సహజ వనరులు..ఖనిజనిక్షేపాలు వరమా?శాపమా?

ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కాకుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలందరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతేకాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి.
సహజ,ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థి తులు ప్రపంచానికి ఇప్పటికీ ఒకఉదాహరణగా ఉన్నాయి.1959లోనెదర్లాండ్స్‌లో భారీఎత్తున గ్యాస్‌ నిల్వలను కనుగొనగా అప్పటి నుంచి ఆదేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారం భించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77 మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒక శాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందుకంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆర్థిక విశ్లేషకులు నిర్ధారించారు. బ్యాటరీ తయారీలో కీలకమైన లిథియమ్‌ నిల్వలను జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 59 లక్షల మెట్రిక్‌ టన్నుల లిథియం ఉన్నట్లు అంచనా వేసింది.ఈ అంచనా నిజమైతే ప్రపం చంలోనే అత్యధిక లిథియమ్‌ నిల్వలున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంటుంది. అంతే కాకుండాజమ్మూ కాశ్మీర్‌, ఏపీ,ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణల్లో 51చోట్ల ఖనిజనిల్వ లను గుర్తించారు. వాటిలో 5బంగారు గనులు సైతం ఉన్నాయి.అంతేకాకుండా పొటాష్‌, మాలిబ్డినం వంటి లోహాలను గుర్తించారు. అయితే ఇలాంటి సహజ, ఖనిజ నిక్షేపాలు ఆయా ప్రాంతా లకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు వరమా? శాపమా? అనే చర్చ అవసరమవుతున్నది.
పర్యావరణంపై తీవ్ర ప్రభావం
లిథియమ్‌ అయినా ఇతర ఖనిజ నిక్షేపాలైనా వాటిని మైనింగ్‌ చేసి, వెలికి తీయాలంటే ప్రకృతి, పర్యావ రణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నేల, నీరు, గాలి కలుషితమవుతాయి. ఉదాహరణకు ఒక టన్ను లిథియమ్‌ను ఉత్పత్తి చేయడానికి 2.2 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుంది. పర్యావరణంపై పడే ప్రభావాన్ని పట్టించుకోకుండా లిథియమ్‌ను వెలికి తీయడానికి ప్రయత్నిస్తే ‘జోషి మఠ్‌’ లాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదముంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియమ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో కర్బన ఉద్గారాలు ఎంతో మేర తగ్గించవచ్చని వాదించే వారూ ఉన్నారు. అయితే లిథియమ్‌ మైనింగ్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలను కూడా మనం తోసిపుచ్చలేం. లాభనష్టాలను బేరీజు వేసుకొని, అన్నింటిని సమతుల్యం చేసి ముందుకు సాగితేనే ఫలితముం టుంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుం డడంతో లిథియమ్‌ వెలికితీతపై ఇప్పటికే అర్జెం టీనా,బొలీవియా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున నిర సన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై..?
కేంద్ర గనుల శాఖ అంచనా వేసినట్టు జమ్మూ కాశ్మీర్‌లో 59లక్షల టన్నుల లిథియమ్‌ నిల్వలు ఉండి, పర్యావరణంపై కనీస ప్రభావంతో వాటిని వెలికితీసినా..అది దేశ ఆర్థిక వ్యవస్థకు, భౌగోళిక పరిస్థితులకు ఏ మేరకు లాభసాటిగా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.చమురు నిల్వలను కనుగొన్నప్పుడు గల్ఫ్‌ దేశాలు జాక్‌ పాట్‌ కొట్టినట్టే భారతదేశ పరిస్థితి ఉండబోతున్నదనే వాదనా ఉన్నది.
చరిత్రను పరిశీలిస్తే…
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున సహజ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఆ దేశా లపై పడ్డ ప్రభావాన్ని చూస్తే అనేక ఆసక్తికర విష యాలను మనం గమనించవచ్చు. కొన్ని దేశాలు సానుకూల పరిస్థితులను సృష్టించుకొని అభివృద్ధి దిశలో పయనించగా, సరైన ప్రణాళికలు లేకుండా మరికొన్ని దేశాలు దీర్ఘకాలికంగా అనేక రంగాల్లో వెనకబాటుకు గురయ్యాయి.గతంలో గల్ఫ్‌ దేశాలతోపాటు నార్వే, ఆస్ట్రేలియా, రువాండా లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొన్నారు.వీటివల్ల ఆదేశ ఆర్థికవ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. అదే సమయంలో వీటికి భిన్నమైన ఉదాహరణలు సైతం మనకు కనిపి స్తాయి.
‘డచ్‌ డిసీజ్‌’ ఒక ఉదాహరణ
సహజ, ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’ పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపం చానికి ఇప్పటికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. 1959లో నెదర్లాండ్స్‌లో భారీ ఎత్తున గ్యాస్‌ నిల్వ లను కనుగొనగా అప్పటి నుంచి ఆ దేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒకశాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందు కంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్ప న్నమైందని ఆర్థికవిశ్లేషకులు నిర్ధారించారు. అంతే కాకుండా 1908లో ఇరాన్‌లో ఆయిల్‌ నిల్వలను కనుగొన్నారు. అక్కడ ఇతరరంగాలు అభివృద్ధి చెందకపోవడం, అక్షరాస్యత అంతంతమాత్రంగానే ఉండడంతో పెట్టుబడులు, మానవ వనరులన్నీ ‘ఆయిల్‌’ రంగం వైపు మళ్లాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒకే వనరుపై ఆధారపడి నడపాల్సి వచ్చింది. దీంతో మిగిలినరంగాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్నో సహజ వన రులు, ఖనిజ నిక్షేపాలున్నా అవినీతి,సరైన ప్రణాళిక లేకపోవడంతో కాంగో,జింబాబ్వే లాంటి దేశాలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి.
ఇతర దేశాలను పరిశీలిస్తే…
గల్ఫ్‌దేశాల కరెన్సీ పూర్తిస్థాయిలో పెట్రో ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నది. ఇతర ఎలాంటి వస్తువులను ఆ దేశాలు ఎగుమతి చేయవు. దీంతో ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులను అవి ఎదుర్కోలేదు. అదే సమ యంలో ఆస్ట్రేలియా, నార్వే దేశాలను పరిశీలిస్తే ఖనిజ నిక్షేపాలతోపాటు ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాయి. విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులు రాకుండా తప్పించు కోగలి గాయి. అంతేకాకుండా సౌది, దుబాయి, యుఎఇ వంటి దేశాలు తమ ప్రాంతాలను టూరిస్ట్‌ హబ్‌ లుగా మార్చి తమ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కా కుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలం దరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి. – (ఫిరోజ్‌ ఖాన్‌)