ఎకో టూరిజంపై సమత శిక్షణ తరగతులు

స్థానిక వనరులపై స్థానికులకే హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో సమత గిరిజన యువతకు ఏకోటూరిజంపై జూన్‌ 19నుంచి 26వ తేదీ వరకు ఆరురోజుల పాటు గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.‘‘స్థానిక వనరులపై స్థానిక ఆదివాసులకే హక్కు ఉంది’’అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది.విశాఖ ఉమ్మడి జిల్లా ఐదువ షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన కటికి, కొల్లా పుట్‌,సరియా,సరుగుడు ఆదివాసీ ప్రాంత జలపా తాల వద్ద జరిగిన శిక్షణకార్యక్రమంలో సుమారు 30మంది యువతీ,యువకులు పాల్గొన్నారు. ఈ యువకులంతా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగాఉన్న వనరుల సద్విని యోగంపై అడిగి తెలుసుకున్నారు. అనంతిగిరి మండలం బొర్రా పంచా యితీ కటిక జలపాతం వద్ద నుంచి శిక్షణ కార్యక్ర మం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని బొర్రాపంచా యితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ కటికి వాటర్‌ ఫాల్స్‌ చరిత్ర ను వివరించారు.తర్వాత గ్రామపెద్ద గెమ్మెల దేవ కుమార్‌ మాట్లాడుతూ ఈ జలపాతాలు ద్వారా స్థానిక యువ కులు పొందుతున్న స్వయం ఉపాధి గురించి వివరించారు.వాటర్‌ ఫాల్స్‌ నిర్వహణ కమిటీ తరుపున గెమ్మెల రమేష్‌ మాట్లాడుతూ దీనివల్ల సుమారు 30మంది ఆదివాసీ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతున్నట్టు చెప్పారు.ఆనాడు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిరెబ్బాప్రగడ ఆద్వ ర్యంలో ఆనాటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ శివశంకర్‌ ఏర్పాటు చేసిన కటికి వాటర్‌ ఫాల్స్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నేడు మా ఆకలి తీర్చుతోందని వివరించారు. రెండోవరోజు కటికి,సరియా,సరుగుడు వాటర్‌ పల్స్‌ టీంలు కాటికి వాటర్‌పల్స్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్‌ భారత్‌ నిర్వహించారు.అక్కడ నుంచి మూడవ రోజు కొల్లాపుట్‌ ఎకో రిసార్టుస్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన శిక్షణలోఐ.టి.డి.ఏ.నుంచి ఎకో టూరిజం కో-ఆర్డినేటర్‌ గణపతి నాయుడు రిసోర్స్‌ పెర్సన్‌గా హజరయ్యారు. ఆయన ఎకో టూరిజం ప్రాముఖ్య తను వివరించారు.ఎకో టూరిజం అంటే ప్రకృతిని పాడు చేయకుండా చేసే కార్యక్రమని అన్నారు. దీనిద్వారా స్థానిక యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని,నీరు కలుషితం కాకుండా చెత్త చెదరాలను లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే దీని లక్ష్యమన్నారు. పర్యా వరణాన్ని పరిరక్షించుకోవడానికి స్థానికులను చైతన్య వంతులను చేయాలని కోరారు.చెట్లను నరక కుండా అందంగా తీర్చిదిద్దాలి.ఎకోటూరిజంద్వారా ప్రకృతి సహసిద్దమైన కూరగాయలు,అటవీ ఉత్పు త్తులు లభిస్తాయని వాటి ద్వారా కూడా జీవనో పాధిని పెంపొదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీనరీ ని పెంచడం ద్వారా టూరిస్టులు ఆకర్షితులు అవు తారని, వాటర్‌ పల్స్‌ దగ్గర ప్లాస్టిక్‌ కనిపించే కుండా టీం వర్కు చేయాలని పిలపు నిచ్చారు. అలాగే ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని అలాగే ఉంచి మనం క్రియేటివిటీగా ఆలోచించి అందంగా తీర్చి దిద్దినట్లుయితే అప్పుడు పర్యాటకులు ఇష్టపడ తారని సూచించారు.మొదట స్థానికంగా మనం ప్లాస్టిక్‌ని వాడకం తగ్గించాలని,తరువాత టూరిస్టు లకు చెప్పాలని సూచించారు. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఆకులు,వెదురును వస్తువులుగా తయారు చేసి వినియోగించుకొని స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.మట్టి కుండల్లో మంచినీటిని నింపి డోకులతో పర్యాటకులకు ఇవ్వడం అలవాటు చేయాలి.ఆదివాసీ సాంప్రదాయాలను,ఆచారా లను,మనం టూరిస్టులకు చూపించాలి.ఈ విధంగా ఉంటే మన ఆదాయం పెరుగుతుంది అని వివరిం చారు.చాపరాయి వాటర్ఫాల్స్‌ టూరిజం మేనేజర్‌ అప్పారావు కూడా పలు సూచనలు చేశారు.ఎకో టూరిజం-ఎకోఫ్రెండ్లీగా ఉండాలి. ఎకో టూరిజం మన ఆదివాసీప్రాంతాల్లో చాలాచక్కగా చేయవచ్చు న్నారు.నేచర్‌ ఎస్‌ టీచర్‌ ట్రైబ్‌ ఎస్‌ గైడ్‌ టీం వర్క్‌కి సొసైటీ కీ చాలా సంబంధం ఉంటుంది, మొదట టీం వర్క్‌ బలపడితే,దాని సొసైటీగా రిజిస్టర్‌ చేయ వచ్చు,ఈ సొసైటీలో ప్రెసిడెంటు, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ,జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి మరియు మెంబెర్స్‌ ఉంటారు. దీనికి ఒక బై లా ఉంటుంది. దాని ప్రకారం సొసైటీ ని నడపాలని సూచించారు. ముఖ్యంగా రికార్డ్స్‌ రాయాలి,ప్రతి సంవత్సరం అడిట్‌ చేయించాలి, టూరిజంలో ఎకోటూరిజం, అగ్రికల్చరల్‌ టూరిజం,హోమ్‌ స్టే టూరిజం ఇలా 75 రకాలు ఉన్నాయి. ఆతర్వాత 2016లో కొల్లా పుట్‌ రిసార్ట్‌ పేరుతో నిర్మించిన 8కాటేజీలద్వారా స్థానిక యువతీ, యువ కులు పొందుతున్న స్వయం ఉపాధిపై వివరిం చారు.అక్కడ నుంచి కొత్తపల్లి జలపాతంను సందర్శించారు.ఇక్కడ నవీన్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడ 12మంది యువకులు పని చేస్తున్నారు వీరు అంతా ఆదివాసీ తెగ(పీటీజీ) గ్రూప్‌కు చెందిన గిరిజనులని వారు ఇక్కడ స్వయం ఉపాది పొందు తున్నట్టు తెలిపారు.అక్కడ నుంచి చింతపల్లి మండలం,పెదబారడా పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు.ఇక్కడ చింతపల్లి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో చింతపల్లి అటవీశాఖ సబ్‌ డివిజినల్‌ అధికారి బెర్లాండ్‌రాజు,రేంజ్‌ అధికారిణి చిట్టితల్లి,సెక్షన్‌ ఆఫీసర్‌అప్పారావు బీట్‌ఆఫీసర్‌ వెంకటరావు గార్డులతో కలసి అవగాహన సదస్సు నిర్వహిం చారు.అటవీశాఖ అధికారులకు సమత కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ సమత నిర్వహిస్తున్న ఏకో టూరిజం శిక్షణపై వారికి వివరించారు. గత మూడు రోజుల నుండి కాటికి జలపాతం, కొల్లాపుట్‌ ఎకో టూరి జం,లంబసింగి టీం అందరు సందర్శించడం, అక్కడ వారు చేస్తున్న పని, ఎకో టూరిజం ద్వారా ఎలా జీవనోపాధి పొందుతు న్నారు, వంటి అంశాలు శిక్షణలో నేర్చుకోవడం జరిగిందన్నారు.షబ్‌ డివిజినల్‌ అధికారి మాట్లా డుతూ కృష్ణాపురం గ్రామం దగ్గరలో ఎకో టూరి జం,మీఅందరి సహకారంతో మొదలు పెడతాం. ఈటూరిజంలో మీ గ్రామస్తులు పని చేసుకొని ఉపాధి పొందడం మన ముఖ్య ఉద్దేశ్యమని వివరిం చారు. దీనికి అందరు సహకరించాలని ఆదివాసీల సహకారం లేకపోతేె ఈ ప్రాజెక్టుని తాము ముందుకు తీసుకెళ్లలేమని సూచించారు.అక్కడ నుంచి నాత వరం మండలం సరుగుడు పంచాయితీ సుందర కోటవాటర్‌ ఫాల్స్‌ సందర్శించారు. ఇక్కడకు కూడా చాలా మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్న మెంటు కొంత సుందరంగా తయారు చేశారు ఫారెస్టు డిపార్టుమెంట్‌ కొంత పెన్సింగ్‌ కట్టడం సరుగుడు వాటర్‌ పల్స్‌ అనిబోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ టికెట్‌ కలెక్షన్‌ లాంటివి చేయడం లేదని స్థానికులు తెలియజేశారు.
ఈ శిక్షణ నాకు ఎంతో ఆలోచన ఇచ్చింది..!
మాది సరుగుడు గ్రామం నేను బి.టెక్‌ చదివాను. ఈఐదురోజులు చాలా ప్రాంతాలు సందర్శించడం వల్ల నాకు ఎంతో ఆలోచన వచ్చింది.సరుగుడు వాటర్‌ ఫాల్స్‌వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టుచేసి ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులం స్వ యం ఉపాధి పొందుతాం.అందుకు సమత సహకా రం అవసరం.
చిన్నా.సరుగుడు ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన మాది కాటికి గ్రామం. మేము దాదాపు 15 సంవ త్సరంల నుండి కాటికి వాటర్‌ఫాల్స్‌ని నిర్వహి స్తున్నాము. ఇందులో దాదాపు 20మందికి ఉపాధి దొరుకుతుంది. కొల్లాపుట్‌ రిసార్ట్‌ ద్వారావారు ఉపాధి ఎలాదొరుకుకుతుంది నేర్చు కున్నాము.అలానే ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా కూడా ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన వచ్చింది. తమాల మోహన్‌,కటిక గ్రామం.
ఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా నేర్చుకున్నా..
మాది బొర్రా గ్రామం. ఈఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా అవసమైన విషయాలు నేర్చుకున్నాము. ఒక ప్రొడక్టుని వేల్యూ ఎడిషన్‌ చేస్తేదాని డిమేండ్‌ ఎలా ఉంటాది అనేది అర్ధమైంది. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టు లో టీంవర్క్‌పాత్ర దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాది తెలు సుకున్నాం.మనకు ఉన్న వనరులపై హక్కు మనకే ఉంది అనేది అర్ధం అయ్యింది. అలానే స్థానికంగా దొరికే వెదురుతో తయారు చేసిన వస్తువులకు రంగులు పూసి వాల్యూ ఎడిషన్‌ చేస్తే ఆదివాసీ వ్యాపారులకు ఇంకా మెరు గ్గా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనం టూరిస్టు లకు ఏదీ ఫ్రీగా ఇవ్వ కూడదు అనేది ఈ విజిట్‌ ద్వారా అర్ధం అయ్యింది.
`వంతుల మేరీ,బొర్రా
మహేష్‌ జర్ర: మాది సిరియా వాటర్‌ పల్స్‌, మేము ఒక్క టిక్కెటు కలెక్షన్‌ చేస్తూ 10 మంది ఉపాధి పొందుతున్నాము . మొదటిలో స్థానిక పంచాయతీ నుండి చాలా వత్తిడి వచ్చింది. వాటర్‌ పల్స్‌ పంచాయితీది అని చాలా ఇబ్బంది పెట్టారు. మేము అన్ని తట్టుకొని చేస్తున్నాము సమతా సతీష్‌ గారి ద్వారా కటికి వారు నిర్వహిస్తున్న వాటర్‌ పల్స్‌ ని సందర్శించడం జరిగింది, అలా నే వారిని చూసి మాకు కూడా కొంత దైర్యం వచ్చింది. సర్యా వాటర్‌ పల్స్‌ అనేదిచాలా ప్రమాద కరమైన ప్రదే శం,కాబట్టి మేము చాలా జాగ్రత్త పని చేయా లి, ముఖ్యంగా టూరిస్టులు విశాఖపట్నం నుండి వస్తారు.ఈ విసిట్‌ వలన మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి,ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు టూరి స్టులకు చూపిస్తే వారు ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఎకోటూరిజం ప్రాజెక్టు నాకు ఆలో చన చేస్తాము.-(కె.సతీష్‌ కుమార్‌)