ఇతర కులాలను ఎస్టీలో చేర్పు వెనుక అంతర్భాగ కుట్రే

ఈ వ్యాసం తేది 30.12.2022 న పాడేరు జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివాసి జెఎసి నిర్వహించిన ‘‘ఆదివాసి గర్జన’’ బహిరంగ సభను ఉద్దేశించి తయారు చేసిన ప్రసంగ పాటవానికి చిన్నపాటి మార్పులతో ఆదివాసు లంటేనే ఇష్టపడని ఇతర కుల సమాజన్ని నేడు ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుటీల యత్నాల వెనక చాలా భయం కరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. ఆ అంతర్గత ఎజెండా గురించి పాలకులు మనకు చెప్పరు. మనమే గ్రహించాలి. అర్థం చేసుకోవాలి. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుట్రల వెనక చాలా భయంకరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. బి.రామారావుదొర

ఈగర్జనసభకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూలల నుంచి ఎన్నో ప్రయసలకు ఓర్చి విచ్చేసిన మీఅందరికీ ఉద్యమా భివందనాలు తెలుపుకుంతున్నాను.గత 12రోజులుగా (డిసెంబర్‌12 నుండి 22వరకు) నిర్వహించిన ఆదివాసి హక్కుల పరిరక్షణ యాత్రతో మీ గ్రామాలకు వఛ్చినయాత్ర బృందాలకు అన్నం పెట్టి ఆదరించిన ఆదివాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలకులు దాచిపెడుతున్న ఆ అంతర్గత ఎజెండా ఏమిటంటే! రాజ్యాంగం ద్వారా ఆదివాసులు సాధించుకున్న రక్షణ చట్టాలు, హక్కుల ప్రకారం ఏజేన్సి ప్రాంతాలలో నిక్షిప్తమై ఉన్న అపరమైన ప్రకృతి సంపాదను కొల్లగొట్టడానికి ప్రభుత్వాలకు/పాలకులకు సాధ్యం కావాడం లేదు. కావున ఆదివాసులకంటే ఎక్కువ జనాభా కలిగి,వారికి విధేయులుగా ఉండే కులాలను, ఆదివాసులకంటే అభివృద్ధి చెందిన అగ్ర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వారికి పంచిపెట్టి తద్వారా ఏజేన్సి ప్రాంతాలను చిన్నభిన్నం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు/పాలకులు పూనుకున్నారు.చరిత్రలో చూడండి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద విదేశీ పెట్టుబడుదారి కంపెనీలకు కట్టబెట్టినప్పుడు ఆదివాసి చట్టాలు మాత్రమే కాపాడిరది. ఆరక్షణ చట్టాలు నాశనం చేయాలంటే! పాలకులకు అసలైన ఆదివాసులు చేత ఆ పని చేయించడం సాధ్యం కాకావడం లేదు. ఆయా సందర్బాలలో ఎంతో కొంత మంది చైతన్య వంతులై పాలకుల కుటీల ప్రయత్నాలను అడ్డుకున్న సందర్బాలున్నాయి. అదే ఇతర కులాలను మన ఆదివాసి జాబితాలో చేర్పించి మన రాజ్యాధికారాన్ని వారికి కట్టబెట్టి అసలైన భూమి పుత్రులను అచేతనవస్తలో పెట్టి ఆదివాసిల మనుగడను దెబ్బతీయడానికి పూనుకున్నదీ ప్రభుత్వం. ఒకసారి మనం గమనించినట్లైతే ఎస్టి జాబితాలో కలపడానికి ప్రతిపాదిత కులాలవారికి 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నది. అదే మనకు (ఆదివాసులకు) 6శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలులో ఉంది. ఎవరైనా తక్కువ రిజర్వేషన్‌ నుండి ఎక్కువ రిజర్వేషన్‌ లో చేరాలనుకుంటారు. చేర్చుతారు కూడా. కానీ మన విషయంలో ఎక్కువ రిజర్వేషన్‌ ఉన్నవాళ్ళను తక్కువ రిజర్వేషన్‌ లోకి చేర్చడానికి కారణం ఏమిటి? అంటే జగన్మోహన్‌ రెడ్డి గాని, ఇతర పాల కులకుగాని ‘బోయవాల్మికి, నకిలీ బెంతు ఒరియా (వడ్డీ) కులాలపై వల్లమాలిన ప్రేమ గాని, ఆదివాసు లపై ఒర్వలేనంత ద్వేషం గాని ఎందుకు? వారి మీద ప్రేమ లేదు. వీరి మీద ద్వేషమూ లేదు. స్వతహగా జగన్మోహన్‌ రెడ్డి గారు వ్యాపారవేత! కావుననే ఈ కపట నాటకాలాడుతున్నారు. ఆదివాసుల పాదాల కింద, అడవి తల్లి గర్బంలో బాధ్రంగా ఉన్న అపారమైన ఖనిజ సంపాదనను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి చేస్తున్న కుటిల ప్రయత్నమని ఆదివాసులు మరియు ఇతర కుల సమాజం (అగ్రకులాలు) కూడా గమనించాలి.6శాతం రిజర్వేషన్లు కలిగి ఉన్న ఆదివాసులు ఇప్పటివరకు కనీసం పాఠ శాలలలు, తాగు నిరు,రోడ్లు,కరెంట్‌ లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? దానిని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ఆదివాసులు ఎంత అభివృద్ధి చెంది ఉన్నరో..2017 డిసెంబర్‌ 2నచంద్రబాబు నాయుడు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. జగన్మోహన్‌రెడ్డి తనపాదయాత్రలో బోయలకు ఇచ్చిన మాట ప్రకారం 52జీవోద్వారా శ్యామ్యూల్‌ ఆనంద్‌ ఏక సభ్య కమీషన్ను నియమించి ఆ కమిటి రిపోర్టు ఆధారంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడానికి సిద్ధపడ్డాడు. జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులను కూడా ఎస్టీలలో కలపడానికి మద్దతు ఇచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీ 1976లో వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాలు కలిగి ఉన్న లంబాడాలను తన రాజకీయ అవసరాల కోసం ఎస్టీలలో కలిపి తెలుగు రాష్ట్రాల ఆదిమతెగలను కోలుకో లేని దెబ్బతీశారు. బిజెపి ఎలాగో రిజర్వే షన్లు అమలు ఇష్టం లేక ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ ప్రైవేటుపరం చేస్తుంది.ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తే, రిజర్వేషన్లన్న సంగతే ఉండదు. ఇది ఆదివాసులు, దళితులు వంటి అణగారిన వర్గాలకు పెద్ద బ్దెబ్బ.చివరికి కమ్యూనిస్టులు సైతం ఓటు బ్యాంకు రాజకీయాలనే అనుసరి అనుసరిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కుటుంబం ఆదివాసులను వెంటాడుతూనే ఉంది.బాక్సైటు తవ్వకాలకు చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానాలతోనే జర్రెల కొండలను తవ్వి తన బావమరిది పెన్నా ప్రతాపరెడ్డికి కట్టబెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక 2009న పాడేరు పర్యటించి ఎజేన్సిలో నాన్‌ ట్రైబల్స్‌కు మూడుసెంట్లు భూమి ఇస్తున్నమని ప్రకటిం చాడు.నేడు జగన్మోహన్‌ రెడ్డి గారు ఆదివా సేతరులకు షెడ్యుల్డ్‌ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు భూమి ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశాడు.ఈ అన్ని సందర్భాలలో ఆదివాసుల సంక్షేమం ఎక్కడుంది? అదిమజాతుల వినా శము కోరే సంక్షోభం తప్ప. అదే మనలను బయపెడుతుంది. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదు.చదువుకున్న యువ తులకు ఉద్యోగాలు లేవు. యువత పక్కదారి పట్టి గంజాయి స్మగ్లర్ల చేతిలో చిక్కి సాగుదా రులుగాను, రవాణాదారులుగాను ముద్ర పడి వేలాది మంది బంధిలై జైల్లో మగ్గుతున్నారు. మొన్నటి వరకు జీవో నె.3 షెడ్యూల్‌ ప్రాం తంలో స్థానిక ఆదివాసి యువతకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పించే జీవోగా పెద్ద బరోసాగా ఉండేది. ఈ జివో రద్దు చేసారు. చట్టపరంగా మనకు వచ్చిన ఎస్టి సబ్‌ ప్లాన్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకా లకు మళ్ళించి మన కోసం ఖర్చుపెట్టవలసిన డబ్బును అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వసతి దీవెన వంటి ఇతర పథకాలకు మళ్ళించి రాష్ట్ర ప్రజలందరికి పంచిపెదితున్నారు. ఆదివాసులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌ సదుపాయం లేదు.పరిశ్రమలు లేదు. కష్టపడి పండిరచిన పంటలను అదివాసేతర దళారులు కొల్లగొడుతున్నారు. అంతర్జా తీయంగా గుర్తింపు పొందిన కాఫీని పందిం చమని ప్రోత్సహిస్తున్నరే! తప్ప మార్కెట్‌ సదుపా యాలు కల్పించడం లేదు.ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదు. ఆపంట అంత ప్రభు త్వమే (ఐటిడిఎ కాఫీ బోర్డు ద్వారా) ప్రైవేటు దళారులకు గంపగుత్తగా అప్పజేప్పు తుంది.విద్యాలయాలు కాస్త దాణా కేంద్రాలు (టవవసఱఅస్త్ర షవఅ్‌తీవం)గాను,నిరుద్యోగ ఉత్పత్తి కేంద్రాలు (బఅవఎజూశ్రీశీవఎవఅ్‌ జూతీశీసబష్‌ఱశీఅ షవఅ్‌వతీం)గా మాత్రమే పనికొస్తున్నాయి. తప్పితే! ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉపాది మార్గాలు చూపించడం లేదు.300 నుండి 500 మంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సరిపడ్డ సౌకార్యాలు ఉన్న వసతి గృహాలు/పాఠశాలలలో 700నుండి 1500 మంది వరకు బలవంతంగా కుక్కుతున్నారు. పిల్లలకు ఆలనా పాలన కూడా సరిగలేక మంచి చదు వులు సంగతి ఏమోగాని,పాఠశాలలలోనే మృత్యువాతపడుతున్నారు. ఈ మద్య కాలంలో పాడేరు ఐటిడిఎ పరిధిలో మూడు నెలల కాల వ్యవధిలో 8మంది విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడ్డారు.స్వాతంత్రం రాకముందు బ్రిటిష్‌ వారు ఆదివాసుల రక్షణ కొరకు బలమైన చట్టాలు చేసి పగడ్బందీగా అమలు చేయడం వలన కొంత వరకు న్యాయం జరిగింది. అంతేకాకుండా నేటికి ఆ చట్టాలే రక్షణగా ఉంటున్నాయి.ఉదా: 1914-17మద్య కాలంలో కారం తమ్మన్న దొర నడిపిన లాగరాయి తిరుగుబాటు ఫలితంగా అతని మరణాంతరం ఆగస్టు 4,1917నుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ ూaఅస ుతీaఅంటవతీ Aష్‌ -1917’’ను రూపొందించారు. ఆ చట్టమే ‘‘1/70 భూ బదలాంపు నియంత్రణ చట్టం’’గా రూపొందించారు. దీనిని అమలు చేయవలసిందిపోయి నిర్వీర్యం చేసి ప్రకృతి సంపదనంత అంబానీ, అధానిలకు అప్ప జెప్పడానికి సిద్ధమయ్యారు.1935 - దీతీఱ్‌ఱంష్ట్ర Iఅసఱa Aష్‌ ద్వారా212ుతీఱపaశ్రీ స్త్రతీశీబజూం ను గుర్తించి వారిని కాపాడడానికి చేసిన చట్టాలను సామాజిక న్యాయం పేరిట నిర్వీర్యం చేస్తు న్నారు. ఇతర కుల ప్రభావాలకు లోనైన తెగలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. అందులో భాగంగానే బీసీ కులాలైన బోయ,బోయ వాల్మీకి,ఒడ్డి(నకిలీ బెంతు ఒరియా) కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రెజిల్‌ దేశంలో ఆదిమజాతీ సమూ హానికి చెందిన చిట్టచివరి మనిషి మరణించిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పెసా చట్టం,అటవీకుల చట్టం ఎంత మేరకు అమలవుతుందో! ఎంత చిత్తశుద్ధితో పాలకులు అమలు చేస్తున్నారో! కళ్ళారా చూస్తున్నాము. ఆదివాసులు ఆధారపడ్డ అడవుల నుంచి వారిని గెంటివేయడానికి, ఆ అడవులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టదానికి, చట్టం చేసిన అనతి కాలంలోనే అంటే గత రెండున్నర దశబ్దాల కాలంలో కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయి.చింతపల్లి మండలం ఎర్ర వరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌, జాతియా రహదారి నిర్మాణం, టూరిజం పేరిట ఆదివాసులను భూమి లేని పేదలుగా మార్చివేస్తుంది. ఉమ్మడి విశాఖ ఎజేన్సి ప్రాంతంలో గత నాలుగు దశబ్దాలుగా (Gూఖ) (గిరిజన విద్యార్ధి సంఘం) ూూGR (ూతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ టశీతీ ూతీశ్‌ీవష్‌ఱశీఅ శీట Gఱతీఱjaఅa/ుతీఱపaశ్రీ Rఱస్త్రష్ట్ర్‌ం) చేసిన పోరాటాల ఫలితంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ఆదిమ తెగలకు ఉద్యోగాలు కల్పించే జీవోనె.3 వచ్చింది. అది ఇప్పుడు పాలకుల సహకారంతో రాద్దాయి పోయింది. ఆ జీవోను కాపాడడానికి పాలకుల ద్వారా కనీస ప్రయత్నం కూడా చేయబడి ఉండలేదు. Gూఖ, ూూGR సంస్థల పోరాట స్ఫూర్తితోనే ఆదివాసుల గొంతుగా మనం నేడు ‘‘ఆదివాసిని అనివార్యంగా ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. దీనిని కూడా లేకుండా చేయడానికి కుటీల ప్రయత్నలు జరుగుతుంది. జెఎసి అంటే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఆదివాసులు తమకు తాముగా సవరించుకున్న గొంతు. ఈ సంస్థ కొన్ని తరాల వరకు ఆదివా సులు తమ మనుగడను కొనసాగించ డానికి బరోసగా..స్తూర్తిగా ఉండాలని ఆశిస్తు న్నాను.ఆ స్పూర్తిని కొనసాగించడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం లేదా పాలకుడైన తమ రక్షణ చట్టాలు, హక్కులకు బంగం కలిగిస్తే చట్టసభల్లో ప్రశ్నించి సరి చేసుకునే అవకాసం ఉంటుందన్న గొప్ప ఆశయంతో రాజ్యాంగంలో అణగారిన కులాలకు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎంపిపిలు, చైర్మన్లులు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఆయా స్థానాలలో వారిని మాత్రమే ఎన్నుకునే అవకా శం కల్పించబడిరది. ఆయా సందర్బా లలో వారిని ప్రశ్నించే అవకాశం కల్పించాలనే ఇంగిత జ్ఞానం పాలకుడికి ఎలాగో ఉండదు. ఉన్న అవకాశం ఇవ్వరు. మన ప్రతినిదులులు కూడా కనీస బాద్యత తీసుకోవడం లేదు. అందువలనే పాలకులు ‘‘కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు’’ అల్పసంఖ్యాకులైన మన రిజర్వేషన్‌ హక్కులు మనం అనుభవించకుండా చేయడానికి ఇతర కులాలను ఎస్టిలలో కలపడానికి పూను కుంటున్నారు. ఈ అన్ని సందర్భాలలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆదివాసి ప్రజా ప్రతి నిధులు వారి యొక్క కనీస బాధ్యత నిర్వహించకపోవడం వలన ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.మీరేగాని ఈబాధ్యత తీసుకుంటే మీ అందరి జెండాలు కలిపి మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. విజ్ఞులైన మేధావులు జాగ్రత్తగా లేకపోతే నిజమైన ఆదివాసుల మనుగడకే ప్రమాదం మంచుకొస్తుందని ముగిస్తున్నాను. వ్యాసకర్త : జిల్లా కన్వినర్‌,ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జాయింట్‌ ఏక్షన్‌ కమిటి,అల్లూరి సీతారామారాజు జిల్లా