ప్రభం జనం ఆపుదాం..!

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం… ప్రపంచ జనాభాదినోత్సవం (జూలై11)సంద ర్భం గా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకా రం భారత్‌వచ్చే ఏడాది1.4బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినదేశంగా అవతరించ నుం ది.ఈనివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్‌ నాటికి 800 కోట్లకు చేరనుంది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4బిలియన్ల(1040కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగుతోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిరచింది. కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపి యా,భారత్‌,నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌, టాంజా నియా దేశాల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశా లు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవడంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050 నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం,2023 ఇతివృత్తం ఏమిటంటే,‘‘హక్కులు,ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది.అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగు దల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగించడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవాహాన్ని అనుభవించాయని అంచనా వేయబడిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణం గా ఉన్నాయి, అవి పాకిస్థాన్‌ (2010-2021లో -16.5 మిలియన్ల నికర ప్రవాహం), భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి.అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యం లో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందుబాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక,ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.-జిఎన్‌వి సతీష్‌