చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే

మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గావ్‌లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్‌, వాల్వేకర్‌, దియోరావ్‌ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్‌ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్‌ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్‌ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్‌ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్‌ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే.
సంస్కరణ వాది..
సావిత్రి బాయి ఏర్పరుచుకున్న బోధనా పద్ధతి సమ్మిళిత స్వభావంగా,విద్యార్థిని భాగస్వామిని చేసేలా వినూత్నంగా ఉండేది. విద్య ద్వారా విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడాన్ని ఆమె ప్రోత్సహించేది.11 ఏండ్ల ముక్తా బాయ్‌ అనే సావిత్రి బాయ్‌ దళిత శిష్యురాలు మాంగ్‌ లు, మహర్‌లు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలు-బాధలపై1855లో ధ్యానోదయ అనే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాసింది. వివిధ అంశాలపై దళిత మహిళలు రాసిన రచనల్లో బహుశా దీన్ని తొలిరచనల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. సావిత్రి బాయి సామాజిక మార్పును అట్టడుగు స్థాయి నుంచి తీసుకురా వడానికి ప్రయత్నించారు. దీనికి అనుగుణంగా ఆమె ఆ కాలంలో అమల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లను, సంప్రదాయాలను నిశితంగా విమర్శించేవారు. శూద్రులకు ఆమె స్వయంగా బావులను ఏర్పరిచింది. సంస్కరణవాది అయిన జ్యోతిరావ్‌ ఫూలేతో కలిసి కులవ్యవస్థపై సమూ లంగా పోరాటం చేసింది. కులాంతర వివాహా లను ప్రోత్సహించి,ఆ విధంగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఆశ్రయం కల్పించేవారు.సావిత్రి బాయి సాహిత్య గ్రంథాల్లో కావ్య ఫూల్‌(కవిత్వ నవవికాసం),బావన్‌ కాషీ సుబోధ్‌ రత్నాకర్‌ (రత్నాల సంద్రం) తదితర రచనలు ఆమెలోని సృజనాత్మక ఆలోచనలు, సామాజిక చింతనలను మేళవింపుగా ప్రతిబింబిస్తాయి. అణగారిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం, తద్వారా వారి విమోచనకు పాటుపడటం, ఆంగ్లవిద్య ప్రాముఖ్యాన్ని పేర్కొనడం, సంప్రదా య దురాచారాలు,అహేతుక విలువలను సవాలు చేయడం, వితంతువులకు పునర్వి వాహాలను,కులాంతర వివాహాలను ప్రోత్సహిం చడం,దళితులకు మంచినీటి బావులు అందు బాటులో ఉంచడం, మహిళలకు అను కూలం గా ప్రజాజీవనంలోని వ్యక్తిగత-బహిరంగ సంద ర్భాల్లో తనగొంతు వినిపించడం, ఇతర మతా లకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండటం సావిత్రిబాయి దృ క్పథం. – (చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే మహాపరినిర్వాణ దినం మార్చి 10)
-మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గావ్‌లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్‌, వాల్వేకర్‌, దియోరావ్‌ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్‌ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్‌ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్‌ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్‌ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్‌ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే. –(శామ్యూల్‌ రాజ్‌)

గీతం న్యాయ అవగాహన సదస్సు

భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు,బాధ్యతలు పౌరులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. భారత ప్రభుత్వన్యాయ మంత్రిత్వ శాఖ,న్యాయ విభాగం,గీతం స్కూల్‌ ఆఫ్‌ లా మరియు భోపాల్‌లోని న్యాయగంగ ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సు మార్చి 9న గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. నీ సదస్సును రవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన న్యాయ విద్యార్థులను ఉద్దేశించిప్రాధిమికంగా పౌరుల తెలుసుకోవలసిన న్యాయ పరమైన అంశాలు, పౌరుల బాధ్యతలు అనే అంశంపై సమత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు రవి రెబ్బాప్రగడ ప్రసంగించారు.స్వేచ్ఛా,స్వాతంత్య్రపు హక్కు,మతస్వాతంత్య్ర హక్కు లాంటి సంప్రదాయ హక్కులతోపాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు,పీడనాన్ని నిరోధించే హక్కు,విద్యా,సాంస్కృతిక హక్కులు సైతం ప్రాధమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదని తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాధమిక హక్కులుపేర్కొంటున్నాయని గుర్తిచేశారు. తర్వాత సమత సుప్రీం కోర్టు సాధన,ఆదివాసీల వనరులు పరిరక్షణ కోసం సమత చేసిన కృషి,ఐదోవ షెడ్యూల్‌లో గిరిజనుల వనరులు,భూమి హక్కుల పరిరక్షణకు జడ్జెమెంట్‌ ఏవిధంగా కాపాడు తుందనే అంశాలను విద్యార్థులకు వివరించారు. తర్వాత న్యాయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నివృత్తి చేశారు. మధ్యాహ్నాం జరిగిన సదస్సులో సిబిఐ విశ్రాంతి ఐపిఎస్‌ అధికారి వి.వి.లక్ష్మి నారాయణ సైబర్‌ నేరాలు వాటిని నియంత్రించే చట్టాలు అనే అంశంపై ప్రసంగించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అనితారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంర్భంగా న్యాయ అవగాహన పై వివిధ నినాధాలు, సచిత్ర అంశాలతో ఎగ్సిబిషన్‌తో పాటు న్యాయ అంశాలపై క్విజ్‌ పోటీ నిర్వహించారు. సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్ధులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను చైతన్య పరిచేదిగా ఉంది. న్యాయ వృత్తిలో పాటించాల్సిన మెలకవులపై విద్యార్ధులకు ప్రాక్టికల్‌ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసరన బి.అనితారావు తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ లా అధ్యాపకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. – ` సైమన్‌ గునపర్తి

విద్యావంతుల విజ్ఞతనే సవాలు చేస్తారా?

‘ఈ శాసనమండలి ఎన్నికలు సెమీ ఫైనల్స్‌’… ఈ మాటలు అన్నది వైఎస్సార్‌సిపి అగ్రనేతల్లో ఒకరైన వై.వి.సుబ్బారెడ్డి.జగన్‌ కూడా తమ పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలలో సర్వశక్తులూ ఒడ్డి పని చేయమని ఆదేశించారు. శాసన మండలిలో ప్రతీ రెండేళ్ళకూ మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతూంటాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికలు జరుగుతూంటాయి. ఈ ఎన్నికల్లో ఓటు చేసేవారు సాధారణ ఓటర్లు కారు. కొన్నింటికి కేవలం ఎమ్మెల్యేలే ఓటర్లు. కొన్నింటికి స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ఓటర్లు. కొన్నింటికి ఉపాధ్యాయులే ఓటర్లు. మరికొన్నింటికి పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న పట్టభద్రులు పది లక్షలమంది సుమారుగా ఉంటారు.ఈ విధం గా చాలా పరిమితమైన పరిధిలో ఓటర్ల అభి ప్రాయాలు వ్యక్తం అయ్యే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ ఎలా అవుతాయి? అదే ఏవో కొన్ని శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా లేక లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా అక్కడ అన్ని తరగతులకూ చెందిన ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ శాసన మండలి ఎన్ని కలలో ఆ విధంగా వ్యక్తం కాదు. అయినా వైసిపి నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. ఏమిటి కారణం? వీటిలో ఎమ్మెల్యే కోటా లోని సీట్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న బలా బలాలను బట్టి అన్నీ వైఎస్సార్‌సిపి కే దక్కు తాయి. స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావలసిన స్థానాలూ ఆ పార్టీకే దక్కుతాయి. ఇక గవర్నర్‌ నామినేట్‌ చేసేవి ఎటూ పాలకపార్టీ సిఫార్సు ఆధారంగానే భర్తీ అవుతాయి గనుక అవీ అధికార పార్టీవే. ఇక మిగిలిపోయినవి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలు, మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు. వీటి విష యంలో వైసిపి ఈ మారు ఎందుకింత ఉలికి పడుతోంది? పట్టభద్రుల స్థానాల్లో కూడా రాజకీయ పార్టీలు పోటీ పడవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు. కాని అధికారంలో ఉన్న పార్టీ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఓటర్లు గౌరవిస్తారు కాని ఇలా అన్ని విలువలనూ గాలికి వదిలి చౌకబారుతనంగా,అడ్డగోలుగా దిగజారిపోతే ఆ విద్యావంతులు,మేధావులు అయిన ఓటర్లు ఈసడిరచుకుంటారన్న కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోవడం చూస్తే కొంత జాలీ,కొంత ‘అది’కలుగుతోంది.
కనీస విద్యార్హతలు కూడా లేనివారిని ఓటర్లుగా చేర్చేశారు. అంటే అచ్చంగా విద్యావంతు లైనవారే ఓటర్లుగా ఉంటే తాము గెలవడం సాధ్యం కాదు అని అధికార పార్టీ ఎన్నికలకు ముందే ఒప్పేసుకుందన్నమాట! అబ్బే, అటు వంటిదేమీ కాదు అని వైసిపి చెప్పదలచుకుంటే అర్హత లేని ఓటర్ల పేర్లు తొలగించడంలో తామే ముందుండి వ్యవహరించి వుండాలి. ఎందుకు అలా చేయలేకపోయింది? కనీస స్థాయిలో కూడా నైతిక స్థైర్యం లేని దుస్థితిలో ఆ పార్టీ ఎందుకుంది? వలంటీర్ల వ్యవస్థ స్థాయిలో మొదలుపెట్టి అత్యున్నత స్థాయి అధికారుల వరకూ అందరి అధికారాలనూ ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎంతో ప్రఖ్యాతి కల ఆంధ్రా యూనివర్సిటీకి ఉపకులపతి హోదాలో ఉండడం అంటే ఎంత ప్రతిష్టా త్మకమైన విషయం! అటువంటి స్థానంలోని వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అధికారపార్టీ అభ్యర్ధికి ప్రచారం నిర్వహించా రంటే వైసిపి దిగజారుడు అధ:పాతాళానికి పోయిందని వేరే చెప్పాలా? అధికార పార్టీ తరఫున కులసంఘాల పేరుతో ప్రచారం జరిగిపోతోంది. డబ్బు విచ్చలవిడిగా వెదజల్లి, కానుకల పేరుతో ప్రలోభపెట్టి ఓటర్లను లొంగదీసుకోవాలన్న పథకాలు అమలులో పెడుతున్నారు. అంటే ఓటర్ల విద్యాస్థాయి పట్ల, వారి మేధో స్థాయి పట్ల పాలక పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలిసిపోతూనే వుంది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అందుకు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చొరవ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో గాని, ఆ తర్వాత గాని ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలలో అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పట్ల, సమా జంలోని విద్యావంతుల పట్ల, వారి అభిప్రా యాల పట్ల తనకెంతో గౌరవం ఉందని, తమ పార్టీని విమర్శించినా,వాటిని సలహాలుగానే స్వీకరిస్తానని ఆయన అన్నారు. ఆ కాలంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాబోటివారు చెప్పిన సలహాలను అన్నింటినీ ఆయన అమలు చేశాడని చెప్పను. చాలా సలహాలను ఆయన అమలు చేయలేదు కూడా. కాని సలహాలను, సూచన లను, విమర్శలను వినే సహనాన్ని ఆయన ప్రదర్శించారు. ఆ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని తిరుగుతూ, ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్న వైసిపికి, ఆ పార్టీ అధినేతకు మాత్రం ఆ అధినేతకున్న సహనంలో వెయ్యో వంతు కూడా లేదు.2019లో అధికారం చేపట్టాక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా ఎన్నిసార్లు సమావేశాలు జరిపారు? ఎన్నిసార్లు వారి అభిప్రాయాలను విన్నారు? ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉం డాలంటారు. ఇదేనా ఆదర్శం?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జగన్‌ ప్రభు త్వంలోని ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులను కలుసుకోడానికి గాని, వారి వినతి పత్రాలను స్వీకరించడానికి గాని సిద్ధంగా లేరు. జగన్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగలేదు. విద్యార్థి, యువజన,మహిళా,నిరుద్యోగ సంఘాల ప్రతి నిధులను ఒక్కసారి కూడా చర్చలకు పిలిచింది లేదు. రైతుల గురించి చాలా కష్టపడిపోతు న్నట్టు ప్రకటించుకునే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సంఘాలతోగాని, రైతుకూలీ సంఘాలతో గాని, దళిత సంఘాలతోగాని ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖాముఖి చర్చలు జరిపిందా? ఇది కూడా గత ప్రభుత్వం మాదిరి ముందస్తు అరెస్టుల ప్రభుత్వమే తప్ప ముందస్తు చర్చల ప్రభుత్వం ఎంతమాత్రమూ కాదన్న సంగతి అందరికీ తేటతెల్లం అయిపోయింది. అదానీలకు, అంబానీలకు రాష్ట్రంలోని పరిశ్రమ లను, భూములను కట్టబెట్టే పనిలో చాలా జోరుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది. అందుకే రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేస్తానని మోడీ ప్రభుత్వం ప్రకటించినా,అసెంబ్లీలో ఒక తీర్మా నాన్ని చేయడం మినహా ఇక చేసిందేమీ లేదు.రాష్ట్ర ప్రజానీకపు మనోభావాలను ప్రతిబిం బించే విధంగా ఒక అఖిల పక్ష బృందాన్ని ఎందుకు ఢల్లీి తీసుకుపోలేక పోయారు? ఎందుకు అన్ని సందర్భాలలోనూ బిజెపికి అనుకూలంగా పార్లమెంటులో వైసిపి ఎంపీలు ఓటు చేస్తు న్నారు? విద్య, వైద్యం,విద్యుత్తు, ముని సిపల్‌ తదితర రంగాలలో మోడీ ప్రభుత్వం ఏం చెప్తే దానికల్లా తలాడిరచి అమలు చేస్తు న్నారు. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్వయంప్రతిపత్తి ఏమిటి? ఇదిగో ఇటువంటి విషయాలను శాసనమండలిలోను, వెలుపల లేవనెత్తుతున్నారు గనుకనే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలంటే అధికార పార్టీకి అంత అక్కసు, గుండెల్లో అంత గుబులు. అందుకే కక్షగట్టి ఈ పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఎలాగై నా గెలవకూడదన్న దుగ్ధతో అన్ని విలువలకూ తిలోదకాలిచ్చేశారు. అడ్డగోలు దోవలు తొక్కుతు న్నారు.వైసిపి,దాని అధినేత ఒక్క విషయం మరిచిపోయినట్టు ఉన్నా రు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.ఆతర్వాత భారత రాజ్యాంగం వచ్చిం ది. ఆతర్వాతనే ఈ అసెంబ్లీ, పార్లమెంటు వచ్చాయి. ఎమర్జెన్సీ వంటి అత్యం త నిరంకుశ చర్యలనూ ఓడిరచనది ప్రజాఉద్య మాలే. చివరికి సైనిక పాలన పెట్టినా, దానిని కూల దోసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పా లంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. ప్రజాఉద్యమాలను, ప్రజా సంఘాలను అణగదొక్కజూసిన ప్రతీ నాయకుడూ కాలగర్భంలో కలిసి పోయాడు. కాని ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి. అవి ప్రజ ల్లోంచి, ప్రజల కోసం పుట్టుకొచ్చినవి. అధికార దాహం లోంచి పుట్టినవి కావు. వాటి ప్రతినిధు లు శాసనమండలిలో సభ్యులుగా ఉండడం శాసన మండలికే గౌరవాన్ని ఇచ్చింది, ఇస్తుంది. డబ్బు పంచిపెట్టకుండా, కానుకలు పంచిపెట్ట కుండా, కులం,మతం వంటి అంశాల ప్రస్తా వనలు తేకుండా,ప్రచారార్భాటానికి పోకుండా ఓటర్ల విజ్ఞత మీద సంపూర్ణ గౌరవంతో తాము గెలిస్తే ఆ ఓటర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపిస్తామని మాత్రమే హామీ ఇస్తూ ఓట్లిమ్మన మని అడగగలిగే నైతిక స్థైర్యం ఉన్నది కేవలం ఒక్క పిడిఎఫ్‌ అభ్యర్ధులకు మాత్రమే. గెలిచాక తాము ముందస్తుగా ప్రకటించిన విధానాలకు, విలువలకు పూర్తిగా కట్టుబడి నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తూ మాట దక్కించుకోగలుగు తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. ప్రజాస్వా మ్య విలువలను, ప్రజా తంత్ర వ్యవస్థను బలం గా నిలుపు కోవాలంటే ఈ తరహా ప్రజాప్రతి నిధులే కావాలి అని ఓటర్లు భావించేలా వ్యవహరిస్తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. పిడిఎఫ్‌ అభ్యర్ధుల మీద కక్ష గట్టి వ్యవహరిం చడం అంటే అది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమే. అటు వంటి ద్రోహానికి పాల్పడు తున్న వైసిపికి ఈ ‘సెమీ ఫైనల్స్‌’’లో గట్టిగా గుణపాఠం నేర్పడానికి మన రాష్ట్రంలోని విద్యావంతులకు, మేధావులకు వచ్చిన మంచి అవకాశం మార్చి 13న జరగ బోయే ఉపాధ్యా య,పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు. ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసు కుందాం.! (వ్యాసకర్త : పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..)- (ఎం.వి.ఎస్‌.శర్మ)

విజయవంతంగా గ్లోబల్‌ సమ్మిట్‌ `2023

విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ క్రీడా మైదానంలో మార్చి 3,4వ తేదీల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తం రూ.13 లక్షల41వేల 734కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొ న్నారు. దీని వల్ల 6లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశశాల నుంచి ప్రపంచస్థాయి సంస్థలు తరలివచ్చారు.
పరస్పర ప్రయోజనాల దిశగా….
రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సు ను అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుం దన్నారు. అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు ఇది దోహదపడు తుందన్నారు. తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్‌. అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామ న్నారు. బ్రాడ్‌ బాండ్‌, ఇంటర్నెట్‌ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముంద డుగు వేస్తోందన్నారు సీఎం జగన్‌ తెలిపారు. కీలక సమయంలో ఈ సమ్మిట్‌ నిర్వహించా మన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు.‘‘అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 ఎంవోయూలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ.25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ.22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.’’ గణనీయమైన పెట్టుబడులకు అవకాశశం ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటి అని గట్టిగా చెప్పగలను. నిబద్ధత గ్రీన్‌ ఎనర్జీ కోసం ప్రయత్నిస్తూ భారత్‌కు గణనీయమైన సహకా రాన్ని అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.14 ఇండస్ట్రీయల్‌ ఫెసిలిటీస్‌ను రిమోట్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. రూ.3, 841 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు 9,108 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి. ఈ సమ్మిట్‌ సందర్భంగా 100 మందితో 15 సెక్టార్లపై సెషన్‌లు నిర్వహించారు. ఏపీలో ఉన్న అడ్వాంటేజ్‌లను తెలియజేశారు. ఇందులో ఆటోమొబైల్‌ సెక్టార్‌,హెల్త్‌కేర్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా,అగ్రి ప్రాసెసింగ్‌ టూరిజం మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి నెదర్లాండ్స్‌, వియత్నాం, ఆస్ట్రేలియాతో సమావేశాలు నిర్వహించారు. రిలయన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్‌,ఆదిత్య బిర్లా గ్రూప్‌, రెన్యూ పవర్‌, అరబిందో గ్రూప్‌, డైకిన్‌, ఎన్టీపీసీ,ఐఓసీఎల్‌, జిందాల్‌ గ్రూప్‌, మోండలీస్‌,పార్లీ, శ్రీ సిమెం ట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.ఈ సందర్భంగా వారికి ధన్యవా దములు. మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం బలాలు, మేము కల్పించే విభిన్న అవకా శాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియ జేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడం పట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు,మెడ్‌టెక్‌ జోన్‌, టూరిస్ట్‌ హాట్‌ స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు సీఎం జగన్‌. విశాఖపట్నం కేవలం పారిశ్రా మిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందనని.. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అని.. ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్‌, ఒన్‌ ఫ్యా మిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుం బం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ-20 సదస్సును నిర్వహిస్తోందన్నారు. మార్చి చివరి వారంలో జరిగే జీ-20 వర్కింగ్‌ కమిటీ సమా వేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. రెండు రోజుల సదస్సులో కనిపించిన అద్భుతమైన ఆశావాదం రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత అను కూలం గా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఎంఒయు దశ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులను త్వరితగతిన గ్రౌండిరగ్‌ చేయాలని పారిశ్రామికవేత్తలకకు సీఎం అభ్యర్థించారు. దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండ్రోజుల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు 353 ఎంవోయూలు కుదిరాయి. దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని సదస్సుకు హాజరయ్యేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యంగా అంబానీ,కరణ్‌ అదానీ, జిఎమ్మార్‌, పునీత్‌ దాల్మియా,ప్రీతారెడ్డి,సజ్జన్‌ భజాంక్‌, హరిమో హన్‌ బంగూర్‌,జిందాల్‌,నవీన్‌ మిట్టల్‌, మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కృష్ణా ఎల్లా,కుమార మంగళంబిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంత మంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడుల్ని స్వయంగా ముకేష్‌ అంబానీ ప్రకటించడమే కాకుండా..ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్‌ జగన్‌లపై ప్రశంసలు కురిపించడం సమ్మిట్‌కు హైలైట్‌ అయింది. ముకేష్‌ అంబానీ స్వయంగా విశాఖ సదస్సుకు హాజరు కావడమే కాకుండా..తన సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో చేరుకోవడం మరో విశేషం.– జిఎన్‌వి సతీష్‌

సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టిద్దాం..!

దశాబ్దాల పోరాటం..అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానంఈ ఏడాది మహిళలందరం.. ఈక్విటీని స్వీకరించ గలగాలి. ఇది మనం చెప్పేది..రాసేది మాత్రమే కాదు. మనం ఆలోచించవలసిన, తెలుసుకోవలసిన, విలువైన స్వీకరించవలసిన విషయం. ఈక్విటీ అంటే… సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత ప్రభావ పరిధిలో ఈక్విటీకి చురుకుగా మద్దతు ఇవ్వవచ్చు మరియు స్వీకరించవచ్చు.ఈక్విటీని స్వీకరించడానికి మీ స్నేహితులు, కుటుంబం,సహ చరులు మరియు సంఘాన్ని ప్రోత్సహించండి.. ర్యాలీ చేయండి… సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మనం కలిసి పని చేద్దాం..! మనమందరం కలిసి సమాన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడగలము. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఎల్లప్పుడూ ఈక్విటీని కలిగి ఉండేలా అందరం ఆలింగనం చేద్దాం! ఈనెల 8నఅంత ర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్‌.దేవులపల్లి పద్మజ
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధిం చు కున్న విజయమిది.రాజకీయంగా, ఆర్ధికం గా,సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిల బడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగ తాలు తప్పడం లేదు. నిజమే..మహిళా దినోత్స వం సాధించుకోవ డానికి పలు దేశాల్లోని మహి ళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. పోరాడి అంరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజుల్లో సాధ్యం కాలేదు.ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించు కున్న విజయమిది. ఆకాశంలో సగం..అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవు తున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్ధిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంర్జాతీయ మహిళాది నోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లో ప్రభు త్వాలు ఈరోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్‌,ఆస్తిహక్కుకల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి.
ప్రత్యేక దినంగా మహిళలు తమ బాధలు,సమస్యలను చర్చించు కోవడానికి,నలుగురితో పంచుకోవడానికి ఒకరోజు ఉండాలని నిర్ణయించారు.ఆరోజును మహిళా దినో త్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహిం చారు.1910ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్‌ సామ్యవాద లూయీస్‌ జియట్జ్‌ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్‌ సామ్యవాద క్లారాజెట్కిన్‌ సమర్ధించారు.17 దేశాల నుంచి హాజరైన 100మంది మహిళలు ఓటు, సమాన హక్కు,సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911మార్చి 19న పదిలక్షల మందికిపైగా ఆస్ట్రియా, డెన్మా ర్క్‌, స్విట్జర్లాండ్‌ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వ హించారు. ఇందులో ఓటుహక్కు..ప్రభుత్వ పద వులు కావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు.1914నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు,ఉత్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీ కోట్‌ పరిశోధన చేశారు.
మహిళలు పోరాటాలు..విజయాలు
1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వ హించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లోగాని మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు.1917లో (గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి8)సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మహిళలు మొదటి ప్రపంచ యుద్దం,రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమ లోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరిక లను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.మార్చి8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్‌, అలెగ్జాండర్‌, కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటికదాకా అమల్లోకి రాలేదు. చైనా లో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రక టించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు. 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్స వానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచశాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపు నిచ్చింది. అమెరికా 1994లో అంతర్జా తీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
– నాయకత్వం,రాజకీయాల్లో అవకాశాలు్చ ఆర్ధిక స్వాలంబన
– మహిళలపై హింస నివారణ
– శాంతి,భద్రత
– మానత్వం
– జాతీయ ప్రణాళిక,పరిపాలనలో సమానత్వం
– యువతకు ప్రాధాన్యం
– దివ్యాంగులైన మహిళలు,బాలికలకు అవకాశాలు
భారత్‌లో మహిళా హక్కుల ఉద్యమం
భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అన సూయ సారాబాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. మహిళలను సంగటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్‌,విమలా రణదివే,కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌,అహల్య రంగ్నేకర్‌,పార్వతీకృష్ణన్‌ ఉన్నారు. మహిళల ఉద్యంతో కార్మికుల పనివేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజిని నాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం ప్రకటనలు
-1996మహిళాల గతం గుర్తించడం,భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం -1997మహిళలుశాంతి

-1998మహిళలు,మానవహక్కులు
– 1999మహిళలపై హింసలేని ప్రపంచం -2000శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
– 2001మహిళలు,శాంతి,పోరాటాల నిర్వహణ -2002నేటిఆఫ్గన్‌ మహిళ,నిజాలు,అవకా శాలు
– 2003లింగ సమానత్వం -2004మహిళలు,హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌
– 2005లింగ సమానత,భద్రమైన భవిష్యత్తు నిర్మాణం -2006మహిళలు,నిర్ణయాలు
– 2007మహిళలు,బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం -2008మహిళలు,అమ్మాయిలు,పరిశోధన
– 2009మహిళలపై హింసకు వ్యతిరేకం -2010సమాన హక్కులు,సమాన అవకాశాలు
– 2011మహిళలు పనిచేసేందుకు అవకా శాలు,విద్య,శిక్షణ,శాస్త్రసాంకేతిక రంగాల్లోకి ప్రవేశం -2012గ్రామీణ మహిళల సాధికారత, పేదరికం ఆకలి నిర్మూలన
– 2013మహిళలపై హింస నివారణకు కార్యాచరణ -2014అన్నింటా మహిళల పురోగతి
– 2015మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం -20162030నాటికి అంతరిక్షంలో 5050,లింగ సమానత్వం -2017పని ప్రదేశంలో మహిళలు,2030కి సమానత్వం
– 2018గ్రామీణ,పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు -2019మార్పు సాధించేందుకు ప్రయత్నం
– 2020పురుషులతో సమానంగా హక్కులు -2021కోవిడ్‌19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం -2022మహిళల సమానత్వం,కార్యచరణ
– 2023`సమ్మిళిత ప్రపంచాన్ని స్వీకరించడం మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏపక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’అన్న స్వామి వివేకానంద మాటలు మరో సారి స్మరిస్తూ..‘జయహో… జనయిత్రి’ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తు లకు శుభాకాంక్షలు.‘అన్నీ మారుతున్నాయి. మహిళలపట్ల మనఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలం దుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మనప్రగతికి మూలం.ఇదే నినా దంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయం గా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటోప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నా రు.విద్య,వైద్యం,వ్యాపారాలు,రాజకీయాలు,క్రీడలు, బ్యాంకింగ్‌,అంతరిక్షం,టెక్నాలజీ వంటిపలు రంగా ల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం.రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. జయహో… జనయిత్రీ.అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది.

వైజాగ్‌లో జరగనున్న జీ`20 దేశాల సదస్సు

సిటీ ఆఫ్‌ డెస్టినేషన్‌ విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిస్తోంది. ఇప్పటికే మార్చి 3, 4 తేదీల్లో ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ అట్టహాతంగా నిర్వహించింది. మళ్ళీ ఇదే నెలాఖరు 28,29 తేదీల్లో జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి భారత్‌.. పెద్ద ఎత్తున సన్నాహక సదస్సులతోపాటు, పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు వేదిక కాబోతోంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.సైమన్‌ గునపర్తి
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయ బారులు,కేంద్ర,రాష్ట్ర మంత్రులు,సీఎం జగన్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణకు విశాఖలో రెండు స్టార్‌ హోటళ్లను గుర్తించారు. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు.నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.ఈ సమా వేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్‌ 1,2022న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది.జీ20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహిం చేలా ప్లాన్‌ చేస్తోంది.డిజిటల్‌ పరివర్తన,హరిత అభివృద్ధి,మహిళా సాధికారత,యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. జీ20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది.12శాఖల ఆధ్వర్యంలో ఈపనులు జరుగుతున్నాయి.నగరంలోని పర్యాటక ప్రదే శాలను సుందరంగా తీర్చిదిద్దడం,రహదా రులను అభివృద్ధిచేయటం,తదితరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు.నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, (జీవీ ఎంసీ),విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవల్‌ పెంట్‌ అథారిటీ సంస్థ (వీఎం ఆర్‌డీఏ),పోర్టు, జాతీయ రహదారుల సంస్థ,ఆర్‌అండ్‌బీశాఖల తరపున ఆయా యప నులు చేపడుతున్నారు. సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92 కోట్లు, పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు, సాధారణ పనులకు రూ.17.67కోట్లు, వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి, ఆహారం,ఇతర సదుపాయాలకు రూ.7కోట్లు, మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి, పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు, బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు, ఐటీ,కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణా వాహనాల కోసం రూ.3కోట్లు, ప్రొటోకాల్‌, భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసర మని అధికారులు అంచనా వేశారు. మార్చి 28,29 తేదీల్లో జరిగే జీ20 సన్నాహక సదస్సుకు 45దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. వారి కోసం నగరంలో పలు స్టార్‌ హోటళ్లులో గదులు తీసుకున్నారు. సదస్సు ఏర్పాట్లు,వసతుల కల్పనలో 15ప్రభుత్వ శాకలు భాగస్వాములయ్యాయి..
జీ-20 సదస్సు (గ్రూప్‌ ఆఫ్‌ గ్లోబల్‌ )అంటే ఏంటీ ?
అత్యంత శక్తిమంతమైన 17వ జి-20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈ సమావేశాలు వచ్చే ఏడాది భారత్‌లోని ఆంధ్ర ప్రదేశ్‌ విశాఖపట్నంలో నిర్వహించడం ప్రతిష్టా త్మకం.పోటీ పరీక్షల దృష్ట్యా అంతర్జా తీయ సంబంధాల్లో భాగంగా జీ-20 సదస్సుపై ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో జీ-20 ఏర్పాటు,సభ్యదేశాలు,లక్ష్యాల గురించి తెలుసుకుందాం!
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు,అతి వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ఇది అంతర్జాతీయ సంస్థల్లో అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడిర ట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాను జీ20 కలిగి ఉంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం జీ-20 వేదికపైన కనిపిస్తాయి. అధిక జనాభా కలిగి ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల కూటమినే గ్రూప్‌ ఆఫ్‌ 20 లేదా జీ20 అంటారు.1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్‌ ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్‌ ఆఫ్‌ ఎయిట్‌ (జీ-8) బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్‌,సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చేర్చారు. సభ్య దేశాలు 19,యూరోపియన్‌ యూనియన్‌ తో కలిపి జి20గా పేర్కొంటారు. మొదటిసారి 1999లో బెర్లిన్‌లో సమావేశ మయ్యారు. మొదట్లో జీ-20 సదస్సుకు ప్రధా నంగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్ర ల్‌ బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. 2008 లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థి తుల్లో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూ లడం,నిరుద్యోగం పెరగడం,వేతనాల్లో మాం ద్యం నెలకొనడంతో జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారింది.జీ-20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి సభ్య దేశాల్లో సమావేశం అవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్‌ డి.సి.లో జరి గింది. వాస్తవానికి జి20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది.ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభ జించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. జీ-20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండుసార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థలు వరల్డ్‌ బ్యాంక్‌,ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో,ఐఎంఎఫ్‌,డబ్ల్యూటీవో, ఫైనాన్షి యల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు పాల్గొంటాయి. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల మొదటి పర్సనల్‌ ప్యానల్‌ సమావేశం ఇండోనేషియా నేతృత్వంలో 2022,ఫిబ్రవరి17,18వ తేదీల్లో జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతా రామన్‌ ప్రసంగించారు.
డ్రాప్ట్‌ స్టేట్‌మెంట్‌
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జీ-20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చించారు. ఉక్రెయిన్‌ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసం హరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జీ-20 సదస్సుకు రష్యా తరఫున విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ హాజరయ్యారు.
డిక్లరేషన్‌
శాంతి స్థాపన,కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని డిక్లరేషన్‌ పేర్కొంది.ఘర్షణల శాంతియుత పరిష్కారం,సంక్షోభ నివారణకు కృషి,చర్చలు ఇప్పుడు కీలకం. ఇది యుద్ధాలు చేసుకొనే శకం కాదని సభ్యదేశాలు పేర్కొన్నా యి. ఉగ్రవాదానికి నిధులందించే కార్యక లాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌?ను నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిం చడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయు క్తంగా ప్రకటించారు. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం చర్చించింది. లక్ష్యాలు ా సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారాలను పెంపొందించడం ా భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం ా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం సభ్యదేశాలు : అర్జెంటీనా,ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కెనడా,చైనా,ఫ్రాన్స్‌,జర్మనీ,ఇండియా,ఇండో నేషియా,ఇటలీ,జపాన్‌,దక్షిణ కొరియా,రష్యా, మెక్సికో,సౌదీఅరేబియా,దక్షిణాఫ్రికా,టర్కీ, గ్రేట్‌? బ్రిటన్‌,అమెరికా,యూరోపియన్‌ యూనియన్‌. 2008 నుంచి స్పెయిన్‌ శాశ్వత ఆహ్వానిత దేశం.జీ20లో పాకిస్థాన్‌ లేదు. అంకురార్పణ ఇలా ... 1999లో బెర్లిన్‌లో తొలి జీ-20 సదస్సు జరిగింది. ఆ సమయంలో తూర్పు ఆసియా ఆర్థిక లోటుతో సతమతమైంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. 2008లో మొదటి సమావేశం జరిగింది. తర్వాత ఏడాదికోసారి భేటీ అవుతుంది. బెర్లిన్‌లో జరిగిన తొలి సమావేశానికి ఆయా దేశాల ఆర్థికమంత్రులు, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్లు హాజరయ్యారు. అయితే 2008లో ఆర్థికమాంద్యం రావడంతో జీ-20 సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ దెబ్బతిని,నిరుద్యోగం పెరగ డంతో ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకొనేది అధినేతలే కాబట్టి ..దాంతో అధినేతలు సమావేశమవుతున్నారు. ఆర్థికమే మూలం .. జీ-20 సదస్సులో ఆయా దేశాల అధినేతలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తారు.తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచు కుంటారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై ఈసారి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రంప్‌, జీనీ పింగ్‌,ట్రంప్‌, మోడీ మధ్యయ పన్నులు తదితర అంశాలపై కీలక డిస్కషన్స్‌ జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌ ప్రధానిగా రాజీ నామా చేసిన థెరెసా మే కూడా సమావే శానికి హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆమె వివిధ అంశాలపై కూలం కషంగా మాట్లాడ తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కీలకం గా ప్రస్తావన ఉంటుంది. సదస్సులో వివిధ అంశాలపై ఒప్పందం చేసుకొని ..తర్వాత అధినేతలు ఫోటోలు దిగుతారు.ఆ ఫోటోలు వివిధ అంశాలపై చర్చలకు సంబంధించి సాక్షిభూతంగా నిలుస్తాయి.గతేడాది కొందరు అధినేతలు సౌదీ రాజుతో కరచాలనం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా56 నగరాల్లో 200 సమావే శాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తు న్నారు. సదస్సులె సీఎం జగన్‌ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్‌ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు. వివిధ దేశాల నుంచి జీ-20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. ఇప్పటికే మార్చి 3,4 తేదీల్లో నిర్వహించిన విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ గ్రాండ్‌ సెక్సెస్‌ అయ్యింది. విశ్వనగరిగా విశాఖ సుందరీకరణ సహజ అందాల ప్రకృతి నిలయం తీరప్రాంత నగరం విశాఖపట్నానికి రాజధాని కళ సంత రించుకుంటోంది.విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి విశాఖ విశ్వనగరిగా అదనపు హంగులు సమకూర్చు తున్నారు. అంతర్జాతీయ బ్రాండిరగ్‌ కల్పిం చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనికి తోడుగా వరుసగా అంతర్జాతీయ కార్య క్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన మెట్రో సిటీ (మోస్ట్‌ హ్యాపె నింగ్‌ సిటీ) విశాఖ ఖ్యాతి జాతీయ,అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.జీ.20సమావేశాలు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. ఈ సదస్సుకు విచ్చేసే జాతీయ,అంతర్జాతీయ ప్రతినిధులకు విశాఖ బ్రాండ్‌ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదులు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున,జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజుబాబు,నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షణలో నగర సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయా పనులు తుదిదశకు చేరుకుం టున్నాయి.ఈనేపథ్యంలో విశాఖనగరం అంతర్జాతీయ వేడుకలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుం టోంది. సాగర్‌తీరం,ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, విశాలమైన రోడ్లు,విమానసర్వీసులు అందుబాటులోఉండ టంతో విశాఖ ప్రపంచదేశాలను ఆకట్టుకునే విధంగా ముస్తాబువుతోంది. ప్రభుత్వాధినేతలు విశాఖపైనే ఫోకస్‌ పెట్టడంతో వైజాగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఇప్పటికే గతనెల జనవరి 68వరకు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌,20,21న ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్‌, ఈనెల16,17తేదీల్లో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ జరిగిన జాతీయ,అంతర్జాతీయ సమావేశాలకు విశాఖ వేదిక కావడం దీనికి నిదర్శనం.
విశాఖ బీచ్‌లకు అదనపు హంగులు
రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలీకి వెళ్లే మార్గాన్ని మరింత సుందరంగా మార్చబోతున్నారు. ఈబీచ్‌రోడ్డు వెంట అదనపు హంగులను సమకూర్చారు.రుషికొండ,జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌,మధురవాడ,వుడా కాలనీ, సీతమ్మధార, బుచ్చిరాజుపాలెం, మద్దిళ్లపాలెం, బీఆర్‌టీఎస్‌ రోడ్డు,మహారాణి పేట సహా పలు ప్రాంతాల్లో సుందీరకరణ పనులు చేపట్టారు. మార్చి నెలలో జరగనున్న జి-20 సదస్సునకు జరుగుతున్న అభివృద్ధి,సుందరీకరణ పనులు త్వరితగతిపై ఇప్పటికే రాష్ట్ర మునిసిపల్‌ శాఖ కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి,సముద్ర తీర ప్రాంతాలలో రెండు సార్లు పర్యటించి నగర సుందరీకరణపై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.జీ-20 సదస్సు నకు దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో అతిధులు,ప్రతినిధులు నగరానికి విచ్చేయనున్న నేపథ్యంలో విశాఖఖ్యాతి,సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భు తంగా వివిధఆకృ తులతో కూడినబొమ్మలు ఏర్పాటు,ఉన్న ప్రతిమలకు రంగులు అద్దిఅలంక రించడం, విద్యుత్‌ దీపాలం కరణలు,రంగు రంగుల మోడరన్‌ పెయింటింగలు, కల్చర్‌ఆర్ట్‌లతో వివిధ ఆకృ తులతో కూడిన మొక్కలు -చెట్ల్లు కటింగ్‌,వాటికి ఆకర్షణీయమైన రంగులు అద్దడం,పరిశుభ్రంగా రోడ్డులు నిర్వహణ, ఫుట్‌పాత్‌ ఆధునీ కరణ,నిరంతరం పారిశుధ్య పనులు పర్యవేక్షణ వంటి పనులపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని ప్రదేశాల్లో లాండ్‌ స్కేప్స్‌,వాటర్‌ ఫౌంటైన్స్‌, పార్కింగ్‌,వాల్‌ పెయింటింగ్స్‌,పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు ఉద్యాన వనాలు, బీచ్‌లు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దు తున్నారు.విదేశాల నుండి వస్తున్న అతిధులకు నగరం అందాలతో అబ్బుర పరచేటట్లు ఆకర్షితంగా ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాడానికి అన్నీ హంగులతో సుందరీ కరిస్తున్నారు. రూ.150కోట్లతో నగర సుందరీకరణ పనులు
జీ`20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది. నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధిచేస్తున్నారు.సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92కోట్లు,పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు,సాధారణ పనులకురూ.17.67 కోట్లు,వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు,ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి,ఆహారం,ఇతర సదుపా యాలకు రూ.7కోట్లు,మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి,పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు,బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు,ఐటీ, కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణావాహనాల కోసంరూ.3కోట్లు,ప్రొటోకాల్‌,భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. నగరంలోని పలు ప్రధానమార్గాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రహారీ గోడలకు అందమైన బొమ్మలను చిత్రీ కరించారు. నగరంలో ముందుజాగ్రత్త చర్య లను సీపీ శ్రీకాంత్‌ నేతృత్వంలో కొత్తగా 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చ నున్నారు. ఇంటర్నేషల్‌ ఈవెంట్స్‌తో విశాఖ నగరం కొత్త అందాలు జీ20 సమావేశాలతో విశాఖ నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ విశ్వప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకా శాలు కన్పిస్తున్నాయి. రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ సీఎం జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలని పట్టుదలతో ఉన్నారు. అంతర్జాతీయ సమావేశాలతో విశాఖలోనే రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి అధికార యంత్రాంగం బిజీబిజీగా గడపబోతున్నారు.

అడవి బిడ్డల ఆత్మి చిత్రం

ప్రతి రచయిత తన రచనలు వెలు వరించడానికి అనుభూతి లేదా ఆవేదన ఒక్కోసారి రెండు కావచ్చు అలా ఆవిర్భ వించిన రచనలకే పట్టుత్వం వుండి, పదికాలాల పాటు ప్రజల అక్షర హృదయాలలో నిలిచిపోతాయి. అలా కాక ఊహాత్మకత కోసమో. సానుభూతి కోసమో, సందర్భోచితమో అయిఉండి వ్రాసే రచనలకు బోలెడు బలహీనతలు ఉంటా యి.రచయిత డా.దిలావర్‌ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడు,ఉపన్యాసుడుగా…సుమారు పాతికేళ్లు అచ్చంగా అడవి బిడ్డల ఆవాసాల నడుమ జీవనం చేసిన అను భవం తాలూకు అనుభూతులతో రాయబడిరది ఈడజను కథల ‘కొండ కోనల్లో….’ కథా సంపుటి,దీనిలో ప్రతికథ ఓగిరిజన ప్రాంతం జీవన్మరణగోస, సమస్య చూస్తూ రాయకుండా ఉండలేనితనం రచ యితది.ఈ కథలు వెలువటానికి అది కూడా ఓకారణం!!.రచయిత డా:దినార్‌ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడైన రచయిత,భిన్నమైన ప్రక్రియలు చేపట్టినా కథా రచయితగా చేయి తిరిగిన వ్యక్తి, 2014 సంవత్సరంలో వెలువరించిన ఈ కొండ కోనల్లో…కథా సంపుటిలోని కథలన్నీ గిరిజనుల జీవితాలకు, సాంఘిక పరిస్థితులకు అద్దంపడ తాయి. కారడివిలో కాంతికిరణం,పాటకు మరణం లేదు, వేట,తునికాకు,చెట్లు కూలుతున్న దృశ్యం,అరణ్య రోదన,కొండ కోనల్లో… మొదలైన కథలన్నీ గిరిజన జాతుల బతుకు చిత్రాలను నింపుకున్నాయి.ఈ కథల్లోనే ప్రాంతాలు పాత్రలపేర్లు అన్ని ఇలా స్వీయ పర్యటనలు అనుకోవాలి అలాగే కథల్లో వాడిన జాతీయాలు,సామెతలు, ఉపమా నాలు, అన్నీ అందమైన అటవీ వాతావరణం అన్వయించి రాయడం ద్వారా రచయితలోని పరిణితి అనుభవం తేటతెల్లం కావడంతో పాటు, సుందర శైలి ఆసక్తికర అధ్యయ నానికి ఆయువుగా నిలుస్తాయి.అసౌకర్యాలకు నిలయమైన అడవుల్లోని అడవి బిడ్డల జీవితాల్లో అన్ని చక్కగానే అనిపిస్తాయి, ఆరోగ్య సమస్యలు రవాణా సదుపాయాలు లేమి తప్ప.!! వీటి వల్లే అన్ని కాలాల్లో కన్నా ‘వానాకాలం’లో అధిక సంఖ్యలో అడవి బిడ్డలు అనారోగ్యాల పాలై సకాలంలో సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ‘అనారోగ్య సమస్యలు’ అడవుల్లో అంతటా అగుపిస్తాయి.ఈ నేప థ్యంలో సాగిన కథ ‘‘కారడివిలో కాంతి కిరణం’’ వెంకటాపురం మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌గా వచ్చి న కిరణ్‌ అనే యువ వైద్య విద్యార్థి తన కార్యదీక్షతో అక్కడి గిరిజనుల ఆలోచనలో ఎలాంటి ధైర్యాన్ని, మార్పును, పెంపొందించ గలిగాడో తెలిపిన కథ ‘‘కారడివి లో కాంతి కిరణం’’, పిల్లలైనా, అడవి బిడ్డలైన,ఉపన్యా సాలు విని ప్రేరణ పొంది మారరు, కేవలం ఆచరణా త్మకమైన కార్యాల ద్వారానే మార్పుకు దారులు వేయవచ్చు అని చెబుతారు ఈ కథ ద్వారా రచయిత దిలావర్‌. కొత్తగా డాక్టర్‌ ఉద్యోగంలో చేరిన కిరణ్‌ గిరిజన గుడాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆధునిక వైద్యం వైపు కాక పాత వైద్య విధానాలకు, పసరు వైద్యాలకు, వారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, చేతబడి, దేవర్ల పూనకాలను ఎందుకు నమ్ముతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. ‘‘గిరిజనుల వద్దకే సర్కారు వైద్యం’’ అన్న నినాదం నీరుగారడానికి గల కారణాల్లో శాఖ పరమైన అవినీతి, ఉద్యోగుల్లో అలసత్వం, ప్రధానంగా చూపిస్తారు. గిరిజన గుడేల్లో ప్రభుత్వాలు ఆనాడు చేపట్టిన మొక్కుబడి వైద్య విధానాల వల్లే గిరిజనులు తమనాటు వైద్యాల నుంచి బయటపడలేక పోతున్నారనే సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతారు ఇందులో. కిరణ్‌ తనదైన అంకిత భావంతో చేసిన పనులు ముఖ్యంగా గిరిజనగుడేనికి చెందిన సారమ్మ అనే గిరిజన గర్బిణి నిండు వానాకాలంలో ప్రాణాపాయ పరిస్థితిల్లో నుండి గూడెం యువకుల సాయంతో ఆమెను వాగు దాటించి సరైన సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అక్కడ తను పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ కథలోని సారం, ఆ గర్భి ణీని తనదైన ఆధునిక వైద్యం ద్వారా కిరణ్‌ ఎలా కాపాడాడో ప్రత్యక్షంగా చూసిన గిరిజనుల ఆలోచనల్లో మార్పు రావడమే ఈ కథకు ప్రాణప్రదమైన ముగింపు.కాయకష్టాలకు చిరునామాదారులైన గిరిజనులు సంఘటిత కార్మికులు కాదు, భరోసా లేని సాధారణ కూలీలే,!! వారి వారి పనుల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు ఎందరో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం దానికి స్వార్థపరులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కారణం గురించి రచయిత ‘‘తునికాకు’’ కథలో చక్కగా చెబుతూ అందరిలో ఆలోచన కలిగించారు. గిరిజనులకు కన్నతల్లి తర్వాత తల్లి వంటి అడవిని సంరక్షించుకోవడం వారి ఆచార సంప్రదాయాల్లో అంతర్భాగంగా మొదటి నుంచి వస్తుంది, కానీ ఆధునిక సమాజంలో అడుగడుగునా మోసులెత్తుతున్న అవినీతి, స్వార్థం, సాయంగా అంతరించిపోతున్న అడవులు తద్వారా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం, గురించి ఓ గిరిజన యువకుడి ఆవేదన సాయంగా కళ్ళకు కట్టారు ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ లో కథా రచయిత. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసిన ‘‘తేజ’’ అనే యువకుడు తన భార్య ఉష ఇతర మిత్రుల కుటుం బాలతో భద్రాచలం – పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వైనం విహార యాత్ర సంబంధంగా భార్య ఉషకు జాతీయ,అంతర్జాతీయంగా గిరిజనుల చరిత వారి జీవన విధానం గురించి సహేతు కంగా చెబుతూ…కొమరం భీము నుంచి నేటి తరం గిరిజన పోరాట వీరుల దయాగుణం గురించి చెబుతూ.. పాపి కొండలు, పేరంటాలపల్లి, తదితర స్థల ప్రాసస్థ్యాల గురించి రచయిత ఈకథలో చక్కగా వివరించారు. అంతేకాక భద్రా చలం ఆలయానికి రామదాసుకు, తూము నరసింహదాసుకు, ఇచ్చిన ప్రాధాన్యత రామ కథకు కారణభూతురాలు అయిన గిరిజన మహిళ శబరికి ఎందుకు ఈయలేదనే ధర్మసందేహంతో పాటు అనేక పాత్రల స్వభావాలను పరామర్శిస్తూ వ్రాసిన చక్కని చరిత్రాత్మక విషయాల మేళవింపు గల కథ ‘‘కొండకోనల్లో…..’’ ఇంత చక్కని ప్రాముఖ్యత గల ఈ ‘‘మన్య సీమ’’ పోలవరం ముంపుతో అంతర్థానం అయిపోయినట్టు కలగన్న తేజ మానసిక స్థితి గురించి తన భావాలు జోడిరచి ఎంతో హృద్యంగా చెబుతారు రచయిత. ఇంచుమించు అదే భావనతో వ్రాసిన ఆ ‘‘ఏడు మండలాలు’’ కథ, పోలీసుల దాష్టి కాలకు అమాయకపు గిరిజ నులు బలవుతున్న వైనం తెలిపే ‘‘పాటకు మరణం లేదు’’ మృగ్యమవుతున్న అటవీ సంపద గురించిన ‘‘వేట’’ ‘‘బొందల గడ్డ’’ తదితర కథలు వేటికవే భిన్నంగా ఉండి గిరిజన సంస్కృతి,అందాల అడవిని, అంతే అందంగా అక్షరీకరించారు రచయిత డా: దిలావర్‌ . కథల్లో ఉపయోగించిన భాష, వ్యాకరణాం శాలు, సంస్కృతి,తదితర అంశాల ద్వారా రచయిత యొక్క పరిశీలన గుణం,సంస్కృతి శైలి వెల్లడవుతాయి. మనిషి శరీరంలోని నరాల్లా అడవి దేహం నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాలిబాటలు, వాగు పలుపు విడిచిన లేగ దూడలుగా…. సుడులు,సుడులు,తిరిగి ప్రవహిస్తుంది, వాగులు వంకలు ఎండిపోయి అస్తిపంజ రాల్ల పడిఉన్నాయి, వంటి ఉదాహ రణలు మచ్చుకు కొన్ని మాత్రమే…!! ఇలా ప్రతి అంశాల్లో, విశేషాలు, కల్పనలు, వెరసి ఈ కథా సంపుటం నిండా అచ్చమైన అడవి వాతావరణం ఆవిష్కరించబడిరది. సందర్బో Ûచితమైన సంభాషణ శైలి రచయిత యొక్క విధివిధానాల గుండా ఈ కథలను అధ్యయనం చేయడం ద్వారా చక్కని వైజ్ఞానిక, సామాజిక, సమాచారం అందుకోవచ్చు.
పుస్తకం :- కొండుకోనల్లో..- (ఆదివాసి కథలు)
పేజీలు:152, ధర:-100/-
రచయిత: డా: డిలావర్‌,
సెల్‌:986692329.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాస రాజు 7729883223.

ఆదివాసులను విస్మరిస్తున్న నాగరికత

మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవనశైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
త్యాగాల చరిత్ర కనుమరుగు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు,పాల్గొ నని వారు కూడా వజ్రోత్సవాల పేరుతో ఎన్ని కల లబ్ధి ఎంత పొందవచ్చు అని మాత్రమే పోటి పడుతున్నారు.విచిత్రం ఏమిటంటే భారత దేశం మీద ఏ విదేశీయులు దాడి చేసినా మొట్టమొదట తిరుగుబాటు జెండా ఎగుర వేసింది స్వేచ్ఛా ప్రియులైన ఆదివాసులే . భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆది వాసుల పోరాటాల చరిత్రను విస్మరించి నట్లుగనే ఇప్పుడు కూడా మొత్తం ఆదివాసులనే విస్మరిస్తున్నారు .
ఉత్సవాలను పట్టించుకోని పాలకులు
ఐక్య రాజ్య సమితి 1994 నుండి ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని,ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించింది.1995 నుండి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ప్రపంచ ఆదీ వాసీ దినోత్సవాన్ని జరుపుకుంటు వస్తున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా90దేశాలలో దాదాపు48కోట్ల మంది ఆదివాసులు ఉన్నారని అంచనా.వారు ప్రపంచ జనాభాలో 5శాతం కంటే తక్కువనే.కానీ పేదలలో 15శాతం ఉన్నా రు.మొత్తం ప్రపంచంలో ఉన్న 7000 భాష లలో ఎక్కువ భాషలు మాట్లాడుతారు.5000 విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు మొత్తం ప్రపంచం గురించి ఇచ్చిన అంచనాలు మాత్రమే. పేదరికం ఇంకా ఎక్కువగనే ఉంటుంది. సాంప్రదయక జ్ఞానాన్ని రక్షించడంలోనూ ప్రసారం చేయడంలోనూ ఆదివాసీ మహిళల పాత్ర ఈసంవత్సర ఆదివాసీ దినం యొక్క విషయం. ప్రతి సంవత్సరం ఆదివాసులకు చెందిన ఏదో ఒక విషయాన్ని చర్చించడానికి ఎంచుకుని ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు. మరో వైపు ఆదివాసుల పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నది .
ఆదివాసీల పరిస్థితి అధ్వాన్నం
మన దేశ విషయానికి వస్తే ఆదీవాసుల పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి . భారతదేశ జనాభాలో ఆదివాసులు దాదాపు 9 శాతం ఉంటే,అందులో 40శాతం పేదరి కంలోనే ఉన్నారని ఒక అంచనా.ఈ పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు కేంద్రంలో అధికారం కలిగి ఉన్న పార్టీ,అసలు ఆది వాసులను,ఆదివాసులుగానే గుర్తించని ఆలో చనతో ఉన్నది.ఆదివాసులను,అడవులలో ఉంటున్న హిందువులే అని చెప్పుతూ వారిని వనవాసులు అని పిలుస్తున్నది. ఇప్పటికే జనభా లెక్కింపు సందర్భంగా చాలా రాష్ట్రాలలో తెలిసీ తెలవక, స్పష్టమైన కోడ్‌ లెకపోవడం వలన ఆదీవాసులను, హిందువులుగా లెక్కిస్తు న్నారు. దీనితో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతలు కూడా 5వషెడ్యూల్‌ లోకి రాకుండా పోతున్నాయి. ఆదివాసులకు దక్కాల్సిన అవకా శాలు,హక్కులు,రక్షణలు దక్కకుండా పోతు న్నాయి.1871నుండి1951వరకు జనభా లెక్కలలో స్పష్టంగా మతం కాలమ్‌లో ఆదివా సులగా గుర్తించే కోడ్‌ ఉండిరది.కానీ1951 తరువాత జనాభా లెక్కలలో మతం కాలమ్‌ కింద ఉన్న ఆదివాసుల ఆప్షన్‌ తీసివేసి, ‘‘ఇతరులు’’అని చేర్చడం జరిగింది.చివరికి 2011 వరకు ఉండిన ‘ఇతరులు’అనే ఆప్షన్‌ ను కూడా తీసివేశారు.మతం కాలమ్‌లో ఆరు మతాలనే ఉంచారు.1) హిందూ,2) ముస్లిం, 3)క్రిస్టియన్‌,4) బౌద్ధులు,5) జైనులు,6) సిక్కులు. జనాభా లెక్కింపులలో ఇలా చేస్తూ వచ్చిన మార్పులతోనే ఆదివాసీల జనాభా తక్కువగా లెక్కించబడుతూ వస్తున్నది. అంటే భారత దేశ ఆదివాసులు అందరూ 6 మతా లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలన్న మాట. విచిత్రం ఏమిటంటే బౌద్ధులు జైనులు కంటే మన దేశంలో ఆదివాసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది.కానీ ఆదివాసులకు జనాభా లెక్కలలో తమ మతం గురించి, తమ విశ్వాసాలను గురించి ప్రకటించుకునే, గుర్తించే అవకాశమే ఇవ్వలేదు.ఆదివాసులందరిని హిందువులుగా లెక్కించే కుట్రనే ఇది.అయితే 2019లో 19 రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు వారి ప్రతి నిధులు,2021 జనాభా లెక్కింపులో మతం కాలమ్‌లో ఆదివాసులను గుర్తించే కోడ్‌ పెట్టాలని డిమాండు చేస్తూ డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా కూడా చేశారు.జార్ఖండ్‌ అసెంబ్లీ ఈ సందర్భంగానే, జనభా లెక్కింపులో ఆదివాసులను గుర్తించడానికి,ఆదివాసుల మతం అయిన సర్నాను మతం కాలమ్‌ లో పెట్టాలని తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ అంగీ కారం లేకుండా అది అమలు అయ్యే విషయం కాదు. కాని ఆదీవాసులను హిందువులగా మాత్రమే గుర్తించే ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోనే లేదు. ఇతర పార్టీలన్ని గట్టిగా కళ్ళు మూసుకుని మౌన వ్రతం పాటించాయి.
మతముద్రకు కుతంత్రాలు
ఇక జరిగేదెమిటంటే,ఆదివాసులు అందరూ హిందువులే కావున వారి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రక్షణలు, హక్కులు అవసరం లేదంటారు. ఇటువంటి రక్షణ చట్టాల వల్లనే ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు. అందుకే తెలంగాణా ఆంధ్రాలో1/70చట్టాన్ని ఎత్తి వేయా లని చర్చలు,వాదనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరం హిందువులమే పేరు మీద ఇటువంటి చట్టలన్నింటిని తుంగలో తొక్కవచ్చు. అంబానీ అదానీలకు ఆదివాసి ప్రాంతాలలోని ఖనిజాలను,ఇతర సంపదలను ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా తరలించుకు పోవడానికి అవకాశం ఏర్పడు తుంది. ఆదివా సులను వారి ప్రాంతాలనుండి తరిమి వేయ వచ్చు. ఇప్పటికే మన దేశంలో కట్టిన పెద్ద ప్రాజెక్టుల వలన గనుల వలన నిర్వాసితులు అయ్యింది 70శాతం మంది ఆదివాసులే. యురేనియం లాంటి గనుల వలన అకాల మరణాలకు గురవుతున్నదీ,అంతుపట్టని రోగా లకు బలి అవుతున్నది ఆదివాసులే. ఒక ప్రణా ళిక లేకుండా ఎటువంటి పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుండా చిత్తం వచ్చినట్లు గనుల తవ్వకా లు చేపడుతూ ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. రోగాలపాలు చేస్తున్నారు. పర్యా వరణ సమస్యలను సృష్టిస్తు న్నారు. అటవీచట్టా లలో పారిశ్రామిక అధిప తులకు అనుకూలంగా సవరణలు చేసి వేల ఎకరాల అడవులను నరికి వేయడానికి అను మతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చట్టాలు ఇంకా కొత్తవి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇవన్నీ ఆదివాసుల అస్తి త్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండగా,అన్ని ఇబ్బం దులను ఎదుర్కొంటూ ఆదివాసులు తమ అస్తిత్వం కొరకు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వారి అస్తిత్వ పోరాటాలకు పునాదే లేకుండా చేయడం కొరకు,జనాభా లెక్కలలో ఆదివాసుల గుర్తింపు నే మాయం చేస్తున్నారు. ఇది వారి మొదటి అడుగు మాత్రమే .
సంఘటితమే హక్కుల రక్షణకు మార్గం
ఆదివాసుల హక్కులను రక్షించడం,విద్య వైద్య సంస్కృతులను అభివృద్ధి చేయడం కొరకే ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను జరుపు కుంటున్నట్లుగా ఐక్యరాజ్యసమితి చెప్పు కుంటున్నది.కానీ ముందే చెప్పినట్లు ఆదివాసులు నిర్వాసితులు అవుతుండగా వారి సంస్కృతిపై అన్ని దిక్కుల నుండి దాడి జరుగుతున్నది. ఆది వాసుల భాషల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆదివా సులలో చాలామందికి వారి మాతృభాష రాకుండా పోయింది.ఏ రాష్ట్రంలో ఏభాష అధికార భాషగా ఉంటే ఆ భాషను ఆ రాష్ట్రం లోని ఆదివాసుల పైన రుద్ద పడుతున్నది. చత్తీస్గఢ్‌,మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై హిందీ రుద్ద పడుతున్నది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు రుద్ద పడుతున్నది.ఒరిస్సాలో, ఒడియా రుద్ద పడుతున్నది.భారతదేశం అంతటా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది.కనీసం1980 వరకు మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం లోనూ కొన్ని ఇతర రాష్ట్రాల లోనూ హిందీ లిపిలోనే అయినా,ఆదివాసులకు ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించ బడిరది.కానీ తరువాత అది కూడా ఎత్తి వేశారు.ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఆది వాసుల భాషలు అంతరించి పోయాయి. మిగిలిన ఆదివాసి భాషలు కూడా అంతరించి పోయే పరిస్థితిలో ఉన్నాయి.విద్య,ఆరోగ్యం విష యంలో ఈ రోజుకు కూడా ఆదివాసీ ప్రాంతా లు వెనకపడే ఉన్నాయి. సులువుగా తగ్గించ గలిగే మలేరియా వైద్యాన్ని కూడా సరిగా అందించపోవడం వలన ప్రతి యేడు ఆది వాసులు చనిపోతునే ఉన్నారు. ఇక, ఒక ప్రాం తంలో ఒకప్పుడు ఆదివాసులు ఉండే వారని గుర్తించడానికి కూడా వీలు లేకుండా వారి గుర్తులు అన్నింటినీ కూడా తుడిచివేయ చూస్తున్నారు. ప్రాంతాల పేర్లను గ్రామాల పేర్ల ను మనుషుల పేర్లను నదుల పేర్లను చివరికి కొండల పేర్లను అన్నింటినీ అన్నింటిని మార్చి వేస్తున్నారు. మరో వైపు ఆదివాసుల మతం మార్చడానికి వివిధ మత సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ,హిందూ సంస్థలు పోటీ పడి పని చేస్తు న్నాయి. చివరికి ఈ మత సంస్థలు ఆదివాసులను కులాలుగా చీల్చుతున్నాయి. ఏ కులంలోకి మతంలోకి వెల్లని ఆదివాసులను అంటరానివారుగా చూస్తున్నారు,మారుస్తు న్నారు.మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని ధ్వసం చేయడానికి కార్పోరేట్‌ వర్గాలు,పాలకవర్గాలు, పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేస్తున్నాయి. ఆదీవాసి సమాజం కూడా పార్టీలకు,మతాలకు అతీతంగా ఐక్యం అయ్యి తమ అస్తిత్వం కొరకు ఒక్కటిగా పోరాడాల్సి ఉంది.అప్పుడే ఆదివాసి సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకో గలుగు తుంది.
కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు
మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధార పడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదిత రాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజి స్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్ప రచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవన శైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
ఐక్యరాజ్య సమితి చొరవ
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో 47.60కోట్ల ఆదివాసులు సుమారు 20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో వీరి జనాభా సుమారు ఆరు శాతం. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులు వీరి సొంతం. యునెస్కో అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరకు సుమారుగా మూడు వేలకు పైగా అంటే నలభై భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంతటి అసాధారణ చరిత్ర, సంస్కృతి, భాషలు కలిగిఉన్న ఆదివాసులను కాపాడుకునేందుకు ప్రజల్లో చైతన్యం పెంచేం దుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినంగా నిర్వహిస్తోంది.2019ను అంతర్జాతీయ ఆదివాసీ భాష సంవత్సరంగా,2022-2032 కాలాన్ని అంతర్జాతీయ ఆదిమ భాషల దశాబ్దంగా ప్రకటించడం ద్వారా వీరి సంస్కృతులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది. ఆదివాసుల భాష, వారి సంస్కృతి సంప్రదా యాలను భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఈ తరంపై ఉంది. ఈ భాషలకు లిపి లేదు.మరో తరానికి అవి మౌఖికంగానే బదిలీ అవుతున్నాయి. ప్రపంచీ కరణ యుగంలో వచ్చిన సాంకేతిక విప్లవం, ఆధునికత,సైనిక ఆక్రమణలుబీ సామాజిక, ఆర్థిక,రాజకీయ,మతపరమైన అణచివేతలుబీ ఇతర బాహ్య కారణాలు,ఆత్మన్యూనత వంటి అంతర కారణాలవల్ల ఈ భాషలు క్రమక్ర మంగా అంతరిస్తున్నాయి. వీటి ప్రభావం వారి అస్తిత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, దీంతో ముడివడిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారపుటలవాట్లు,సంప్రదాయాలు మొదలైనవీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. యునెస్కో- ప్రపంచంలోని 6,912 భాషల్లో 2473 భాష లు వివిధ రూపాల్లో కనుమరుగు అవుతున్నా యని అంచనా వేసింది.భారత్‌లో10.45కోట్ల ఆదివాసులు(130 కోట్ల దేశజనాభాలో 7.5 శాతం)ఉన్నారు.700కు పైగా విభిన్న జాతు లున్నాయి. యునెస్కోకు చెందిన ‘అట్లాస్‌ ఆఫ్‌ వరల్డ్‌ లాంగ్వేజెస్‌’ ప్రకారం ఇండియా 197 భాషలతో మొదటిస్థానంలో ఉంది.అమెరికా 192 భాషలతో, ఇండొనేసియా147భాషలతో తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో అండమాన్‌ ద్వీపంలో నివసించే ‘గ్రేట్‌ అండమానీస్‌’ ప్రధాన భాష అక-జెరు-తం బొల అనే వ్యక్తి మృతితో అంతరించిపోవడం బాధాకరం.జరావా,సెంటీనేలే,షోపెన్‌,ఓనగీ, బిరహోర్‌,గదబా,పహరియా,బొండోలు మాట్లా డే భాషలూ అంతరించే దశలో ఉండటం ఆందోళనకరం.
యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలోఆర్టికల్‌ 16(4),46,275,330, 332,243డి,5,6షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికా రాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాలమేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ వంటివి నిరంతరం పనిచేస్తున్నప్పటికీ- వారి భాషను, సంస్కృతులను కాపాడలేకపోతున్నాయనడానికి అంతరిస్తున్న భాషలే నిదర్శనం. వీటి సంరక్షణ కోసం మానవ వనరుల శాఖ 2013లో అంతరించే భాషల సంరక్షణ, పరిరక్షణ పథకాన్ని భారతీయ భాషల సంస్థ, విశ్వవిద్యాలయాలు, భాష పరిశోధన సంస్థల సమన్వయంతో ప్రారంభించింది. ప్రమాదపుటంచున ఉన్న భాషలను గుర్తించి వాటిని సేకరించి భద్రపరచడం (డాక్యుమెంట్‌) ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గిరిజనుల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం దేశంలో గిరిజన విశ్వవిద్యా లయాలను, సాంస్కృతిక కేంద్రాలను యుద్ధప్రాతి పదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, భారత్‌ కూడా ఆదిమ భాషలను కాపాడుకోవడం కోసం మాతృభాషను తప్పనిసరి చేస్తూ 2020 నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. గిరిజన భాషల లిపి తయారు చేయడం,వాటిని భారత రాజ్యాం గంలో పొందుపరచడం వంటి చర్యల ద్వారానే ఆదివాసీ సంస్కృతి, భాషలను కాపాడగలు గుతాం.తద్వారా భారత జాతి గొప్పతనాన్ని భావితరాలవారికి అందించాలి!-(లంకా పాపిరెడ్డి/డాక్టర్‌ డి.వి.ప్రసాద్‌)

చింతిస్తున్న చింతపండు రైతులు

ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు నో చెబుతున్నారు.
ప్రతి వంట గదిలో తప్పక ఉండా ల్సిన ఐటెమ్స్‌లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏవంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండుతప్పని సరి.. దేనికైనా రుచిరావాలి అంటే చింతపండు పులుపు తగలా ల్సిందే?కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?చింతపడు సాగు పూర్తిగాతగ్గిపోవడమే దానికి కారణమా..? మన్యంలో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు.దీంతో నిరాశతప్పడం లేదు. చింత పువ్వు దశలోనే ఈదురుగాలులు,వర్షాలు అధికం గా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడిరది. చాలాచోట్ల ఇదే పరిస్థితి..దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా,చింతదిగుబడి కూడా అం తంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్ప లేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సాలూరు,కొమరాడ,పాచిపెంట ప్రాం తాల్లో5 వేల క్వింటాళ్లు,సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. సాధారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారానే వస్తుంది. అయితే గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొను గోలుకు మొగ్గు చూపలేదు. 2022లో కిలో చింత పండు మద్దతు ధర 36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను 32. 50కు తగ్గించారు. ఆ ధరకు కూడా గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో 40 నుంచి 5కు పంటను అమ్ముకున్నారు.అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప,గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింత పండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈసారి కూడా బయట మార్కెట్‌ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయిం చేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పూర్వ వైభవాన్ని కోల్పోతున్న గిరి బజార్లు
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వ ర్యంలో నెల కొల్పిన గిరిబజార్లు(సూపర్‌ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి.ఏజెన్సీలోని గిరిజనులు సేక రించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకుద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం,తేనె ఇతరత్రా వాటిని విక్ర యిండంతో పాటు సాధారణ సూపర్‌ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మ కాలు సాగిస్తుంటారు.కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయిం ట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కఉత్పత్తి కూడా లేదు.ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అను సంధానంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రా చలం,ఏటూరునాగారం,ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు కార్య కలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్‌ సోప్‌ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్‌ మార్కెట్లలో కానరావడం లేదు. ప్రధానంగా జిసిసి అటవీ ఉత్ప త్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు,నీమూసబ్బులు,టర్మరిక్‌ సబ్బులు,తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పుడు సూపర్‌ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి. షికాకాయి,కుంకుడుకాయిపౌడర్‌, షాంపులు,చీపర్లు,పెసర్లు,కందులు,చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్‌ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయి స్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేం దుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలు వురు వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరా భారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్‌ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్న ప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరపైనే ‘చింత’
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) రaలక్‌ ఇచ్చింది. జిల్లాలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధాన మైన చింతపండుకు రివర్స్‌ గిట్టుబాటు ధర కల్పిం చింది. ఈ ఏడాది సీజన్‌లో కిలో చింతపండును 32.40రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.గత ఏడాదితో పోల్చుకుంటే నాలు గు రూపాయలు తగ్గించింది. ధర తగ్గింపుతో ఆగకుండా కొనుగోలుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబం ధనల ప్రకారమైతే ఏగిరిజనుడూ జిసిసికి చింత పండు విక్రయించే అవకాశం లేదు. చింతపండు పొడిగా వుండాలని,తేమ శాతం అసలు వుండ రాదని,చింత బొట్టలను చేతులతో కొట్టాలని, కర్రలు వినియోగించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే చింతపండు విక్రయించే గిరిజన రైతులకు నగదు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ప్రతి గిరిజన రైతూ బ్యాంకు ఖాతా,ఆధార్‌ కార్డు జరాక్స్‌ కాపీలు అందజేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలపై జిసిసి సిబ్బంది ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. సాలూరు మండలం లోని పట్టు చెన్నూరు, పగులచెన్నూరు, నేరళ్లవల సలో జిసిసి సిబ్బంది స్థానిక గిరిజన ప్రజాప్రతి నిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో జిసిసి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైంది చింతపండే. దీన్ని జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సేకరించి విక్రయించుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో వారి కుటుంబ అవసరా లను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జిసిసి చింతపండుకు కనీస మద్దతు ధర తగ్గించడం గిరిజ నులకు ఆశనిపాతంలా పరిణమించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జిసిసి వారిని దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండేళ్ల ధర కన్నా తక్కువ
గడిచిన రెండేళ్లలో జిసిసి నిర్ణయించిన చింతపండు ధర కన్నా ఈ ఏడాది తక్కువగా నిర్ణ యించింది. సాధారణంగా ఏటేటా అటవీ ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2021-22లో కిలో చింతపండు రూ.32గా మొదట నిర్ణయించింది. అయితే ప్రయి వేటు వ్యాపారుల కన్నా ఈధర తక్కువ కావడంతో అప్పటి జిసిసి ఎమ్డీ మరో మూడు రూపాయలు పెంచి రూ.35గా నిర్ణయిం చారు. 2020-21సం వత్సరానికి కిలో చింత పండు ధర రూ.36గా జిసిసి ప్రకటించింది. ఈ ఏడాదిలో జిల్లాలో 780మెట్రిక్‌ టన్నుల చింత పండును కొనుగోలు చేసింది. గత ఏడాది కొను గోలు చేసిన చింతపండు పూర్తిగా అమ్మకం కాకపోవడం వల్లే ఈ ఏడాది చింతపండు ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలు స్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన చింత పండు లాభదాయకమైన ధరకు అమ్ముకో వాల్సిన బాధ్యత జిసిసి సంస్థ ఉన్నతాధికారులదే. పాత చింతపండు కోల్డ్‌ స్టోరేజ్‌లో మూలుగుతున్న దనే సాకు చూపి ఈ ఏడాది ధర తగ్గించడంపై గిరిజ నులు ఆందోళన చెందుతున్నారు.అసలే కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గిరిజన రైతులకు చింతపండు ధర పెంపు ద్వారా మేలు చేయాల్సిన ప్రభుత్వంరివర్స్‌ గేర్‌ లో వెళ్ళడం వివాదాస్పద మవుతోంది.
ప్రయివేటు వ్యాపారులదే హవా
ఈ ఏడాదిలో చింతపండు కొనుగో లుకు సంబంధించి ప్రయివేటు వ్యాపారుల హవా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర తగ్గించడం,కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం,ఆన్‌ లైన్‌ చెల్లింపులు చేస్తా మన డం వంటి నిర్ణయాలు గిరిజనులను పూర్తిగా జిసిసికి దూరం చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తు న్నాయి. చింతపండు కొనుగోలు సీజన్‌కు ముందే ప్రయివేటు వ్యాపారులు గిరిజన రైతులకు అడ్వాన్స్‌ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. జిసిసి మెరుగైన ధర కల్పించినా కొంతమంది గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకే చింతపండు విక్రయిస్తారు. తాజా నిబంధనల ప్రకారమైతే గిరిజనులంతా ప్రయివేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చింతపండు కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను తగ్గించిందనే అనుమానాలు వ్యక్త మవుతు న్నాయి. దీనివల్ల జిల్లాలోని గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, జియ్య మ్మవలస, పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట,మక్కువ, మెం టాడ,ఎస్‌.కోట మండ లాలకు చెందిన వేలాది మంది గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాం తంలోని గిరిజనులకు చింత పండు సేకరణతో వచ్చిన ఆదాయమే ఏడాది పొడవునా వారి కుటుం బ పోషణకు వినియోగిస్తారు.
కాఫీ ధర పెంపు, చింతపండు ధర తగ్గింపు
అరకు ప్రాంతంలో పండిరచే కాఫీ, స్ట్రా బెర్రీ పండ్లుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాఫీ,స్ట్రా బెర్రీ పండ్లుకు గిరాకీ ఉండడంతో ధరలను పెం చింది. చింతపండుకు డిమాండ్‌ ఉన్నప్పటికీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విక్రయిం చడంలో జిసిసి అధికారులు విఫలమయ్యారు. వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చింతపండు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం రోజంటే ఎందుకంత భయం..
గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్ప త్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు..అక్కడ పండిర చే పంటలకు ఆర్గానిక్‌ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌ వస్తుంది. అయి తే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందు కంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపో తుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటు ఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగు తాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్‌ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ 40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్‌ ప్యూరిఫైయర్‌ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్‌కి వచ్చేసరికి డబల్‌ అయి పోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండిరచిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్‌ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు.అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

విద్య హక్కు వీడని చిక్కు

-ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ` ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చు. లాటరీ విధానంలో సీట్లను కేటాయి స్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. సెకండ్‌ రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు ఏప్రిల్‌ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితు లకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా?విద్యా హక్కు చట్టం ప్రకారం6నుండి14సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశా లలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటా యించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్‌ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపి టేషన్‌ ఫీజులు ఫీజులు వసూలు చేయడంపిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవు తుంది. డ్రాపౌట్‌ స్టూడెంట్‌లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి,3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమి కోన్నత పాఠశాల ఉండాలి.ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి,ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు..ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళి కను తయారు చేయాలి,ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వ హించ కూడదు,విద్యావిధానం ఆధునిక ధోర ణులులో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందిం చేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవా లని ఈ చట్టం పేర్కొంటోంది. ప్రభుత్వ టీచర్‌ ప్రైవేట్‌ ట్యూషన్లు ప్రైవేట్‌ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్‌ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిం చాల్సిన అటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొద లైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలల హక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవు తుందని ఉపాధ్యాయుడు భావి స్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజే సలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనా భ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక (కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసిం చాలి,విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండ న లేని పాఠశాల వాతా వరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతిగది ఉండాలి.పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యా యుడు నిరంతరం మూల్యాం కన ద్వారా అంచ నా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీససౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడంవల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ ను తగ్గిం చాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ తగ్గించడంతో పాఠశా లల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితం గా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది.విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథ మిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. విద్యా హక్కు చట్టం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తుంది కానీ వ్యంగ్యంగా దీన్ని సాధ్యం చేయగల ప్రైవేట్‌ విద్యా ప్రదాతలను పరిమితం చేస్తుంది. చట్టం ప్రారంభానికి ముందు స్థాపించబడిన పాఠశాలలు మూడు సంవత్సరాలలోపు ఆర్‌టీఐ షెడ్యూల్‌లో పేర్కొ న్న నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని లేదా లేకుంటే మూసి వేయ బడతాయని సెక్షన్‌ 19 పేర్కొంది. చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన పాఠశా లలు ఆర్టీఈ షెడ్యూల్‌లోని నిబంధనలను మాత్రమే పాటించాల్సి ఉండగా,గుర్తింపు లేని పాఠశాలలు అదనంగా రాష్ట్ర నిబంధనలను కూడా పాటించాలి.చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు ప్రణాళిక లేని కాలనీల్లోనే ఉండి ప్రాథమిక స్థాయి వరకు బోధిస్తున్నారు. గుర్తిం పు పొందిన పాఠశాలలను కొనుగోలు చేయలేని మరియు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ పాఠశాలలు చౌకైన ప్రత్యామ్నాయం. ఢల్లీిలో గుర్తింపు పొందని పాఠశాలల సాంప్రదాయిక అంచనా ప్రకారం ఒక్కొక్కటి 200 మంది పిల్లలతో దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రస్తుత ఢల్లీి రాష్ట్ర నిబంధనల ప్రకారం, పాఠశాలలకు 800 చదరపు గజాల స్థలం ఉం డాలి మరియు ఆరవ వేతన సంఘం తర్వాత ప్రవేశ స్థాయిలో రూ.23,000 ప్రభుత్వ జీతంతో సమానంగా ఉపాధ్యాయుల జీతం చెల్లించాలి.అదనంగా,విద్యా హక్కు చట్టం ప్రతి పాఠశాలకు ఆట స్థలం ఉండాలని నిర్దేశి స్తుంది. ఈ స్థలం మరియు ఉపాధ్యాయుల జీతం అవసరాలు గుర్తించబడని పాఠశాలలకు చేరుకోవడం కష్టం.ఈ ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐదు గుర్తింపు పొందిన పాఠశా లలు,తొమ్మిది గుర్తింపు లేని పాఠశా లలను షహదారాలో సందర్శించారు. గుర్తింపు పొందిన ఐదు పాఠశాలల్లో ఏదీ ప్రస్తుత భూమి ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు నిర్ణీత ఉపాధ్యాయుల వేతనాన్ని చెల్లించలేక పోయింది. ఒక గుర్తింపు పొందిన పాఠశాల నిర్వాహకుడు తన పాఠశాల 200 చదరపు గజాల స్థల ప్రమాణానికి అనుగుణంగా ఉన్నం దున గుర్తింపు పొందాడు, అయితే ఆ సమయం లో రూ.80,000లంచం చెల్లించాల్సి వచ్చిం ది. అతను ఒక పిల్లవాడికి నెలకు రూ. 250 రుసుము వసూలు చేస్తున్నప్పుడు, అది రూ. 500గా లెక్కించబడుతుంది, తద్వారా అతను ఉపాధ్యాయుని జీతం వాస్తవానికి చెల్లించే దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.గుర్తింపు లేని పాఠశాలలు ఏవీ భూ ప్రమాణాలకు అను గుణంగా లేవు. కనీసం ప్రణాళిక లేని కాలనీల్లోనైనా భూ నిబంధనలను సడలించా ల్సిన అవసరం ఉంది. పాఠశాలలో తగినంత సంఖ్యలో వెంటిలేషన్‌ మరియు కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే గుర్తింపు ఇవ్వడం ఒక ఎంపిక. అనేక గుర్తింపు లేని పాఠశాలల్లో తరగతికి 15-20 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పిల్లలకి అవసరమైన స్థలం ప్రకారం గది పరిమాణాన్ని లెక్కించడం మరింత సమంజసంగా ఉంటుంది. అలాగే, ఉపాధ్యా యుల జీతాలు పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉండాలని ప్రభుత్వం కోరుకోనప్పటికీ, అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠ శాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయితీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠ శాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్య వేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించ కుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశా లలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు.
వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం
ఆర్టికల్‌ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికం గా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్‌ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వే షన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012 లో ప్రతిమా ఎడ్యుకేషనల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండి యా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలు వరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 15(5) లను ఆమోది స్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ లలో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వే షన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్‌ 13(1) ప్రకారం ఏర్ప డిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్ల మెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి100% అక్షరా స్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాం గం నిర్దేశించి నట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికల కు నాణ్యమైన విద్యను అందించవలసిన అవ సరం ఉంది.-జిఎన్‌వి సతీష్‌

1 6 7 8 9 10 48