పోలవరం పోరు కేక

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండు తాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూ ములు గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా,సరైన పునరావాసం కల్పించకుండా కాలం గుడపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మమా పాద యాత్రకు కదం తొక్కారు. జూన్‌ 20 అల్లూరి జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర జూలై 4న విజయ వాడలో ముగిసింది.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్రప్రభ/త్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్వక్ష్యం వహి స్తుందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగ రంగ వైభంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మూరు మూరులో పాదయాత్ర కొనసాగుతుంది. కళ్లుండి చూడ లేని,చెవులుండీ వినలేని గుడ్డి,చెవిటి ప్రభు త్వాల్ని మనం ఎన్నుకున్నామని నిర్వాసితులు విమర్శి స్తున్నారు. వరదలోస్తే మురమూరు గ్రామాలు నీటి మునిగే ప్రమాదముందని,41కాంటూరులో కలపా లని కోరుతూ అధికారిక మెమోరాండం సమర్పిం చినట్లు నిర్వాసితుల తరుపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటించారు. మురు మూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయ కులు సంఫీు భావం పలికారు.అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్వాసితుల డిమాండ్లు ఇవే
పోలవరం నిర్వాసితులకు పునరావాసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని,1986,2022నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని,మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరవాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది.పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలని,ప్రతి ఎకరానికి రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి18ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని,నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.
ఇలా సాగిన పాదయాత్ర
అల్లూరి సీతారామారాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400కిలోమీటర్ల మేర 15రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం,వీ.వెంకటేశ్వర్లు పాల్గొ న్నారు.
పోలవరం పునరావాసం కోసం…
పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇదిబహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగు నీరు,తాగునీరు,విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మాహయాంలో పూర్తిచేస్తా మంటే మాహ యాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనంచూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు,ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబు తున్నది….ప్రాజెక్టు ఎత్తు, పొడవు,వాలు,డ్యామ్‌ నిధులు…వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగంచేసిన నిర్వాసితుల గురించి. పోల వరం నిర్వాసితులకు న్యాయం చేయా లని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4వరకు చేపట్టిన‘మహా పాద యాత్ర’ గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ జూలై 4న విజయవాడకు చేరికొని మహా సభతో ముగి సింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373గ్రామాలు,1,06, 000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు,సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం.2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టుఖర్చు రూ.55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ.33,000కోట్లు కానీ ఖర్చుచేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు.మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు,అడవి బిడ్డల పరిస్థితి ఏంటి?అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు.ఏనిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు.బుట్టాయిగూడెం, జీలు గుమిల్లి,జంగారెడ్డిగూడెంనిర్వాసిత కాలనీల్లో అధ్వా న పరిస్థితులున్నాయి.ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి.నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులైనెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాం టూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపో యింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితా లోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి.పంటపొలాలు మునిగిపోయాయి.33రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10వేలు అందిం చారు. అదికూడా అరకొరగానే అందించారు. అందులోను రేకులషెడ్డుకి ఇవ్వలేదు.ముంపు గ్రా మాల ప్రజలకష్టాలు ఇలాఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసితకాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయా రైంది.వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి2సంవత్సరాలైంది.రావాల్సిన ప్యాకే జీ డబ్బులు ఇంకారాలేదు.కనీస సౌకర్యాలు కల్పిం చడం లేదు.‘చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళి పోతాం.పరిహారం ఇస్తుందో,మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద’ని ఆవేదన చెందుతున్నారు.సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి.కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారినదిలో.ఆ తుఫాన్‌పేరు నిర్వాసితుల ఉద్య మం.ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.
1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధి కార్లు ఇలా చేస్తున్నారని అన్నారు. 2,ప్రభుత్వం నిర్వాసితులనుగాలికి వదిలేసింది అని, వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10లక్షలు, ప్రతీకుటుం బానికి రూ10వేలు,దోమతెరలు మూ డు,నెలలపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతిపక్షరాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.3,కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.4,ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి25 కేజీల బియ్యం,కేజీ కంది పప్పు, కేజీ నూనె,కూరగాయలు ఇస్తున్నారు.అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరుజిల్లా కలెక్టరు,మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.వెలేరు పాడు ముంపు గ్రామాలను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వా నికి తెలియదా? సవంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ మే నెలలో నే చెప్పింది.ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియకుండా పోతుం దా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమ వుతుంది.ముంపు ప్రాంతాలను అధికారులు ముం దస్తుగా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్లను,తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రిపూట చడీ చప్పుడూ లేకుం డా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయ మైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామప్రజలు సొం తంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఇలా చేయడంవల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు.అంటే దానర్ధం పొ మ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉం డలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుం ది.కానీ ఇది పూర్తిగా మానవతప్పిదంగానే భావిం చాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఉంటుంది.
ముంపు, నిర్వాసిత సమస్యను,తగ్గించటానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,ప్రాజెక్ట్‌ భాధిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిం చాలని ఉంటుంది.కానీ వాస్తవానికి కనిపించేది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.
1986గోదావరి వరదలకు దీనికి పొంతన లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకునీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫ ర్‌ డామ్‌ నిర్మాణం వలన బ్యాక్‌ వాటర్‌ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రా చలం కూడా వరద తాకిడికి గురైంది. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఓ.ఎస్‌.నెంబర్‌బీ1ఆఫ్‌2019.అదే ఇప్పుడు పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చి వేయాలని వాదిస్తున్నారు.
ఆస్తి నష్టం అంచనా వేయరు!
సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంటనష్టం, ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుముంపు గ్రామాలలో అది సాధ్యంకాదు.ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగిపోయినా,రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్‌ కట్టరు,ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ.ఏ.వై.స్కీమ్‌లో కట్టరు.పంట దెబ్బతిందని వ్యవసాయశాఖఅధికారులు వచ్చిచెక్కులు ఇవ్వరు. (భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి. 1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్‌ వాటర్‌ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి.రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆవిషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు.కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసిం చాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రజల మధ్యన పని చేసే అను భవంఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదు ర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏఒక్కరి సమస్యకాదు,మానవ సమా జంలోఉన్నఅన్ని వర్గాల ప్రజలదని నమ్ముతు న్నాను.-(వై.రాము/బాబ్జీ)