కోయ భాష అస్తిత్వాన్ని బతికిద్దాం

పిల్లలే కవులుగానూ,కథకులు గానూ రచయితలుగామారి తమకోసం తాము కవి తలు,కథలు,పాటలు రాసుకునే అరుదైన సంఘటనతో మొదటి రోజు బాల సాహిత్య కార్యక్రమం అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం రామన్నపాలెంలో అక్టోబర్‌ 5న కార్యశాల ప్రారంభమైంది. కోయత్తోర్‌ బాట మరియు సమత సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదురోజుల కోయబాష బాల సాహిత్య కార్యశాలఅక్టోబర్‌ 5నుంచి 9వ తేదీవరకు కొనసాగింది.6 నుండి 14 సంవ త్సరాల వయస్సు గల చిన్న పిల్లలు తాము రాసిన కవితలు, పాటలు, కథలు రాసి వినిపించిన తీరు అందరిని ఆకట్టు కుంది.’’ పిల్లల కు సరిjైున అవకాశం, ప్రోత్సాహం ఇస్తే పెద్దల తో సమానం గల కవితలు, కథలు ఎన్నెన్నో రాస్తారని‘‘కార్యశాల సమన్వయకర్తలు జీ.యాదయ్య,కె.పాండు, డి.భీమమ్మ,జె.మల్లయ్య అన్నారు.పిల్లలను ఐదుగురు గ్రూప్‌లుగా విభజించి వాటికి బంతి, మల్‌ పిట్ట,ఎడజు డువ్వు,గులాబీ అని పేర్లు పెట్టి,అందరికీ చిన్న చిన్న కథల,పాటల పుస్తకాలు ఇచ్చి,వీటి మాదిరి మీరు కూడా కవితలు,కథలురాసి,చదివి వినిపించాలని చెప్పి రాయించి‘‘కార్యశాల నిర్వహించిన తీరు వివరించారు.ఇందులో తొలి కోయ బాల సాహిత్య రచయిత్రి భీమమ్మ తాను రాసిన కొన్ని పిల్లల పాటలు చదివి వినిపించి,పిల్లల లను ప్రోత్సాహం నింపింది.కోయ బాష కార్య కార్యకర్తలు తెల్లంకృష్ణ,మోసం సత్యనారా యణలు తమ నాట్య గీతాలలో పిల్లలను పాల్గొనేలా చేసిన తీరు పిల్లలలో కొత్త ఉత్సా హం నింపింది.ఎంతో దూరం నుండి కొయ తురు బాట పూర్వ విద్యార్థులు విచ్చేసి ఈ కార్యశాలలో పాల్గొనడం ప్రశంస నీయమని కార్యశాల నిర్వాహాకులు తెలియ జేశారు.ఈ కార్యశాలలో రామన్నపాలెం పిల్లలూ,కుంజ వారి గూడెం పిల్లలూ ఉత్సాహంగా పాల్గొ న్నారు.కోయత్తోర్‌ బాట పూర్వ ఉపాధ్యా యులూ,బాల సాహిత్య అభిమానులూ, మొదటితరం రచయిత శ్రీపూనెం బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు కనుమరుగవుతూ వస్తున్నాయన్నారు.ఆదివాసీ భాషలు అంతరించే దశకు చేసుకుంటున్నాయి. గత ఇరవైఏళ్లుగా కోయ భాషలో బాల సాహిత్యం అభివృద్ధికి కోయత్తర్‌ బాట విశేష కృషి చేస్తుందన్నారు.ఇందులో భాగంగానే పూర్వ ప్రాధమిక సాహిత్య సృజనపై ఐదురోజుల కార్యక్రమం గిరిజనబిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు.భాష మనుగడను పరిరక్షించడానికి స్వచ్ఛంధ సంస్ధలు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. – (జీ.యాదయ్య)

బ్రతిక ఉన్నా లేనట్లే..

‘‘ ప్రపంచం ముందుకు వెళ్తోందని, సాంకేతి కతని అందిపుచ్చుకుంటున్నా మని మనమం దరం అనుకుంటాం.కానీ ఇప్పటికీ ఆధార్‌ అంటే ఏంటో తెలియని గిరిజనులు, ఆధార్‌ కార్డ్‌ ప్రయోజనం పొందలేనివారు, తద్వారా పభుత్వ సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నవారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు.అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఆధార్‌ కార్డు,రేషన్‌కార్డు,ఆరోగ్యశ్రీకార్డు లేని గిరిజన కుటుంబాలు అనేకం ఉన్నాయి. చాలా బడిఈడు పిల్లలు ఆధార్‌కార్డులు లేక చదువులకు దూరమవుతున్నారు.’’(గునపర్తి సైమన్‌)

అందరికీ ఆధార్‌ ఓవరం.ఆధార్‌ కార్డ్‌తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీగిరిజనులకు మాత్రం అది ఇంకా ఓశాపంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్‌ సౌకర్యానికి దూరంగా ఉంటు న్నారు. చిన్నపిల్లల్ని స్కూల్‌లో వేయాలంటే ఆధార్‌ తప్పనిసరి,రేషన్‌ కార్డ్‌ కావాలంటే ఆధార్‌ ఉండాలి,అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా ఆధారే కీలకం.కానీ ఆధార్‌ గురించి, పథకాల గురించి సరైన అవగాహన లేక గిరిజనులు వీటన్నిటికీ దూరమైపోయారు. వీరితోపాటు సంచార జాతుల్లో సగటున 50శాతం మంది గిరిజనులకు ఆధార్‌ కార్డ్‌ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు.ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు ఎన్ని ఏర్పాటు చేసినా,ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆధార్‌ కార్డు పొందలేని స్థితిలో చాలామంది గిరిజనులు ఉన్నారు.దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ బల్లిపురం అనే ఓగిరిజన గ్రామం.అక్కడ కొండదొర,నూకదొర,భగత్‌, మన్నెదొర తెగలకు చెందిన సుమారు 39మంది కుటుంబాలున్నాయి.మొత్తం జనాభా120మంది.ఈ గ్రామంలో అధికశాతం వలస వచ్చిన గిరిజన జనాభా అధికం.దీంతో సుమారు 25మందికి పైగా ఆధార్‌ కార్డులు, రేషన్‌కార్డులు,ఓటర్‌ ఐడీ కార్డులు లేవు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు లేక ఓటును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిరది.అల్లూరి జిల్లా బొర్రా,కొయ్యూరు,అనంతగిరి మండ లాల్లోని మారుమూల పంచాయితీల నుంచి దశాబ్దాల క్రితం మైదాన గిరిజన గ్రామా లకు వలస వచ్చి కూలీ పనులకు వెళ్లే గిరిజన కుటుంబాలకు ఆధార్‌కార్డులుగానీ, రేషన్‌కార్డులుగానీ లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆఖరికి వారికి పుట్టిన బడిఈడు పిల్లలు చదువుకు సైతం దూరమవుతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ పరిధిలోగల బల్లిపురం తదితర గిరిజన గ్రామాలు మైదాన ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి.అల్లూరి జిల్లా నుంచి వలస వచ్చిన అనేక మంది గిరిజనులకు నేటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచు కోలేదు.కనీసం అవ్వతాతలకు, వితంతువు లకు,దివ్యాంగులకు సామాజిక పింఛన్‌ అందని వైనం నెలకొంది.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామానికి చెందిన కర్రిచిలకమ్మకు సామాజిక ఫించన్‌ అందక వృద్దాప్యంతో కొట్టిమిట్టులాడుతున్నారు. కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రా రామచంద్రర్‌కు ఆధారకార్డు లేదు.జీకేవీధి మండలం దమ్మయన్న పల్లి గ్రామపంచాయితీ సింగనపల్లి గ్రామానికి చెందిన వీర్రాజి (11)ఆధార్‌కార్డు లేక చదువుకు దూరంగా ఉన్నారు. పంటపొలాలు,బొగ్గు,ఇటుకల బట్టీల వద్ద ఏడాదిలో తొమ్మిది నెలలు జీవనం సాగించే ఎస్టీలకు ఎలాంటి ధ్రృపత్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదుకు అర్హత కోల్పోతున్నారు. ఆర్డీవో కార్యాలయం జారీ చేసిన జనన ధ్రువపత్రం కావాలని ఆధార్‌ కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో నిరుత్సాహంతో వెనుదిరుగు తున్నారు.ఇళ్లు,పొలాల్లో పురుడు పోసుకున్న చిన్నారుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయని కారణంగా పంచాయితీ కార్యాల యాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు.దీంతో వారికి ఆధార్‌కార్డులు జారీ చేయడం లేదు.ఆధార్‌ కార్డు లేని కారణంగా వీరికి రేషను,ఓటరుకార్డులు లేవు.పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టిన ఏ సంక్షేమ పథకాలు వీరిదరి చేరడం లేదు. వృద్దులు,వితంతువులు,దివ్యాంగులు ఉన్నా పింఛను ఇతర సౌకర్యాలు అందడం లేదు. బడిలో పేరు నమోదు చేయాలన్నా ఆధార్‌ తప్పని సరి కావడంతో పిల్లలు చేరలేని పరిస్థితి నెలకొంది.ఎస్టీ కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం జిల్లాలో అయిదువేల మందికిపైగా ఆధార్‌ కార్డు లేని గిరిజనులు ఉన్నాట్లు అంచనా.గతంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు నమోదు కార్యక్రమం జరిగేది.ప్రస్తుతం ఆవిధానం నిలిపివేయడంతో ఇటీవల జన్మించిన పిల్లలు,ఇంకా ఆధార్‌ తీసుకోని వారు అవస్థలు పడుతున్నారు.అంగన్‌వాడీలో పోషణ,ఉచిత బియ్యం,ప్రబుత్వ ప్రయోజనాలు కోల్పోతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో సుమారు 105మంది ఆధార్‌ లేనివారినిఅధికారులు గుర్తించారు. వీరిలో బల్లిపురంలో సుమారు 70మంది పాఠశాల విద్యార్థులు ఉండగా,50మందికిపైగా చిన్నారులు ఉన్నారు.వలస పనులకు వెళ్లేన గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే..కనీసం ప్రభుత్వ బీమా సొమ్ము కూడా వారికి రాదు.ఎందుకంటే వారికి ఆధార్‌ లేదు.దీంతో ఆరోగ్యశ్రీకార్డు,రేషన్‌ కార్డులు కూడా లేని పరిస్ధితి నెలకొంది. చాలామంది గిరిజనులు అసంఘటిత రంగంలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరంతా ఏదైనా ప్రమాదానికి గురైనా ఇచ్చే బీమాకు వారు అనర్హులు మారుతున్నారు.ఎలాంటి పత్రాలు లేకపోయినా,వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్‌ నమోదు చేసుకుంటారు.
పింఛన్‌ లేదు..
మాది బల్లిపురం గిరిజన గ్రామం. పదిహేనేళ్లక్రితం బొర్రా పంచాయితీ నుంచి బల్లిపురం వలస వచ్చేశాం. ఇప్పుడు నాకు 65సంత్స రాలు.ఆధార్‌కార్డు గానీ,రేషన్‌కార్డు కానీ లేదు. భర్త చనిపోయి పదేళ్లువుతుంది. అప్పటి నుంచి ఆధార్‌కార్డు లేక పింఛన్‌ ఇవ్వలేదు.ఆరోగ్యశ్రీ కార్డు లేక ముగ్గురు కొడుకులను అనారోగ్యం తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.వారికి పుట్టిన ఒక మగబడ్డ (15వయస్సు)ఆధార్‌కార్డు లేక చదవించలేకపోయాను.
తమ గ్రామంలో ఆధార్‌కార్డులు,రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు చాలామందికి లేవని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సుమారు ఊరులో సగానికిపైగా కుటుం బాలకు ఆధార్‌కార్డులు లేవు.దీనివల్ల చాలా మంది బడిఈడు పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారులకు తమ గోడును చెప్పుకున్నా పట్టించుకునే నాధుడు కరవయ్యారు.`ఆగారి బంగారుబాబు,బల్లిపురం గ్రామ పంచాయితీ సభ్యుడు

సంయమనం అవశ్యం

తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమ ణ్యస్వామి, టిటిడి మాజీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసిపి కేంద్ర కార్యాల యంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతు న్నాయి. తాము ఎంతో పవిత్రంగా భావించి, పూజించి, భుజించిన స్వామి వారి లడ్డు అపవిత్రమైనదా! జంతు వుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా! అంటూ దేశవ్యాపి తంగా వున్న కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందో ళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగి వుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసు లు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. అందుకు చట్టం తన పని తాను చేయాలి.ఈ పని సక్రమంగా చేయాల్సి న పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారు.
తిరుపతి లడ్డూ-కల్తీ నెయ్యి అంశంపై వారం రోజులుగాచర్చసాగుతోంది.నిజానిజాలను నిర్ధారించి,కారకులపై చర్యలు తీసుకోవడంపై చూ పాల్సిన శ్రద్ధను-అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒక దానిపై ఒకటితీవ్రమైన నిందారోపణలు చేసుకో వటంపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తుల మనో భావాలు, క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టే సంఫ్‌ు పరివార్‌ శక్తు లకు ఊతమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుపతి-తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. తిరు మల క్షేత్రంలోనే కాదుబీ ఎక్కడైనా సరే ప్రసాదంగా నో,ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుం డా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారిం చాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినుసులో నాణ్యత లోపించినా, కల్తీ కనిపిం చినా నిబంధనలప్రకారం వ్యవహరించాలి. ఆయా దినుసులను వాడకంలోకి వెళ్లకుండా నిలిపి వేసి, సరఫరా సంస్థలపైనా, నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పైనా తగు చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావా లను గౌరవించాలన్నాబీ పౌరుల ఆహార నాణ్యత కు,ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నా-ఇదీ, పాటించాల్సిన పద్ధతి!
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమలులో ఉన్నాయి.సరఫరా సంస్థలు పంపే దినుసులు నిర్దే శిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? లేదా? అనితనిఖీ చేసి, సరిగ్గా ఉన్నవాటిని స్వీకరించటం, లేనివాటిని వెనక్కు పంపటం చేస్తున్నాయి. గతంలో టిడిపి,వైసిపిప్రభుత్వాలు,అవి నియమించిన పాలక వర్గాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. తనిఖీ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమూ లేదా ఉద్దేశపూర్వక విస్మరణ ఎక్కడ,ఏ దశలో జరిగినా గుర్తించటం చాలా సుల భం.కారకులను గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభం. ఈ పనులన్నీ చేయటానికి అధికా రిక వ్యవస్థలూ,దొంతరలూ తిరుమలలో నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యాన సమ స్యను సరిచేయాలి తప్ప వివాదాస్పదం చేయడం తగదు. మనోభావాలను గాయపరిచే, మత వైష మ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం మరీ ప్రమాదకరం. కల్తీని కనుక్కోవటానికి, కార కులను శిక్షించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతు లను అవలంబించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏకం గా మత వైషమ్యాలను రెచ్చగొట్టే మాటలతో లడ్డూ అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారు. కొన్ని మతాలను,ఆ మతస్తుల ప్రార్థనా స్థలాలను ప్రస్తా వించారు. ఇలా వైషమ్యాలను సృష్టించటం అభ్యం తరకరం. చాలా సాధారణంగా, సరళంగా పరిష్క రించాల్సిన అంశానికి మతపరమైన ఉద్రేకాలను, ఉద్రిక్తలను అంటుగట్టి,రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వీరంగానికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద పొర పాటు. అధికార టిడిపి-జనసేన, ప్రతిపక్ష వైసిపి ఈ విధమైన పొరపాట్లతో సామరస్యానికి చేటు తెస్తున్నాయి. ఒక పార్టీ ప్రాయశ్చిత్తమంటే- మరొక పార్టీ దేవాలయాల్లో పూజలు చేస్తామంటూ ప్రక టించింది.రాజకీయపార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలితప్ప వ్యక్తిగత మతవిశ్వాసాలపై కాదు. మతాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకో వటంపై అసలే కాదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వరద బాధితులకు కేంద్ర సహాయంలో నిర్లక్ష్యం తదితరఅనేక ప్రజాసమస్యలు పక్కకుపోతు న్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మతోన్మాదాన్ని ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి-ఆర్‌ఎస్‌ ఎస్‌ పొంచి చూస్తున్నాయి.అంతర్వేది,రామతీర్థం తది తర అంశాలను ఎంచుకొని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.ఇలాంటి కుయుక్తులపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, సామరస్యానికీ ప్రమాద కరం.సిట్‌ నివేదిక వచ్చేవరకూ రాజకీయ పార్టీలు లడ్డూ అంశంపై ఎలాంటి ఉద్రేక ప్రకటనలూ చేయకుండా సంయమనం వహించాలి.
(`వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు) – (ఆర్‌.వెంకట సుందరరావు)

కూటమి వంద రోజుల పాలన

ఏపీకి భరోసా లేకుండా లేని నాడు,ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్న నేపథ్యంలో అసలు ఆశలు అన్నవి ఆవిరి అయిన వేళ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది.మూడు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో ఇదే తొలిసారి.ఎంతో అనుభవం కలిగిన చంద్ర బాబు అలాగే ప్రజల కోసం తపన పడే పవన్‌ కళ్యాణ్‌,కేంద్రంలో రెండు టెర్ములు సక్సెస్‌ ఫుల్‌ గా అధికారాన్ని అందుకుని ప్రజలకు మేలైన పాలన సాగించిన బీజేపీ కలసి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాయి.జూన్‌ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు స్వీకరించారు.అలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సరిగ్గా సెప్టెంబర్‌ 20తో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులలో ప్రభుత్వం ఏమిచేసింది అన్నది అంతటా చర్చించాల్సిన విషయమే. నిజానికి ఒకప్రభుత్వానికి వంద రోజులు అన్నది చాలా చిన్నది.అయినా సరే ఈ వంద రోజులలో చంద్ర బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజ లలో కొత్త భరోసా కల్పించింది.ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ఏపీకి రాజధాని ఆవశ్యకతను గుర్తించి అమరావతిని మళ్లీ పూర్వపు దారిలో నడి చేలా చర్యలకు ఉపక్రమించింది. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు మొదలెట్టిన గత ప్రభుత్వం దిగి పోగానే వైసీపీ వచ్చి వాటిని అలా వదిలేసింది. అయితే తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే పాత నిర్మాణాలను పరిశీలించి వాటిని ఎక్కడ నుంచి నిర్మాణం పనులు ప్రారంభించవచ్చు అన్నది నిపుణులతో చర్చించి ఒక గాడిన పెట్టే కార్యక్రమం ఆరంభించింది. అంతే కాదు అమరావతి రాజధాని అంటే దాని చుట్టూ తుప్పలతో అడవిని తలపించే లా ఉన్న వాటిని అన్నీ తొలగించేలా పెద్ద ఎత్తున జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. దాని కోసం 37 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంద్వారా అమరావతికి కొత్త రూపు ఇవ్వ డానికి ప్రయత్నాలు స్టార్ట్‌ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంవద్ద ఉన్న పలుకుబడితో అమ రావతి రాజధానినిర్మాణానికి అవసరం అయిన నిధులను పోగుచేసే పనిలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది. కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంక్‌ ఏకంగా పది హేను వేలకోట్ల రూపాయలు తీసుకుని రావడం అంటే అది గ్రేట్‌ అనే చెప్పాలి. దాంతో పాటు అమరావతిలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగిస్తు న్నారు. గతంలో అమరావతిలో భూములు కేటా యించిన వారిని పిలిచి వారితో సంప్రదింపులు చేయడం ద్వారా వారి పనులు ప్రారంభించ డానికి కూడా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నారు.అలాగేఎన్నారైలను కూడా పిలిచి మరీ వారిద్వారా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలని మాస్టర్‌ ప్లాన్‌ వేస్తు న్నారు. అమరావతిలో విద్యా సంస్థలు ఇతర కార్య కలాపాలు మొదలైతే కచ్చితంగా అక్కడా యాక్టివిటీ స్టార్ట్‌ అవుతుందని దాని ఫలితంగా అమరావతి రూపూ షేపూ మారిపోతాయని బాబు భావిస్తు న్నారు. మరో వైపు అమరావతి రాజధాని విషయం లో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు కూడా చేస్తోం ది.గతంలోలా కాకుండా గుంటూరు, విజయ వాడలను కలుపుకుని జంట నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇక అమరావతి నుంచి భారీ రైల్వే లైన్లు వేసేలా కేంద్రం నుంచి సహకరం కూడా అందు కుంది.అదే విధంగా ఆరులైన్ల రోడ్లను కూడా నిర్మించడం ద్వారా అమరావతిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు దగ్గరచేసేలా కనెక్టివిటీ ఉండేలా కూడా ప్రయత్నం చేస్తోంది.దీంతో గతపదేళ్ళుగా రాజధాని లేదు అని మానసికంగా ఎంతో అవేదన చెందుతూ ఇతర రాష్ట్రాల వారితో ర్యాగింగ్‌కి గురి అయిన ఏపీ ప్రజానీకానికి కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాజధాని పేరిట ఒక రాజసం కల్పించింది అని చెప్పాలి. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌. ఇది ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్‌. దీని విషయంలో 2014 నుంచి 2019దాకా టీడీపీ ప్రభుత్వం చాలానే వర్క్‌ చేసి పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా స్లో డౌన్‌ అయింది. దాంతో ఎపుడో పూర్తికావాల్సిన పోలవరం కూడా పడకే సింది.టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్య తలుగా పోలవరంని కూడా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్ళి పెండిరగులో ఉన్న 12 వేల కోట్ల రూపాయ లను విడుదల చేయించుకుంది.దాంతో పోలవరం పనులకు ఇపుడు ఆటంకాలు లేకుండా పోయాయి. నవంబర్‌ నుంచి పోలవరం పనులు శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాలైన ప్రయత్నాలను కేవలం వందరోజుల వ్యవధిలోనే కూటమి ప్రభు త్వం చేయడం మరో ప్లస్‌పాయింట్‌. ఇక నిరు ద్యోగా యువత కోసం మెగా డీఎస్సీని 16 వేలకు పైగా టీచర్‌ పోస్టులతో భర్తీ చేయడానికి చంద్ర బాబు సీఎంగా చేసిన మొదటి అయిదు సంతకా లలో ఒకటిగా పెట్టడం నిజంగా మరో విజయం గా చూస్తున్నారు.అంతేకాదు చంద్రబాబు సామా జిక పెన్షన్లు కూడా భారీగా పెంచారు. మూడు వేల రూపాయలను ఒక్క సారిగా నాలుగు వేలకు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రెట్టింపుచేసారు. ఈ విధంగా అరవై ఆరు లక్షలకుపైగా పెన్షన్‌ లబ్దిదారుల కళ్ళలో వెలుగు నింపారు.మరోవైపు చూస్తే ల్యాండ్‌ టైటిలిం గ్‌ యాక్ట్‌ ద్వారా రైతులు తమ భూములు ఎక్కడ పోతాయో అని నానా బాధలు పడుతూ అవేదన చెందారు.కూటమి ప్రభుత్వం అధికారంలోని వస్తూనే ఆయాక్ట్‌ని తొలగించింది. దాంతో రైతులు అంతా పూర్తి భరోసాను పొందారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను టీడీపీకూటమి ప్రారంభిం చడం మరో శుభ పరిణామం.దీనివల్ల పేదల ఆకలి పూర్తిగా తీరుతోంది.ఇది దేశంలోనే అద్భుత పథకంగా మారింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ ఏపీకి తేవాల్సిన నిధులను తెచ్చుకుంటూ మరో వైపు ఏపీని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ తొలి అడుగులే బలంగావేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ముఖ్యంగా గతంలో ప్రజలలో ఉన్న అభద్రతా భావం ఇపుడు లేదు.అంతే కాదు భవిష్యత్తు మీద ఒకగట్టి నమ్మకం ఏర్పడిరది. ఏపీ సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉంది అని ప్రతీ ఒక్కరూ భావిస్తు న్నారు. ఏపీ సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుని అభివృద్ధిలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు ఇవ్వగలి గారు. మొత్తానికి వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా చంద్రబాబు ఆత్మ విశ్వా సంతో ముందుకు సాగారు.దానికితాజా ఉదా హరణ బెజవాడను ముంచెత్తిన భారీ వరదలు. అటువంటి సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి పదిరోజుల పాటు శ్రమించి ప్రజలకు తగిన సహాయం అందించగలిగారు. దాంతో వందరోజుల పాలన ఏపీకి మేలు మలు పుగా ఉందని అంతా భావిస్తుననారు.
వంద రోజుల అసహనం, అపనమ్మకం
నరేంద్ర మోడీ సర్కారు మూడో దఫా పాలనకు వంద రోజులు నిండిన పేరుతో హడా వుడి చేయా లని బిజెపి, సంఘపరివార్‌లు ఎంత హంగామా చేసినా వాస్తవాలు మాత్రం వెక్కిరిం చేలా గోచరిస్తున్నాయి.నిజానికి మూడోసారి వచ్చిన ప్రభుత్వానికి ఇవేవీ పెద్ద సందర్భాలు అవసరం లేదు. అయితే ఈసారి కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ఏర్పడిన తీరులోనే ఆబండారం దాగుంది. నాలుగు వందల జపంతో మొదలై చివరకు అందులో సగం దగ్గర ఆగి అన్య పక్షాల మద్దతుపై ఆధారపడి రాజ్యం చేయవలసిన రాజకీయ దురవస్థ అడుగ డుగునా అడ్డుచక్రం వేస్తున్నది.లాంఛనంగా జర పాల్సిన ఈవంద రోజుల వేడుకను పెద్దఉత్స వంలా ప్రచారం చేసుకోవడంలోనే బలహీనత స్పష్టమవుతుంది.ఒకసారి నెట్‌ పరికిస్తే అన్ని ఇంగ్లీ షు పత్రికలలోనూ చాలా జరిగిపోయిందని రైట ప్పులు రాయించుకోవడం, అందరూ అచ్చు గుద్ది నట్టు ఒకే జాబితా రాయడం బట్టి వాటికి ఎలాంటి ఆదేశాలు వచ్చిందీ తెలిసిపోతుంది. మంగళవారం నాడు మోడీ ‘సుభద్ర’పేరుతో ఒకపథకం ప్రారం భిస్తూ తాము ఎన్ని చేశామో ఏకరువు పెట్టారు. నిజానికి ఈఅపనమ్మకం ఎన్నికల ఫలితాలు రాక ముందే మొదలైంది.రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గతప్రభుత్వమే చర్చకు పెట్టడం వంటి ప్రహసనం గతంలో ఎన్నడూ జరిగి వుండదేమో!కానీ మోడీమోతకు అవన్నీ అవసరమై నాయి.ముందే నిర్ణయించాము గనక ఆవంద రోజుల పనులు చేశామని ఆయన ఇప్పుడు చెప్పు కుంటున్నారు.మరోవైపున హోంమంత్రి అమిత్‌షా కూడా అదే పనిలో వున్నారు. మూడుకోట్ల కొత్త ఇళ్లనిర్మాణం,యువతకు సహాయ పడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి,కొత్త పెన్షన్‌ పథకం,11లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయంఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ,ఇప్పుడు కూడా స్పష్టత లేనివే. వచ్చిన మేరకు కూడా ఉద్యమాల ఒత్తిడికి జంకి మొక్కు బడిగా ప్రకటించినవి వున్నాయి. పదేళ్ల తర్వాత కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేక పోయామని ప్రధాని పరోక్షంగా ఒప్పుకుంటు న్నారన్నమాట.ఇక నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డుస్థాయిలో వుంటే వారి పేరి ట కార్పొరేట్లకు నెలజీతం జమ చేయడం ఓ విపరీ త విధానం. వీటినే మహత్తర విజయాలుగా మోడీ సర్కారు గానీ ఆయన పార్టీగానీ ప్రచారం చేసుకో వడం,ఎన్‌డిఎ భాగస్వాములుగా వున్న పార్టీలు వంత పాడటం హాస్యాస్పదం. ఇదేగాక విదేశాంగ విధానంలోనూ గొప్పఫలితాలు సాధించినట్టు మరో ప్రచారం. – జి.ఎన్‌.వి.సతీష్‌

సమత రవికి ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు

వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు.విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’..అంటూ భరోసా ఇచ్చారు.వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఆయనే రవి రెబ్బాప్రగడ. ఆయన సేవలకుగాను ఇప్పటికే ‘లక్ష్మీపత్‌ సింఘానియా యువ నాయకత్వం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించగా తాజాగా అక్టోబర్‌ 4న మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం సమత రవిని వరించిన సందర్భంగా…
రవి పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అమాయకులైన నిరుపేద గిరిజనుల సాదక బాధకాలు ఆయన్ని బాగా కలచి వేశాయి.గ్రామీణాభివృద్ధి అంశంపై స్నాతకోత్తర పట్టా(పీజీ)పుచ్చుకున్న ఆయన బహుళజాతి సంస్ధల్లో వచ్చిన ఉద్యోగావకా శాన్ని వదులుకున్నారు.34ఏళ్ల క్రితం ఓసామా జిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆయన సేవలకు గుర్తింపుగా ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2024’పురస్కారాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తి ఎన్‌.కోటిష్వరసింగ్‌ అందుకున్నారు.ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రముఖ తీర్పులకు దారితీసిన న్యాయ పోరాటం చేసిన వ్యక్తులను,ప్రముఖ తీర్పులకు దారితీసిన విజేతలను సత్కరించడానికి ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2023’కార్యక్రమాన్ని ప్రారంభించింది.రెండవ సంచికను నిర్వహించిన న్యాయపోరాటం చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదోవ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజన హక్కులు, పర్యా వరణం,వనరుల పరిరక్షణపై పనిచేస్తున్న రవికి ఈఅవార్డు లభించింది.
అవార్డు ఎంపిక జ్యూరీ..
సమత వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌,ఇతర రాష్ట్రాలలో న్యాయం కోసం సమత చేసిన అలుపెరగని పోరాటం కోసం ప్రముఖ జ్యూరీ ‘గిరిజన ఎస్సీ,ఎస్టీ విభాగంలో అవార్డు గ్రహీతగాఎంపిక చేసింది.ఈ అవార్డుల ఎంపికను ప్రముఖ జ్యూరీ అవార్డు గ్రహీతలను నిర్ణయించారు.ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి,మీనన్‌, సాయుధ దళాల ట్రిబ్యునల్‌ ఛైర్మన్జస్టిస్‌ రాజేంద్ర,ఢల్లీి హైకోర్టు మాజీ న్యాయ మూర్తి,జస్టిస్‌ కైలాష్‌ గంభీర్‌,తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండ రామ్‌,ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు,సీనియర్‌ న్యాయవాది, మోహిత్‌ మాథుర్‌,సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు,ఢల్లీి హైకోర్టు వికాస్‌ పహ్వా,ఢల్లీి మాజీ ప్రత్యేక పోలీసు కమిషనర్‌ సంజయ్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టుమ ణిందర్‌ సింగ్‌ జ్యురీస్‌ సభ్యులుగా ఉన్నారు.
నేపథ్యం ఇదీ..
దేశం యావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవి చూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు.ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా సమత వాదన సరైం దేనని తీర్పు పొందిన ఘనతకు మూల కారకు డాయన. సమతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1997)లో సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని గిరిజన సంఘాల హక్కు లను,ముఖ్యంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూవినియోగం,సహజ వనరుల దోపిడీకి సంబంధించిన హక్కులను గణనీ యంగా సమర్థించే ఒక మైలురాయి తీర్పు. మైనింగ్‌ కార్యక లాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల భూములను గిరిజనేతర కార్పొరేష న్‌లకు లీజుకు ఇచ్చినప్పుడు,అక్కడ నివసిస్తున్న ఆదివాసీ జనాభా హక్కులు,జీవనోపాధిని ఉల్లం ఘిం చినప్పుడు ఈ కేసు తలెత్తింది.
సమత ఉద్యమంగా విశాఖ కేంద్ర బింధువు..
విశాఖను సమత ఉద్యమాల కేంద్ర బింధువుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం పరిశీలిస్తే..సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 1986లో రవి భాగవతుల చారిటబుల్‌ ట్రస్టులో చేరారు. ఆతర్వాత కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో స్వాతంత్య్ర సమర యోధుడు స్వర్గీయ కె.తిలక్‌ స్థాపించన స్పందన సంస్థలో పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారు. 1990లో తానే స్వయంగా సమత స్వచ్చంధ సంస్థను స్థాపించి గిరిజన హక్కుల పోరాటం లో కొత్తపుంతలు తొక్కారు.ఏజెన్సీలోని కాకినాడ జిల్లా బవురవాక గ్రామంలో పేద గిరిజనులకు 298 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేయడంలో రవి కృషి అనన్య సామా న్యం.ఏజెన్సీలో నెలకొన్నపలు సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పనిచేశారు.
ఉద్యమమే ఊపిరిగా..
ఉమ్మడి విశాఖ అల్లూరి సీతారామారాజ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చడమే ధ్యేయంగా సమత కార్యకలాపాలను విస్తరించారు.గిరిజనులను చైతన్యవంతులను పర్చేపలు సామాజిక సేవా కార్యక్రమాలను చేయడంతో ఆసేవలను గుర్తించి అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ 1994లో అవార్డును బహుకరించారు.బొర్రా ప్రాంతో మైనింగ్‌,భూ సమస్యలను దృష్టి సారించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కంపెనీలు చేపట్టే కార్యక్రలాపాలను వ్యతిరేకిం చారు.అనంతగిరి బొర్రా,అరకు,ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ ఇచ్చిన లీజులను సమర్దవంతంగా అడ్డు కున్నారు.ఈఘటనతో తూర్పు కనుమల్లో గిరిపుత్రుల్నీ,వారి హక్కుల్నీ సంరక్షించడానికి ఉద్య మించిన ఉక్కు పిడికిలి రవి రెబ్బా ప్రగడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. న్యాయపోరాటంచేసి 1997లో భారత అత్యన్నత న్యాయస్థానం ద్వారా సాధించిన ‘సమత తీర్పు’ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రా ల్లోని గిరిజన హక్కుల పరిరక్షణకు ఓకవ చంలా ఉపయోగపడుతోంది.ఆనాటి పోరాట ఫలితమే నేడు ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు` 2024 పురస్కారం ఈసముచిత గౌరవాన్ని రవి రెబ్బాప్రగడ దక్కించుకున్నారు.– గునపర్తి సైమన్‌

ప్రామాణిక దర్పణం కొండరెడ్డి జీవన విధానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన గ్రంధం ‘ కొండ రెడ్ల గిరిజనుల జీవన విధానం’ అనే పుస్తకంపై సమీక్ష
మనం మూల వాసులుగా చెబుతున్న ఆదివాసీలలో ఒక తెగ అయిన కొండరెడ్డి గిరిజన జీవన విధానంకు సంబంధించి సంపూర్ణ సమాచారంగల ప్రామాణిక పుస్తకం ‘‘కొండరెడ్డి గిరిజనుల జీవన విధానం’’ తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ శాఖ వారి పరిశోధన, ప్రచురణల విభాగంలో భాగంగా ఈ పుస్తకం 2010 సంవత్సరంలో ప్రచురించారు. గిరిజన జీవన విధానాల పరిశోధన ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని నాటి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి మండలంలో గల ‘‘బొడ్లంక’’అనే సంపూర్ణ కొండారెడ్డి గిరిజన గ్రామంను ఈ పరిశోధనకు ఎంపిక చేసుకొని పరిపూర్ణమైన సమాచారం సేకరించి పొందుపరిచారు.
నాటి గ్రామ చరిత్ర సమాచారాలను తెలిపే కైఫియత్తు ప్రక్రియలో వ్రాసిన ఈ గిరిజన గ్రామ చరిత్రలో అనేక చారిత్రక సామాజిక సాంస్కృతిక విషయాలు తెలుస్తాయి.
సుమారు 1901 సంవత్సరంలో పుట్టగండి గ్రామం నుంచి వలస వచ్చిన కొన్ని కొండ రెడ్డి కుటుంబాలతో ఏర్పడిన ఈ పూర్తి గిరిజన గ్రామంలో నేడు 60 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు.
చుట్టూ దండకారణ్యం ఎతైన కొండలు వాటి మధ్య బొడ్డు లాగా లోతుగా ఉండే లోయ నాలుగు దిక్కుల జలజల పారే సెలయేర్లతో అందాలు ఆరబోస్తున్న ఈ ప్రాంతం భౌతిక రూపం అనుగుణంగానే ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు సార్ధకం చేసినట్టు,అలాగే ఈ గ్రామ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిం చిన పల్లాల వీరపరెడ్డి తండ్రి బోడి రెడ్డి పేరు మీదుగా కూడా ఈ గ్రామానికి బొడ్లంక అనే పేరు వచ్చిందనే మరో కథనం కూడా ఉంది.
నేడు ఈ గ్రామం ఐటిడిఎ సహాయ సహకారాలతో కొంత కొత్త రూపును సంతరిం చుకుంటున్న,నగర సంస్కృతి ఛాయలు సంత రిస్తున్న ఇక్కడి కొండరెడ్డి గిరిజనులు వారి పూర్వ తరాల సంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ మనుగడ సాగించటం విశేషం.
‘‘బొడ్లంక పరిచయం’’ మొదలుకొని ‘‘ఆటలు’’ వరకు మొత్తం14విభాగాలుగా విభజించి వ్రాసిన సంపాదకులు ఆచార్య భట్టు రమేష్‌ గారి సంఘటిత అక్షర కృషి అభినందనీయం, విషయ సేకరణ కర్తల కృషి ప్రశంసనీయం, గ్రామాల చరిత్ర రాయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్ని ఇందులో అగుపిస్తున్నాయి. గ్రామ పరిచయంతో మొదలై. ప్రజలు కులాల మధ్య సయోధ్య, పర్యావరణం,ఇంటి నిర్మాణం, గృహ సంబంధ వస్తు సంస్కృతి,వైద్య విజ్ఞానం, దేవతలు పండుగలు,జీవిత చక్రం,సంబరాలు వేష భాషలు భూషణాలు,ఆహారం,వస్తువులు, నిలవ పద్ధతులు,ఆటలు,తదితర అంశాలు కొండరెడ్డి గిరిజన జీవితాల్లో ఎలా పెనవేసు కున్నాయో ఆసక్తిదాయకంగా ఇందులో వివరించారు.
కొండ రెడ్డి కుటుంబంలో పుట్టిన శిశువుకు పేరు పెట్టడం ఒక ప్రహసనంగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని ‘‘పేరు ముళ్ళ’’ అని పిలుస్తారు ఈ తంతులో వారి సంస్కృతిని ఆధారం చేసుకుని వ్యవహరించడంలో అనేక ఆసక్తి దాయకమైన విషయాలు వెల్లడవుతాయి మనుషుల పేర్లతో పాటు ఇంటిపేర్లు చెట్ల పేర్లు తదితర పేర్ల గురించి వివరంగా తెలిపారు. బొడ్డులంక సంపూర్ణ కొండ రెడ్డి గ్రామం అయినా వీరితో సయోధ్య గల కమ్మరులు వేగుజంగాలు తదితర జాతుల గురించి ప్రస్తావిస్తూ వారితో వీరికి గల సయోధ్య గురించి వివరించిన అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయి.
అలాగే ఈ గ్రామస్తులు పర్యావరణ సంరక్షణలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరిస్తూ అక్కడి వృక్ష సంపద గురించి అనేక విలువైన విషయాలు పేర్కొన్నారు. అలాగే కొండరెడ్డి గిరిజనులు నిర్మించుకునే ఇంటి నిర్మాణం గురించి జీవిత చక్రపు సంబరాల్లో ఇంటి ప్రాధాన్యత దానికి కొండరెడ్లు ఇచ్చే ప్రాతినిథ్యం తదితర అనేక విలువైన విషయాలు ఈ విభాగంలో పొందుపరచబడ్డాయి.
అలాగే ‘‘గృహ సంబంధ వస్తు సంస్కృతి’’ వైద్య విజ్ఞానం, వృత్తి విజ్ఞానం,తో పాటు కొండరెడ్లు ప్రత్యేకంగా చేసుకునే దేవతల పండుగలులో వారు చేసుకునే విలక్షణమైన సంక్రాంతి పండుగ గురించి, అనేక ఆసక్తిదాయకమైన విషయాలు ఈ విభాగంలో తెలిపారు దీనితో పాటు వాళ్లు చేసుకునే కొండ దెయ్యాల పండుగ,సొప్పల పండుగ,పచ్చిక పండుగ, మామిడి కొత్త పండుగ,మామిడి టెంకల పండుగ,కొర్ర కొత్త,జొన్న కొత్త,పండుగలు బుడమల పండుగ,దారి పండుగ,లక్ష్మీదేవి పండుగ,భూదేవి గంగానమ్మల పండుగలు, వంటి సామూహిక పండుగలతో పాటు వ్యక్తి గతమైన పండుగలను జీవిత చక్రపు సంబ రాలు శీర్షికతో కొండరెడ్లు చేసుకునే మరికొన్ని పండుగలు అవి చేసుకునే విధానాల గురించి ఉపయుక్తమైన విషయాలను సేకరించి అందిం చారు.దీనిలో కొండారెడ్డి జాతిలో జననం నుంచి మరణం దాకా చోటు చేసుకునే వివిధ సంఘటనల గురించి సవివరంగా తెలిపారు. ఇక 11వ విభాగం అయిన ‘‘వేష భూషణాలు’’ గురించిన దానిలో కొండరెడ్లు ధరించే ఆభర ణాలు అలంకరణలు తదితర విషయాలు ఎంతో చక్కగా పేర్కొన్నారు.అనంతరం ఆహా రం గురించిన విశ్లేషణలో వారు తినే సోడి రొట్టె, సామకూడు,సామజావ,కొర్రకూడు, గంట్లు,జీలుగు అంబలి,మామిడి టెంకల రొట్టె, అంబలి,మొక్కజొన్న అంబలి,సేమకూర, వెదురు కొమ్మలకూర,లక్ష్మిచారు,తదితర ఆహార దినుసులు తయారు చేసే విధానాలు మొదలైన అంశాలు ఈ విభాగంలో పొందుపరిచారు. ఇక చివరి రెండు విభాగాలుగా,వస్తువులు నిల్వ పద్ధతులు,ఆటలు,అనే అంశాలు చెప్పబడ్డాయి. పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధస్తులైన కొండరెడ్లు వారు పండిరచిన ఆహారం పంట లను నిల్వ చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహి స్తారు.ఆధునికులకు ఈవిధానం ఆశ్చర్యకరంగా ఆగుపించిన,వీరు పాటించే పద్ధతులు ప్రామా ణికంగా ఆరోగ్య దాయకంగా ఉంటాయి. కొండరెడ్లు ఆడే ఆటల్లో కూడా కొన్ని విలక్షణమైన అంశాలను మనం గమనించ వచ్చు వాటిలో ప్రధానంగా ఆగుపించేవి ఉప్పరి పెట్టెలు,నాలుగురాళ్లు,పిన్నీసు ఆట,ముక్కు చిక్కుడు,తల్లి పిల్లఆట, ఎత్తురాళ్ళు,పుల్ల, బచ్చ,గూటి బిళ్ళ,గెలుపులాట,మొదలైన ఆటలు కొండరెడ్డి గిరిజన జాతులవారిలో పిల్లలు పెద్దలు స్త్రీ పురుషులు ఆడతారు..అనే అంశా లు ఇందులో తెలిపారు.
ఇలా ఒక గ్రామమును ప్రామాణికంగా తీసు కుని అక్కడి వివరాలను పరిశోధనాత్మకంగా అక్షరబద్దం,చేయడం ద్వారా బహుళ ప్రయో జనాలు చేకూరతాయి.
ఎన్నో పరిశోధక విలువలు గల ఈ బొడ్లంక కొండరెడ్డి గిరిజన గ్రామ చరిత్ర ఆధారంగా మరిన్ని గిరిజన గ్రామాల చరిత్రలు రావాల్సిన అవసరం కనిపిస్తుంది.
పుస్తకం : కొండ రెడ్డి గిరిజనుల జీవన విధానం (బొడ్లంక)
సంపాదకులు : ఆచార్య భట్టు రమేష్‌, పేజీలు:172,వెల :-85/-రూ,ప్రతులకు : జానపద గిరిజన విజ్ఞాన పీఠం తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్‌-506002, ఫోన్‌ : 0870-2101309/2441258
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు
సెల్‌ :7729883223.

పెసా చట్టంపై అవగాహన సదస్సు

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందా లంటే పెసా చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమత,గిరిమిత్ర సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వతేదీన నర్సీపట్నం ఎన్‌జీజీఎస్‌ భవనంలో పెసా చట్టం-1996పై సమీక్ష,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపి ఆదివాసీ హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్‌. కళ్యాణ్‌ మాట్లాడుతూ గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు గ్రామసభల అమలపై పెసా చట్టాలను నేటి గిరిజన యువత అవగా హన చేసుకొని,స్థానిక వనరులు దోపిడికి గురి కాకుండా పరిరక్షించుకోవాలన్నారు.పెసా కమిటీ సభ్యులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ గిరిజన వనరులు పరిరక్షణ,గిరిజన పల్లెల ప్రగతి చెందాలంటే పెసా చట్టం ద్వారా గ్రామ సభలు సంపూర్ణంగా అవగాహన చేసుకోవా లన్నారు.అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు ఎస్‌.జనార్దన్‌ ప్రతి యువత గ్రామసభల నిర్వహణ,బాధ్యతలు తెలుసుకుని గిరిజన గ్రామభివృద్ధికి తోడ్పాడాలని పిలుపు నిచ్చారు.సమత సభ్యులు పెద్దమల్లాపురం)లోతా సుబ్బారావు మాట్లాడుతూ సమత చేస్తున్న రాజ్యాంగ పోరాటాల ఫలితమే నేడు గిరిజన వనరుల పరిరక్షణ అన్నారు.గిరిమిత్ర కార్యదర్శి బి.గంగరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో అనకాపల్లి జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు బి.నాగరాజు,వికాసవాణి కార్యదర్శి జగ్గారావు,ప్రగతి శిలా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ పెసా చట్టం అమల్లోకి వచ్చి సుమారు 32 సంవత్సరాలు అవుతున్నా నేటికీ షెడ్యూల్డ్‌ ఏరియాలో సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు.దీనివల్ల ఎన్నో గిరిజన కుటుంబాలు భూములు అన్యాక్రాంతమవుతూ దోపిడీదారుల గుప్పెట్లో నలిగిపోతున్నారని పేర్కొన్నారు.బి.బాలరాజు,వినియోగదారుల మండల్‌ చింతపల్లి మండల అధ్యక్షులు పి.చిట్టిబాబు,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణాగ్రహీ,కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామసభ ప్రతిష్టతను,దాని ఫలితాలను వివరించారు.జీ.సైమన్‌ మాట్లాడుతూ పెసాచట్టం, గ్రామసభ ప్రాధాన్యత పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.పెసా చట్టంలో పొందు పరిచిన కమిటీలు నిర్వహణ,బాధ్యతలు,అన్యా క్రాంత మవుతున్న భూములు పరిరక్షణ, సంతల కోసం గ్రామసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవా లనే అంశాలను వివరించారు.ఈ సమావేశం లో సమత పరిశోధన విద్యార్థులు,గిరిజన యువకులు పాల్గొన్నారు. అనంతరం ‘పల్లె ప్రగతికి పట్టాభిషేకం పెసా చట్టం-996’అనే పుస్తకానీ ఆవిష్కరించారు. – (బి.గంగరాజు)

దేశంలో జమిలి ఎన్నికల సంకేతాలు

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగు పడిరది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యా యాల్లో ఈదిశగా సాగించిన ప్రయత్నా లను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశా నికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడ కుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో జమిలి ఎన్నికల సంకే తాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.అకస్మాత్తుగా పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగు తోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాం గ్రెస్‌ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది.ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసు లను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం,తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది.జమిలి ఎన్నికలు నిర్వహిం చాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది.తొలివిడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ డానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటి ఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే..వంద రోజు ల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు,లోక్‌ సభకు,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వ హించడమే జమిలి ఎన్నికలప్రధాన ఉద్దేశం. గతం లో జరిగినా..ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952 లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడక పోవడం,గడువుకు ముందే పలురాష్ట్రాల శాసన సభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాల తో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ,అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరు పడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్య వధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నిక లు జరుగాలంటే దాదాపు 18రాజ్యాంగ సవర ణలు,ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌172(1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తు న్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయక త్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పిం చింది.దేశంలో47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.ఈకమిటీ 2029నాటికి రాజ్యాం గంలో 5ఆర్టికల్స్‌ సవరణ చేసి జమిలి ఎన్నికలు నిర్వ హించవచ్చని తెలిపింది.7దేశాలలో జమిలి ఎన్ని కల గురించి అధ్యయనం చేశామని పేర్కొంది. కానీ స్వీడన్‌,జర్మనీ,బెల్జియం వంటి దేశాలలో అమ లులో ఉన్న నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం గురించి కమిటీ పేర్కొనలేదు.కోవింద్‌ కమిటీ 10కీలక సిఫా ర్సులు చేసింది.తొలి దశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారిఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు,పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్ని కలు నిర్వహించాలని పేర్కొంది.స్థానిక సంస్థల ఎన్నికలు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పింది. జాతీ య ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాలని పేర్కొంది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికలు అమలులోకి రావటానికి కనీసం 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గద ర్శకాలను నిర్దేశించిన 1951ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు కనీసం 6కీలక రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉం టుంది.లోక్‌సభ,రాజ్యసభ కాలపరిమితిని నిర్ణ యించే 83వఆర్టికల్‌,రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని నిర్ణయించే 172వ ఆర్టికల్‌,ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన 324వ ఆర్టికల్‌ సవరణ చేయాలి.వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్‌243-కె, 243-జడ్‌.ఏలను కూడా సవరించవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణలను రాజ్య సభ, లోక్‌సభ లలో 2 బై 3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం రెండు సభలలో బిజెపికి ఉన్న బలంతో అది సాధ్యం కాదు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. దీనితో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. బిజెపి మిత్రపక్షాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యమౌ తుంది. – (కె.యస్‌.లక్ష్మణరావు)

అడవి తల్లి వేదన..అరణ్య రోధన

అడవంటే జ్ఞాన నిలయం.తపోభూమి. అడ వంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడు తుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవు తుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందిం చేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.
ప్రపంచ జనాభాను బాధిస్తున్న దాదాపు ఎనభై శాతానికి పైగా జబ్బులకు ఔషధాలను అంది స్తున్న ఆఅడవితల్లి ఇప్పుడు రక్తకన్నీటిని కారుస్తున్నది..ప్రతీ యేటా ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఐక్యరాజ్య సమితి ఈసంవత్సరం కూడా ‘’ఫారెస్ట్‌ అండ్‌ ఎనర్జీ(అడవి మరియు శక్తి)’’ నినాదంతో పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించింది. అయినప్పటికీ,ప్రకృతి మాతపై జరుగుతున్న ఘోర కలి ఆగట్లేదు. డెబైÄ్భయేండ్ల క్రితం 250కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభాకు ఎటువంటి రక్షణను అందించిందో, ప్రస్తుతమున్న ఎనిమిది వందల కోట్ల జనులకు అదే ప్రేమను పంచుతున్న ఆ అడవికి మాన వుడు చేస్తున్న గాయం వర్ణనాతీతం! తనను ఎంతగా నాశనం చేస్తున్నా..ఆఅడవితల్లి తన బిడ్డలకు జీవ వాయువులను అందిస్తూ, వర్షాలు కురిసేలా చేస్తూ, ఆకలితీర్చే అమ్మగా తన ఒడిలో ఇప్పటికీ సమస్త ప్రాణికోటిని కంటికి రెప్పల సాకుతూనే ఉన్నది.
అగ్ర రాజ్యాలే ఆజ్యం పోస్తున్నాయి
1990 నుంచి ఇప్పటి వరకు సగానికి సగం వర్షాధార అడవులు కేవలం అగ్ర దేశాల కార్యకలాపాల వల్లనే నాశనమయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు..అటవీ పరిరక్షణ సమితి,ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం..భూమిపై 30శాతం అడవులు ఉం డాలి.కానీ ఏటావీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. ప్రతీ సెకనుకి ఒకటిన్నర ఎకరం అడవి నరకబడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు చెప్పే దాన్ని బట్టి..వాతావరణంలోకి విడుదల య్యే ఒక క్లోరిన్‌ పరమాణువు, భూమికి కవచంలా ఉన్న ఓజోన్‌ పొరలోని లక్ష అణువులను విచ్ఛి న్నం చేయగలదు! అడవులను క్రమక్రమంగా క్షీణింపజేస్తూ..రోజుకి కొన్నిలక్షల లీటర్ల క్లోరిన్‌ సంబంధ ఉదారాలను అగ్రదేశాలు వాతావర ణంలోకి వదులుతున్నాయని, ఇదిలాగే జరిగితే రానున్న శతాబ్ద కాలంలో భూమిపై ఒక్కటంటే ఒక్క వర్షాధార అడవి కూడా మిగలదని హార్వర్డ్‌,కొలంబియా విశ్వ విద్యాలయాల పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల పరిశోధనల్లో వెల్లడ వ్వడం యావత్‌ ప్రపం చాన్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
అడవుల ప్రాధాన్యం తెలుసా ?
అభివద్ధి ముసుగులో అగ్రరాజ్యాలు అవలం భిస్తున్న పారిశ్రామిక వింత పోకడలు ప్రకతి మాత ఒంటిని తునాతునకలు చేస్తున్నది. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల కార్బన్‌ డైయాక్సైడ్‌ నియంత్రణ కుంటు పడి, వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తున్నది. సాధా రణంగా సముద్రాలు 25శాతం కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుం టాయి.ఇవి నీటిలోని వివిధ మూలకాలతో కలిసి కార్బాలిక్‌ యాసిడ్‌ వంటి పదార్ధాలను ఏర్పరుస్తాయి.ఈ విధంగా గడచిన 250 సంవత్సరాల్లో సము ద్రజలాల ఆమ్లత్వం 30శాతం పెరిగిందని, దీనికి కారణం..అడవులశాతం తగ్గడమే నని,ఇది ఇలాగే కొనసాగితే,2100 సంవత్స రం నాటికి సముద్రజలాల ఆమ్లత్వం 150 శాతం వరకు పెరిగి..సముద్రాన్నే ఆవాసంగా ఏర్పరచుకున్న లక్షలాది సముద్ర జీవులు మృత్యువాత పడటం ఖాయమని బయో డైవర్సి టీ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. ఇక,అడవుల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలు పర్యా వరణానికి, జంతువులకే గాక మానవుల్లో సైతం వివిధ శ్వాసకోశ వ్యాధులు,అస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోగాలకు పెను ముప్పుగా దాపురిస్తున్నాయి. ఉదాహరణకు.. 2015ఆగష్టు నెలలో ఇండోనేషియా అటవీ ప్రాంతంలో సంభవించిన ఘోరఅగ్ని ప్రమా దంలో వేలకు వేల అరుదైన వ క్షాలు, జీవ జాలం కలిగిన సుమారు 2.6మిలియన్‌ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహు తవ్వగా..సుమారు 1,00,300 మంది ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో అసువులు బాసా రని తేలింది.అడవులను నరకడంవల్ల ఓజోన్‌ పొర క్షీణించి సూర్యుడినుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమికి చేరుకోవడవల్ల మానవుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణ మవుతాయనే విషయం కూడా తెలిసిందే !
అడవులను విచక్షణారహితంగా నరుకుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సుమారు 70శాతం కాగితాన్ని వినియోగించు కుంటూ ..రానున్న ఇరవై యేండ్లలో 28వేల జీవజాతుల మనుగడనే ప్రశ్నార్ధకంచేస్తున్న అమెరికా,ఐరోపా వంటి అగ్రదేశాలే జరుగు తున్న విపత్కర పరిణామానికి జవాబుదారీతనం వహించాలి.పర్యావరణ ప్రేమికులు,అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలు అగ్రరాజ్యాల మెడలు వంచి అడవితల్లి మెడలో పచ్చల తోర ణం అలంకరించే అవసరం ఎంతైనా ఉంది.
అడవులు ఆశ్చర్యకర అంశాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160కోట్ల మంది ప్రజలకు అడవే జీవనాధారం!భూమిపై ప్రతి నిమిషం..ఇరవై ఫుట్‌ బాల్‌ స్టేడియం విస్తీర్ణ మంతా అటవీ ప్రాంతం కనుమరుగవుతు న్నది.ప్రపంచ జనాభాలో 5శాతం కూడా లేని అమెరికన్లు, ముప్పై శాతంకి పైగా కాగితాన్ని వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం అమెరికా,ఐరోపా దేశాలే 12రెట్లు ఎక్కువ అడవిని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నాయి.
చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్‌ సిగ్నలింగ్‌, మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌ శాస్త్రవేత్త సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు.లండన్‌ రాయల్‌ సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు.జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన.వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా.వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలిం చుకోవడమే.
పచ్చదనం మీద కక్ష
అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావ రణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పర్యా వరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధిని స్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి.భూగర్భ జలాల పరిరక్షణ,కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీ కరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏఒక్క దేశా నికో,రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరి స్తున్నాడు.దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపో తోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్య ప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు,పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి.రుతుపవ నాలు క్రమం తప్పుతున్నాయి.వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్‌ భూ మండలం తల్లడిల్లుతోంది.విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు,తుపాన్లు,వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటు న్నాయి.ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతు న్నాయి.
ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?
ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది.వనాలక్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది.12నుంచి 20శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం.ఈపరి స్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది.
కాపాడలేకపోతున్న ‘కంపా’
కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరి స్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకు లలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు.కొత్తగా వనాల పెంప కం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం.జలాశ యాలు,వివిధ ప్రాజెక్టులు,రహదారుల నిర్మాణం,విస్తరణ,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకు పోతున్నాయి.ఈపరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం‘కంపా’పథ కాన్ని తెరపైకి తీసుకువచ్చింది.కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌,ప్లానింగ్‌ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’.కోల్పో యిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దే శం.దీనికింద 27రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ.47వేలకోట్లు మంజూరు చేసింది.ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ,అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే,ఆ మే రకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచన తో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది.పథకం లక్ష్యాలు సమున్నతమే.కానీ ఆచరణ అంతంత మాత్రం.వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం,కాగితాలపై లెక్కలు, క్షేత్ర స్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంప కం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం.అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం,నదీగమనాలను మళ్లించడం,నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీ త్యాలకు దారితీస్తోంది.కొండలను,గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి.ఇటీవలి ఉత్తరాఖండ్‌ వరదలకు ఇదే కారణం.అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి.ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.– (గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌)

అనివార్యంగా వాతావరణ సంక్షోభం..!

సీజన్‌తో సంబంధం లేకుండా తుపాన్లు సంభవిస్తున్నాయి.ఎండాకాలం ముగిసినా..హీట్‌ వేవ్స్‌ వెంటాడుతూనే ఉంటున్నాయి.శీతాకాలంలో..చలితీవ్రత ఊహించనిస్థాయికి పెరిగి పోతుంది. వర్షా కాలంలోకుండపోత వానలతో వరదలు పోటెతున్నాయి.హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతాయి.అంతకుముందెన్నడూ చూడని జలప్రళయం సంభ విస్తుంది.నానాటికీ భూతాపం పెరిగిపోయి..భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారి పోతుం దని,మానవాళి చాలాడేంజర్‌లో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు.
ఈ ఏడాదిజూన్‌28,జూలై15,19,ఆగస్టు3,29,సెప్టెంబర్‌5,13,23తేదీల్లో బంగా ళాఖాతంలో ఏర్పడిన వరస అల్పడీనాలు కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే..ఈఏడాది సెప్టెంబర్‌ నాటికే ఎనిమిదిసార్లు అల్పపీడనాలు తూర్పుతీరాన్ని భయపెట్టించాయి.వాతావరణం మార్పులు, భూతాపంవల్ల మహాసముద్రాలు వేడెక్కితున్నాయని,వర్షపాతంలో అసాధారణ పరిస్ధితులు సంభ విస్తున్నాయనడానికి సాక్షీభూతమే..ఈఏడాది నైరుతి సీజన్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు. రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా,వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంటవెంటనే ఏర్పడటం,తీవ్రరూపం దాల్చి తుఫాన్లుగా మారడం,కుంభవృష్టి కురిపించ డాన్ని అసాధారణంగా విశ్లేషిస్తున్నారు.
లానినో,పసిఫిక్‌ పరిణామాలుతోడై..బంగాళాఖాతంలో అల్పపీడనాలు సంఖ్య,వాటి తీవ్రత పెరుగుతోంది.తదుపరి భారీవర్షాలు కురుస్తుండటంతో తీరప్రాంతంలోనే కాదు..మధ్య,ఉత్తర భారతం వరకూ అధికశాతం జనాభా ప్రభావితమవుతోంది.విజయవాడ,ఖమ్మంప్రాంతాల్లో ఇటీవల కుంభ వృష్టిక కూడా ఇక్కడి పరిస్థితులే కారణం.సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువే. ఈసారి వాటకి లానినో ప్రభావం తోడైంది.పశ్చిమ పసిఫిక్‌మహాసముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్లు తూర్పు,ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం,కంబోడియా,ధాయ్‌లాండ్‌ మీదుగా పయనించి బలహీన పడుతున్నాయి.ఈసీజన్‌లో ఇప్పటికే ఎనిమిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి.అందులో ఐదు వాయు గుండాలుగాబలపడి,తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
అల్పాపీడనాలు తీరం దాటినా అదే తీవ్రత సంభవిస్తోంది.భూతాపం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్‌ఎస్‌టీ)పెరిగి,తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.అవి తీరానికి చేరువగా వచ్చే సరికి తీవ్రత పెరుగుతోంది.మరోవైపు వారా నికో అల్పపీడనం రావడంతో నేలలో తేమశాతం పెరుగుతోంది.ఈ కారణంగా అల్పపీడనం సముద్రతీరం దాటి,భూభాగంపైకి వచ్చినా బలహీన పడట్లేదు.ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణం గానే దేశ పశ్చిమ,వాయువ్య ప్రాంతాలైన గుజరాత్‌,రాజస్థాన్‌ వరకూ పయనించాయి.ఒడిశా, రaార్ఖండ్‌,తెలంగాణ,మధ్యప్రదేశ్‌,గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో భారీవర్షాలకు కారణమయ్యాయి.
గతంలో అండమాన్‌ దీవులవద్ద తుఫాన్లు ఏర్పడితే,పశ్చిమ దిశగా నెల్లూరు,వాయవ్యంగా కోల్‌కతా వైపు పయనించేవి.కొన్నాళ్లుగా వాటి గమనం మారుతోంది.తీరాలు కోతకు గురికావడంతో తుఫాన్‌ తీరాన్నితాకే ప్రాంతాలు మారిపోతున్నాయి.తీరంవైపు వెళ్తున్నట్లే కనిపించిన తుఫాన్లు, సముద్రంలోనే దిశ మార్చు కుంటున్నాయి.లేదా ఆకస్మాత్తుగా తీవ్రమవుతున్నాయి.భూతాపం,తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధ్దృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
గ్లోబుల్‌ వార్మింగ్‌ పరిరక్షణకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుఫాను మయన్మార్‌ వద్ద బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిరది.దీని ప్రభావంతో ఉత్తర భారతదేశ:లో భారీ వర్షాలు కురిశాయి. ఇది అంచనాలకు అందనిది.ప్రస్తుతం పసిఫిక్‌,హిందూ,అట్లాంటిక్‌ మహాసముద్రాల్లోని పరిస్థితులను జపాన్‌,భారత్‌, అమెరికాలు పర్యవేక్షిస్తున్నాయి.ఈదేశాలు కలసి కట్టుగా వీటిపై పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

1 6 7 8 9 10 75