించడానికి,స్వేచ్ఛగా మాట్లా డడానికి హక్కును కల్పించగలగాలి. సామాజిక, రాజకీయ,ఆర్థిక అసమానతలను తొలగించి అణచివేయబడిన వర్గాలకు చక్కని అవకాశా లు కల్పించాలి. భయం నుండి విముక్తిని కోరిక నుండి విముక్తిని అనుభవించే విధంగా ప్రతి వ్యక్తికీ అవకాశం కల్పించాలి. రాజ్యం మనిషినీ, సమాజాన్ని ఒక సేవకుడుగా సేవించాలే తప్ప యజమా నిలా ఆధిపత్యం వహించకూడదు. అందుకనే స్వాతంత్య్రానంతరం ఆయన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దృఢంగా నిల బడ్డాడు.ఆయన స్వతంత్రం కోసం మనషి నిరంతర పోరాటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ స్వతంత్రం మాత్రమేకాదు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతి క, సామాజిక, తాత్త్విక స్వతంత్రం ఉంటేనే స్వాతంత్య్రం ఉన్నట్లు భావించాలని ఆయన నొక్కిచెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో రాజ్యం అనేది మానవ్ఞల కోర్కెలను, ఆశయాలను సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికి, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు ఈ దిశలోనే ఉండాలని ఆయన భావించారు. అంబేద్కర్‌ తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌లో పరిశ్రమలను భూములను జాతీయం చేస్తే దేశ సంపద పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ భూమి లేనివారికి వ్యవసాయ భూమి కల్పించడం వల్ల వాళ్లు ఆ భూమిని ఎంతో శ్రద్ధగా చేసుకుని ఉత్పత్తిని పెంచుతారని కొంత మంది చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండడం వల్ల భూమి నిర్ల క్ష్యం అయ్యే ప్రమాదముందని అంబేద్కర్‌ ఆనాడే ప్రబోధిం చాడు. కానీ పాలకవర్గాలు నిరుపేదలకు భూమిని పంచటంలో ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నా యి.అందువల్ల ఎక్కువమంది వ్యవసాయ కూలీలు మనకు ఏర్పడ్డారు. వ్యవసాయ కూలీల్లో కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. అస్పృశ్యులను కూడా ఆయన మీరు ఇతరుల కంటే తక్కు వనే ఆత్మన్యూనతా భావాన్ని వదులుకోవాలని పిలుపునిచ్చాడు. మిమ్మల్ని అన్ని రంగాల్లోకి రావడానికి సంబంధించిన ద్వారాలను తెరుస్తున్నారు.మీరు ప్రతిభావం తంగా సమర్థవంతంగా వాటిలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అంబేద్కర్‌ దళితుల్లో ఉన్న తాగుడు వంటి దురా చారాలకు వ్యతిరేకంగా పోరాడాడు.మీలో వ్యక్తిత్వం రూపొందాలంటే మీరుబౌద్ధాన్ని స్వీకరిం చాలి.ఎటువంటి దుర్వ్యసనాలు లేకుండా మీ సంపదను పిల్లలకు విద్య నేర్పించడం కోసం ఉపయుక్తం చేయండని ఆయన పదేపదే తన ఉపన్యాసాల్లో చెప్పాడు. నేను ఒకతల్లి లేని పిల్ల వాడిగా ఎదిగి ఇవాళ వేల పేజీలు గ్రంథాలు రాయగలిగానంటే అక్షరం ఎవరి సొత్తు కాదు. అక్షరంద్వారా ఎవరైనా ప్రపంచ మానవ్ఞనిగా ఎదగొచ్చని ఆయన తన ప్రజలకు ప్రబోదం చేశాడు. అంబేద్కర్‌ తనప్రబోధాల్లో ప్రజలు భిక్ష గాళ్లుగా మార కూడదు. శ్రమద్వారా, ఆత్మ గౌరవం ద్వారా నిరంతరం ఉత్పత్తిలో పాల్గొ నడం ద్వారా మేథో సంపదను పెంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండని ఆయన బోధి స్తూ వెళ్లారు. ఆయనది ఆత్మ గౌరవ ఉద్యమం. మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం. కులంద్వారానో,మతంద్వారానో, అధి కారం ద్వారానో,అనువంశికంగా సంపాదించిన సంపద ద్వారానో మనిషి ఉన్నతం కాలేదు. పాలకులు, ప్రజలు రాజ్యాంగంలో రూపొం దించిన లౌకిక,ప్రజాస్వామ్య, సమసమాజ భావజాలంతో,మానవ తావాదంతో సామాజిక విప్లవ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన ప్రబోధించిన బోధనలను ఆచరించటం ద్వారా భారత దేశంలో సామాజిక పునరుజ్జీవన ఉద్య మంలో మనమూ భాగస్వాములు అవుదాం.
భారతరత్న జీవిత విశేషాలు
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’అన్న ఊరిలో) తల్లిదండ్రులు రాంజీ మలోజీ సాక్వా ల్‌,భీమాబాయ్‌ జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమ్‌ రావ్‌ రాంజీ అంబేద్కర్‌. చదువు కోవాలన్నా మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడిరది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ,వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొం దించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కొందరివాడు కాదు అందరి వాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావా ల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహానాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్పనాయకుడు అంబేద్కర్‌. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాం గంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అం శాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూ లన’, ‘మతమార్పిడి’,‘బౌద్ధమతం’, ‘హిందూ మతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కర ణలు-దళితులు’,‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా,అదనపు సంపదగా,అదనపు విలువగా,అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్‌ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగు నాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యం లో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది.1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్‌ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
బాబాసాహెబ్‌ ప్రత్యేకతలు-దక్కిన గౌరవాలు
బాబాసాహెబ్‌ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు.ప్రతి ప్రసంగం అత్యంత ప్రభా వితం చేయగలిగేవే. లండన్‌ యూనివ ర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్‌. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావు లలో బాబాసాహెబ్‌ ఒకరు. లండన్‌ విశ్వ విద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ పీహెచ్‌డీని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
అంబేద్కర్‌ విద్యాభ్యాసం
ా బీ.ఏ (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
ా ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
ా ఎమ్మెస్సీ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏకనామిక్స్‌, 1921)
ా పీహెచ్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)
ా డీఎస్‌సీ (లండన్‌ విశ్వవిద్యాలయం, 1923)
ా బారిష్టర్‌ ఎట్‌ లా (గ్రేస్‌ ఇన్‌ లండన్‌, 1923)
ా ఎల్‌ఎల్‌డీ( కొలంబియా విశ్వవిద్యా లయం, 1952, గౌరవపట్టా)
ా డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
కుటుంబ నేపథ్యం
మరాఠీ నేపథ్యం గల అంబేద్కర్‌ కుటుంబం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబేవాడ గ్రామంలో నివాసం ఉండేది. వీరి వంశీకులు మహార్‌ కులానికి చెందినవారు. తండ్రి రాంజీ బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదారు. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడ్డారు. మిగిలినవారు.. ఇద్దరు అక్కలు.మంజుల, తులసి,ఇద్దరు అన్నలు బలరాం,ఆనందరావు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన చిన్నతంలోనే అంట రానితనాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్‌ పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా,మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒకమూల కూర్చోబెట్టేవారు. నీళ్ళు తాగాలంటే ప్యూన్‌ మాత్రమే వచ్చి ఇచ్చే పరిస్థితి.బరోడా మహారాజు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఇచ్చిన 25రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ.పూర్తి చేశారు. విదే శాల్లో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందు కొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన అంబేద్కర్‌.1915లోఎం.ఏ.,1916లో పి. హెచ్‌.డి. డిగ్రీలను పొందిన అంబేద్కర్‌, 1917లో స్వదేశం వచ్చాక మహారాజా శాయా జీరావ్‌ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఇక అంబేద్కర్‌ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్‌ క్లాస్‌ కాంగ్రెస్‌, ఆలిండియా షెడ్యూ ల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ వంటి అనేక రాజకీయ పార్టీ లను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పగించిన నెహ్రూ..ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో విజయం సాధించారు. తరతరాలుగా బడుగు,బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవి తాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌. వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్‌..వారసత్వ,వివాహ చట్టా లలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించారు. హిందూ కోడ్‌ బిల్లు ముసా యిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబరు14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌..తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్‌ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు అంబేద్కర్‌. దళితుల హక్కులు,అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. (సేకరణ : థింసా ఎడిటోరియల్‌ డెస్క్‌)