అడవే తిండి పెడుతోంది..

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది.
ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయ కుండానే అనేక రకాల ఆకుకూరలు,దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో,దుంపో దొరుకుతుంది.సంతల్లో 21 రకాల ఆకుకూరలు,పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు,చిన్న రొయ్యలు,కొక్కులు అమ్ము తుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్‌గఢ్‌),చింతూరు (ఆంధ్ర ప్రదేశ్‌), చర్ల(తెలంగాణ),మోటు (ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు,ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. ప్రకృతిని ప్రేమించాలి. దండ కారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్‌ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం…కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతు న్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్‌, డిస్‌ప్లేస్‌మెంట్‌, క్లైమేట్‌? ఛేంజ్‌, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే..వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్‌ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు.
ఇవి దొరుకుతున్నయ్‌
మిర్చిలో బొబాయి,బోరాయి,చిన్ని కోర్‌ మిడియా పెద్దకోర్‌ మిడియా,నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి.వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్‌జాట,బామ్‌జాట, కిసీర్‌ జాట-2,లుగ్గి జాటా తెల్ల వంకాయ, పెద్ద రాముల్క,చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్‌?మీట,నారదుంప,అడవి ఎలేరి దుంప, నాగేల్‌మాటి దుంప,నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్‌?, ఇత్తోడ్‌కుసీర్‌, కుక్కాళ్‌ కుసీర్‌,దోబకుసీర్‌, పండ్లలో తోలె,పరిగి,ఎర్క,వెలగ,పుసుగు.. సీజన్‌ బట్టి దొరుకుతాయి.
ఆహార భద్రతకు ముప్పు
ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ)-2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ‘ఉచిత రేషన్‌’ నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూ హంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడిరట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది ‘ఉచితం’ ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్ర యులు,వితంతు ఫించను పొందేవారు, ఏ ఆస రా లేని నిరుపేదలు, నిరుద్యోగులు,వయో వృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలోరూ.3), గోధు మలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికా హారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధార పడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితా లకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన ‘జీవించే హక్కు’ అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల ‘అమృతోత్సవ భారతావని’ గొప్పలు ఎంత ఘోరమైనవో.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తు న్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనే వుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చి లో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది.ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యా లతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.
ఆహార భద్రత అందరి బాధ్యత
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించి నట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35శాతం వరకు వృథా అవుతు న్నాయి. భారత్‌లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ఈ లోపంవల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది.భారత్‌లో 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకా హార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపో వడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండిరచే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవ సాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథావల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్‌ పద్ధతులు పాటించాలి. ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడిరది. తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంత మొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుం చింది.ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అను కూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది. ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధి కులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది. మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారత దేశంలోనే ఉంటారని హెచ్చరించింది. 2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌,నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది. 2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమ టిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్స రాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది. ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడిరది. ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదిం చిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి,దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడిరది. తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడిరది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడిరది. అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికా హారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడిరది.
2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని వేసింది.ఆ వ్యా జ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకా లను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి.2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం.ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనం తరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడిరది. ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ,6-14 సంవ త్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు. -జి ఏ సునీల్ కుమార్