విఫత్తుల నాశనం..జయించే శక్తిలేకున్నా..

విఫత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం విఫత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది.ఇవి వాటిల్లి నప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నీ వర్గాల మీద ప్రభావం చూపిస్తాయి.ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విఫత్తుల కోట్లమంది చని పోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా..కోలుకోవడా నికి కొన్నేళ్లు పట్టేదిగా ఉం టుంద కూడా. సాధారణంగా విఫత్తులు రెండు రకాలు.ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు,భారీ వర్షాలు,వరదలు,తుఫాన్‌, సునామీ,భూకంపాలు ప్రకృతి విఫత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌హౌజ్‌ ఎఫెక్ట్‌) కాలుష్యం, అడవుల నరికివేత్త తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈరెండు విఫత్తులు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహామ్మారు లను సైతం విఫత్తులుగా ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు.
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతిపాదన చేసింది.ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విఫత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని అధికారికంగా పాటించాలని నిర్ణయించింది.కానీ,1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు.విఫత్తులను తగ్గించుకునేంఉదకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ ఆవేరీనెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది.మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓ రెజుల్యూషన్‌ పాస్‌ చేసింది.ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతోపాటు ఈ దినోత్సవం పేరును మార్చేసింది.
విఫత్తుల నిర్వహణ
విఫత్తుల సంబంధించాకే సహాయక చర్యలు మొదలు పెట్టాలి.విఫత్తు నిర్వహణ అంటే ఇంతే..అని ఒకప్పుడు అనుకునేవాళ్లు.గతంలో మనదేశంలో విఫత్తులు ఆలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే.అయితే విఫత్తును ముందే అంచనా వేసే జాగ్రత్తలు తీసుకోలేమా?ఈ దిశగా ఐక్యరాజ్య సమితి(ఐరాస)1990లో ఒక తీర్మాణం చేసింది.ఆ దశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విఫత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటిం చింది.విఫత్తుల నిర్వహణ అంటే..ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు.రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి.ముందుస్తు చర్యలు చేపట్టాలి. లోపాలను అధిగమించాలి.ఒకవేళ విఫత్తులు వస్తే త్వరగతిని సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవ డంతోపాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి.తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే.

జాతీయ విఫత్తు..
విఫత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. ఉదాహరణకు..కేరళ వరదలను జాతీయ విఫత్తుగా కేంద్ర ప్రకటించడానికి కారణం కూడా ఇదే.విఫత్తు నిర్వహణ చట్టం ప్రకారం మహా విఫత్తు,మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి.ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం జాతీయ విఫత్తుగా ప్రకటిస్తుంది. కానీ, సహజ విఫత్తులను ఖచ్చితంగా జాతీయ విఫ త్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహాజ విఫత్తుల అంటే ఏంటీ సూచన లు చేయకుండానే డిజాల్వ్‌ అయ్యింది. రాష్ట్రా లకు ఇదే మైనస్‌గా మారింది.అయితే విమర్శ లు వచ్చినప్పుడుల్లా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ రంగంలోకి దింపి,ఏదో మొక్కబడి ఆర్ధిక సాయం ఇచ్చి చేతులుదులుపుకుంటోంది కేంద్రం. విఫత్తులు/ఆపదలు చేప్పిరావు.. ఆకస్మాత్తుగా వస్తాయి.మానవ తిప్పదాలతో జరిగే విఫత్తులను ఆరికట్టొచ్చు.కానీ,ప్రకృతి విఫత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు.ఎదుర్కొం డటానికి..తీవ్రతను తగ్గించడా నికి మాత్రమే సిద్దంగా ఉండాలి!కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి.అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేథావులు అభిప్రాయపడుతున్నారు.
వైపరీత్యాలను
1. సహజ వైపరీత్యాలు
2. సామాజిక-సహజ వైపరీత్యాలు
3. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు
4. పర్యావరణ వైపరీత్యాలుగా విభజించవచ్చు. భూకంపం,సునామీ,అగ్నిపర్వత విస్ఫో టనం, భూతాపం,ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం మొదలైనవాటిని ప్రకృతిసిద్ధ లేదా సహజ వైపరీత్యాలు అంటారు.
వరదలు, భూకంపాలు,కరువులు,ఆనకట్టలు కూలిపోవడం వంటి వాటికి మానవ ప్రేరేపిత, ప్రకృతి కారణాలు రెండూ ఉన్నాయి. అందువల్ల సామాజిక-సహజ వైపరీత్యాలు అంటారు.ఉదాహరణ: వరదలు అనేవి సహజసిద్ధంగా కురిసే అధిక వర్షాల వల్ల రావచ్చు లేదా మావన నిర్లక్ష్యం కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంవల్ల కూడా రావచ్చు. పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు,ఉగ్రవాద దాడులు, ఆనకట్టలు కూలిపోవడం,విషపూరిత వ్యర్థాల లీకేజీ,యుద్ధం,అంతర్గత తిరుగుబాట్లు మొదలైనవి మానవ ప్రేరేపిత వైపరీత్యాలకు ఉదాహరణలు.కాలుష్యం,అడవుల నరికివేత, ఎడారీకరణ, తెగుళ్లదాడులు మొదలైనవి పర్యావరణ వైపరీత్యాలు. ఉదా: మానవజాతి నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే అది సమాజానికి ఎలాంటి ప్రత్యక్ష, తక్షణ నష్టం కలిగించదు.అందువల్ల దాన్ని విపత్తుగా పేర్కొనలేం.ఉదా:2001లో గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంపం 10వేల మందికిపైగా ప్రాణాలను హరించింది.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

గిరిజన ఆకాంక్షల మేరకు అల్లూరి జిల్లా అభివృద్ధి

గిరిజనుల ఆకాంక్షల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా మని అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్‌ఎ. ఎస్‌.దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.అక్టోబర్‌ 23న కలెక్టరేట్‌ మిని సమావేశ మందిరంలో జిల్లా వ్యా ప్తంగా ఉన్న పలుగిరిజనసంఘాల నేతలతో సమా వేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు,రహదారుల అభివృద్ది,స్వయంఉపాధి పథకాలు,నైపుణ్యాభివృద్ధిని సమర్దవంతంగా అమ లు చేయడానికి గిరిజన సంఘాల నేతల తగు సలహాలు సూచనలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రా 2047కింద చేపట్టిన అబి óవృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పాఠ శాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించాలమని తెలియ జేసారు.పాఠశాల భవనాలు లేని చోట తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేయడానికి ఒకడిజైన్‌ చేయాలని అన్నారు. ప్రభు త్వ భూములు,క్వార్టర్లను ఆక్రమిస్తే తనదృష్టికి తీసుకునివస్తే తగిన చర్యలు చేపడతామని చెప్పా రు.గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తే సమాచారం అందించాలని అన్నారు. మూడు, నాలుగేల్లో ప్రతి గ్రామానికి కనీస రహదారి సదు పాయం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి నేతలు రామారావు దొర,మొట్టడం రాజాబాబు,కొర్ర బల రాం,డా.రామకృష్ణ,ఎస్‌.వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఆశ్రమపాఠశాలల్లో మెనూ సక్ర మంగా అమలు చేయడం లేదని అన్నారు. డిప్యూటీ వార్డెన్ల పోస్టులు నిర్వహణకు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తుంటారని చెప్పారు.ఆశ్రమ పాఠ శాలలో చదువుకుంటున్న 4,5తరగతి విద్యా ర్ధులపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపిపి పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని అన్నారు. కొయ్యూరు ప్రాంతంలో జీడి తోటలు అధికంగా ఉన్నాయని జీడిపిక్కల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతా యని సూచించారు. జాఫ్రా,రబ్బరు పరిశ్రమలు, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మారేడు మిల్లి నుండి రాజమండ్రికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.గిరిజన యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి పథకాలు నెలకొల్ప డానికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గంజాయి సాగు,రవాణా,వినియోగంపై కఠిన చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యపరీక్షలు,రక్త పరీక్షలు సక్ర మంగా నిర్వహించడం లేదని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.నకిలీ కులదృవీ కరణ పత్రా లుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్య కలాపాలు సక్రమంగా జరగపోవడం వలన రక్తకొరత ఏర్పడుతుందని చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా చింతూరు డివిజన్లో వరద సహాయ చర్యలు చేపట్టి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సేవలును అందరూ ప్రశంసించారు. ఈ సమావేశంలో 22 మండలాల నుండి గిరిజన సంఘాల ప్రతినిధులు కె.ఆనం దరావు,గోపాల్‌,ఎస్‌.అశోక్‌,డా.పి.రాకుమార్‌, కె.సన్యాసిరెడ్డి,గిరిజన విద్యార్ధి సంఘం ప్రతిని దులు కిరసాని కిషోర్‌, ఎం.బాబూజీ తది తరులు పాల్గొన్నారు.
కాఫీ రైతులకు గిట్టుబాటు ధర అందించండి
అరకు కాఫీకి గిట్టుబాటు ధర అందించా లని జిల్లా కలెక్టర్‌ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ సూచిం చారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఐటిసి కంపెనీ అధికారులు,కాఫీ అధికారులతో కాఫీ విక్ర యాలపై సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు కాఫీని గిరి జన రైతులు ఆర్గానిక్‌ విధానంలో సాగు చేస్తు న్నారని కాఫీ రైతులకు మంచి ధర చెల్లించాలని స్పష్టం చేసారు. చింతపల్లి మాక్స్‌ సంస్థ సేకరిస్తున్న కాఫీని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామ మన్నారు. కాఫీ సేకరణలో తగిన నాణ్యతలు పాటించాలని సూచించారు. కాఫీ రైతుకు జియో ట్యాగింగ్‌ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.కాఫీ నాణ్యతలపై లైజాన్‌ వర్కర్లకు అవగా హన కల్పించాలని చెప్పారు.చింతపల్లి మాక్స్‌ సంస్థ ఈ ఏడాది 600టన్నుల పార్చిమెంట్‌ కాఫీని ఉత్పత్తి చేస్తోందన్నారు గిరిజన కాఫీని బహిరంగ వేలంలో విక్రయిస్తామన్నారు.గత రెండు సంవ త్సరాలను అరకు కాఫీ ఫైన్‌ కప్‌ అవార్డును పొందు తోందన్నారు.ఐటిసి అధికారులు వాసు దేవ మూర్తి, కిరీట్‌ పాండే మాట్లాడుతూ మాక్స్‌ కాఫీ వేలంలో పాల్గొంటామని చెప్పారు. కాఫీ విక్రయాలు, వేలం సమయంలో సమాచారం అందించాలని కోరారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా నడుద్దాం – రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరం కలిసి కట్టుగా నడుద్దా మని, సమష్టి కృషి చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.ప్రజా సమస్య ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుద్దామని పేర్కొ న్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఛైర్‌ పర్శన్‌ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి లో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. డయేరియా లాంటి మహమ్మారి దాడి చేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్‌ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని చెప్పారు.మురుగు కాలువలకు ఆను కొని తాగునీటి పైపు లైన్లు ఏర్పాటు చేయరాదని, జలజీవన్‌ మిషన్‌ లో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత కాలంలో వందశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని,శివారు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా స్పందించిన హోం మంత్రి రోడ్ల అభివృద్ధికి సభ్యుల సలహాలు, సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందిద్దామని పేర్కొన్నారు.ఇప్పటికే దీనిపై కేంద్ర హోం మంత్రి తో చర్చించామని కేంద్ర,రాష్ట్ర నిధుల సహా యం తో గిరిజన ప్రాంతాల్లో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇక నుంచి డోలీమోత కష్టాలు ఉండ వని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపడతామని,తదుపరి శాశ్వత చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా తెలి పారు.ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని రోడ్ల మరమ్మ తులకు రూ.20కోట్లతో పనులు చేసేందుకు చర్య లు తీసుకున్నట్లు ఆమెగుర్తు చేశారు. రోడ్లకు ఇరు వైపులా తుప్పలను తక్షణమే తొలగించాలని ర.భ. శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షా కాలం కావున కాలువగట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికా రులను ఉద్దేశించి పేర్కొన్నారు.జడ్పీ ఛైర్‌ పర్శన్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముం దుగా సీఈవోపి.నారాయణమూర్తి అజెండా అం శాలను చదివి వినిపించారు.సభ్యులు పలు అంశా లపై ప్రశ్నలు వేశారు. మధ్యాహ్న భోజనం పథకా న్ని బాగా అమలు చేయాలని,ప్రయివేటు పాఠశా లల్లో తనిఖీలు చేపట్టాలని, పిల్లల భద్రతకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సకాలం లో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కు ఏజెన్సీ ప్రాంతంలో భారీగాపంట నష్టం జరి గిందని, పారదర్శకంగా అంచనాలు వేసి పరిహా రం అందించాలని విజ్ఞప్తి చేశారు.రోడ్లకు మరమ్మ తులు చేపట్టాలని విన్నవించారు. ఉపాధి హామీ, కల్వర్టుల నిర్మాణం, తాగు నీటి సౌకర్యం,జలజీవన్‌ మిషన్‌ పనులు తదితర అంశాలపై సభ్యలు మాట్లా డారు.
స్టీల్‌ ప్లాంటుపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తాం ః ఎంపీ శ్రీభరత్‌
సమావేశంలో భాగంగా స్టీల్‌ ప్లాంటు విషయంలో స్థానిక ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించాలని, న్యా యం చేయాలని ఓసభ్యుడు విన్నవించగా విశాఖ పట్టణం ఎంపీ శ్రీభరత్‌ సానుకూలంగా స్పందిం చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణా మాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ నాలుగు నెలల కాలంలో రూ.500కోట్లు ఒక సారి,రూ.1200కోట్లు ఒకసారి మొత్తం రూ.1, 700 కోట్ల నిధులు వేర్వేరు అవసరాల దృష్ట్యా విడుదలయ్యాయని పేర్కొన్నారు. నిధుల విడుదల ను బట్టే స్టీల్‌ ప్లాంటు విషయంలో కూటమి ప్రభు త్వం దృక్పథం అర్థమవుతుందని ఎంపీ వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే స్థానికంగా స్పందిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కాఫీ,మిరియాలు,జీడితోటలు,ఇతర పండ్ల తోట లకు గ్రామీణ ఉపాధిహామీపథకాన్ని అనుసం ధానం చేసే విధంగా పార్లమెంటులో ప్రస్తావిం చాలని జడ్పీ ఛైర్‌ పర్శన్‌ ఎంపీని కోరగా తప్పకుం డా ప్రస్తావిస్తామని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.
పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఆహారం నాణ్యతను పెంచాలి ః ఎంపీ తనూజ రాణి
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో అందించే ఆహారం నాణ్యతను మరింత పెంచాలని అరుకు ఎంపీ తనూజ రాణి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలన్నారు. పిల్ల లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచిం చారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా..పిల్లలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శిథిల భవనా లకు మరమ్మతులు చేయాలని, కొత్తవాటిని నిర్మిం చాలని, గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు.స్థానిక సమస్యలను పార్ల మెంటులో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
మార్కెట్‌ కమిటీ ఆదాయాన్ని ప్రజా అవసరాలకు వెచ్చించాలి ః పెందుర్తి ఎమ్మెల్యే
స్థానికంగా ఉండే మార్కెటింగ్‌ కమిటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజా అవసరాల మేరకు వెచ్చించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు అభిప్రాయపడ్డారు. ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలపై అధికారులు దృష్టి సారించాలని, సభ్యులకు,ప్రజలకు సహకారం అందించాలని సూచించారు. అలాగే సమావేశానికి వచ్చే సభ్యులు స్థానిక పరిస్థితులపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలని,ఏయే అంశాలపై ప్రశ్నలు అడ గాలో సిద్ధమై రావాలని అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయని పేర్కొన్నారు. అన్ని రకాల శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలు, అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు తోడుగా నిలవాలన్నారు.
షట్రపల్లిలో మోడల్‌ కాలనీ నిర్మిస్తాం ః ఏఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌
ఇటీవల కురిసిన వర్షాలకు జీకే వీధి మండలం లోని షట్రపల్లిలో భారీ నష్టం జరిగిం దని, అక్కడి ప్రజలు ఇళ్లు కూడా కోల్పాయరని స్థానిక జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించగా అల్లూరి సీతారాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందిం చారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించానని, అక్కడి పరిస్థితులను పరిశీలించానని చెప్పారు. షట్రపల్లి గ్రామంలోని 37కుటుంబాలను అనుకూ లమైన ప్రాంతానికి తరలించి వారికి కోసం పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద మోడల్‌ కాలనీని నిర్మిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో విశాఖపట్టణం,అరుకు ఎంపీలు శ్రీభరత్‌, తనూజ రాణి,ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, దినేష్‌ కుమార్‌,విజయ కృష్ణన్‌,ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-జిఎన్‌వి సతీష్‌

నీళ్లకోసం..నేలకోసం..మత్స్యకారుల దైన్యం

మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై.. ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు. చేపలనే కాదు.. సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంద్రం నిండా కదలాడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమైపోతుంటే.. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో దిక్కు తెలియక ప్రపంచవ్యాప్తంగా సతమతమవుతున్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! కడలి అలలపైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు.. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత చేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం,బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతుపట్టని రోజుల తరబడి ప్రయాణం..అయినా సంద్రంపై నమ్మకంతో బతుకుపోరు సాగిస్తూనే ఉంటారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు..అన్న నానుడిని మననం చేసుకుంటూ,వలలు భుజాన వేసుకుని, తిరిగి వస్తామో రామోనన్న నమ్మకం లేని పయనం చేస్తారు మత్స్యకారులు.. సంద్రంలో ఇప్పుడు కార్పొరేట్‌, కాలుష్య తిమింగలాలు సంద్రాన్ని..తీరాన్ని.. వీరిని, వీరి బతుకుల్ని కబళించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..-`గునపర్తి సైమన్‌
వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులతో1997లో తొలిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట న్యూఢల్లీిలో ఒక సమా వేశం జరిగింది. దాదాపు 18 దేశాల నుండి ప్రతి నిధులు హాజరైన ఈసమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా,కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ని మత్స్య దినోత్సవంగా జరపాలని ఆసమావేశం పిలుపునిచ్చింది.తొలి సమావేశం జరిగి 26 సంవత్సరాలు గడిచిపోయా యి.అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్య కారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు.
ఉనికికే ప్రమాదం..
ఇప్పుడు జలచరాలకే కాదు..మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలు ష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈదుష్పరిణా మానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూము లపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆప్రాం తంలోని అన్నిజలవనరులను విషతుల్యంగా మారు స్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తు న్నారు.జలచరాల గుడ్లను కూడా మిగల్చ కుండా ఊడ్చేస్తున్నారు. అందుకే..మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపు నింపే నీళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఈ పరిణామాలు మన రాష్ట్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి.ఫలితంగా తూర్పు తీరం లోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్ప చెబుతున్నాయి.సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇలా..
రాష్ట్రానికి సుదీర్ఘమైన 974కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది.సముద్రం మీద ఆధా రపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం)సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం12,747మోటారైజ్డ్‌,1771మెకనైజ్డ్‌, 14, 677సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడి చిన పన్నెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకా రుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.సాంప్రదాయ,మోటరైజ్డ్‌బోట్లసంఖ్య భారీ గా తగ్గింది.వాటిస్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగా యి.వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి.పెద్ద వ్యాపారవేత్తల నుండి వందలకోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కార ణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యం గా మారింది.ఎక్కడైతే స్వేచ్ఛగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీ డ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను,చేప పిల్లలను వదిలి వేస్తూ సాగే ‘బతుకు.. బతికించు’ జీవన విధానం నుండి ‘సర్వస్వాన్ని దోచేసే’ కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళ కింద నేలను..బోటుకింద నీళ్లను..’లాగేసే ప్రభుత్వ విధానాలు..తీర ప్రాంతంలో తిష్టవేసి,మత్స్యకా రుల బతుకుల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు దయనీయస్థితిలోకి నెట్టబడ్డారు.
ఏం జరుగుతోంది?
నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగు తోంది.సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది.నదుల్లో చేరుతు న్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రం లో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచా రం లేదు.రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యు లేటరీ జోన్‌ నిబంధనలను కాదని, బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమోగానీ స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈవాస్తవం పూర్తిగా అర్థ మైంది.‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్ర త్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు.తీసుకెళ్లి చూపించేస్తారు కూడా..కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు..పైగా రోజురోజుకీ పెరుగుతూ ఉం టోంది’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒకమత్స్య కార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగు తూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలు గురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన‘కొన్ని సంవత్స రాల క్రితం ఒడ్డునేచేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. రోజుల తరబడి సము ద్రం మీదనే ఉండాల్సి వస్తోంది.ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు.ఒక్కోసారి బోటు మీద తీసుకెళ్ళేవారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు.ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీరప్రాంతంలో కనిపించడం లేదు. వీటి లో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్ప మని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి!
కలవరపెడుతున్న కోత!
కాలుష్యం కారణంగా చోటుచేసుకుం టున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి.పిల్లి పిల్లలను మార్చి నట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాం తాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సి వస్తోంది.అయినా,తరతరాలుగా అలవాటైన సము ద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. అందు బాటులో ఉన్నలెక్కల ప్రకారం గడచిన 80 సంవ త్సరాల కాలంలో ఇక్కడ రెండు కిలోమీటర్ల భూమి కోతకు గురైంది.ఈప్రభావం 1989నుండి మరిం త స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ఒక అంచనా! ‘ఒకే దగ్గర నివాసంఉండటమన్నది మరచి పోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం.మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా..ఇక్కడే ఉంటున్నాం’అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ఇళ్లనుకోల్పోయిన వారే అంద రూ.కోల్పోకుండా ఉన్నవారు ఒక్కరంటే ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు.ఇలానష్ట పోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్ట లతో మిగలడం వారికి మామూలే. ఉప్పాడలోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89కిలోమీటర్ల భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం.దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ఏ జిల్లాలో ఎంత కోత?
జిల్లా కోత (కి.మీ.లలో)
శ్రీకాకుళం 25.12
విశాఖపట్నం 25.81
తూర్పుగోదావరి’ 89.25
కృష్ణా 57.55
నెల్లూరు 53.52
తీరం కార్పొరేట్ల పరం..
కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిణామం మరింత వేగవంతమైంది.అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు,మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోంది.ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్‌ కాస్తా అదానిప్రదేశ్‌గా మారుతోంది. పోరు ్టలను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సము ద్రంలోకి నౌకలకు ఆటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37కిలోమీ టర్లకు పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కిలోమీటర్ల మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మి కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరం పోర్టు వద్ద కూడా ఇదే స్థితి.గోడ నిర్మాణంతో కిలోమీటరు దూరం వెళ్లి, వేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా‘కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు,సాగరమాల’ ప్రాజెక్టుల పేరుతో తీరప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసె సింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రో కెమికల్స్‌ ఫార్మా పరిశ్ర మలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌,రాంకీ ఫార్మ సిటి, హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,బ్రాండిక్స్‌ ఇండియా అపె రల్‌ సిటీ,డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని.వీటి నుండి విడుదలయ్యే కాలు ష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తు న్నాయి.దీనిని నియంత్రిస్తున్నట్లు,కాలుష్య నివార ణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరి మితం.దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది.
సమస్యలు పరిష్కరిస్తేనే బతుకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు నష్టదాయకమైన జీవోలను విడుదల చేస్తున్నాయని ఎపి మత్స్యకారులు,మత్స్యకార్మిక సంఘం పేర్కొం ది.దీంతో మత్స్యకార వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది.చేపలకు గిట్టుబాటు ధర కల్పించాలి. గంపల మహిళలకు మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి.సబ్సిడీ డీజిల్‌,ఐస్‌ ప్లాంట్‌ వంటి సదుపా యాలు కల్పిస్తామని,జెట్టీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.తుపాను సమయాల్లో మత్స్య కారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి. వేట నిషేధ కాలంలో సమస్యలను పరిష్కరించాలి. యాభై సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పిం ఛన్‌ సౌకర్యం కల్పించాలి.స్థానిక పరిశ్రమల్లో మత్స్యకార కుటుంబాల యువతకు ఉపాధి కల్పించాలి.
ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి..
ఆక్వా (రొయ్యలు, చేపలు,పీతలు) రైతులు ఇటీవల కాలంలో పీకల లోతు కష్టాల్లో కూరుకు పోతున్నారు. సన్న, చిన్నకారు రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరి గాయి.ఫీడ్‌, సీడ్‌ (విత్తనం) నాణ్యతా ప్రమాణాల్లో లోపాలుంటున్నాయి.వైరస్‌లు, వాతావరణ మార్పు లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దిగుబడులు తగిన విధంగా లేవు.ధర రాక ఆక్వా రైతులు కుదేలౌతు న్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల పన్ను లు,విదేశీ మారకద్రవ్యం రూపంలో ఆదాయం పొందుతున్నాయి.కానీ ఆక్వారైతుల్ని మాత్రం గాలి కి వదిలేసి,నట్టేట ముంచుతున్నాయి. ఆక్వా రైతుల చేపలు,రొయ్యలకు ధర కల్పించి..ఆదుకోవాలి. నాణ్యమైన సీడ్‌,ఫీడ్‌ సరఫరా చేయాలి.విద్యుత్‌ రాయితీ పునరుద్ధ్దరించాలి.
సముద్రమూ వారికే..
మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు,వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ-సిఎఎ(అమెండ్‌ మెంట్‌)బిల్లు -2023..సాధారణ మత్స్యకారు లకు ప్రాణాంతకంగా మారనుంది.ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం.గత ఏడా దికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచ నా.వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌,మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపా యల్లో పెట్టుబడులు అవసరమైంది. బ్లూ ఎకానమి,సముద్ర ఆధారిత టూరిజం,డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమ తించింది.దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్య కారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని,సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపా డుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది! 2004 భారత మహాసాగరమైన సునామీ నుండి వచ్చే పాఠాలు తదుపరి తరంకోసం మహా సముద్రం వంటి అధికమొత్తంలో నీరు శీఘ్ర స్థాన భ్రంశం జరగడంవల్ల ఒక సునామి సముద్రపు కెరటం (అలలు) పరంపర ఆరంభమవుతుంది నీటి పై గాని క్రిందగాని భూకంపాలు, సమూహపు కద లిక,కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనములు,కొన్ని జలాంతర్భాగ విస్ఫోటనం.

అడవి బతుకులు ఆదివాసీ నవల

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు పమ్రుఖ రచయిత,పరిశోధకులు డాక్టర్‌ దిలావర్‌ కలం నుంచి జాలువారిన ఆధ్యాత్మక, చారిత్రక,ప్రాధాన్యత సంతరించుకొని గిరిజనల్లో ఒక ప్రత్యేకత చాటుకున్న ‘ అడవి బతుకులు ఆదివాసీ నవల’ అనే పుస్తకంపై సమీక్ష
అడవి జన జాతుల్లో అచ్చమైన అడవి బిడ్డలు చెంచులు,మన తెలుగు రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో అధికంగా అగుపించే ఈచెంచులకు ఎంతో ఆధ్యాత్మిక,చారిత్రక,ప్రాధాన్యత ఉండి గిరిజనుల్లో ఒక ప్రత్యేకత చాటు కున్నారు.
ఎంతో ఘనమైన చరిత గల ఈ చెంచు జాతి అడవి బిడ్డలు నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న అగచాట్ల గురించి ఆవిష్కరించిన ఆదివాసీ నవల‘‘అడవి బ్రతు కులు’’దీని రచయిత ప్రముఖ పరిశోధకుడు ‘‘డాక్టర్‌ దిలావర్‌’’ వీరు తెలుగు బోధకునిగా పనిచేస్తూ పలు గిరిజన జనవాసాల్లో ప్రత్యక్షంగా గడిపిన అనుభవంతో పాటు తనదైన పరిశోధన, పరిశీలన, సాయంగా ఈ నవలను అనేక విషయాలు విశేషాల సమాహారంగా అందించారు.
నవల మొత్తం 21అధ్యాయాలుగా విభ జించబడి కొనసాగింది, కాల్పనిక పద్ధతిలో వాస్తవ సంఘటనలను మిళితం చేసి వ్రాసిన ఈనవల రచనా శైలి సరళంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది,
నవల మొత్తం చెంచుల సంస్కృతి సాంప్ర దాయాల ఆవిష్కరణతో పాటు వారి జీవనం లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా ఆధునిక వ్యక్తులు ఆధునిక కట్టడాలు నిర్మాణాలు ద్వారా అడవి బిడ్డలు ఎదు ర్కొంటున్న కష్టాలే కాక నష్టాలు,తద్వారా తమ జాతి జనాభా నిర్వీర్యం అయి అంత రించిపోతున్న తీరు,నల్లమల ప్రాంతంలో నిర్మించిన నాగార్జునసాగర్‌ ఆనకట్ట నిర్మా ణం తీరు ఆనాటి పరిస్థితులు, చెంచులు నష్టపోయిన వైనం, వంటి చారిత్రక విష యాలు విశేషాలతో పాటు నేటి ఆధునిక కాలంలో స్వార్థపు స్మగ్లర్ల వల్ల అటవీ సంపద కొల్లగొట్ట పడుతున్న తీరు,ఆ దాస్టి కంలో అమాయక చెంచులు సమిదలవు తున్న వైనం,కళ్ళకు కట్టారు రచయిత డాక్టర్‌ దిలావర్‌.ఈనవలలో ప్రధాన పాత్రలు ప్రొఫెసర్‌ రచయిత రమణారావు, అతని భార్య సృజన,పరిశోధక రచయిత రమ ణారావు తన దగ్గర గల క్షేత్ర పర్యటనల అను భవ సారంతో ఒక మంచి ‘ఆదివాసీనవల’ రాయలనుకొని చాలా కాలం కృత్యాద్య వస్థ పొంది చివరికి రచన ఆరంభిస్తారు.కట్‌ చేస్తే తెలంగాణకు హృదయం వంటి అందమైన నల్లమల అడవుల్లో నవల ప్రారంభమవుతుంది. నవల రెండో భాగంలో చెంచులు నల్లమల ప్రాంతానికి దూరమైన తీరు తద్వారా మరణి మరణించిన వైనం చెప్పడం జరుగుతుంది. మూడవ భాగంలో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ కట్టిన నేపథ్యం వివరిస్తూ దాని నిర్మాణంలో వందలాది చెంచులు అసువులు బాసిన మరు గున పడిన చరిత్రను,ఈ నవలా రచయిత ఆవిష్కరించటం ఇందులో విశేషం. నల్లమల అడవుల్లోని పక్షి, జంతు,సంతతి వివరాలు, చెంచుల జీవన విధానం ఆహారపు అలవాట్లు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ …డాక్టర్‌ దిలావర్‌ తనదైన శైలిలో స్థానిక విషయాలతో కూడిన ఉపమానాలు అన్వయిస్తూ నవలను నడిపించిన వైనం పాఠకులను అబ్బురపరుస్తుంది.4,5 భాగాలలో ఈ అక్షర దృశ్యాలు నల్లమల అందా లు చెంచుల ఆనంద వైభవాలు హృ ద్యంగా చదవవచ్చు.సంస్కృతి సాంప్రదాయాలను పర్యా వరణను పరిరక్షించే అడవిబిడ్డలైన చెంచుల్లో నిభిడీకృతమైన ప్రేమఅనురాగాలు,అమలిన శృంగార కథనాలు కూడా మనం ఈనవలలో గమనించవచ్చు.కోనమ్మ,కొండడు,అనే ఇద్దరు చెంచు యువతీ యువకుల ప్రణయగాథ ఈ నవలకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక రచయితలోని ప్రేమతత్వం చిలిపితనం,శాంత స్వభావం,అర్థం అవుతాయి.ఇష్టపడ్డ ఇద్దరూ యువతీ యువకులు కుల పెద్ద అంగీకారంతో రెండు మూడు రోజులు వనవాసం చేసివస్తే ఆ తర్వాత కులదేవత సాక్షిగా వారికి అందరి అంగీకారంతో పెళ్లిచేసే సంప్రదాయం చెంచు జాతిలో ఉందనే విషయంఈనవలలో కొండడు, కోనమ్మల,పెళ్లి సందర్భంగా రచయిత వివరిం చారు.భార్యా,భర్త చనిపోయిన జంటలు తిరిగి పెళ్లి చేసుకునే సహృదయ సాంప్రదాయం సైతం చెంచు జాతిలో ఉందని, ఆ సహజీవ నం కూడా కుల పెద్ద అంగీకారంతోనే అంటూ చెంచుల కుల కట్టుబాటును ఉదహరిస్తూ గుర్రమ్మ,లింగయ్యల సహజీవనం గురించి కూడా రచయిత ఈనవల ద్వారా వివరించారు,
చెంచుల్లో ఉండే పోడు వ్యవసాయ విధానం, సంచార జీవనం ద్వారా ఎక్కడ పంటలకు అనుకూలమైన వాతావరణం భూమి ఉంటుం దో అక్కడే వారు జీవనం చేస్తూ జీవితం గడుపుతారు.ముఖ్యంగా వారి వ్యవసాయ పద్ధతులు అన్ని సహజత్వంగా ప్రకృతికి దగ్గరగా ప్రకృతిని పరిరక్షించే తీరులో ఉండ టం అందరికీ ఆశ్చర్యకరమే కాదు ఆదర్శ నీయం కూడా. చెంచులు ఎంతగా ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛ మైన జీవనం సాగిస్తున్న,చెట్ల మందులతో వైద్యం చేయడం వచ్చిన, అత్య వసరమైన కాన్పుల సమయంలో కనలేక ఎందరో చెంచు మహిళలు మరణిస్తున్నారు. అందులో ఒకటి లింగయ్య ఇష్టపడి మారు మనువు చేసుకున్న గుర్రమ్మ, కాన్పు సమ యంలో మరణించడం,కొందరు చెంచు యువకులు మత్తు పానీయాల వ్యసనాలకు లోనై నాలుగు పదుల వయసులోనే చనిపోతూ… చెంచు గుడేలు,పెంటలు, విధవ రాళ్ల తో నిండిపోతున్నాయని,హృదయ విధా రక ఆవేదనను సైతం రచయిత ఈ నవలలో ఆవిష్కరించారు. నవల పదవ భాగం నుంచి పరిశోధక రచయిత ప్రొఫెసర్‌ రమణరావు చెంచుల మరి కొన్ని జీవన విధానాలు ప్రత్య క్షంగా చూసి తెలుసుకోవడానికి గాను తన మిత్రులతో కలసి చెంచు గుడేలకు వెళ్లడంతో మొదలవుతుంది. స్థానిక చెంచు పెద్దలు వీరికి చెప్పిన స్థానిక చరిత్రల ఆధారంగా అనేక చారిత్రక సత్యాలు అర్థం అవుతాయి,చెంచుల తొలి దేవర వృద్ధ మల్లికార్జునుడు అతను శ్రీశైలంలో స్వయంభూ గా వెలిసినట్టు,అతనిని ‘‘మలల అన్న’’అని మొదట పిలిచేవారని, అతను తమ ఆడబిడ్డ ‘‘బ్రహ్మ రాండదేవి’’ని పెళ్లి చేసుకున్నట్టు, శ్రీశైలం మొదట చెంచుగూడెం అని, అక్కడ గుడి కట్టింది కూడా చెంచులే అని గజ్జల కొండడు ఆలయతొలి పూజారి అనే మరుగున పడిన చారిత్రక విశేషాలు రచయిత ఈనవల లో అందించారు. శివాజీ చేసిన యుద్ధాలకు చెంచులు అందించిన సహకారం గురించి మరికొన్ని మరుగున పడిన చెంచు ప్రాంత చారిత్రక విషయాల గురించి రమణారావు పాత్ర క్షేత్ర పర్యటనల ద్వారా తెలుసుకున్నట్టు రచయిత దిలావర్‌ నవలీకరించారు.
అలాగే నల్లమల అడవుల్లో ప్రస్తుత ఆధునిక కాలంలో స్వార్థపరులైన వ్యాపారులు దళారీల ద్వారా జరుగుతున్న అటవీ ఉత్పత్తుల రవాణా వల్ల స్థానిక చెంచు కుటుంబాలు నేటి కాలంలో ఎలా నష్టపోతున్నాయో అన్యాయాలు ఇబ్బందు లు ఎలా ఎదుర్కొంటున్నారో ఈ నవల ముక్తా యింపులో రచయిత డాక్టర్‌ దిలావర్‌ అందం గా ఆలోచింపజేసే విధంగా ఆవిష్కరించారు. అందమైన స్థానిక అంశాల ఉపమానాలే కాక స్థాని సరళమైన భాషను కూడా నవలలో ప్రయోగించటం రచయితకు గల అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది ఎన్నో చారిత్రక సాంస్కృతిక విలువలు గల విలువైన ఆదివాసీ నవల‘‘అడవి బతుకులు’’ అందరూ విధిగా చదవాలి.
అడవి బతుకులు (నవల),రచయిత: డాక్టర్‌ దిలావర్‌, పేజీలు: 112, వెల:100/- రూ,
ప్రతులకు: యండి అక్బర్‌,సెల్‌: 93811 06671,సమీక్షకుడు:డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

గిరిజన విద్యార్థుల్లో సమగ్ర వికాసం

అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, అరకు లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, యండపల్లి వాలసాలో జూనియర్‌ కాలేజ్‌, మరియు పాదేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ వంటి వివిధ సంస్థలలో యువ క్లబ్‌లు ఉన్నాయి.ఈ యువ క్లబ్‌లతో మా పరస్పర చర్యల సమయంలో,విద్యార్థులు కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలను మాకు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో,మేము పాఠశాల మరియు కాలేజ్‌ విద్యార్థుల కోసం ఉద్యోగా భివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాము, వారి సంబం ధిత గ్రామాల నెలకొన్న సమస్యలపై విద్యార్థులు దృష్టిసారించి తెలియజేశారు. వారి సమస్య లను యూత్‌ క్లబ్స్‌ తరుపున అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కి,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ సమత ప్రతినిధులు అందజేయడం జరిగింది.
విద్యార్థి దశ ఓమధురానుభూతి.అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల విద్యా ర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పుస్తకాల బరువు,హోంవర్కులు,పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరుతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. ఆటపాటలు కరువై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతుం డటంతో మధురస్మృతులకు లోనై తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు.విషయ పరిజ్ఞానం,ఆలోచ నాశక్తి,సృజనాత్మకత,ప్రశ్నించేతత్వం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా సమత రెండేళ్ల నుంచి అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు,అనంతగిరి, అరకు ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ జూని యర్‌ కళాశాల బాలబాలికలతో యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసింది.స్థానికంగా నివాసముంటున్న వారి గ్రామాల్లో పలు సామాజిక సమస్యలను గుర్తించడం,వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం,జీవిత నైపుణ్యాలు తెలుసుకోవడం వంటి అంశాలపై తద్వారా విద్యార్ధినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలతో గ్రామాల్లో ఉన్న పలు రకాల సమస్యలను తెలుసుకుని ఇటీవల జిల్లా కలెక్టర్‌,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి విన్నవించేలా కృషి చేస్తోంది.సామాజిక సేవే లక్ష్యంతో విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గిరిజన యూత్‌ క్లబ్‌లు సత్ఫ్‌లితాలు ఇస్తున్నాయి.కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన,వక్తత్వ పోటీలు నిర్వహిస్తుండటం ద్వారా విద్యార్థుల్లో ప్రపంచ,సామాజిక,శాస్త్ర, సాంకేతిక విషయా లపై అవగాహన,ఆసక్తి పెంపొందిం చటానికి కృషి చేస్తున్నారు.పోటీల్లో విజయం సాధించిన విజేతలకు చక్కట విలువైన బహుమతులు అందజేస్తున్నారు.స్నేహపూర్వకంగా సహాయ సహకారాలతో ముందుకు సాగుతోంది. కళా శాల విద్యార్థుల్లో సమగ్ర మనో వికాసానికి తమవంతుగా కృషి చేస్తున్నారు. ప్రాథమిక విద్య సమయంలోనే నైతిక విలువలు,జీవన నైపుణ్యాలు,సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని యూత్‌ క్లబ్‌ విద్యార్థులకు అలవర్చుతున్నారు.మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత,భావ ప్రకటనా సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి కృషిచేస్తున్నారు. సామాజిక సమానత్వం,న్యాయం,ప్రపంచ సంఫీుభావం పెంపొందించటం,ప్రజాస్వామ్య విలువల పరి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య గురించి హేతుబద్ధంగా ఆలోచించటం,పరిస్థితులను అవగాహన చేసుకోవటం,ఊహించటం,పోల్చటం, క్షేత్ర స్థాయి జ్ఞానాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.చదువుకునే రోజుల్లో ఉన్నత ప్రమాణాలకు పునాదులు వేసేందుకు యూత్‌ క్లబ్‌లు నిర్విరామంగా కషిచేస్తున్నాయి. వాటితోపాటుగా ఆరోగ్య సూత్రాలు,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికిగాను వారి శారీరక, మానసిక,విజ్ఞాన శక్తులను పెంపొందించే విధంగా సూచనలు,సలహాలిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.ఆటల్లో ప్రోత్సాహం, వ్యాయామం వంటివి నేర్పిం చటం, అవగాహనా శక్తి పెంపొందించే విధంగా మోటివేషనల్‌ తరగతులను వివిధ విషయాలపై నిర్వహిస్తున్నారు. మేథోశక్తిని పెంపొందించటానికి పుస్తకపఠనం,ఆన్‌లైన్‌ పోగ్రాములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా,ఒత్తిడి లేని విద్యను అభ్యసించటంపైనా, కెరీర్‌ గైడెన్స్‌పైనా మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నత చదువులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఆతర్వాత కూడా వారి ఆరోగ్య రక్షణకు,మానసిక వికాసానికి తగిన సూచనలు,సలహాలను అందిస్తున్నారు.
-గునపర్తి సైమన్‌

సముద్ర కాలుష్యం..ప్లాస్టిక్‌ అధికశాతం

తినే తిండి..తాగేనీళ్లు..వాడుకునే వస్తువులు..ప్రతిదానికీ ప్లాస్టిక్‌! మనకండ్ల ఎదురుగా కనిపించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్‌..అంతాలా మన జీవితంలో ప్లాస్టిక్‌ భాగమైపోయింది.అవసరం ఉన్నాలేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరి పోయాం.ప్లాస్టిక్‌ వస్తూనే ఉన్నది..గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూనే ఉంది.భూమినే కాదు..సముద్రాలను ముంచెత్తుతుంది.ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.ప్లాస్టిక్‌ భూతం వల్ల సముద్రాలకు,జలచరాలకు జరుగుతున్న నష్టమెంత?ప్లాస్టిక్‌ను ఆపేదెట్ల? సముద్రాలను కాపాడుకునుడెట్ల (కొట్టాల రాము)
మనిషి అడుగుపడనంత వరకే ఏ ప్రాంతమైనా సురక్షితం..అని అన్నాడో రచయిత.దేన్నయినా ధ్వంసం చేయగల నేర్పు..గాలినీ,గంగనూ..కలుషితం చేయగల తెలివి..ఒక్క మనిషికే సొంతం.మన తప్పులకు నీటి అడుగున ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది.ఫ్లాస్టిక్‌ చెత్తను పడేసేందుకు డంపింగ్‌ యార్డుల్లా సముద్రాలు మారిపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో నిండిపోతున్నాయి.సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని అమెరికాకు ఎందిన ‘ది5గైర్స్‌ ఇనిస్టిట్యూట్‌’ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రపం చవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు 170 ట్రినియన్ల ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నాయి.వీటి బరువు రెండు మిలియన్‌ టన్నుల ఉంటుంది.2005నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ చాలా పెరిగింది.దీన్ని కానీ ఆపకపోతే 2040నాటికి వ్యర్ధాలు మూడురెట్లు పెరుగుతాయి.ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది.ప్లాస్టిక్‌ నివారణకు చట్టబద్దమైన విధానాలు తీసుకురావాలి.ఫ్లాస్టిక్‌ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అవసరం.ఎక్కువ ఫ్లాస్టిక్‌ తయారీతోపాటు వాడకం కూడా పెరిగింది.దీంతో భూమిపై వీటి వ్యర్ధాలు భారీగా పేరుకుపోయాయి’’ని వివరించింది.
మనకు ఎంతో ఇస్తోంది..
జీవి మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం.సముద్రాలులని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడువంతులు సముద్రాలే.ఒకవంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం.సముద్రాల్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ,మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. మన ఫుడ్‌లో ఇంపార్టెంట్‌ స్టాల్‌..అఅది దొరికేది సముద్రం నుంచే.చేపలు,రొయ్యలు,పీతల్లాంటి జలచరాలు సముద్రాల నుండే లభిస్తున్నాయి.అలాగే సముద్రపు పొచి,నాచు నుంచి సేకరించే పదార్ధాలను ఫుడ్‌ ఐటమ్స్‌లో వాడతారు.సముద్రాల్లో దరికే ఫ్రాన్స్‌,సీవిప్‌ కోరల్స్‌ నుంచి సేకరించిన పదార్ధాలను ఫెయిర్‌ కిల్లర్స్‌,ఇతర ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. సముద్ర తీరాల్లో లభించే ఇసుక..భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది.మనకు ఇంత ఉపయోగపడుతున్న సముద్రాలకు మనం మాత్రం తిరిగికాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నాం.ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాం.
సముద్ర జీవాలకు ముప్పు…
సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ బయటపడుతున్నాయి. ‘‘మైక్రో ఫ్లాస్టిక్‌వల్ల నీరు కలుషితం అవుతుంది.ఇదొక్కటేనా ప్లాస్టిక్‌ను ఫుడ్‌ అనుకొని సముద్ర జీవులు తినడంతో వాటి ఆర్గాన్స్‌ దెబ్బతింటున్నాయి.మహాసముద్రాల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంద’’ ని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.తాబేళ్లు,తిమంగలాలు,ఇతర జలచరాలు ఫ్లాస్టిక్‌ మింగడం లేదా వాటిలో చిక్కు కొని మరణిస్తున్నాయి.సముద్రపక్షలు చేపలు అను కుని ప్లాస్టిక్‌ను తింటున్నాయి.ఇలా చనిపోయిన పక్షల కడుపుల్లో దాదాపు80శాతం ఫ్లాస్టిక్‌ ఉంది. తిమింగలాల పొట్టలో నుంచి కేజీల కొద్దీ ఫ్లాస్టిక్‌ బయటపడిన ఘనటలూ ఉన్నాయి.
కారణాలేంటీ?..
సముద్రాలకు ఫ్లాస్టిక్‌ చేస్తున్న హానిని ఊహించ లేమని సైంటిస్టులు ఆందోళన పడుతు న్నారు.‘బీచ్‌ల్లో చెత్త వేయడం,సాధారణ వ్యర్ధాల నిర్వహణలోపం,మురుగు కాలువలు,నదులు, వాన లకు కొట్టుకుని రావడం వంటి కారణాలతో సము ద్రంలోకి ఎత్త చేరుతోంది.మరో 22శాతం మిస్‌ మేనేజ్‌ చేస్తున్నారు.ఇది ఇలానే కొనసాగితే భయంకర పరిస్థితులు తెలెత్తుతాయి.ప్రపంచం ముందుకు వచ్చి ఫ్లాస్టిక్‌ కట్టడికి చర్యలుతీసుకోకపోతే..2040 నాటికి మహా సముద్రాల్లోకి చేరే చెత్త 64బిలియన్‌ ఫౌండ్ల(2,902కోట్ల కిలోల)కు పెరుగుతుందని రీసెచర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి భూమిపై పోగయ్యే చెత్త 26ట్రిలియన్‌ ఫౌండ్ల(11.79కిలక్షల కోట్లు)వరకు ఉండొచ్చని మరో స్టడీ అంచనా వేసింది.‘‘ఫ్లాస్టిక్‌ కాలుష్యం చాలా స్థిరంగా కొనసాగుతుంది.అలానే వదిలేస్తే అనేక దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు ఇలానే ఉండొచ్చు.సముద్రంలోకి ఫ్లాస్టిక్‌ చేరకుండా అడ్డు కోవాలంటే దాని మూలాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి.అప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. దీనికి పూర్తి మ్యాపింగ్‌ అవసరం.ఒకసారి మహా సముద్రాల్లోకి చేరిన చెత్త..చిన్నచిన్న భాగాలుగా విడిపోతుంది.కాలక్రమేణా మారిపోతుంది.కానీ నిజంగా అదృశ్యం కాదు.రికవరీ కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది’’అని ది ఓషన్‌ క్లీనప్‌ రీసెర్చ్‌ హెడ్‌ లౌరెంట్‌ లెబ్రెటెస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.
నమ్మలేని నిజాలివి…
-కొన్నేండ్లుగా సగటున ప్రతి నిమిషానికి ఓట్రక్కు చెత్త సముద్రంలో కలుస్తున్నట్లు అంచనా.
-గత వందేండ్లలో ఉత్పత్తి కానంత చెత్త..కేవలం గత దశాబ్దకాలంలోనే ఉత్పత్తి అయింది.
-ఒక ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు ఉపయోగపడే సమయం సగటున కేవలం 15 నిమిషా లు.కానీ అవసరం తీరాక అది డీగ్రేడ్‌ కావడానికి 500నుంచి వెయ్యేండ్లు పడు తుంది.డీ గ్రేడ్‌ అయినంత మాత్రాన డీ కంపోజ్‌కాదు.మైక్రోఫ్లాస్టిక్‌గా మారు తంది. మనుషులు,జంతువులకు విష పూరితంగా మారుతుంది.పావుగంటలో వాడేందుకు పనికరాకుండా పోయే వస్తువును..కొన్ని తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాకర వస్తువుగా మారుస్తున్నాం.
– ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 సముద్ర జంతువులు ఫ్లాస్టిక్‌ వల్ల చనిపోతు న్నాయి.దాదాపు 90శాతం సముద్ర పక్షలు ఫ్లాస్టిక్‌ తింటున్నాయి. ఫ్లాస్టిక్‌ను ఆహారం అనుకుని ప్రతి మూడు సముద్ర తాబేళ్లలో ఒకటి తింటున్నాయి.
– చివరికి తల్లి గర్బంంలోని శిశువులకు అన్ని పోసకాలను అందించే,బొడ్డు తాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రోఫ్లాస్టిక్‌ అవశే షాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
-2050కల్లా ప్రపంచంలో మత్స్య సంపద తో సమానంగా ఫ్లాస్టిక్‌ సముద్రాల్లో చేరు తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా పడుతున్నాయట. ఇటీవల కేరళలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ ఫ్లాస్టిక్‌ చెత్త వచ్చి పడిరదట.
-సముద్రాల్లో పొగువుతన్న చెత్తలో 80శాతంపైగా ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలే ఉం టున్నాయి.
– ప్రపంచంలోని ఒక్కశాతం నదులు (సుమారు1,0001)..సముద్రాల్లోకి చేరే 80శాతం ఫ్లాస్టిక్‌కు కారణమవు తున్నాయి.
క్లీనింగ్‌ ఇలా..
ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి చేరకుండా ఆపడాన్ని నదులను శుభ్రపరచడం ద్వారా ప్రారం భించాలి.దిఓషన్‌ క్లీనప్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనై జేషన్‌.. సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ క్లీన్‌ చేసేందుకు చర్యలు చేప ట్టింది.ఇప్పటివరకు 2మిలియన్‌ కిలోలకు పైగా చెత్తను సముద్రం నుంచి తొలగించింది.
కాస్టింగ్‌ నెట్‌..
సముద్రాల్లో ఏర్పడే ప్యాచ్‌లను తొలగిం చేందుకు నెట్స్‌ వాడుతున్నారు.రెండు పడవలకు చెరోవైపు నెట్‌ను తగిలించి..యు ఆకారంలో వెళ్లి చెత్తనంతా మధ్యలోకి తీసుకొస్తారు.అక్కడి నుంచి తరలించి రీ సైకిల్‌ చేస్తారు.ఈప్రాసెస్‌లో సముద్ర జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంటర్‌ సెప్టార్‌ సిస్టమ్‌..
నదికి అడ్డంగా ఒకవైపు నుంచి ఇంకో వైపునకు ‘ట్రాష్‌ ట్రెంచ్‌’ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌ సెప్టార్‌ బ్యారియర్ల ద్వారా చెత్త సేకరి స్తారు. నది వెడల్పు,లోతు,ప్రవాహ వేగం,చెత్త రకం వంటి అంశాల ఆధారంగా సేకరణ తీరు మారు తుంటుంది.ఈ మొత్తాన్ని ఏఐ కెమెరాలను ఉపయో గించి అంచనా వేస్తారు.చెత్తను తీయడానికి కన్వే యర్‌ బెల్ట్‌ వాడతారు.
గ్రేట్‌ బబుల్‌ బారియర్లు..
గ్రేట్‌ బబుల్‌ బారియర్లద్వారా నది నుంచి వచ్చే చెత్త సముద్రంలో కలవకుండా చూస్తారు.ఈ బబుల్‌ బారియర్లను నదిలో వాలుగా ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వచ్చే గాలి బుడగలు ప్లాస్టిక్‌ చెత్తను అడ్డుకుంటాయి.వచ్చే చెత్తమొత్తం ఒడ్డును ఒక మూలకు చేరేలా చేస్తాయి.అక్కడి నుంచి చెత్తను సేకరిస్తారు.
రోజూ వాడే వస్తువులన్నీ…
నదులు ద్వారా,నేరుగా డంపింగ్‌ చేయ డం ద్వారా భారీస్థాయిలో ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి వచ్చి పడుతోంది.సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆఫ్లాస్టిక్‌ అక్కడక్కడా గుంపు(ప్యాచ్‌)గా చేరుతోంది.ఈ ఫ్లాస్టిక్‌ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల వస్తువులు ఉంటున్నాయి.శాస్త్రవేత్తలు పసిఫిక్‌ ప్యాచ్‌లో పరిశీలించినప్పుడు..ఫ్లాస్టిక్‌ బాటి ల్స్‌,గ్లాసులు,పాత్రలు,బొమ్మలు,టాయిలెట్‌ సీట్లు, చేపల వలలు,ఎలక్ట్రానిక్‌ పరికరాల ఫ్లాస్టిక్‌ భాగా లు,ఇంట్లో వాడే ఇతరఫ్లాస్టిక్‌ వస్తువుల ముక్కలు, థర్మాకోల్‌ ముక్కలు..ఇలా ఇంకా ఎన్నో రకాలు కనిపించాయి.
ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా.?
ఫ్లాస్టిక్‌ను నియంత్రిండమెలా?నిజంగా మనం ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా?శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి.‘‘ విచ్చలవిడిగా ఫ్లాస్టిక్‌ను తయారుచేస్తూ..రీ సైకిల్‌ చేయాలి..క్లీన్‌ చేయాలి అంటే ఎలా?అసలు ఫ్లాస్టిక్‌ తయారు చేయడమే మానేయాలి.అప్పుడు రీ సైక్లింగ్‌,క్లీనింగ్‌ అవసరమే ఉండదు.ఫ్లాస్టిక్‌ బదులు మనకు ఎన్నోప్రత్యామ్నాయ మార్గాలున్నాయి .కాకపోతే ప్రభుత్వాలకూ,ప్రజలకూ నిబద్దత అవ సరం.ఫ్లాస్టిక్‌ వాడే తీరు మారాలి’అంటున్నారు.
సైంటిస్ట్‌లు..
మనం బజారుకెళ్లి ఏంతెచ్చినా..ఫ్లాస్టిక్‌ కవర్‌లోనే తెస్తాం.ఇంటికి వచ్చే వరకే ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు అవసరం.తర్వాత అదిచెత్త బుట్టలోకి వెళ్తుంది. ఇలా ఒకరోజుకు,నెలకు,ఏడాదికి ఎంత ఫ్లాస్టిక్‌ చెత్తను మనం పడేస్తున్నాం అనేది ఆలో చించాలి.అవసరం మేరకే వాడుతున్నామా? అందుబాటులో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాడు తున్నామా?అనేది గమనించాలి.మితిమీరి తింటే మందు కూడా విషం అవుతుంది.అలాంటిది విషం లాంటి ఫ్లాస్టిక్‌ను..ప్రతి దానికి ఉపయోగిస్తున్నాం.
మారాల్సింది మనం ..ఫ్లాస్టిక్‌ వాడుతున్న పద్దతి కదా!..
ఫ్లాస్టిక్‌ కవర్లపై నిషేధం అంటూ ఉత్తుత్తి ప్రకటనలతో కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి.దశల వారీగా సింగిల్‌ యూజ్‌ ఫ్లాస్టిక్‌ను నిషేధించాలి.ఫ్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేం దుకు టార్గెట్లు పెట్టుకోవాలి.వాటిని సాధించేందుకు కృషి చేయాలి.బ్యాన్‌ను కాదని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రత్యామ్నాయాలను ప్రొత్స హించాలి.జనపనార లేదా క్లాత్‌ సంచుల వినియో గాన్ని ప్రోత్సహించాలి.తయారీదారులకు ఇన్సెం ట్‌వ్‌లు ఇచ్చి దన్నుగా నిలవాలి.ముఖ్యంగా బయో డీఏడబుల్‌ సంచులను ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలి.బంగాళదుంపలతో కూడా క్యారీబ్యాంగ్‌,స్పూన్స్‌,ప్లేట్స్‌,పిల్లల ఆట సామగ్రిని తయారు చేస్తున్నారు.పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.కొదÊఇద రోజులకే కరిగి భూమిలో కలిసిపోతాయి.వీటిని రీసైక్లింగ్‌కి కూడా వాడొచ్చు. బ్రిటన్‌,జపాన్‌లలో వీటిని ఇప్పటికే వాడుతున్నారు. రోజుకు సముద్రాల్లో ఎంత ఫ్లాస్టిక్‌ చెత్త పేరుకు పోయింది?రేపటికీ అది ఎంత అవుతుంది?వచ్చే ఏడాది ఎంత పెరుగుతుంది?ఇలాంటి ప్రశ్నలకు మనకు నిజంగా సమాధానాలు తెలియపోవచ్చు. కానీ,సముద్రపు చెత్తా చెదారాన్ని నియంత్రించ డానికి స్థానికంగా,ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయి లో తీవ్రమైన ప్రయత్నాలు జరిగే వరకు భారీ మొత్తంలో ఫ్లాస్టిక్‌ వేస్ట్‌ సముద్రాల్లో పెరుగుతూనే ఉంటుంది.
పదివేల అడుగుల లోతున…
ఫిలిప్పీన్స్‌ మెరైన్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మైక్రోబయల్‌ ఓషియనాలజిస్ట్‌ డాక్టర్‌ డియోఫ్లోరెన్స్‌ ఓండా..2021లో పసిఫిక్‌ సముద్రం లోని ‘ఎమ్డెన్‌ డీప్‌’లో 10,000మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు.అది ప్రంచంలోని అతి పురాత నమైన, భూమ్మీద మూడులోతైన ట్రెంచ్‌(కందకం) సముద్రంలో దాగి ఉన్న రహాస్యాలను కనుగొవడం కోసం ఆసాహసం చేశారు.10,000మీటర్ల లోతులో పదార్ధాలను,వాతారణాన్ని పరిశీలిం చారు. ఆయనతోపాటు అమెరికన్‌ సైంటిస్ట్‌ విక్టర్‌ వెస్కోవా వెళ్లారు.ఇద్దరూ దాదాపు 12గంటలపాటు అన్వేషించారు.‘‘ మేమిద్దరం సముద్రంలోని లోతైన ప్రదేశానికి వెళ్లగానే తెలుపు రంగులోని పదార్ధాలు కనిపించాయి.వాటిని మొదట జెల్లీఫిష్‌ అనుకు న్నాం.తీరా దగ్గరకు వెళ్లి చూస్తే..అవన్నీ ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలని అర్ధమైంది.ఇంత లోతులో ఫ్లాస్టిక్‌ వ్య ర్ధాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. బట్టలు, పాత బొమ్మలు,ప్యాకేజింగ్‌ వస్తువులు,ఫ్లాస్టిక్‌ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకు పోయాయి’’ని చెప్పారు ఓండా.
ఊహించలేనంత నష్టం..
సముద్రం ఒక క్రైమ్‌ ప్లేస్‌గా మారింది. ఇది ఒక సైటింటిస్టు ఆవేదన.నీటిలో తప్ప ఇంకె క్కడా బతకలేని జలచరాలకు..సముద్రమే ప్రమాద కరమైన ప్రదేశంగా మారుతోంది.మనకెన్నో ఇస్తు న్న సముద్రాన్ని అంతలా మనమే నాశనం చేస్తు న్నాం.నీళ్లు,సముద్రపు ఉత్పత్తులు కలుషితం అయి పోతున్నాయి.అమెరికా సహా పలుదేశాల్లోని సము ద్ర తీర ప్రాంతాల్లో మట్టి,ఇసుకను పరిశీలిం చిన శాస్త్రవేత్తలు…వాటిలో ఫ్లాస్టిక్‌ అవశేషాలు గణ నీయంగా ఉన్నట్లు గుర్తించారు.మనం తినే తిండి, తాగే నీళ్లు..ఓలెక్కన చెప్పాలంటే మన శరీరంలోకి కూడా మైక్రోఫ్లాస్టిక్‌ చేరిపోతుంది.అసలు మైక్రోఫ్లాస్టిక్‌(సూక్ష్మస్థాయి ఫ్లాస్టిక్‌ ముక్కలు) లేనిప్రదేశమే లేకుండా పోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకా రం..గాలిలోని దుమ్ములో,తాగేమంచినీళ్లలో, సము ద్ర జీవు కడుపుల్లో మైక్రోఫ్లాస్టిక్‌ను గుర్తించారు. మనం తప్పు చేసి శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో కోట్ల జీవరాశులను బలి చేస్తున్నాం.భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం.‘‘ఏటా 640 వేల టన్నుల ఫిషింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను సముద్రాల్లో డంప్‌ చేస్తున్నారు.ఫ్లాస్టిక్‌ నుంచి వెలువడే రసా యనాలతో నీళ్లు కలుషితమవుతున్నాయి.ఆ ప్రభా వం సముద్రం జీవులపై పడుతోంద.వాటి నుంచి ఆ ఎఫెక్ట్‌ మనుషుల ఆరోగ్యంపై పడుతోంది’’ అని డబ్ల్యూయూఎన్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ రీసెర్చర్లు ఆందోళన పడుతున్నారు.
ప్లాస్టిక్‌ లేని ఊరు..
ఫ్లాస్టిక్‌ వల్ల ఈ భూమ్మీద ప్రతి ప్రాణికి ప్రమాదమే.అందుకే మన దేశంలో సహా ప్రపం చంలో అనేక దేశాలు ఫ్లాస్టిక్‌ వాడకం తగ్గించాయి. వ్యర్ధాలను ఎక్కపడితే అక్కడ పారేయకుండా చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్ధాలను గుర్తించిన ఓ గ్రామం సర్పంచ్‌ వాళ్ల ఊరి ప్లాస్టిక్‌ రహిత పంచాయితీగా మార్చాలి అనుకున్నాడు.కానీ,అది అంత ఈజీకాదని కొత్తగా ఆలోచించాడు.దాంతో ఆయన లక్ష్యం 15రోజు ల్లోనే నెరవేరింది.సౌత్‌ కశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా లోని షహబాద్‌ బ్లాక్‌ సాదీవర పంచాయితీకి ఫరూ క్‌ అహ్మద్‌ గనయ్‌ సర్పంచ్‌.ఇంతకుముందు ఆయన లాయర్‌గా పనిచేశారు.వాళ్ల గ్రామంలో ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలు లేకుండా చేయాలనుకుని..‘ఫ్లాస్టిక్‌ తీసుకు రండీ`బంగారం గెలుచుకోండి’ అని ప్రకటించాడు.ఈ కార్యక్రమంలో భాగంగా 20 క్వింటాళ్ల ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలను తీసుకొచ్చిన వాళ్లకు ఒక బంగారం నాణెం ఇస్తామని చెప్పాడు.దాంతో ఊరివాళ్లంతా ఫ్లాస్టిక్‌ సేకరించే పనిలో పడ్డారు. దాంతో..పదిహేను రోజుల్లోనే ఊళ్లో ఫ్లాస్టిక్‌ కని పించకుండా పోయింది.ఆ తర్వాత గవర్న మెంట్‌ ఆ గ్రామాన్ని ఫ్లాస్టిక్‌ రహిత గ్రామంగా ప్రకటిం చింది.
రీసైక్లింగ్‌కు కట్టుబడితేనే…
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం మున్సి పాలిటీల ప్రాధమిక విధుల్లో ఒకటి.తడి,పొడి చెత్తను వేరుగా తీసుకోవాలి.రీసైక్లింగ్‌ చేపట్టాలి .అయితే ఈపని ఎక్కడా సరిగా జరగదు.కానీ, ఒడిశాలోని సంబల్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ)చెత్తనుంచి ఆదాయం సంపాదించుకుం టోంది.ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మ డం ద్వారా ప్రతినెల రూ.15లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఆదయాం పొందుతోంది.‘గ్లాసు, పేపర్‌,కార్డ్‌బోర్డ్‌,మెటల్‌,ఫ్లాస్టిక్‌ టైర్లు,బట్టలతో సహా 16రకాల రీసైకిల్‌ చేయగలిగే వ్యర్ధాలు వేరు చేస్తోంది. ఎంపిక చేసిన ఏజెన్సీకి..ఒక్కో ఐటమ్‌ను ఒక్కో ధరకు అమ్ముతోంది.సంబల్‌పూర్‌ సిటీలో రోజూ 110టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. తొమ్మిది వెల్త్‌ సెంటర్లును ఏర్పాటు చేసి ప్రాసెస్‌ చేస్తున్నారు.తొలుత గృహాలు,వాణిజ్యసంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్‌ సెంటర్లకు తీసు కొస్తారు.ఈసెంటర్లలో మైక్రోకంపోస్టింగ్‌ సెంటర్‌ (ఎంసీసీ),మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ (ఎం ఆర్‌ఎఫ్‌) ఏర్పాటు చేశారు.నగరంలో ఉత్పత్తయ్యే బయోడీగ్రేడబుల్‌ వ్యర్దాలను వేరు చేస్తారు.అలా వేరు చేసిన తర్వాత రీసైకిల్‌ చేయడానికి వీలులేని చెత్తను..ఇంధనంగా వాడేందుకు సిమెంట్‌ ఫ్యాక్టరీకి పంపుతారు.రీసైకిల్‌ చేయగలిగే చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు.వేస్ట్‌ను కూడా వేస్ట్‌ చేయకుండా ఆదాయవనరుగా మార్చుకుంటు న్నారు వాళ్లు.2017లో బ్రిటన్‌కు చెందిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ కారోలిన్‌ పవర్‌ తీసిన పొటో ఇది.హోండురాస్‌లోని రోవాటెన్‌ ఐలాండ్‌కు దగ్గర్లోకి కరేబియన్‌ సముద్రంలో ఇలాకొన్ని కిలో మీటర్ల మేరచెత్త పేరుకుపోయింది.హోం డురాస్‌, గాటెమాలలో అడ్డూఅదుపు లేని ఫ్లాస్టిక్‌ వినియో గానికి ఇదోఉదాహరణ.సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ ఎంతటా పేరుకుపోతుందో చేపేందుకు ఇదో నిదర్శనం.పైగా‘దీనికి మీదే బాధ్యత’అంటూ రెండు దేశాలు ఒకరినొకరు నిందుంచుకోవడం గమ నార్హం. (వీ6వెలుగు సౌజన్యంతో…)

దసరా అందరూ కలిసే సరదా

ప్రకృతి ప్రసాదించే ప్రత్యేక కాలాల్లో మనుషుల సంతోషాలూ, సందళ్లూ పరవళ్లు తొక్కుతుం టాయి. ఆటపాటలూ, ఆనందాలూ ఆకాశాన్ని తాకుతాయి. ఇది పండగల ఆరంభ సంధర్భం. ఆ తరువాత పండగల్లోకి పురాణగాథలు వచ్చి చేరతాయి. కథోపకథల సంగతి ఎలా ఉన్నా.. పండుగ పరమార్థం పదిమందీ కలిసి ఆడటం, పాడటం, చెడును నిరసించి,మంచికి జేజేలు పలకటం. చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ మనుషులంతా గెలిచినట్టే.అదే నిజమైన పండగ. దసరా సరిగ్గా అట్లాంటి పండగే. మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన అమ్మల వీరత్వానికి ఒక మచ్చుతునక. ప్రకృతిని గౌరవించుకుంటూ మనుషులిచ్చే కానుక. ఈ చివరి వాక్యాలను స్కాన్‌ చేసి, మనసులో సేవ్‌ చేసుకోవాలి.ఈ చివరి వాక్యాలను టాటూగా హృదయం మీద వేసుకోవాలి. నిజానికి ఇది దసరాని మరింత గుర్తుచేసుకోవాల్సిన సందర్భం.సింధూ నాగరికత కాలం నుంచీ నేటి వరకూ మన చరిత్రను పరిచీ,తరచీ చూసుకోవాల్సిన సందర్భం.ఈ నేల మీద మాతృస్వామ్య వ్యవస్థ తాలూకా ఛాయలు లీలామాత్రంగా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం కాస్త ఫోకస్‌ చెయ్యాలి. మరి కాస్త జూమ్‌ చేయాలి. లేదంటే నిర్భయలూ, దిశలూ, గృహహింసా బాధితులు, చైల్డ్‌ అబ్యూజ్‌కు గురవుతున్న పిల్లలూ, ఆఫీస్‌లో చెవులు కట్టేసుకుని బతుకుతున్న ఉద్యోగినులు.. ఇలా వీళ్లే కనబడుతుంటారు. అదీ నేటి పరిస్థితి.ఇది చెడు మీద కత్తి తిప్పిన దుర్గమ్మను తలుచుకోవాల్సిన సమయం. పురుషాధిక్యపు చెట్టు మీద ఎక్కుపెట్టడానికి సమానత్వపు గొడ్డలిని సిద్ధం చేసుకోవాల్సిన సందర్భం. మన అమ్మలఅమ్మలఅమ్మల వీర గాథóలను నరన రానా ఇంకించుకోవాల్సిన సమయం. ఒకసారి దసరానీ, అందులో మిళితమై ఉన్న మన తెలుగు సంస్కృతినీ, మన ఇంటి అమ్మలని మనం గౌరవించుకునే విధానాన్నీ తలుచుకుందాం.
టూకీగా అదీ కథ..
ప్రకృతిని ఆరాధిస్తూ, మాతృమూర్తిని జగన్మా తగా కొలిచే పండగే దసరా. సహజంగా తల్లి తన బిడ్డల పట్ల అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటుంది. తన బిడ్డలు మంచిని పంచాలనీ, చెడును అంతరించాలనీ, మనుషులందరి కోసం నిలబడాలనీ కోరుకుంటుంది. దీని కోసం తన జీవితాన్ని హాయిగా ఇచ్చేస్తుంది. కానీ కథ యూటర్న్‌ తీసుకుంటే ఊరుకోదు. ఆ బిడ్డలే చెడు వైపు నిలబడితే, అడ్డుకోవడానికి సర్వప్రయత్నాలూ చేస్తుంది. విఫలమైతే రౌద్ర మూర్తిగా మారి తానే బుద్ధి చెబుతుంది. టూకీగా ఈ తాత్వికతను చాటిచెప్పే పండుగే దసరా.
నవరాత్రులు..
సీమాంధ్రలో దసరా పండగను నవరాత్రులుగా చేసుకుంటారు. ఒక్కోరోజున ఒక్కోరకంగా దుర్గమ్మను అలంకరించుకుని మాతృమూర్తికి ప్రతిరూపంగా, చెడుపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా కొలుస్తారు. ప్రపంచీ కరణ ప్రభావానికి ముందు జీవం ఉన్న పండుగలను ప్రజలంతా మనసారా ఆస్వాదించే వాళ్లు.వేడుకలన్నీ కమర్షియల్‌ అయ్యాక ఆ మజా తగ్గిపోయింది. మనిషికీ, మనిషికీ మధ్య పోటీ ప్రపంచం దూరాన్ని పెంచింది. దాన్ని పండగలు కూడా దగ్గర చేయలేకపోతున్నాయి. ఇదంతా మనుషుల మీద పెట్టుబడి సాధించిన విజయం. మనుషులకూ, మమతలకూ మధ్య క్యాపిటలిష్టులు దూరం పెంచిన వైనం. కాలాన్ని కొంచెం వెనక్కి జరిపితే మనం కొన్ని ఆనంద సమయాలనూ, మరికొన్ని కళారూపాలనూ గుర్తుతెచ్చుకోవచ్చు.
విజయవాడలో కనకదుర్గ..
దసరా అనగానే విజయవాడ కచ్ఛితంగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కాస్త తీరు మారింది కానీ,గత కాలపు ఉత్సవాల్లో కళలకు ప్రాధా న్యత ఉండేది. తొమ్మిది దశాబ్దాల క్రితమే ఇంద్రకీలాద్రి కొండ మీద భేతాళ వేషాలు వేయడం..ఆడటం ఒక సంస్కృతిగా మొదలైంది. అంతరించిపోతున్న సామాన్యుల కళారూపాల్లో ఇదీ ఒకటి. అత్యంత క్లిష్టమైన ఈ కళాప్రక్రియలో కాళికాదేవి వేషం వేసుకుని, ఆడటం కత్తి మీద సాము లాంటిదే. ఆ రూపా నికి అవసరమయ్యే చేతుల బరువు పాతిక కేజీలు ఉంటుంది. వాటిని వీపుకు తగిలిం చుకుని తలపై కిరీటం పెట్టుకుని నృత్యం చేస్తారు. ఆ కళాకారులు పలికించే హావ భావాలు ఇప్పటి తరానికి ఏ ఓటీటీ తెర మీదా కనిపించవు. వెండితెర మీద డబ్బింగ్‌ సినిమా కాంతారాకు కలక్షన్ల వర్షం కురిపించాం. అలాంటి కళారూపాలు మనకూ ఉన్నాయనీ ఇప్పటికీ వాటి ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎవరికో కానీ తెలియకపోవడం విషాదం. తొంభై ఏళ్ల క్రితం బెజవాడలో ఈ బేతాళ వేషాలను బి. గురువులు, చంటీ మొదటగా వేశారు. ఇప్పటికీ వాళ్ల వారసులు ఆ వారస త్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా తోలుబొమ్మలాటతో మొదలుకుని బుర్రకథల వరకూ అనేక కళరూపాలకు ప్రదర్శనా వేదికలుగా ఒకప్పటి దసరా ఉత్సవాలు ఉండేవి.ఇప్పటికీ అరాకొరా వాటి ఛాయలు ఉన్నా ఆ స్థాయి ప్రభావం లేదు. ప్రభలు కట్టే సంస్క ృతి కూడా ఇక్కడ వైభవంగా సాగేది. ఎడ్ల బండ్లపై ఎంత ఎత్తుగా ప్రభను కడితే అంత గొప్పగా భావించేవాళ్లు. అందులో కాళికాదేవి వేషం కట్టి కూర్చునే మనిషి అచ్చంగా విగ్రహంలానే ఉండి ఆశ్చర్యపరి చేవారు. పీడిత ప్రజల నేత పుచ్చలపల్లి సుందరయ్య ఫోటోని పెట్టి ప్రభను కట్టిన చరిత్ర ఉంది. అత్యంత వైభవంగా సాగే ఈ సంస్క ృతి కూడా దాదాపు అటకెక్కేసింది.
తెలంగాణాలో బతుకమ్మ
%దసరానే కాదు. దసరా నవరాత్రుల్లో జరుపుకునే పండగల్లోనూ ఓ విశిష్టత ఉంది. ప్రకృతితో మమేకమయ్యే సజీవ సంబంధమేదో దాగుంది. మహిళలను గౌరవించుకునే పద్ధతి ఇమిడి ఉంది. తెలంగాణలో దేవీ నవరాత్రుల్లో భాగంగా జరుపుకునే బతుకమ్మ పండగ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బతుకమ్మ ‘పూల పండగ’, చెరువుల పండగ, మహిళల పండగ, పర్యావరణ పండగ. మరి కాస్త అర్థం చేసుకుని చెప్పాలంటే ప్రకృతి పండగ. మన అమ్మలకు, అక్కలకు, ప్రతి ఆడబిడ్డకూ కృతజ్ఞతలు తెలుపుకునే పండగ. ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండగ.
బతుకమ్మ పండగ సాధారణంగా భారతీయ కాలమానం ప్రకారం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ వేడుకను తొమ్మిది రోజుల పాటు సెలబ్రేట్‌ చేసుకుంటారు. ‘బతుకు’ ‘అమ్మ’ అనే పదాలే బతుకమ్మగా మారాయి. ఇందులో భాగంగానే మహిళలనూ, ప్రకృతినీ పూజించు కుంటారు. సాధారణంగా భారతీయ పూజా విధానాల్లో విగ్రహారాధన ఉంది. అందులో భాగంగా పూజ కోసం పూలను ఉపయోగి స్తారు. కానీ బతుకమ్మ విషయంలో మాత్రం పూలనే దైవత్వానికి ప్రతినిధిగా గుర్తించి పండగ చేసుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో గొప్ప జీవన విలువల్ని నేర్పే పాఠాలూ ఉన్నాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ,మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ,ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ,తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పండగ పూర్తవుతుంది. రోజుకో బతుకమ్మ చొప్పున చివరిరోజుకు చేరేసరికి ఒక రకమైన పరిపూర్ణత చేకూరుతుంది. చివరి రోజున సద్దుల బతుకమ్మతో దగ్గర్లోని చెరువుకి చేరతారు. అక్కడ ఆటపాటల మధ్యన బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చే క్రమంలోనూ మన మహిళల కళాత్మక నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది.
బతుకమ్మ పాటల్లోనూ ఒకరకమైన స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి పట్ల ప్రేమ,గౌరవం,ఆరాధనా కనిపిస్తూ ఉంటాయి. అవి సామాన్యుల జీవితాలకు దగ్గరగానూ, అందరూ కలిసి పాడుకునేందుకు వీలుగానూ ఉంటాయి.
అవన్నీ పల్లెల నుంచి పుట్టిన పాటలు..
శ్రామిక మహిళల నుంచి పుట్టిన పాటలు. ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎంపలీ చెట్టు కింద ఉయ్యాలో ఎల రేని కింద ఉయ్యాలో ఎప్పుడూ నీ నోము ఉయ్యాలో శ్రీ గౌరి దేవి ఉయ్యాలో చిన తల్లి నోమింది ఉయ్యాలో సిన తోటా వనము ఉయ్యాలో పెద తల్లి నోమింది ఉయ్యాలో పెద్ద తోటా వనము ఉయ్యాలో నా తల్లి నోమింది ఉయ్యాలో నందన్న వనము ఉయ్యాలో నందన్న వనమైతె ఉయ్యాలో నాకేమి కలుగు ఉయ్యాలో పెట్టెతో బియ్యమే ఉయ్యాలో పేటంచు చీర ఉయ్యాలో గోనెతో బియ్యమే ఉయ్యాలో గోరంచు చీర ఉయ్యాలో మొంటెతో బియ్యమే ఉయ్యాలో మొగ్గాలంగీలు ఉయ్యాలో ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి పువ్వొప్పుదూ గౌరమ్మ ఏమేమి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి కాయొప్పుదూ గౌరమ్మ గుమ్మాడి చెట్టు మీది యాట సిలుకాలాల పాట సిలుకాలాల కలికి సిలుకాలాల కందుమ్మ గుడ్డలు మమ్మ సిరి మేడలు రాను మూడడుగులు పోను మూడడుగులు సందప్పు జల్లులు సకినప్పు నీడలు నీడల్ల కనుగొంటినీ గౌరమ్మ
నీ నోము నే నోమితీ గౌరమ్మ
ఈ పండుగలో జమ్మిచెట్టుకి కూడా ప్రాధాన్యత ఉంది. జమ్మి కొండవాలుల్లో పెరిగే ఒక ముల్ల చెట్టు. దీంతో అనుసంధానమవడం కంటే ప్రకృతితో మమేకం అవ్వడం ఇంకేముంటుంది. జమ్మి చెట్టును పూజించుకోవడం కూడా ఈ పండుగలో ప్రధాన ఘట్టం.జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ విషయంలో కరీంనగర్‌ లాంటి ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో మరి కొంత విభిన్నమైన సంస్క ృతిని చూడొచ్చు.వయసు తేడాలను పరిగణనలోకి తీసుకోకుండా,ఇంట్లోని ప్రతి మహిళకూ జమ్మి ఆకును ఇచ్చి నమస్కరిస్తారు. అదీ కాక ఆడపిల్లలు తమ పుట్టింటికి కచ్ఛితంగా చేరే పండగ ఇది. బతుకమ్మకు పేర్చే పూలను చూసుకున్నంత అపురూపంగా, గౌరవంగా, మర్యాదగా వాళ్లని చూడమనే బతుకమ్మ చెప్పేది.
పిల్లల సందడి
అది ఏ పండగైనా కానివ్వండి.ముందుగా వెలిగిపోయేది పిల్లల మొహాలే.సెలవులకు వారం రోజులు ముందుగానే, పిల్లల్లో ఆ ఆనం దం కనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మల ఇళ్లకు, నానమ్మలకు ఇళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఎదురుచూపులు ఉండేవి. స్కూల్‌ ఒత్తిళ్లకు కాస్త విరామమిచ్చి పల్లె వాతావరణపు మట్టిగాలినీ, ముందుతరాల ప్రేమలనీ గుండెల నిండా నింపుకునే అవకాశం ఉండేది.పండగ అంటే ఊరంతా కలిసి జరుపుకునేది.వీధుల్లో జరుపుకునేది.నవ్వుకుంటూ,తుళ్లుకుంటూ ఆలింగనాల మధ్య జరుపుకునేది.కానీ ఇప్పుడు తీరు మారిపోయింది. పిల్లలంతా అపార్ట్‌ మెంట్‌లో చిక్కుకుపోయారు. మన బతుకుల్లానే పండగ కూడా ఇరుకైపోయింది. ముందు తరం వరకూ అయినా కాస్తోకూస్తో అసలైన పండగ శోభను చూసి ఉన్నారు. బొమ్మల కొలువులు పెట్టుకుని, స్నేహితులతో ఆడిపాడి ఉన్నారు. ఇప్పుడంతా పబ్జీలు, ఫ్రీఫైర్‌ల కాలమొచ్చేసింది. బొమ్మల కొలువు కమ్యూనికేషన్‌ని పెంచితే, స్మార్ట్‌ఫోన్‌ ఆటలు కళ్లను డ్యామేజ్‌ చేస్తున్నాయి.
పిండి వంటలు
పండగ అంటే సంస్క ృతీ,సాంప్రదాయం,కళలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. వాటన్నింటితో పాటు పిండి వంటలకూ ప్రత్యేక స్థానం ఉంది. ఒక తమిళ సినిమాలో హీరో విజరు ’’కప్పు ముఖ్యం బిగిలు’’ అన్నట్టు పండుగకు ’’పిండి వంటలు’’ ముఖ్యం.పిల్లలకు సెలవులు ఇవ్వగానే, టౌన్‌లూ,సిటీలూ టిక్కెట్టేసుకుని సొంత ఊళ్లకు చేరిపోయేవాళ్లు. అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఒక్కో ఇంటి పిండివంటలనూ చేసుకునేవాళ్లు. ఏడాది పాటు జీవితాల్లో జరిగిన కష్టాలకూ, నష్టాలకూ, సుఖాలకూ, దు:ఖాలకూ షేరింగ్‌ పాయింట్‌ అదే. ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్టేటస్‌ పెడితే చూసే కాలం.మనుషులంతా సంతోషాలను తెర మీదా,బాధలను గుండె లోపలా దాచుకుంటున్న కాలం. పిండి వంటల సంగతి స్విగ్గీ,జొమోటో,స్వగృహా ఫుడ్స్‌ చూసుకుంటున్నాయి.ఆర్డర్‌ చేసాక, డెలివరీ బారు తెచ్చిచ్చే, కేజీ అరిసెలంత తీపిదనం కూడా లేని పండగను సెలబ్రేట్‌ చేసుకునే హడావుడిలోకి చేరిపోయాం.
దసరా మామూళ్లు
నిజానికి దసరా మామూళ్లు ఒక ఎమోషన్‌. ఒకరి సాయం లేకుండా ఎవరూ తమ బతుకుబండిని లాగలేరనేది వాస్తవం.అది ఇల్లు కావొచ్చు,ఆఫీస్‌ కావొచ్చు, పొలం కావొచ్చు మరేదైనా కావొచ్చు. హెల్పర్లు లేకపోతే ముందుకు నడవాల్సిన పని వెనక్కే నడుస్తుంది. వాళ్లని గౌరవించుకోకపోతే,ఒక మనిషి తనని తాను గౌరవించుకోనట్టే అవుతుంది. ఇలా పండగల సందర్భంలో తమ హెల్పర్లకు మూమూళ్లు ఇవ్వడం ఒక మనిషి తనకు తాను ఇచ్చుకునే మర్యాదే అవుతుంది. ఒకప్పుడు దసరా వస్తుందంటేనే పనివాళ్ల మొహాలన్నీ కళకళలాడుతుండేవి. ఇప్పటికీ ఈట్రెండ్‌ కొనసాగుతున్నా కొద్దిపాటి మార్పులొచ్చాయి. డిజిటల్‌ ఇండియా అట్టడుగు స్థాయి వర్కింగ్‌ క్లాస్‌ వరకూ ఇంకా పూర్తిగా చేరనేలేదు. మరో పక్క పైస్థాయి వర్కింగ్‌ క్లాస్‌ ఉద్యోగులు చెల్లిం పులన్నీ డిజిటల్‌ మయమైపోయాయి. ఇదే అవకాశం అనుకుని, మూమూళ్లకు ఎగనామం పెడుతున్న మహానుభావులూ పెరిగిపోయారు. తప్పదన్నట్టూ, వదిలించుకోవాలన్నట్టూ ఎంతో కొంత సమర్పించుకునేవాళ్లూ ఎక్కువైపోయారు. హృదయంతో మామూళ్లిచ్చే కాలం వెళ్లిపోయి చాలా కాలమే అయింది.
పలచనవుతోన్న కళ..
ఇప్పుడు ఏ పండగలోనైనా సాంప్రదాయకళల సందడి తగ్గింది. హడావిడి పెరిగింది.. ఆదరణ సన్నగిల్లింది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒంగోలు ‘కళారం’ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నా ఆ శోభ తగ్గిపో యింది. తూతూ మంత్రంగా లాగించడమే తప్ప గౌరవమూ, ఆసక్తి సన్నగిల్లిపోతున్నాయి. మచిలీపట్నం కాళికానృత్యం పరిస్థితీ ఇంతే. అత్యంత కళాత్మకమైన ఆ నృత్యానికి అప్పటి ఆదరణలో పదోవంతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఆకాశాన్ని తాకే వీరవాసం ఏనుగు సంబరాలు ఇప్పుడు పూర్తిగా నేల మీదే ఉన్నాయి. ఇక దసరా వేషాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు వీటికి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. వేషం కట్టి ఇంటింటికీ తిరిగి తమ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం మీ దగ్గర ఒక భూతద్దం ఉంటే తీసి వెతకండి. ఒకరో ఇద్దరో కనిపించొచ్చు. పోనీ మీ యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి చూడండి. అతి తక్కువ వ్యూవ్స్‌తో ఏదో ఒక మూలన కనిపించొచ్చు.ఇది మనం సమూలంగా దసరాను గుర్తుచేసుకోవాల్సిన సమయం.అసలైన దసరా అంటే ప్రకృతిని గౌరవించడం.అసలైన దసరా అంటే మహిళలను గౌరవించడం.అసలైన దసరా అంటే కళలను గౌరవించడం. అసలైన దసరా అంటే అదంతా అందరూ కలిసే ఒక సరదా.(ప్రజాశక్తి సౌజన్యంతో..) – (రావి నేహ)

కొత్త బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలి

ఆసియన్‌ పీపుల్స్‌’మౌవ్‌మెంట్‌ ఆన్‌ డెబ్‌ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏపీఎండీడీ`Aూవీ ణణ) పిలపు మేరకు గ్లోబల్‌ వీన్‌ ఆఫ్‌ యాక్షన్‌ 10-20సెప్టెంబర్‌ వరకు ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు తవ్వకాలు నియంత్రించి, కొత్త చేపట్టబోయే తవ్వకాలను నిలిపి వేయా లని డిమాండ్‌ చేస్తూ ఏపీ అల్లూరి సీతారా మారాజు జిల్లా బొర్రా గుహలు,కటికి, అరకువ్యాలీ వంటి పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువకులతో కలసి ర్యాలీ నిర్వహిం చారు.బొగ్గు తవ్వకాలు ఆపాలి,భూగర్భలో ఉన్న ఇంధన వనరల వెలికితీత తగ్గించాలి, సోలార్‌ వినియోగం పెంచాలి,ప్రతిచోటా విండ్‌ పవర్‌ ప్లాంట్స్‌,మైక్రో హైడల్‌ పవర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేయాడెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను – గునపర్తి సైమన్‌

బంగారు భవితకు బాట

దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. యూత్‌కు ఉన్న బలం, అంకితభావం ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. సమాజానికి ఉపయోగపడేలా తమ కార్యాచరణ ఉండేలా యోచిస్తుంది. అటువంటి యువతకు ప్రపంచీకరణ ఆధునిక కాలం ఎన్నో సవాళ్లు విసురుతోంది. అయినా పుంజుకుని ముందుకు వెళ్లేందుకే చూస్తోంది. ఉపాధి అవకాశాలు, సరైన నైపుణ్యాలు లేక వెనకబడుతున్నారే తప్ప, ప్రకృతి విపత్తులు, ఆపదల వచ్చినా ముందుకు వచ్చేది యువకులే. అందుకే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అవరోధాలు దాటి, విజయాలెన్నో సాధిస్తారు.
దేశానికి నిజమైన సంపద బంగారు గనుల్లో, అద్దాల మేడల్లో,అందాల నగరాల్లో కాదు.. యువతలో ఉందని- అటువంటి యువశక్తిని సక్రమంగా వాడుకుంటే దేశం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందనే స్వామి వివేకా నంద మాటలు నిత్యసత్యం.యుక్త వయ స్సులో ‘ఏదైనా సాధిస్తాం.ఎంతటి కష్టాన్నైనా ఛేదిస్తాం.మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి.అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాం’ అనేలా యువత ఉం టుంది. కొంగొత్త ఆలోచనలు పుట్టేది కూడా ఈ వయస్సులోనే. పిల్లల్ని పెంచేది తల్లిదం డ్రులే అయినా వారికి విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిచేలా చేసేది ఉపాధ్యా యులు. విజ్ఞానంతో బయటకు వచ్చిన యువతకు నైపుణ్యాలు నేర్పించి-వారిని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా చేసుకునే బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వాలదే.
నిధులు లేక
ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్ర మాలను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నెహ్రూ యువజన సంఘాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. నిరక్షరా స్యత నిర్మూలన, సామాజిక చైతన్య కార్యక్ర మాల్లో పాల్గొనే యువతకు ఆదరణ కరువైంది. గతంలో గ్రామాల్లో వివిధ రకాలశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నింపే కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు అటువంటి చర్యలు కనిపించడం లేదు. దాంతో యువత ఉపాధి హామీ,వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. పాలకులు సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో యువతలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది.ఇది భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే కొత్త జిల్లాల్లో యువజన సంఘాల ఏర్పాటు చేసి-ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.సామాజిక దృక్పథం పెంపొందించేందుకు వారిలో చైతన్యం కల్పించి-విద్య,ఉద్యోగ సాధనలో నైపుణ్య వికాసం నింపేలా శిక్షణ ఇవ్వాలి. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్లే గ్రామాల్లో ప్రోత్సాహం లేక ప్రాథమిక స్థాయిలో నిలిచిపోతున్న క్రీడామణులు ఉంటారు. వారిని గుర్తించి ప్రోత్సహించాలి.వారికి కావలసిన ఆట వస్తువులు సరఫరా చేయాలి.సమాజావృద్ధిని కాంక్షించేలా యువజన సంఘాలను బలోపేతం చేయాలి.
రాజకీయాల్లోనూ..
యువతీ, యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి తమ గొంతును వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన శిరీష-డిగ్రీ చదివినా ఉద్యోగం – (పద్మావతి)

సమ్మిళిత ఆర్ధిక వృద్ధికి ఆలంబన

సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధానంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. – (ఎం. సునీల్‌కుమార్‌)
ఇండియాలో బ్యాంకింగ్‌ సేవలు ఇంతగా విస్తరించడానికి 47ఏళ్లు పట్టేది.జన్‌ధన్‌వల్ల ఆ ప్రగతి అత్యంత వేగంగా వాస్తవ రూపం దాల్చింది.అని బ్యాంక్‌ ఆప్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ పరిశోధకుడు కితాబునిచ్చారు. దానికి గర్వించడంతోపాటు సరిదిద్దుకోవాల్సిన వ్యవస్థాగత లోపాలూ కొన్ని ఉన్నాయి. జనధన్‌ తదనంతరం అంతవరకూ వెళ్లని ఊళ్లలోకి బ్యాంకులు అడుగు పెట్టాయి.2013లో దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు శాఖలు దాదాపు1.06లక్షలు,2023కు అవి 46శాతం అధికమయ్యాయి.ఏటీఎంల సంఖ్య సైతం 30శాతం మేరకు పెరిగింది.కానీ, లావా దేవీలేమీ జరగని బ్యాంక్‌ ఖాతాలు ఎక్కువగా ఉండటమే విస్మయకరం!దేశంలో మొత్తం ఖాతాల్లో అటువంటివి 35శాతం వరకు ఉంటాయని ప్రపంచబ్యాంకు క్రోడికరించిన గ్లోబ్‌ ఫిన్‌డెక్స్‌ డేటా బేస్‌ వెల్లడిర చింది.అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే ఇది ఏడు రెట్టు ఎక్కువ!జన్‌ధన్‌ ఖాతాల్లోనూ నిష్క్రియమైనవి 20శాతం దాకా ఉంటాయని అంచనా.అందుకు కారణాలేంటో అన్వేషించడంతోపాటు పీఎంజేడీవై ప్రధాన లక్ష్యమై న ఆర్ధికఅక్షరాస్తను పెంపొందించడం మరో సవాలు. ఆర్బీఐ నివేదిక ప్రకారం,గడిచిన పదేళ్లలో దేశీయ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ. 5.3లక్షలకోట్లు.సైబర్‌ నేరాల ఉధృతికి ప్రభుత్వాలు అడ్డు కట్టవేస్తేనే`ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుం ది.డిజిటల్‌ ఆర్ధికవ్యవస్థ పురోగతీ శ్రీఘ్ర తరమ వుతుంది.
సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11,12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.11వ పంచవర్ష ప్రణా ళిక సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రాలకు నిర్దేశిం చింది.దీనిలో భాగంగా పేదరికంతగ్గించి,ఉపాధి కల్పనను పెంచి సత్వర వృద్ధి సాధించడం, విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందిం చడం,విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధి కారతను సాధించడం,ద్వారా ఉపాధిని విస్తరిం చడం,పర్యావరణ కొనసాగింపు సాధించడం, లింగ వివక్షతను తగ్గించడం, పాలనలో మెరుగు దలను తీసుకురావడం వంటి అంశాల్లో దృష్టిని సారించింది.పై వాటిని సాధించడానికి వ్యవసాయ రంగంలో4శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 10-11శాతం వృద్ధిని,సేవారంగంలో 9-11 శాతం వృద్ధిని సాధించాలని వాటి ద్వారా ప్రణాళి కలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యమైన 9శాతం వృద్ధిని సాధించాలని నిర్ణయించారు.సమాచార సాంకేతిక రంగంలో విశిష్టమైన అభివృద్ధిని సాధించాం. సాఫ్ట్‌ వేర్‌ పరిక్షిశమ బాగా వృద్ధి చెందింది. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి ‘ఇంటిక్షిగేటెడ్‌ యాక్షన్‌ప్లాన్‌ను దేశం లోని 60 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
11వ ప్రణాళికలో వివిధ పథకాల్లో భాగంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే పేదరి కపు రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని 2007 లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడానికి ‘ఆమ్‌ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ప్రారం భించారు. దీనికి చెల్లించే ప్రీమియం రూ.200. దీని నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించారు. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పిం చడానికిగాను ‘ఉజ్వల’పథకాన్ని ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవ డానికి దేశంలో వేతన ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. పైవాటితో పాటుగా ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్‌షిప్‌ పథకాలను అమలు చేసింది.దీనిలో భాగంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’ జాతీయ హార్టికల్చర్‌ మిషన్‌,సత్వర నీటి పారుదల ప్రయో జన పథకం గ్రామీణ తాగునీటి సదుపాయం, రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ, ఇందిరా ఆవాస్‌ యో జన,సర్వశిక్షా అభియాన్‌,మధ్యాహ్నభోజన పథకం, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వృద్ధిని సాధించడంతోపాటు దాన్ని సమాజంలో అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి అందించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్య మవుతుంది. సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధా నంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవా భివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
భారత ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధిని 9 శాతానికి పెంచాలని పేర్కొన్నది. వ్యవసాయరంగంలో 4శాతంవృద్ధిని,పారిక్షి శామిక రంగంలో 9.5శాతం వృద్ధిని,సేవారంగంలో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించింది.మొత్తం మీద ప్రణాళికలో వృద్ధిని 9-9.5శాతం వరకు సాధిం చాలని నిర్ణయించింది.
హరిత ఆర్థికం సమ్మిళితమేనా?
హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాట పడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులనుబీ రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా విద్యుత్‌ను, పరిశ్రమలలో శిలాజ ఇంధనాలకు మారుగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ చురు గ్గా చర్యలు చేపడుతున్నాయి.అడ్డూ అదుపు లేకుం డా భూతాపం తీవ్రమవుతుండడం, తత్పర్య వసానంగా వాతావరణ వైపరీత్యాలకు కారణమ వుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు, ఇంధన వ్యవస్థలు,రవాణా రంగం,వస్తూత్పత్తి కార్య కలాపాలలో చోటు చేసుకుంటున్న మౌలిక మార్పు లు దోహదం చేయగలవని ప్రభుత్వాలు ఆశిస్తు న్నాయి. హరిత ఆర్థికవ్యవస్థ దిశగా ప్రపంచ దేశాలు మరింత వేగంగా,సమస్యను పరిష్కరిం చేందుకు అవసరమైన బృహత్‌ చర్యలతో పురోగ మించవలసి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ,ఉత్పాదక కార్యక లాపాల నిర్వహణ) విధానాలు,పద్ధతులు ఎలా ఉండనున్నాయి? అవి హరిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల పరిపూర్తికి తోడ్పడుతాయా? సహజ వనరులను ఉపయోగించుకోవడంలో మనం అనుసరిస్తున్న పాత పద్ధతులలో స్వతస్సిద్ధంగా పలు సమస్యలు ఉన్నాయి. ఇవి సామాజిక, పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా,మరింత కచ్చితంగా చెప్పాలంటే విధ్వంసకరంగా ప్రభావితం చేస్తున్నందునే హరిత ఆర్థిక కార్యకలాపాలలో సైతం మనం పాటించే పద్ధతుల గురించి ప్రశ్నించడం అనివార్య మ యింది. ఖనిజాల వెలికితీతనే తీసుకోండి% బొగ్గు, ఇనుము,అల్యూమినియం మొదలైన ఖనిజాలు మన ఆర్థికవ్యవస్థలకు మౌలిక అవసరాలు. అయితే భూగర్భం నుంచి వాటి వెలికితీత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది.భారత్‌లో ఈముడి పదార్థాలు అడవుల కింద,వన్యప్రాణుల ఆవా స ప్రదేశాలలోను,గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. పర్యావరణ భద్రతకు, ప్రజా శ్రేయస్సుకు హాని వాటిల్లకుండా ఆ సహజ సంపదను ఉపయోగిం చుకోవడం ఎలా? ఇదొక విపత్కరమైన పరిస్థితి. వనరుల విపత్తు అనేది సంపద్వంత భూములు, పేద ప్రజలకు సంబంధించిన సమస్య. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఖనిజాలను సమ కూర్చుకునేందుకు మనం అడవులను నరికివే స్తున్నాం.స్థానిక జనసముదాయాలను నిర్వాసితు లను చేస్తున్నాము.ఖనిజాల వెలికితీత అనేది మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనాలో చాలా కీలకమైన కార్యకలాపం. దానివల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతున్నది.

1 5 6 7 8 9 75