మానవత్వానికే మచ్చ..!

మణిపూర్‌లో మూడు నెలలుగా పాలన గాడి తప్పింది.శాంతిభద్రతలు దిగజారాయి. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించి నీచరాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడి యోలు అసాంఘికశక్తుల అరాచకాలను స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు,పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు.
మణిపూర్‌లో స్త్రీల మానాలకు, పురు షుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది.పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. దురాగతాల వీడియోలు ప్రపంచానికి మణిపూర్‌ దీనస్థితిని ఎలుగెత్తి చాటుతున్నాయి.బీజేపీ పాలన లో తప్ప గతం లో ఎన్నడూ దేశ ప్రతిష్ఠ ఇంతగా దిగజారిపోలేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ డబు ల్‌ ఇంజిన్‌ సర్కారే మణిపూర్‌లో ఉన్నది.వారి పాల నలో ప్రభుత్వ అనుకూల మూకలు రెచ్చిపోతున్నాయి. రాక్షస ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నాయి. గత రెండు నెలలుగా హింసా త్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. గృహ దహనాలు కొనసాగుతున్నాయి. స్త్రీలు,పిల్లలు, వృద్ధు లు హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలపై అత్యాచా రాలు కొనసాగుతున్నాయి. తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపాడమని దేవుడిని వేడుకుం టున్న వందలాది మంది క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.పోలీసుల కాల్పులలో 86 మందికిపైగా మరణించారు. ప్రార్థనా మందిరాలైన వందలాది చర్చిలను ధ్వంసం చేశారు. మణిపూర్‌లో మతం మత్తులో హింస హద్దులు దాటింది.మరో గుజరాత్‌ మారణ కాండను తలపించేలా మైనారిటీ గిరిజనులపై హింసాకాం డ కొనసాగుతున్నది. అల్లరి మూకలు గిరిజనులను లక్ష్యం గా చేసుకుంటున్నాయి. కర్ర లు, కత్తులు, ఆయుధాలతో దాడులు చేస్తున్నాయి. చేతికి చిక్కిన మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తు న్నాయి. ఇద్దరు మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారిని వివస్త్రలను చేసి, వీధులలో బహిరంగా ఊరేగించారు. ఆపై పొలాల్లోకి ఈడ్చు కళ్లారు. స్త్రీలపై సామూహిక లైంగికదాడులు జరుగుతున్నాయి.కాలేజీలో చదువుతున్న 21 ఏండ్ల అమ్మాయి కూడా బాధితుల్లో ఉన్నది. 19 ఏండ్ల ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి హింసించి చివరికి చంపేశారు. రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించారు. మే4న జరిగిన ఈఅమానుష సంఘ టన వీడియో దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఒకవైపు అల్లర్లు, హింసాత్మక సంఘటన లతో మణిపూర్‌ మూడు నెలలుగా తగలబడు తుంటే,మరోవైపు బాధ్యతలేని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశ,విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు ఆయనకు జేజేలు పలకడం అమానుషత్వానికి పరాకాష్ఠ. కనీసం బాధితులను ప్రధాని ఓదార్చలేదు. వారికి ధైర్యమైనా ఇవ్వలేదు.శాంతిభద్రతలపై సమీక్ష కూడా చేయలేదు. ప్రాణ భయంతో మణిపూర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్న వారికి భరోసానైనా కల్పించలేదు. పోలీసులకు మార్గదర్శక త్వమైనా చేయలేదు. వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీ సం స్పందిస్తుందా?ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదాఎప్పటి మాదిరిగానే దున్నపోతు మీదవర్షం పడినట్లు స్తబ్ధుగా,మౌనంగా ఉండి పోతుందా? వేచిచూడాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతావాదులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలనను ఎండగట్టాలి.దేశ,విదేశీ మీడి యా కండ్లు తెరువాలి.సోషల్‌ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్‌ దురాగతాలను ఖండిరచాలి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. మణిపూర్‌ సంఘటనలపై ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచా రణ జరిపించాలి. కాలయాపన చేయకుండా దోషులపట్ల కఠినంగా వ్యవహరించాలి. న్యాయపర మైన శిక్ష విధించాలి.
స్త్రీల అస్తిత్వానికి పెను సవాల్‌ ` అనిశెట్టి రజిత
మాతృదేశానమాతృమూర్తులకు లబి óస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమ యంలో మతితప్పి ఉంటే బాగుండుననిపి స్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయ బడిన పాలనలో ఉన్నామా అనిపిస్తున్నది. మైనారిటీలు, ఆదివాసీలు,కొన్నితెగల,సమూహాల పౌరస త్వాలూ, అస్తిత్వాలూ ప్రశ్నార్థకమవుతున్నాయి. దేశంలో స్త్రీల అస్తిత్వాలకు పెనుసవాల్‌ ఎదురవుతున్నది. భారతీ య సమాజాన్ని వేధిస్తున్న వ్యవస్థను చూస్తే విస్మ యం కలుగుతున్నది. దేశంలో మతతత్వం, కుల తత్వం, ప్రాంతీయ దురహంకారం ఉన్మాదంతో చెలరేగిపోతున్నది. వారి అరాచకాలను సమర్థించు కోవడానికి,ఓటు బ్యాంకులను కొల్లగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే ఈ రాజకీయ హత్యాకాండల న్నీ. అయినా దేశాన్ని, ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి ఇవేం పట్టవు. మతం ఈరోజున దేశానికి ప్రధాన రాజకీయ వనరుగా మారింది. ఈర్ష్యాద్వేషాల ముసుగులను వేసుకొని నగ్నతాం డవం చేస్తున్నది. ఇదంతా చేస్తున్నది చేయిస్తున్నది మతవాదులే అని తేటతెల్లమైంది. మతమంటే మారణ హోమమా? మన భారతీయ సంస్కృతిని మనం ఎలా నిర్వచిం చుకుందాం? నాజ్ఞానానికి, అనుభవానికి తెలిసినంత వరకు మతం, ఆచారా లు, సంప్రదాయాలు,తంతులూ అన్నీ కూడా మన సంస్కృతిలో భాగం మాత్రమే. స్వార్థపర దుష్టశక్తులు తమ పగద్వేషాలూ, దుండ గాలు, దోపిడీల కోసం మతాన్ని సంస్కృతి నుంచి విడదీసి దాన్నొక ఆయు ధంగా వాడుకుంటున్నారు. సంఘ సమగ్రతను చిన్నాభిన్నం చేస్తూ రక్త క్రీడలను ప్రోత్సహిస్తు న్నారు. ఈ దేశాన్ని ‘భారతమాత’ అంటూ మోకరి ల్లుతూ ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ భరతమాతకు చెడ్డపేరు తెస్తున్నారు. ఒకభారత స్త్రీగా,పౌరురాలిగా,దేశ భక్తురాలిగా, సమతా సామ్యవాద శాంతి విలసిల్లే సమాజాన్ని ఆశిస్తున్నాను. కానీ నారీశక్తిగా నేను కలతల లోకంలో కల్లోలిత జీవితం గడపాల్సి వస్తున్నది. అమానుషత్వాల, అగౌరవానికి నిత్యం బలిపశువునై ఆక్రందనలు చేయాల్సి వస్తున్నది. అందుకే వెంటాడుతున్న మానవ మృగాల నీడలకు భీతిల్లి ప్రాణ,మాన రక్షణ కోసం పరితపించాల్సి వస్తున్నది. గాయపడిన దేహాలతో చిరిగిన పీలికల్ని చుట్టుకొని,అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ పోతున్న స్త్రీమూర్తుల వారసురాలిగా ఆందోళన చెందాల్సి వస్తున్నది.ఆడపిల్లగా పుట్టినందుకు లైంగిక దాడు లకు, ఆడజన్మనెత్తినందుకు అత్యాచారాలకు నన్ను వేదికగా చేసుకుంటున్నారు. గౌరవంతో, హుందా తనంతో జీవించే హక్కునూ, అర్హతను నిరాకరిస్తు న్నారు. ఇలాంటి వింత మృగాళ్ళ నడుమ ఉన్నందు కు నాలో విపరీత ఆలోచనలు కలుగుతున్నాయి. సిగ్గులేని మనుషుల నడుమ సిగ్గుతో తలవంచుకొని, నన్నూ నాదేహాన్ని లోలోపలికి కుచించుకొని బత కాల్సి వస్తున్నది. ఈ రోజున దేశానికీ ‘దేశమాత’కూ దిక్కు దిశ లేదు. రాజ్యాంగాన్ని చదువాల్సి వస్తుం దని,పాటించకుంటే ప్రశ్నిస్తారని ఏ చీకటి గుహల్లో నో సమాధి చేశారు. మానవీయ భావనలను మధ్య యుగాల్లోకి మళ్లించారు. ఆడవాళ్ల దేహాలపై నగ్న రాజకీయాల పచ్చబొట్లు పొడుస్తున్నారు.ఈ రోజున రాజకీయాలు సృష్టించిన‘మతం’తో జతగట్టి భారతమాత ప్రతినిధులైన స్త్రీల నగ్న దేహాలతో రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తమ తమ మత ఉన్మాదాలకు రక్తసిక్త నగ్న చరిత్రలు రాసి వికృతత్వానికి పట్టం కడ్తున్నారు. మతం చిచ్చుకు తోడు ‘మర్దాంగీ’(మగతనం)లను మేల్కొల్పి స్త్రీలపై విరుచుకుపడి మృగ(మగ)తనాలను నిరూపించు కుంటున్నారు. నిజంగా వీళ్లు మతం అంటే ఏమిటో తెలిసినవాళ్లేనా? నిజంగా వీళ్లు భారతీయులేనా? దేశమన్నా, దేశభక్తియన్నా వీరికి అర్థం తెలుసా? నిజంగా వీళ్లు స్త్రీలను గౌరవించి పూజించే వ్యక్తు లేనా? స్త్రీలను ‘సతి’ చేసిగాని చల్లబడే మత రక్షకులే కదా, మూర్ఖ పాలకులే కదా. ‘భారత్‌ బచావో’ అన్న భావన నినాదమై ఈ రోజున దేశవ్యాప్తంగా అలజడిగా మారింది.పౌరసమాజం పాలకుల నేరా లపట్ల అట్టడుగు నుంచి ఉడికిపోతున్నది. భరత మాత కన్నీటి గంగలు ప్రవాహాలుగా ప్రళ యాలు సృష్టిస్తున్నవి.భేటీ బచావో, బడావో, పడావో మాట లు చిలుం పట్టి తుక్కులా రాలి పోతున్నవి.
అయ్యా! దేశ ఏలికల్లారా! పాలకుల్లారా! అధికార పీఠాలను అధిష్ఠించిన రాజకీయ, మత నేతల్లారా! మానవత్వం కన్నా ‘మహోన్నత మతం’ ఏదో,ఎక్కడుందో సెలవిస్తారా?మానవ సేవకన్నా మాధవ సేవంటూ ఉందా!దేశప్రజల క్షేమం, రక్షణ, వారికిచ్చే భరోసా, నమ్మకాలను మించిన సంక్షేమ శాంతి పరిపాలన ఇంకేమైన ఉన్నదా? లౌకికశక్తుల నిర్భంధం,అరాచకశక్తుల విశృంఖలత్వమే మీ సైద్ధాంతిక విధానమా? దాన్ని అరాచక అత్యాచా రాల పునాదులపై లేచిన కబేళాలతో నింపాలను కుంటున్నారా? అందుకు ఈ (మా) దేశపు స్త్రీలమైన మా దేహాలే మీకు వేదికలా? మా శవాలపైనే మీ సింహాసనాలా? అయ్యా అన్నీ కన్నీటి ప్రశ్నలే%ౌౌ% అంతా సంక్షుభిత పరిస్థితులే! అంతటా రక్తపు తడిలో తడిచి రెపరెపలాడున్న నెత్తుటి పతాకాలే! మీ దేశభక్తికీ మత ధర్మ ఉద్ధరణలకు ఒక నిరసన దండం! (వ్యాసకర్త : ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు)-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)