ఓటే ఆయుధం..ఒకటై సాగుదాం!

అన్ని అంశాలు పాఠాలు చెప్తాయి. చారిత్రక అంశాలు గుణపాఠాలు నేర్పిస్తాయి’ ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన మేధావి డాక్టర్‌ జయశంకర్‌ ఒక సందర్భంలో చెప్పిన, చాలా విలు వైన మాట. ఆ చరిత్ర లను అర్థం చేసుకున్న పాలకులు పాఠాలు నేర్చుకొని చిరంజీవులుగా మానవ జాతి ఉన్నన్నాళ్లూ కీర్తింపబడు తారు. ఆ విధంగా పాఠాలు నేర్చుకోక కొందరు నియం తలుగా మారి ప్రజా కంటకులుగా గుర్తింపబడు తారు. వారిని తలచుకున్నప్పుడల్లా జనాలకు ఏవగింపు తప్ప ఇంకో భావం కలగదు. అంటే వారు జీవించిలేక పోయినా సామాన్య జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు నడుస్తున్న భారత రాజకీయా ల్లో ఈ దేశ చరిత్రలోంచి నాయకులు నేర్చుకోవలసిన పాఠాలేమిటో చూద్దాం!
గత వెయ్యేండ్లలో అత్యంత అధికారం కలిగి,ఎక్కువకాలం పాలించిన మొఘ లు సామ్రాజ్య చరిత్రను గమనిస్తే ఒక విస్మయం కలిగే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్‌ గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్‌ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రెస్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. మొదటి పాలకుడు బాబర్‌, తర్వాత హుమాయూన్‌, అక్బర్‌,జహంగీర్‌, షాజహాన్‌లకంటే ఎక్కువ భూభాగాన్ని 55ఏండ్లు ఔరంగజేబు పాలించాడు. మరి ఆయన మరణం తర్వాత కొన్నేండ్లలోనే మొఘల్‌ సామ్రాజ్యం చిన్నాభిన్న మైంది.ఏపాలకుడూ నిల దొక్కుకోలేక పోయాడు. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి.

  1. ప్రజాభిమానం పాలకుడికి అతిముఖ్యమైన బలం అని ఔరంగజేబు గుర్తించకపోవటం. 2. ఆయన మత మౌఢ్యం,ఇతర మతాల పట్ల ద్వేషం, ఆలోచనాపరులైన ప్రజలను ఆవంశానికే శత్రువులుగా చేయటం.
  2. దేశ చరిత్ర బట్టి ఐక్యత కోసం అందరినీ సమ దృష్టితో చూడాలన్న అంశం ఔరంగజేబు గుర్తించక పోవడం.
  3. దాదాపు ఆరు దశాబ్దాలు తన పరిపాలనే ఉన్నా, అత్యాశతో యుద్ధాలు చేసి,కోశా గారం లోని ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం, దేశ ప్రగతి కోసం కాకుండా, తాను శత్రువు లనుకున్న వారిని అణచివేయటానికి ఖర్చు చేయటం.
    ఈ నాలుగు బలమైన కారణాలతో,శతాబ్దాలు పాలించినా, మొఘలు సామ్రాజ్య పతనం కేవలం ఐదు దశాబ్దాలలో జరిగిపోయింది. అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమతో కాకుండా ద్వేషంతో,మౌఢ్యంతో ఎంతకాలం పాలించినా ఆ నియంతలకు ఓటమి తప్పదన్నది చారిత్రక సత్యం.
    ఇప్పుడు మన దేశాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్న బీజేపీ విధానాలతో పైన చెప్పిన అంశా లు పోలిక కలిగి ఉండటం సుస్పష్టంగా కనిపి స్తుంది. రెండుసార్లు కేంద్రంలో మెజారిటీ సాధించి పరిపాలిస్తున్నా, అధినాయకులిద్దరూ కడుపు నిండా అన్నం తిని కంటినిండా నిద్రపోతున్నారా అన్నది అనుమానాస్పదమే! ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవో ఒకఎన్నికలు ప్రతిఏడాదీ, రెండేం డ్లకు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో గెలవగానే,ఇక తర్వాత వేరే రాష్ట్రంలో వచ్చే ఎన్ని కల సన్నాహాలతో, ప్రత్యర్థులను ఓడిరచాలనే పట్టుద లతో 24గంటలూ అదే ఆలోచనాధోరణితో, ఆచర ణతో ఉండే వీరికి మరిదేశ పరిపాలనకు సమయం చిక్కటం లేదు. మనది ప్రజాస్వామ్యం కాబట్టి,ఓట్ల ద్వారా గెలుపోటములు నిర్ణయింపబడుతాయి కాబట్టి,రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పు డు ఆలోచనలో పడుతున్నారు, తొమ్మిదేండ్ల సమ యం ఒక్క రంగాన్నైనా ఉద్ధరించటానికి సరిపోదా అని. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గతంలో దేశ ప్రజలకు ఎంత చేయాలో అంత చేయలేదన్నది కఠిన సత్యం. కానీ వారు ఈ విధంగా ప్రజా జీవి తాన్ని అతలాకుతలం చేయలేదన్నది కూడా నిజం. అక్బర్‌,షాజహాన్‌,జహంగీర్‌ కూడా పరిపాలించినా, వారు జన జీవనానికి అడ్డుపడలేదు.కాంగ్రెస్‌ ప్రభు త్వం అంతే.మరి వారి కంటే ఎక్కువ కాలం పరిపా లించిన ఔరంగజేబు ఎందుకు ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నాడు? సరిగ్గా ప్రస్తుత ప్రధానమంత్రి ఇలాగే శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. ఒక తప్పు కప్పుకో వటానికి ఇంకొకటి, ఒక సంచలనాన్ని మరుగు పరచటానికి ఇంకొకటి! ప్రజాగ్రహాన్ని మరల్చత తటానికి పుల్వామా దాడులు, ఆత్మీయ మిత్రుడి కష్టాన్ని కుంభకోణాన్ని దాచటానికి విపక్ష నాయకుడి బహిష్కరణ! నిజానికి నరేంద్ర మోదీ గారి ప్రసం గాలు ఒకసారి టీవీలల్లో ప్రసారం చేస్తే, ఆయన మంత్రులు,అనుయాయులు కాంగ్రెస్‌ నేతలని, ముఖ్యంగా నెహ్రూ కుటుంబసభ్యులని, దేశంలోని మహిళలను ఎంత అవమానించారో ప్రజలకు తెలు స్తుంది. మరి వారి మాటలను కూడా విచారించి శిక్షలు వేయాలి కదా! మాటలే కాదు, వారి అత్యా చారాలు, హత్యలకు కూడా రాజ్యాంగంలో శిక్షలే లేవు. మరి విపక్ష నాయకుడు అన్న దాంట్లో తప్పే ముంది? నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ నిన్న బయట పడ్డారు. మన ప్రధాని అదానీని రక్షిస్తూ, ఇవాళ బయటపడ్డారు. చేసే పనుల మీద సీబీఐ విచారణ వేస్తే తేలిపోతుంది కదా! అయితే, విపక్ష నాయకుడి రాజకీయ ఎన్నికల బహిష్కరణను ఇంకో కోణం నుంచి కూడా పరిశీ లించవచ్చు. ఆధునిక చరిత్రలో గుర్తుకొచ్చే ఇద్దరు నియంతల ప్రవర్తన, అనుసరిం చిన విధానాలు గమ నిస్తే వాటిలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇటలీని పరిపాలించిన నియంత బెనిటో ముస్సోలినీ, జర్మనీని ఏలిన అధినేత అడాల్ఫ్‌ హిట్లర్‌ సమకాలీ కులు,29 జూలై 1883లో పుట్టిన ముస్సోలినీ తన అరాచక పాలనను 1925 నుంచి 1945 దాకా సాగించాడు. తన10వ ఏటనే స్కూలులో ఒక బాలుడిని కత్తితో పొడవటంతో మొదలైన అతడి క్రూరత్వం,ఫాసిస్టు పార్టీ పెట్టి చివరిదాకా దాష్టీకాలు సాగించాడు. అలాగే, 1883 ఏప్రిల్‌ 20న పుట్టిన అడాల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీ అధినేతగా 1933 నుంచీ 1945 దాకా నియంతృత్వ పాలన సాగించాడు. లక్షల మందిని క్రూరంగా చంపిం చాడు. అయితే వీరిద్దరి ఉదాహరణల నుంచి నేర్చుకునే పాఠం ఒక్కటే. పాలితుల పట్ల ప్రేమఉండి వారిలో ఒకడిగా చరిం చి దేశానికి ప్రగతి సాధించేవాడికి ఉన్న ప్రశాంత జీవనం నియంతగా మారి,క్రూరమైన రీతుల్లో ప్రవర్తించి,ముఖ్యంగా తనను విమర్శించే వాళ్లు బతికి ఉండొద్దనే పద్ధతులు పాటించినవారికి ఉండదు. వారు పులి మీద స్వారీ చేస్తున్నట్టే! కొద్దిగా పరిస్థితి మారితే వారు సృష్టించు కున్న విధానాలే వారిని అధఃపాతా ళానికి తొక్కేస్తా యి.మహా ఘోరమైన జీవితం చూడవలసి వస్తుంది. అసహ నం,అధికారదాహం, విపక్షాల పట్ల కక్ష, విపరీత మైన వివక్ష, పక్షపాత ధోరణి ఉన్న నియం తలు చాలాకాలం మనలేరు. పదవిలో కొనసాగ లేరు. అంతేకాదు, తమ అధికార బలం, ప్రజాభి మానం తగ్గుతున్నదన్న అనుమానం కలిగిన కొద్దీ ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తారు. అవే వారిని పదవీచ్యుతులను చేసే ఆయుధాలు. ఇప్పుడు రాహుల్‌గాంధీ బహిష్కరణ,శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు. ప్రధానిలో ఒకరకమైన భయం మొదలైందన్న నిజానికి నిదర్శనం. ఎందుకంటే ఎంత బీజేపీ రెండు సార్వత్రిక ఎన్నికలు గెలిచినా, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు ఒకటి నికరంగా దేశంలో ఉన్నది. ఇప్పుడు మోదీ భయం ప్రతిపక్షాలు తప్పిదారి కాంగ్రెస్‌తో కలిశాయంటే, బీజేపీ పని ఖతమైపోతుంది. ప్రజలు ఈ విషయం ఆలోచిం చాలి.ఇప్పుడు ఏంజరుగుతుంది?రాహుల్‌ గాంధీ ని జైల్లో పెట్టినా,బెయిల్‌ మీదవిడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రె స్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. ఇదే జరిగిన రోజు బీజేపీ చరిత్ర ముగిసి నట్టే! ఆధునిక నియంతలు ముస్సోలినీ,హిట్లర్‌ రెండురోజుల తేడాతో జీవితం చాలించడం చారి త్రక సత్యం. మోదీ-షా ద్వయం తప్పు మీద తప్పు చేసి అధికారం కోల్పోవటం దానిని చరిత్రలో లిఖిం చటం మన కండ్ల ముందే జరుగుతుంది. – (కనకదుర్గ దంటు)

ఏది భారత జాతీయత ?

దేశంలో గత కొంత కాలంగా జాతీ యత పేరు మీద కుహనా జాతీయవాదం వెర్రి తలలు వేస్తోంది. ప్రభుత్వ ప్రాయోజిత భావజా లాన్ని వ్యతిరేకించే వారు, ప్రశ్నించేవారు దేశ ద్రోహులుగా ముద్రించబడుతున్నారు.దేశ సామా జిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న అంశాలపట్ల ప్రభుత్వ ప్రాయోజిత నిపు ణులు,మేధావుల అభిప్రాయాలకు భిన్నంగా స్వ తంత్ర అభిప్రాయాలు కలిగి ఉండటం రాజద్రో హంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటి వెనక దండలో దారంలాగా కొనసాగుతున్న అం శం జాతీయత గురించిన చర్చ. పాలక వర్గాల అభిప్రాయాలే సర్వసాధారణంగా ప్రజాభిప్రా యాలుగా చెలామణీ అవుతాయన్న మార్క్స్‌ సూత్రీ కరణ తాజా పరిణామాల నేపథ్యంలో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రాయోజిత ప్రసార మాధ్యమాలు (ఎంబెడెడ్‌ జర్నలిజం) ఏకశిలా సదృశమైన ఉన్మత్త హిందూత్వమే నిజమైన జాతీ యత అని నమ్మించ చూస్తున్నాయి. సమ్మిళిత సాంస్కృతిక సామాజిక పునాదులు కలిగిన భారతీ యతకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెడుతు న్నాయి.
నిజానికి భారతీయ జాతీయత అంటే ఏమిటన్న విషయాన్ని నిర్ధారించే కోణంలో చారి త్రక పరిశోధనలు లేకపోవటంతో పాచిపళ్ల దాసుడు పాడిరదే పాటగా మారింది. ఈ కాలం లో ఉన్మత్త హిందూత్వ శక్తులు రాజ్యాంగ పునా దులుపై సాగిస్తున్న విధ్వంసక దాడికి మరింత పదును పెట్టిన సందర్భంగా తాజాగా భారత జాతీయ అన్న భావనపై సాగుతున్న దాడిని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో భారతీయత గురిం చి ప్రజాతంత్ర రాజ్యాంగం అందించిన అవగా హనకు నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శ నం అయిన ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న అవగా హనకు మధ్య ఉన్న విభజన రేఖను అర్థం చేసుకో లేకపోతే మరో తరం మతోన్మాదులు ప్రేరేపించే భావోద్వేగాలకు బలికాక తప్పని పరిస్థితి కనిపి స్తుంది. చారిత్రక పరిశీలన కోణం నుండి చూసిన పుడు ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక జాతీయ రాజ్యాలచరిత్ర,పెట్టుబడిదారీ వ్యవస్థదాని పరిణా మ చరిత్ర విడదీయ రానంతగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చారిత్రక పరిణామ క్రమం లో దేశం ప్రాథమికంగా భౌగోళిక యూని ట్‌గా మొదలవుతుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య నిర్దిష్టంగా స్పష్టంగా గుర్తించ గలిగిన సంస్కృతి, ఆచారవ్యవహారాలూ భాషలూ ఇతర ప్రమా ణాలుగా ఉంటాయి. అందువల్లనే ఉన్నత పాఠశాల స్థాయిలో రాజ్యం గురించిన పరిచయ పాఠ్యాం శాల్లో రాజ్యానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రభుత్వం, భాష, ప్రజలు, నిర్దిష్టమైన సరిహద్దులు అని నిర్వచించారే తప్ప మరే ప్రమాణం గురించీ ప్రస్తావించలేదు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో ప్రభుత్వాలు (ప్రభుత్వానికి నాయ కత్వం వహిస్తున్న వారి)అనుసరించే విధి విధా నాలు పద్ధతులు ప్రాతిపదికన రాజ్యాలను నాల్గు తరగతులుగా విభజించారు. అవి కూడా నియం తృత్వ రాజ్య వ్యవస్థలు, పోలీసు రాజ్యం, సంక్షేమ రాజ్య, సోషలిస్టు రాజ్య వ్యవస్థలుగా చెప్పుకుం టున్నాము.వీటిలో ఎక్కడా రాజ్య వ్యవస్థలను మతా ల ప్రాతిపదికన,సంకుచిత లక్ష్యాల కోసం రూ పొందించిన నిర్వచనాల ప్రాతిపదికన నిర్వచిం చలేదు.19వ శతాబ్దం ముగింపు నాటికి లౌకిక నిర్వచనం ప్రకారమే జాతీయతను నిర్దారించటం ప్రమాణంగా ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ పైన చెప్పిన నాలుగు లక్షణాల ప్రాతిపదికనే సరిహద్దు లు విభజితం అయినట్టు యూరోపియన్‌ దేశాల చరిత్ర మనకు విదితం చేస్తుంది. యూరోపియన్‌ జాతీయవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు సంఘటితం అవుతూ వచ్చింది. దేశంలో ఉన్న అంతర్గత శతృవును గుర్తించి వారిని అస్థిత్వ పరంగా రాజకీయంగా సైద్ధాంతికంగా ఒంటరి పాటు చేసే క్రమంలో యూరోపియన్‌ జాతీయత క్రోడీకరించబడిరది. ఈ క్రమంలోనే పెట్టుబడి దారీ దేశాలు తమ మార్కెట్‌ అవసరాలు తీర్చు కునే నేపథ్యంలో వలసవాదాన్ని ఆశ్రయించటం తో జాతీయతకు సరికొత్త వ్యాఖ్యానం తెరమీదకు వచ్చింది. వర్ధమాన దేశాల్లో తెరమీదకు వచ్చిన జాతీయభావాలు బాహ్య శతృవుకు వ్యతిరేకంగా అంతర్గతంగా వైవిధ్య భరితమైన ప్రజా సమూ హాలను ఏకం చేసే క్రమంలో ముందుకొచ్చిన జాతీయత. ఈ విధంగా చూసినపుడు యూరోపి యన్‌ జాతీయ నిర్దిష్ట వర్గాలను, సామాజిక తరగ తులను,మత విశ్వాసాలను వెలివేసింది (ఎక్స్‌క్లూ జివ్‌) జాతీయత కాగా వర్ధమాన దేశాల జాతీ యత సకల సామాజిక తరగతులు, మత విశ్వాసాలు,వర్గాలను సంలీనం చేసుకునే (ఇన్‌ క్లూజివ్‌) జాతీయత అన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. యూరోపియన్‌ దేశాల్లో పెల్లుబుకిన జాతీయత ఆయా దేశాలను పదేపదే విచ్ఛిన్నం చేస్తూ పునరేకీకరణ గావిస్తూ షుమారు రెండు వందల ఏండ్ల రక్తసిక్త యూరప్‌కు తెరతీ సింది. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాల్లో సంఘటి తమైన జాతీయత సుమారు వందేండ్ల వర్తమాన చరిత్రలో శాంతియుత సహజీవనానికి పునాదులు వేసింది.ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత దీర్ఘకా లం వర్థమాన దేశాల్లో అంతర్గత శాంతియుత పరిస్థితులు కొనసాగటం ఇదే ప్రథమమం అని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత రాజ్యాంగం, భారత జాతీయత రెండూ స్వాతంత్య్రోద్యమ పోరాట నేపథ్యంలో రాటుదేలిన వైవిధ్య భరితమైన రాజకీయ సామాజిక మేధోమధనం ఫలితం. యూరోపియన్‌ జాతీయత సంఘటితమయ్యే క్రమంలో పాలకవర్గాలు,మార్కెట్‌ కీలక పాత్ర పోషిస్తే భారత జాతీయ సంఘటితం కావటంలో ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ అంశంగా మారిన వలసవా దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రజా పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ ముందు ఉంచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాల సాధనతో పాటు యూరోపి యన్‌ తరహా జాతీయతకు భిన్నంగా విలక్షణమైన సమ్మిళితమైన భారత జాతీయతను పాలకవర్గాలు అంగీకరించాల్సిన పరిస్థితి కల్పించింది. భారత రాజ్యాంగం కొన్ని మౌలిక విషయాలను ప్రత్యేకించి నిర్వచించకుండా వదిలేసింది.జాతీయత అంటే ఏమిటి?ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అన్న పదబం ధం అటువంటి మౌలిక విషయాల్లో ఒకటి. అంత మాత్రాన రాజ్యాంగ పరిషత్‌ ఈఅంశాలను తడమ లేదు అనుకుంటే పొరపాటు. అప్పటికే సర్వాంగీకృత అభిప్రాయాలను వ్యక్తీకరించేవిగా ఈ పదబంధాలు ఉన్నందున వాటి గురించి ప్రత్యేకంగా చర్చించ లేదు. కానీ వాటిని విపులీకరిస్తూ వివిధ అధికరణా ల్లో ప్రస్తావనలు వదిలారు.
భారత భూభాగంపై జన్మించి నివశి స్తున్న పౌరులందరు భారతీయులే అని పౌరసత్వాన్ని ధృవీకరించింది.తద్వారా భారత జాతీయత భారత దేశంలో నివశించే వారందరి ఉమ్మడి జాతీయత పర్యవసానం అని చెప్పకనే చెప్పింది. అంతేకాదు. దేశంలో నివసిస్తున్న వైవిధ్యభరితమైన సామాజిక ఆర్థిక తరగతులు,మతవిశ్వాసాలకు చెందిన వారిని గుర్తించటమే కాక వారి అస్థిత్వాన్ని రాజ్యాం గం అంగీకరించింది. అందువల్లనే అటువంటి బలహీను లైన తరగతులందరికీ అవసరమైన రక్షణలు కూడా కల్పించాలని,స్వాతంత్య్రోద్యమ పర్యవసానంగా సంఘటితమైన భారత జాతీయతను కాపాడుకోవా లంటే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అన్ని తరగ తుల ప్రజల మనోభావాలు,ఆశలు,ఆశయాలు నెరవేర్చుకునేందుకు రాజ్యాంగం ద్వారా కనీస హామీ ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్‌ నిర్ణయించింది. అందువల్ల భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేని కోణాలు భారత జాతీయతలోనూ లేవు. స్వతంత్ర భారతదేశంఎన్నో వేర్పాటువాద ఉద్యమాలను తట్టు కుని అధిగమించి జాతీయ సమైక్యతా సమగ్రతలను కాపాడుకుంటూ తన ఉనికిని కొనసాగించుకుంటూ వచ్చింది.రాజ్యాంగం ఆరెస్సెస్‌ కోరుకుంటున్న మను వాద వ్యవస్థ, కుల వ్యవస్థను తిరుగులేని విధంగా దెబ్బ తీసింది.కుల వ్యత్యాసాలు,మత విశ్వాసాలతో నిమిత్తంలేకుండా రాజ్యంగం భారతదేశంలో జన్మిం చిన వారందరికీ సమాన హక్కులు,అవకా శాలు, ఓటింగ్‌ హక్కులు ప్రసాదించింది.ఇటు వంటి పరిమిత ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్థానంలో సార్వ త్రిక ఓటుహక్కును మొదటిగా అందరికీ అందిం చింది ఫ్రెంచి విప్లవం.ఈ విప్లవం స్ఫూర్తిగా నాటి వలస దేశాలన్నింటిలోనూ ఈ నినాదం పోరాట నినాదంగా మారింది.ఫ్రాన్స్‌,అమెరికా వంటి దేశా ల్లో సార్వత్రిక ఓటు హక్కు 1960 దశకం నాటికి గానీ చట్టబద్ధం కాని పరిస్థితుల్లో భారత రాజ్యాం గం 1947నాటికే సార్వత్రిక ఓటుహక్కును రాజ్యాం గ బద్ధం చేసింది.ఈ విధంగా సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వటాన్ని నాడే ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది. కుల మత ప్రాంత విద్వేషాలతో దేశాన్ని రక్తసిక్తం చేసే మనువాద సంస్కృతినే జాతీయతగా దేశం మీద రుద్దేందుకు శతాబ్ద కాలం నుంచీ ప్రయత్ని స్తూనే ఉంది.అటువంటి సంఘపరివారం స్వదేశీ ముసుగులో భారతదేశాన్ని యూరోపియన్‌ దేశాల తరహాలో ఉన్మాదపూరిత జాతీయతవైపు నెడుతున్న వాస్తవాన్ని గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశీయంగా రూపొందిన జాతీ యత పునాదులు సంఘపరివారానికి అక్కర్లేదు. విదేశీ నమూనాలో ఉన్న ఉన్మాద భరిత జాతీయతే దానికి ముద్దు. అందుకే సమీకృత, ప్రజాతంత్ర భారత జాతీయతను కాపాడేందుకు కంకణ బద్ధులైన వారంతా ఈ ఎన్నికల్లో ఉన్మాద జాతీయ వాదానికి ప్రతినిధులుగా ఉన్న బీజేపీ, దాని మిత్రు లను ఓడిరచటం జాతీయ కర్తవ్యంగా ఎంచు కోవాలి. వ్యాసకర్త : విశ్లేషకులు,సీనియర్‌ పాత్రికేయులు) – (కొండూరు వీరయ్య)

మళ్లీ గెలిస్తే రాజ్యాంగానికి ముప్పే

ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.
భారత రాజ్యాంగం మత తటస్థతను,మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? అనేది ఆలోచించాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా మోదీ హయాం మొదలైన తర్వాత ముస్లింలను భయభ్రాంతులను చేస్తూ జరుగుతున్న దాడులు ఆకస్మిక ఘటనలు కావు’ అని చెబుతున్నారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ వర్షిణీ. ఈ అత్యంత ప్రమాదకర ధోరణిని భారతీయులు అడ్డుకోకపోతే, మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపడితే భారత రాజ్యాంగం ఉనికికే భంగం వాటిల్లే పెను ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు.హార్వర్డ్‌, మిషిగన్‌ విశ్వవిద్యాలయాల మాజీ అధ్యాపకుడిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర అధ్యాప కుడిగా పని చేశారు.‘ది వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ భాటియాతో జరిపిన సంభాషణలో అశుతోష్‌ పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఈమధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువ. ఈ హింసా కాండ, దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహి స్తున్నది. ఢల్లీి జహంగీర్‌పురాలో శ్రీరామనవమి సందర్భంగా కత్తులు, కటారులు గాల్లో తిప్పు తూ, పిస్తోళ్లు పేలుస్తూ మసీదుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పట్టపగలు ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం.
దేశంలో మత ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.1950ల నుంచి 1995 దాకా దేశంలో 1,180 మతపరమైన అల్లర్లు జరిగాయి. సుమారు 7,173 మంది చనిపోయారు. సుమారు ఎందుకంటే..మత ఘర్షణల్లో చనిపోయిన వారి లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉండదు. అధికారిక లెక్క ఒకటి ఉంటే, వాస్తవసంఖ్య భిన్నంగా ఉంటుంది. మతఘర్ష ణలు చోటుచేసుకున్న చోట పోలీసుల తటస్థ తపై అనుమానాలు ఉంటున్నాయి. మరో పరిణామం ఏమంటే..ఈ ఘర్షణలు కొత్త రూపం తీసుకోవటం. మతఘర్షణలు వ్యవస్థీకృత కార్యక్రమంగా మారుతున్నాయి. 1984లో ఢల్లీిలో జరిగిన సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్‌లో ముస్లింల హత్యాకాండ వీటికి ఉదాహరణ. ఈ రెండిరటిలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యతల నుంచి దూరం జరిగిన తీరు కనిపిస్తుంది. అదింకా పెరిగిపోయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీ సులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు మరిచి మతఘర్షణల్లో పూర్తిగా ఒక వర్గానికే కొమ్ముకాసింది. కొన్ని చోట్ల ప్రభుత్వ యంత్రాం గమే ముస్లిం వ్యతిరేకతలో భాగస్వామ్యం కావ టం ఒక కొత్త పరిణామం.ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. ఉదాహరణకు..కర్ణాటకలో ‘హిజాబ్‌’ అంశాన్ని చూడవచ్చు. హిందూ దేవాలయాల ముందు ముస్లింలు దుకాణాలు నిర్వహించ వద్దంటూ వారి జీవన ఆర్థిక హక్కుపై దాడి చేసి దాన్ని దూరం చేశారు. వీటన్నింటిపై కేంద్రం ఏమీ మాట్లాడదు. ఇదింకా ముందుకు పోయి,ఢల్లీిలో సిక్కులు దుకాణాలు నిర్వహించ వద్దని,వారి దుకాణాల్లో ఎవరూ కొనుగోళ్లు చేయవద్దని శాసించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. 1984 ఢల్లీి అల్లర్ల సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను.సిక్కులపై దాడులు రాజ్యం అండతోనే జరిగాయి.కానీ అప్పుడు రాజ్యం.. ట్యాక్సీలను సిక్కులు నడుపరాదని అనలేదు. అలాగే సిక్కులు హిందూ దేవాల యాల ముందు మిఠాయిలు,పూలు అమ్మరాదని హుకుం జారీ చేయలేదు.సిక్కులు తలపాగా లాగా ధరించే ‘పగిడి’ని హిజాబ్‌లాగా వివాదం చేయలేదు. 1984కు ఇప్పటికీ గుణాత్మక మార్పు ఇదే. ఇప్పుడు జరుగుతున్న వాటిని గమనిస్తుంటే..ఈ పరిణామాలన్నీ రాబోయే ప్రమాదానికి సంకేతాలు. హిజాబ్‌ను వద్దని అన్నవాళ్లు సిక్కుల పగిడిని కూడా వద్దంటారా? బొట్టు పెట్టుకోవటాన్నీ, కొన్ని విద్యాసంస్థల్లో ధోతి కట్టుకోవటాన్ని కూడా తప్పుపట్టి నియం త్రిస్తారా? భారత రాజ్యాంగం మత తటస్థతను, మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడు కోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగు తున్నాయి? అనేది ఆలోచించాలి. హిందూ జాతీయవాదం తొలి నుంచీ తాత్వికం గానే కొన్ని ప్రజా సమూ హాలను జాతి వ్యతిరేక మైనవిగా ప్రకటించింది. ఆ ప్రజలు ఇక్కడే పుట్టినా,వారి పవిత్ర స్థలాలు భారత్‌లో లేవు కాబట్టి, వారి జాతీయత ఈ దేశానికి చెందినది కాదంటున్నారు. దేశంలో 14 శాతం ఉన్న ముస్లింలు, 2శాతం ఉన్న క్రిస్టి యన్లను పరాయివారుగా ప్రకటిస్తున్నారు. వాటిక న్‌ను, మక్కాను పవిత్రస్థలంగా భావించేవారు నిజమైన భారతీయులు కాదంటున్నారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ‘1200 ఏండ్ల బానిసత్వం వీడిరది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో 1920ల్లోనే హిందు త్వానికి పురుడు పోసిన వారు కూడా ఆ కాలం లో సరిగ్గా ఇదే మాట చెప్పటం గమనార్హం. ఈ క్రమంలోంచే..శతాబ్దాల కిందట హిందు వులపై ముస్లిం రాజుల దాడికి ప్రతీకారంగా ఇప్పుడు వారిపై దాడి చేయాలనే వాదాన్ని అమలు చేస్తున్నారు.1947లో మతం పునాదిగా రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్‌ లో హిందువులే ప్రధానమని, మిగతావారు ద్వితీయ శ్రేణికి చెందుతారని వారు అంటు న్నారు. హిందూత్వవాదులు,బీజేపీ నేతలు విశ్వసించేది ఏమంటే..కొన్ని వర్గాల వారిని అణచివేత ద్వారానే అదుపులో పెట్టగలమని. వీరి సిద్ధాంతకర్తలు కూడా ‘ముస్లింలకు సామాన్యుల భాష అర్థం కాదు. వారికి బలప్రయోగం ద్వారానే ఏదైనా అర్థం చేయించగలం. చరిత్ర ఇదే చెప్తున్నది’ అని ఆనాడే అన్నారు. అలాగే..‘వారు (ముస్లింలు) ఆనాడు బలప్రయోగం ద్వారానే మనలను ఓడిరచి ఆధిపత్యం సాధించారు. ఇప్పుడు హిందువులకు సమయం వచ్చింది. వారిని ఆ విధంగానే నియంత్రించి ఆధిపత్యం సాధిం చాల’ని ప్రబోధించారు. సరిగ్గా దాన్నే ఇప్పుడు బీజేపీ, హిందూత్వ వాదులు అమలు చేస్తు న్నారు. కాబట్టి వీటిని ఏదో కాకతాళీయంగా జరిగిన, జరుగుతున్న ఘటనలుగా చూడవద్దు. వీటిని ప్రయత్నపూర్వకంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతున్న దాడులుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందుత్వవాదులు కొత్తదశలోకి ప్రవేశించారు. దేశంలోని హిందువులు ప్రథమ శ్రేణి పౌరులని, మిగతావారిని ద్వితీయ శ్రేణిగా చెప్తున్నారు. రాజ్యాంగపరంగా అంబేద్కర్‌ చెప్పిన వాటిని కూడా తిరస్కరిస్తున్నారు. మనుషులంతా సమానం అన్నదాన్నే కాదు, మతాలన్నీ సమానమే అనటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందూత్వం పేరుతో రాజ్యాంగాన్నే గుర్తించనివారు..రాజ్యాంగాన్ని అమలుచేసే అధిపతులుగా మారారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు, అసెంబ్లీల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఏ రాజ్యాంగ విలువల పునాదులపై మన ప్రజాస్వామ్యం మనగలిగిందో, ఆ రాజ్యాం గం పైనే దాడికి దిగుతున్నారు. బీజేపీ విజయం రాజ్యాంగ పరమైన సమస్య మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య సంక్షోభానికీ అది కారణమవు తుంది. దేశంలో 11రాష్ట్రాలు ఇప్పటికీ వారి ఆధీనంలో లేవు. అందులో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఉన్నాయి. యూపీలో రెండోసారి అధికారాన్ని నిలుపుకొన్నా, గతంలో మాదిరిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించటం అంత సులువు కాదు. అయితే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొనగలవా? పంజాబ్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, బీహార్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే రాజకీయ శక్తి ఏది? అన్నది ప్రధానమైనది. అలాగే, బీజేపీని ఎదు ర్కోబోయే రాజకీయశక్తికి ఎవరు నేతృత్వం వహించాలి అన్నది క్లిష్టమైనది. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి 19శాతం ఓటు బ్యాంకుఉన్నది. మిగతా పార్టీలన్నీ రెండు, మూడు శాతం ఓట్లే కలిగి ఉన్నాయి. తృణముల్‌ కాంగ్రెస్‌ 3.3 శాతం,డీఎంకే 2.7శాతం,ఆమ్‌ ఆద్మీ పార్టీ 2 శాతం ఓట్లు కలిగి ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీని నిలువరించే శక్తి సమకూరు తుంది. ఒకవేళ మూడోసారి మోదీ అధికా రంలోకి వస్తే..రాజ్యాంగం ఉనికే ప్రశ్నార్థక మవుతుంది. 2024లో మోదీ గెలుపుతో ఆ ప్రమాదం పొంచి ఉందనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఒక రాజనీతి శాస్త్రవేత్తగా, రాజకీయ పరిశీల కుడిగా.. మెజారిటీ వర్గం రాజకీయ ఆధిపత్యం సాధిస్తే సంభవించే పరిణామాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. శ్రీలంక, మలేషి యా గురించి తెలుసుకోవాలి. సింహళీయుల ఆధిపత్యం గల రాజ్యంగా శ్రీలంక అవతరిం చింది. ఆ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు లేవు. ద్వితీయ పౌరులుగా పరిగణిం చబడిన తమిళులపై తీవ్ర వివక్ష, అణచివేత కొనసాగాయి. ఫలితంగా తమిళులు తిరగ బడ్డారు. 20ఏండ్ల పాటు శ్రీలంక అంతర్యు ద్ధంలో మునిగి పోవాల్సి వచ్చింది. అదే మలేషియా ఒక మెజారిటీ వర్గం ఆధిపత్యం వహించే విధంగా ఏర్పడలేదు.అక్కడ మైనా రిటీలుగా ఉన్న చైనీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడలేదు. జాతి సమానత్వం పాటించారు. దీంతో అక్కడ జాతిపరమైన పోరాటాలు ప్రజ్వరిల్లలేదు. దీన్నిబట్టి, మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాధికారం దీర్ఘకాలంలో తీవ్రమైన అంతర్యుద్ధాలకు, హింసకు కారణమవుతుందని అర్థమవుతున్నది. అణచివేత కారణంగా ఒకవేళ భారతీయ ముస్లింలు ద్వితీయశ్రేణితో రాజీపడితే.. అది కనిష్ఠ స్థాయి ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. కానీ, వారు అణచివేతను ధిక్కరించి సంఘ టితమైతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. శ్రీలంకను తలపిస్తాయి. దేశంలో ముస్లింలంతా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై లేరు. మూలమూలలా విస్తరించి ఉన్నారు. భౌగోళికం గా అనేక దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న భారత్‌లో ముస్లింలలో అలజడి,అసంతృప్తి ఊహించని ఫలితాలకు దారితీస్తుంది.ఇక్కడే ఇజ్రాయిల్‌, పాకిస్థాన్‌ గురించి కూడా చెప్పు కోవాలి. ఈ దేశాల్లో మైనారిటీ వర్గాలకు సమాన స్థాయి, గౌరవం ఇవ్వలేదు. తమను తాము యూదు, ముస్లిం దేశాలుగా అవి ప్రకటించుకున్నాయి. కానీ, భారతదేశం తననుతాను ఒక మతదేశంగా కాకుండా లౌకికదేశంగా ప్రకటించుకుంది. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం హామీ ఇచ్చింది. కాబట్టి మైనారిటీ వర్గాల రక్షణ, భద్రత అనేది ప్రభుత్వం పైనున్న రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇప్పటిదాకా పౌరుల హక్కుల రక్షణకు మన రాజ్యాంగం హామీగా నిలిచింది. అందుకే దేశవాసులకు ఇప్పటికీ రాజ్యాంగంపై ఎనలేని విశ్వాసం ఉన్నది. ఈ మధ్యన కార్యనిర్వాహక, రాజకీయ వర్గాల ఆధిపత్యంలో న్యాయవ్యవస్థను నిష్క్రియా పరత్వం చేసే ప్రయత్నం జరుగుతున్నది. నా వ్యక్తిగత ఆలోచనాదృక్పథం చెబుతున్న దేమంటే.. న్యాయవ్యవస్థ ఎన్ని సమస్యలు ఎదురైనా సానుకూల శక్తుల దన్నుతో అది నిలబడుతుంది. అలాంటి శక్తులను పక్కకు జరిపి 1975,76 లోలాగా రాజ్యాంగాన్ని అతిక్రమించటం అంత సులువు కాకపోవచ్చు. అయితే రాజ్యాంగ విధ్వంసం ఎంతదాకా పోతుంది, ఏమవుతుందన్నది ఆందోళన కలిగించేదే. అన్ని విషయాలూ`గిరిగీసినట్లుగా జరుగకపోవచ్చు. అయితే ఆశావహ దృక్పథం ఎప్పుడూ అస్పష్టం,బలహీనం కాబోదు. మన దేశం ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ వచ్చింది. గత 70 ఏండ్లుగా ప్రజాస్వామ్య దివిటీగా ప్రపంచంలో వెలుగొందుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గాంచింది. కొన్ని శక్తుల అవాంతరాలతో ఇంతటి ఘనచరిత్ర మసకబారుతుందా,దారి తప్పుతుందా? ప్రఖ్యాత అంతర్జాతీయ ‘ప్రజా స్వామ్య అధ్యయన సంస్థలు’ ఫ్రీడం హౌజ్‌,వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌-స్వీడన్‌..భారత్‌లో దిగజారిన ప్రజాస్వామ్యం పరిస్థితులను తెలియజెప్పాయి. ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రజాస్వామ్యంతో తీవ్రంగా ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొన్నది.విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే.. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. రెండు ఎన్నికల మధ్య కాలంలో జరిగే సామాజిక ఆచరణే ప్రజాస్వామ్యం.ఆ ఐదేండ్ల కాలంలో రాజ్యాంగ నియమాలను ప్రభుత్వం ఎలా అమలు చేసిందన్నదే ప్రజాస్వామ్యం. కాబట్టి, మనది చైతన్యవంతమైన ప్రజాస్వా మ్యమని అనలేం. మనది చైతన్యవంతమైన ఎన్నికల ప్రజాస్వామ్యం మాత్రమే. కానీ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం మాత్రం రోజు రోజుకీ బలహీనపడుతున్నది.
‘పౌరులకు హక్కుల కన్నా విధులు ముఖ్యం’ అని ఆ మధ్య ప్రధాని మోదీ ప్రకటించారు. గతంలో హిందూత్వ సిద్ధాంతకర్తలు కూడా..‘హక్కులు దేశాన్ని బలహీనపరుస్తాయి. బాధ్యతలు బలోపే తం చేస్తాయి’ అనే అన్నారు. వాస్తవానికి దీంట్లో ఉన్న అసలు విషయం ఏమిటంటే.. ప్రజలకు హక్కులు లేకుండా చేయటం.దాని గురించి ప్రశ్నించనివ్వకుండా నోరు నొక్కటం.మోదీ కూడా ప్రజల హక్కులను అణచివేస్తూనే, తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొం టున్నారు. ఇదంతా హిందూత్వ భావజాల కార్యాచరణలో భాగమేనని అర్థం చేసుకోవాలి. మనం పేపర్లు చదువుతాం.టీవీ చూస్తాం. వాట్సాప్‌ సరేసరి. వీటి ప్రభావం చాలా పెద్దది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా స్పందిస్తున్నాం. మనదేశంలో మన చుట్టూ జరుగుతున్న వాటిపై కూడా భారతీయులు సరిjైున విధంగా స్పందిస్తారనే ఆశ, నమ్మకం నాకున్నది. గతంలో ఈ దేశ ప్రజానీకం దాటి వచ్చిన అవరోధాలను బట్టి, నేడు కూడా వారు విజయం సాధిస్తారనే విశ్వాసం నాకు న్నది’.ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.- వాసకర్త : ప్రముఖ పాత్రికేయులు,రాజకీయ విశ్లేషకులు (నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)- (అశుతోష్‌ వర్షిణీ)

గీతం న్యాయ అవగాహన సదస్సు

భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు,బాధ్యతలు పౌరులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. భారత ప్రభుత్వన్యాయ మంత్రిత్వ శాఖ,న్యాయ విభాగం,గీతం స్కూల్‌ ఆఫ్‌ లా మరియు భోపాల్‌లోని న్యాయగంగ ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సు మార్చి 9న గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. నీ సదస్సును రవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన న్యాయ విద్యార్థులను ఉద్దేశించిప్రాధిమికంగా పౌరుల తెలుసుకోవలసిన న్యాయ పరమైన అంశాలు, పౌరుల బాధ్యతలు అనే అంశంపై సమత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు రవి రెబ్బాప్రగడ ప్రసంగించారు.స్వేచ్ఛా,స్వాతంత్య్రపు హక్కు,మతస్వాతంత్య్ర హక్కు లాంటి సంప్రదాయ హక్కులతోపాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు,పీడనాన్ని నిరోధించే హక్కు,విద్యా,సాంస్కృతిక హక్కులు సైతం ప్రాధమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదని తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాధమిక హక్కులుపేర్కొంటున్నాయని గుర్తిచేశారు. తర్వాత సమత సుప్రీం కోర్టు సాధన,ఆదివాసీల వనరులు పరిరక్షణ కోసం సమత చేసిన కృషి,ఐదోవ షెడ్యూల్‌లో గిరిజనుల వనరులు,భూమి హక్కుల పరిరక్షణకు జడ్జెమెంట్‌ ఏవిధంగా కాపాడు తుందనే అంశాలను విద్యార్థులకు వివరించారు. తర్వాత న్యాయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నివృత్తి చేశారు. మధ్యాహ్నాం జరిగిన సదస్సులో సిబిఐ విశ్రాంతి ఐపిఎస్‌ అధికారి వి.వి.లక్ష్మి నారాయణ సైబర్‌ నేరాలు వాటిని నియంత్రించే చట్టాలు అనే అంశంపై ప్రసంగించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అనితారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంర్భంగా న్యాయ అవగాహన పై వివిధ నినాధాలు, సచిత్ర అంశాలతో ఎగ్సిబిషన్‌తో పాటు న్యాయ అంశాలపై క్విజ్‌ పోటీ నిర్వహించారు. సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్ధులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను చైతన్య పరిచేదిగా ఉంది. న్యాయ వృత్తిలో పాటించాల్సిన మెలకవులపై విద్యార్ధులకు ప్రాక్టికల్‌ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసరన బి.అనితారావు తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ లా అధ్యాపకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. – ` సైమన్‌ గునపర్తి

విద్యావంతుల విజ్ఞతనే సవాలు చేస్తారా?

‘ఈ శాసనమండలి ఎన్నికలు సెమీ ఫైనల్స్‌’… ఈ మాటలు అన్నది వైఎస్సార్‌సిపి అగ్రనేతల్లో ఒకరైన వై.వి.సుబ్బారెడ్డి.జగన్‌ కూడా తమ పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలలో సర్వశక్తులూ ఒడ్డి పని చేయమని ఆదేశించారు. శాసన మండలిలో ప్రతీ రెండేళ్ళకూ మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతూంటాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికలు జరుగుతూంటాయి. ఈ ఎన్నికల్లో ఓటు చేసేవారు సాధారణ ఓటర్లు కారు. కొన్నింటికి కేవలం ఎమ్మెల్యేలే ఓటర్లు. కొన్నింటికి స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ఓటర్లు. కొన్నింటికి ఉపాధ్యాయులే ఓటర్లు. మరికొన్నింటికి పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న పట్టభద్రులు పది లక్షలమంది సుమారుగా ఉంటారు.ఈ విధం గా చాలా పరిమితమైన పరిధిలో ఓటర్ల అభి ప్రాయాలు వ్యక్తం అయ్యే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ ఎలా అవుతాయి? అదే ఏవో కొన్ని శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా లేక లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా అక్కడ అన్ని తరగతులకూ చెందిన ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ శాసన మండలి ఎన్ని కలలో ఆ విధంగా వ్యక్తం కాదు. అయినా వైసిపి నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. ఏమిటి కారణం? వీటిలో ఎమ్మెల్యే కోటా లోని సీట్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న బలా బలాలను బట్టి అన్నీ వైఎస్సార్‌సిపి కే దక్కు తాయి. స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావలసిన స్థానాలూ ఆ పార్టీకే దక్కుతాయి. ఇక గవర్నర్‌ నామినేట్‌ చేసేవి ఎటూ పాలకపార్టీ సిఫార్సు ఆధారంగానే భర్తీ అవుతాయి గనుక అవీ అధికార పార్టీవే. ఇక మిగిలిపోయినవి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలు, మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు. వీటి విష యంలో వైసిపి ఈ మారు ఎందుకింత ఉలికి పడుతోంది? పట్టభద్రుల స్థానాల్లో కూడా రాజకీయ పార్టీలు పోటీ పడవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు. కాని అధికారంలో ఉన్న పార్టీ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఓటర్లు గౌరవిస్తారు కాని ఇలా అన్ని విలువలనూ గాలికి వదిలి చౌకబారుతనంగా,అడ్డగోలుగా దిగజారిపోతే ఆ విద్యావంతులు,మేధావులు అయిన ఓటర్లు ఈసడిరచుకుంటారన్న కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోవడం చూస్తే కొంత జాలీ,కొంత ‘అది’కలుగుతోంది.
కనీస విద్యార్హతలు కూడా లేనివారిని ఓటర్లుగా చేర్చేశారు. అంటే అచ్చంగా విద్యావంతు లైనవారే ఓటర్లుగా ఉంటే తాము గెలవడం సాధ్యం కాదు అని అధికార పార్టీ ఎన్నికలకు ముందే ఒప్పేసుకుందన్నమాట! అబ్బే, అటు వంటిదేమీ కాదు అని వైసిపి చెప్పదలచుకుంటే అర్హత లేని ఓటర్ల పేర్లు తొలగించడంలో తామే ముందుండి వ్యవహరించి వుండాలి. ఎందుకు అలా చేయలేకపోయింది? కనీస స్థాయిలో కూడా నైతిక స్థైర్యం లేని దుస్థితిలో ఆ పార్టీ ఎందుకుంది? వలంటీర్ల వ్యవస్థ స్థాయిలో మొదలుపెట్టి అత్యున్నత స్థాయి అధికారుల వరకూ అందరి అధికారాలనూ ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎంతో ప్రఖ్యాతి కల ఆంధ్రా యూనివర్సిటీకి ఉపకులపతి హోదాలో ఉండడం అంటే ఎంత ప్రతిష్టా త్మకమైన విషయం! అటువంటి స్థానంలోని వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అధికారపార్టీ అభ్యర్ధికి ప్రచారం నిర్వహించా రంటే వైసిపి దిగజారుడు అధ:పాతాళానికి పోయిందని వేరే చెప్పాలా? అధికార పార్టీ తరఫున కులసంఘాల పేరుతో ప్రచారం జరిగిపోతోంది. డబ్బు విచ్చలవిడిగా వెదజల్లి, కానుకల పేరుతో ప్రలోభపెట్టి ఓటర్లను లొంగదీసుకోవాలన్న పథకాలు అమలులో పెడుతున్నారు. అంటే ఓటర్ల విద్యాస్థాయి పట్ల, వారి మేధో స్థాయి పట్ల పాలక పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలిసిపోతూనే వుంది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అందుకు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చొరవ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో గాని, ఆ తర్వాత గాని ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలలో అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పట్ల, సమా జంలోని విద్యావంతుల పట్ల, వారి అభిప్రా యాల పట్ల తనకెంతో గౌరవం ఉందని, తమ పార్టీని విమర్శించినా,వాటిని సలహాలుగానే స్వీకరిస్తానని ఆయన అన్నారు. ఆ కాలంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాబోటివారు చెప్పిన సలహాలను అన్నింటినీ ఆయన అమలు చేశాడని చెప్పను. చాలా సలహాలను ఆయన అమలు చేయలేదు కూడా. కాని సలహాలను, సూచన లను, విమర్శలను వినే సహనాన్ని ఆయన ప్రదర్శించారు. ఆ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని తిరుగుతూ, ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్న వైసిపికి, ఆ పార్టీ అధినేతకు మాత్రం ఆ అధినేతకున్న సహనంలో వెయ్యో వంతు కూడా లేదు.2019లో అధికారం చేపట్టాక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా ఎన్నిసార్లు సమావేశాలు జరిపారు? ఎన్నిసార్లు వారి అభిప్రాయాలను విన్నారు? ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉం డాలంటారు. ఇదేనా ఆదర్శం?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జగన్‌ ప్రభు త్వంలోని ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులను కలుసుకోడానికి గాని, వారి వినతి పత్రాలను స్వీకరించడానికి గాని సిద్ధంగా లేరు. జగన్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగలేదు. విద్యార్థి, యువజన,మహిళా,నిరుద్యోగ సంఘాల ప్రతి నిధులను ఒక్కసారి కూడా చర్చలకు పిలిచింది లేదు. రైతుల గురించి చాలా కష్టపడిపోతు న్నట్టు ప్రకటించుకునే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సంఘాలతోగాని, రైతుకూలీ సంఘాలతో గాని, దళిత సంఘాలతోగాని ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖాముఖి చర్చలు జరిపిందా? ఇది కూడా గత ప్రభుత్వం మాదిరి ముందస్తు అరెస్టుల ప్రభుత్వమే తప్ప ముందస్తు చర్చల ప్రభుత్వం ఎంతమాత్రమూ కాదన్న సంగతి అందరికీ తేటతెల్లం అయిపోయింది. అదానీలకు, అంబానీలకు రాష్ట్రంలోని పరిశ్రమ లను, భూములను కట్టబెట్టే పనిలో చాలా జోరుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది. అందుకే రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేస్తానని మోడీ ప్రభుత్వం ప్రకటించినా,అసెంబ్లీలో ఒక తీర్మా నాన్ని చేయడం మినహా ఇక చేసిందేమీ లేదు.రాష్ట్ర ప్రజానీకపు మనోభావాలను ప్రతిబిం బించే విధంగా ఒక అఖిల పక్ష బృందాన్ని ఎందుకు ఢల్లీి తీసుకుపోలేక పోయారు? ఎందుకు అన్ని సందర్భాలలోనూ బిజెపికి అనుకూలంగా పార్లమెంటులో వైసిపి ఎంపీలు ఓటు చేస్తు న్నారు? విద్య, వైద్యం,విద్యుత్తు, ముని సిపల్‌ తదితర రంగాలలో మోడీ ప్రభుత్వం ఏం చెప్తే దానికల్లా తలాడిరచి అమలు చేస్తు న్నారు. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్వయంప్రతిపత్తి ఏమిటి? ఇదిగో ఇటువంటి విషయాలను శాసనమండలిలోను, వెలుపల లేవనెత్తుతున్నారు గనుకనే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలంటే అధికార పార్టీకి అంత అక్కసు, గుండెల్లో అంత గుబులు. అందుకే కక్షగట్టి ఈ పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఎలాగై నా గెలవకూడదన్న దుగ్ధతో అన్ని విలువలకూ తిలోదకాలిచ్చేశారు. అడ్డగోలు దోవలు తొక్కుతు న్నారు.వైసిపి,దాని అధినేత ఒక్క విషయం మరిచిపోయినట్టు ఉన్నా రు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.ఆతర్వాత భారత రాజ్యాంగం వచ్చిం ది. ఆతర్వాతనే ఈ అసెంబ్లీ, పార్లమెంటు వచ్చాయి. ఎమర్జెన్సీ వంటి అత్యం త నిరంకుశ చర్యలనూ ఓడిరచనది ప్రజాఉద్య మాలే. చివరికి సైనిక పాలన పెట్టినా, దానిని కూల దోసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పా లంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. ప్రజాఉద్యమాలను, ప్రజా సంఘాలను అణగదొక్కజూసిన ప్రతీ నాయకుడూ కాలగర్భంలో కలిసి పోయాడు. కాని ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి. అవి ప్రజ ల్లోంచి, ప్రజల కోసం పుట్టుకొచ్చినవి. అధికార దాహం లోంచి పుట్టినవి కావు. వాటి ప్రతినిధు లు శాసనమండలిలో సభ్యులుగా ఉండడం శాసన మండలికే గౌరవాన్ని ఇచ్చింది, ఇస్తుంది. డబ్బు పంచిపెట్టకుండా, కానుకలు పంచిపెట్ట కుండా, కులం,మతం వంటి అంశాల ప్రస్తా వనలు తేకుండా,ప్రచారార్భాటానికి పోకుండా ఓటర్ల విజ్ఞత మీద సంపూర్ణ గౌరవంతో తాము గెలిస్తే ఆ ఓటర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపిస్తామని మాత్రమే హామీ ఇస్తూ ఓట్లిమ్మన మని అడగగలిగే నైతిక స్థైర్యం ఉన్నది కేవలం ఒక్క పిడిఎఫ్‌ అభ్యర్ధులకు మాత్రమే. గెలిచాక తాము ముందస్తుగా ప్రకటించిన విధానాలకు, విలువలకు పూర్తిగా కట్టుబడి నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తూ మాట దక్కించుకోగలుగు తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. ప్రజాస్వా మ్య విలువలను, ప్రజా తంత్ర వ్యవస్థను బలం గా నిలుపు కోవాలంటే ఈ తరహా ప్రజాప్రతి నిధులే కావాలి అని ఓటర్లు భావించేలా వ్యవహరిస్తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. పిడిఎఫ్‌ అభ్యర్ధుల మీద కక్ష గట్టి వ్యవహరిం చడం అంటే అది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమే. అటు వంటి ద్రోహానికి పాల్పడు తున్న వైసిపికి ఈ ‘సెమీ ఫైనల్స్‌’’లో గట్టిగా గుణపాఠం నేర్పడానికి మన రాష్ట్రంలోని విద్యావంతులకు, మేధావులకు వచ్చిన మంచి అవకాశం మార్చి 13న జరగ బోయే ఉపాధ్యా య,పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు. ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసు కుందాం.! (వ్యాసకర్త : పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..)- (ఎం.వి.ఎస్‌.శర్మ)

విజయవంతంగా గ్లోబల్‌ సమ్మిట్‌ `2023

విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ క్రీడా మైదానంలో మార్చి 3,4వ తేదీల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తం రూ.13 లక్షల41వేల 734కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొ న్నారు. దీని వల్ల 6లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశశాల నుంచి ప్రపంచస్థాయి సంస్థలు తరలివచ్చారు.
పరస్పర ప్రయోజనాల దిశగా….
రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సు ను అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుం దన్నారు. అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు ఇది దోహదపడు తుందన్నారు. తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్‌. అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామ న్నారు. బ్రాడ్‌ బాండ్‌, ఇంటర్నెట్‌ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముంద డుగు వేస్తోందన్నారు సీఎం జగన్‌ తెలిపారు. కీలక సమయంలో ఈ సమ్మిట్‌ నిర్వహించా మన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు.‘‘అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 ఎంవోయూలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ.25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ.22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.’’ గణనీయమైన పెట్టుబడులకు అవకాశశం ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటి అని గట్టిగా చెప్పగలను. నిబద్ధత గ్రీన్‌ ఎనర్జీ కోసం ప్రయత్నిస్తూ భారత్‌కు గణనీయమైన సహకా రాన్ని అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.14 ఇండస్ట్రీయల్‌ ఫెసిలిటీస్‌ను రిమోట్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. రూ.3, 841 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు 9,108 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి. ఈ సమ్మిట్‌ సందర్భంగా 100 మందితో 15 సెక్టార్లపై సెషన్‌లు నిర్వహించారు. ఏపీలో ఉన్న అడ్వాంటేజ్‌లను తెలియజేశారు. ఇందులో ఆటోమొబైల్‌ సెక్టార్‌,హెల్త్‌కేర్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా,అగ్రి ప్రాసెసింగ్‌ టూరిజం మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి నెదర్లాండ్స్‌, వియత్నాం, ఆస్ట్రేలియాతో సమావేశాలు నిర్వహించారు. రిలయన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్‌,ఆదిత్య బిర్లా గ్రూప్‌, రెన్యూ పవర్‌, అరబిందో గ్రూప్‌, డైకిన్‌, ఎన్టీపీసీ,ఐఓసీఎల్‌, జిందాల్‌ గ్రూప్‌, మోండలీస్‌,పార్లీ, శ్రీ సిమెం ట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.ఈ సందర్భంగా వారికి ధన్యవా దములు. మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం బలాలు, మేము కల్పించే విభిన్న అవకా శాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియ జేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడం పట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు,మెడ్‌టెక్‌ జోన్‌, టూరిస్ట్‌ హాట్‌ స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు సీఎం జగన్‌. విశాఖపట్నం కేవలం పారిశ్రా మిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందనని.. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అని.. ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్‌, ఒన్‌ ఫ్యా మిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుం బం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ-20 సదస్సును నిర్వహిస్తోందన్నారు. మార్చి చివరి వారంలో జరిగే జీ-20 వర్కింగ్‌ కమిటీ సమా వేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. రెండు రోజుల సదస్సులో కనిపించిన అద్భుతమైన ఆశావాదం రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత అను కూలం గా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఎంఒయు దశ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులను త్వరితగతిన గ్రౌండిరగ్‌ చేయాలని పారిశ్రామికవేత్తలకకు సీఎం అభ్యర్థించారు. దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండ్రోజుల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు 353 ఎంవోయూలు కుదిరాయి. దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని సదస్సుకు హాజరయ్యేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యంగా అంబానీ,కరణ్‌ అదానీ, జిఎమ్మార్‌, పునీత్‌ దాల్మియా,ప్రీతారెడ్డి,సజ్జన్‌ భజాంక్‌, హరిమో హన్‌ బంగూర్‌,జిందాల్‌,నవీన్‌ మిట్టల్‌, మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కృష్ణా ఎల్లా,కుమార మంగళంబిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంత మంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడుల్ని స్వయంగా ముకేష్‌ అంబానీ ప్రకటించడమే కాకుండా..ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్‌ జగన్‌లపై ప్రశంసలు కురిపించడం సమ్మిట్‌కు హైలైట్‌ అయింది. ముకేష్‌ అంబానీ స్వయంగా విశాఖ సదస్సుకు హాజరు కావడమే కాకుండా..తన సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో చేరుకోవడం మరో విశేషం.– జిఎన్‌వి సతీష్‌

సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టిద్దాం..!

దశాబ్దాల పోరాటం..అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానంఈ ఏడాది మహిళలందరం.. ఈక్విటీని స్వీకరించ గలగాలి. ఇది మనం చెప్పేది..రాసేది మాత్రమే కాదు. మనం ఆలోచించవలసిన, తెలుసుకోవలసిన, విలువైన స్వీకరించవలసిన విషయం. ఈక్విటీ అంటే… సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత ప్రభావ పరిధిలో ఈక్విటీకి చురుకుగా మద్దతు ఇవ్వవచ్చు మరియు స్వీకరించవచ్చు.ఈక్విటీని స్వీకరించడానికి మీ స్నేహితులు, కుటుంబం,సహ చరులు మరియు సంఘాన్ని ప్రోత్సహించండి.. ర్యాలీ చేయండి… సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మనం కలిసి పని చేద్దాం..! మనమందరం కలిసి సమాన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడగలము. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఎల్లప్పుడూ ఈక్విటీని కలిగి ఉండేలా అందరం ఆలింగనం చేద్దాం! ఈనెల 8నఅంత ర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్‌.దేవులపల్లి పద్మజ
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధిం చు కున్న విజయమిది.రాజకీయంగా, ఆర్ధికం గా,సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిల బడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగ తాలు తప్పడం లేదు. నిజమే..మహిళా దినోత్స వం సాధించుకోవ డానికి పలు దేశాల్లోని మహి ళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. పోరాడి అంరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజుల్లో సాధ్యం కాలేదు.ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించు కున్న విజయమిది. ఆకాశంలో సగం..అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవు తున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్ధిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంర్జాతీయ మహిళాది నోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లో ప్రభు త్వాలు ఈరోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్‌,ఆస్తిహక్కుకల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి.
ప్రత్యేక దినంగా మహిళలు తమ బాధలు,సమస్యలను చర్చించు కోవడానికి,నలుగురితో పంచుకోవడానికి ఒకరోజు ఉండాలని నిర్ణయించారు.ఆరోజును మహిళా దినో త్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహిం చారు.1910ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్‌ సామ్యవాద లూయీస్‌ జియట్జ్‌ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్‌ సామ్యవాద క్లారాజెట్కిన్‌ సమర్ధించారు.17 దేశాల నుంచి హాజరైన 100మంది మహిళలు ఓటు, సమాన హక్కు,సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911మార్చి 19న పదిలక్షల మందికిపైగా ఆస్ట్రియా, డెన్మా ర్క్‌, స్విట్జర్లాండ్‌ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వ హించారు. ఇందులో ఓటుహక్కు..ప్రభుత్వ పద వులు కావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు.1914నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు,ఉత్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీ కోట్‌ పరిశోధన చేశారు.
మహిళలు పోరాటాలు..విజయాలు
1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వ హించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లోగాని మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు.1917లో (గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి8)సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మహిళలు మొదటి ప్రపంచ యుద్దం,రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమ లోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరిక లను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.మార్చి8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్‌, అలెగ్జాండర్‌, కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటికదాకా అమల్లోకి రాలేదు. చైనా లో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రక టించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు. 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్స వానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచశాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపు నిచ్చింది. అమెరికా 1994లో అంతర్జా తీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
– నాయకత్వం,రాజకీయాల్లో అవకాశాలు్చ ఆర్ధిక స్వాలంబన
– మహిళలపై హింస నివారణ
– శాంతి,భద్రత
– మానత్వం
– జాతీయ ప్రణాళిక,పరిపాలనలో సమానత్వం
– యువతకు ప్రాధాన్యం
– దివ్యాంగులైన మహిళలు,బాలికలకు అవకాశాలు
భారత్‌లో మహిళా హక్కుల ఉద్యమం
భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అన సూయ సారాబాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. మహిళలను సంగటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్‌,విమలా రణదివే,కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌,అహల్య రంగ్నేకర్‌,పార్వతీకృష్ణన్‌ ఉన్నారు. మహిళల ఉద్యంతో కార్మికుల పనివేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజిని నాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం ప్రకటనలు
-1996మహిళాల గతం గుర్తించడం,భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం -1997మహిళలుశాంతి

-1998మహిళలు,మానవహక్కులు
– 1999మహిళలపై హింసలేని ప్రపంచం -2000శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
– 2001మహిళలు,శాంతి,పోరాటాల నిర్వహణ -2002నేటిఆఫ్గన్‌ మహిళ,నిజాలు,అవకా శాలు
– 2003లింగ సమానత్వం -2004మహిళలు,హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌
– 2005లింగ సమానత,భద్రమైన భవిష్యత్తు నిర్మాణం -2006మహిళలు,నిర్ణయాలు
– 2007మహిళలు,బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం -2008మహిళలు,అమ్మాయిలు,పరిశోధన
– 2009మహిళలపై హింసకు వ్యతిరేకం -2010సమాన హక్కులు,సమాన అవకాశాలు
– 2011మహిళలు పనిచేసేందుకు అవకా శాలు,విద్య,శిక్షణ,శాస్త్రసాంకేతిక రంగాల్లోకి ప్రవేశం -2012గ్రామీణ మహిళల సాధికారత, పేదరికం ఆకలి నిర్మూలన
– 2013మహిళలపై హింస నివారణకు కార్యాచరణ -2014అన్నింటా మహిళల పురోగతి
– 2015మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం -20162030నాటికి అంతరిక్షంలో 5050,లింగ సమానత్వం -2017పని ప్రదేశంలో మహిళలు,2030కి సమానత్వం
– 2018గ్రామీణ,పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు -2019మార్పు సాధించేందుకు ప్రయత్నం
– 2020పురుషులతో సమానంగా హక్కులు -2021కోవిడ్‌19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం -2022మహిళల సమానత్వం,కార్యచరణ
– 2023`సమ్మిళిత ప్రపంచాన్ని స్వీకరించడం మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏపక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’అన్న స్వామి వివేకానంద మాటలు మరో సారి స్మరిస్తూ..‘జయహో… జనయిత్రి’ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తు లకు శుభాకాంక్షలు.‘అన్నీ మారుతున్నాయి. మహిళలపట్ల మనఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలం దుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మనప్రగతికి మూలం.ఇదే నినా దంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయం గా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటోప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నా రు.విద్య,వైద్యం,వ్యాపారాలు,రాజకీయాలు,క్రీడలు, బ్యాంకింగ్‌,అంతరిక్షం,టెక్నాలజీ వంటిపలు రంగా ల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం.రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. జయహో… జనయిత్రీ.అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది.

ఆదివాసీల బతుకులు ఆగమైతున్నయ్‌

అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూము లు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాలకులు.. వారిని ఇంకింత భయభ్రాం తులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం, పంటలు ధ్వంసం చేయడం, నివాసాలు ఖాళీ చేయిస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదివాసీల హక్కులను కాపాడాలి.
ప్రపంచవ్యాప్తంగా90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, 5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రకృతితో పెనవేసు కున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంతర్భాగం.ప్రపంచవ్యాప్తంగా ఆది వాసీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతు న్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధా రం. ఐక్యరాజ్యసమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి.కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయిలో కాపాడటం లేదు.అభివృద్ధి,ఇతర అవస రాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పో వడంవల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య,ఆర్థిక అవసరా ల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికికనీస పౌరసేవలు అందడం లేదు. ఇండియాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశం లో8.6శాతం అంటే10.42కోట్లఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461 రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90 శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు, విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం1/70 పీసా చట్టం చేసింది.ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005 లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసు లకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం1967 ప్రకా రం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కు లు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమిస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆతేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికారం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది.అటవీ హక్కులు పొందా లంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్ర మణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ, ప్రభుత్వ రికార్డులు గానీ, ఏదైనా సెటిల్‌ మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు,వర్కింగ్‌ ప్లానులు, అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాంటిది ఆధా రాలు గా చెల్లుతాయి.రేషన్‌ కార్డు,ఓటర్‌ ఐడీ కార్డు, ఇంటి పన్ను రసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌, సర్వేరిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌?మెంట్‌?ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతిఆదివాసి కుటుం బానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆ ప్రకారం రాష్ట్రం లో1.78లక్షల ఎకరాలు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయ కుండా పక్కన పెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్న భూమిపై ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికా రులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు.ఆపేద బతు కులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుం టున్నారన్న నెపంతో గిరిజనుల మీదకేసులు పెడు తున్నారు.తెలంగాణలోభద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఆఫీసర్ల వేధింపులు తట్టుకో లేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 31 లక్షల75వేల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివా సీల్లో ఉపతెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుంచితే.. వారి వనరులు దోచుకోవడం, ఆవాసాలను, భూము లను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33 శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్కలకు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యం మంచిదే అయినా..ఈహరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు.కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. పోలీసులు, కోర్టుల గురిం చి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వంద లాది ఎకరాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పా రు. ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకో లేదు. ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదంటే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజ నులు మరో జల్‌,జంగల్‌, జమీన్‌ పోరాటానికి సిద్ధమవుతారు.
ఆ చట్టాలతో ఆదివాసులకు అన్యాయం
వ్యవసాయం నేడు ఆదివాసి జీవనాధారాలలో అతి ముఖ్యమైన భాగమైంది. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు మార్కెట్‌ ప్రేరేపిత పంటల వైపు ఆకర్షితులవుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించుకునే ముందు ఆదివాసీల రక్షణ కోసం తెచ్చిన చట్టాలకు సంబం ధించి జరిగిన ఉల్లంఘనలను పరిశీలిం చటం అవసరం. భారత రాజ్యాంగంలోని 244వ అధికర ణంలోని ఐదవ షెడ్యూల్‌ను‘రాజ్యాంగంలో రాజ్యాంగం’గా వర్ణిస్తుంటారు. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో ఆదివాసులు గిరిజనేతరుల నుంచి,వడ్డీ వ్యాపారం నుంచి దోపిడీకి గురి కాకూ డదని, ఆదివాసి జ్ఞానం,సంస్కృతి,పాలనావ్యవస్థ లపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలని, షెడ్యూల్‌ ప్రాంత సంరక్షకులుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరిస్తారని, రాష్ట్ర,కేంద్రప్రభుత్వ చట్టాలు ఐదో షెడ్యూల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే అమలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. చట్టా ల రూపకల్పనలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్‌ 14,ఎలాంటి వివక్షకు గురికాకుండా కాపాడే ఆర్టికల్‌ 15(4), ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టికల్‌ 19(1)(జి), గౌరవంతో జీవించేహక్కు ఆర్టికల్‌ 21లను పరిగ ణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో భూములు లీజుకు తీసుకోవడానికి కాని, కొనడానికి కాని, అమ్మే హక్కు కానిలేవని భూపరాయీకరణ నిరోధక చట్టం1/70స్పష్టం చేస్తోంది. ప్రతి ఆదివాసి సమూ హానికి తమ గ్రామ పరిధిలోని సహజవనరులను పాలించే శక్తి గ్రామసభలకు ఉందని స్పష్టం చేసిన పీసా చట్టం 1996లో వచ్చింది. గ్రామంలో జరిగే ఎలాంటి అభివృద్ధి పథకానికైనా గ్రామసభల అను మతి కావాలి. వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయటంలో గ్రామసభలకు అధికారం ఉంది. అలాగే తమ గ్రామ సంప్రదాయ సరిహద్దులలోని సహజ వన రుల (లఘు ఖనిజాలు,చిన్న నీటి వనరులతో సహా) నిర్వహణ, రక్షణ, యాజమాన్యం, వినియోగంలో గ్రామసభలకే అధికారం ఉందని ఈ చట్టం చెబుతు న్నది. గుర్తించిన అటవీ భూములలో డిసెంబర్‌ 2005కన్నా ముందునుంచి నివసిస్తున్న, సాగు చేస్తున్న ఆదివాసులకు, అడవిపై ఆధారపడి జీవి స్తున్నవారికి, ఆవాసాలు ఏర్పరచుకున్న పివిటిజిలకు ఉన్న హక్కులు గుర్తించి, దఖలు చేయాలని పేర్కొం టున్న అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006లో అమలులోకి వచ్చింది. వ్యక్తిగత హక్కులు, అటవీ వనరులపై సామూహిక హక్కులు, ఆవాసాలపై పివిటిజిలకు హక్కులు, వాటి నిర్వహణ, యాజ మాన్యం,వినియోగం గ్రామసభ అధీనంలో ఉంటా యని ఈ చట్టం చెబుతున్నది. భూములు, అటవీ భూములను ఇతర ప్రాజెక్టులకు మరలించాలన్నా గ్రామసభల అనుమతి తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇంత పకడ్బందీగా రాజ్యాంగ రక్షణలతో ఉన్నా షెడ్యూల్‌ ప్రాంతంలోని ఈ అం శాలను కొత్త వ్యవసాయ చట్టాలు పట్టించు కున్నా యా?ఈ కొత్త చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతా లకు సంబంధించినవి కాబట్టి వీటి ప్రభావం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఎలా ఉంటుందో పరిశీలిం చటం అవసరం.గత 30 సంవత్సరాలుగా ఆదివా సులు తిండి కొరకు ఎంతో కొంత పంటలు పండిర చుకుంటున్నారు. మార్కెట్‌ డిమాండ్లకు అనుగు ణంగా వాణిజ్య పంటలను పండిరచే రైతులుగా వాళ్లు మార్కెట్‌ చట్రంలో ఇరుక్కున్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చేది లేదా వాతావరణ మార్పులకు పరిష్కారం అనే కర్బన ఉద్గారాల అమ్మకాల మార్కెట్‌ కూడా అంతర్జాతీయంగా 2000 సంవత్సరం నుంచి మొద లైంది. ఉదాహరణకు బయోడీజిల్‌ తోటల పెంప కం చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా పవర్‌గూడా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుతో ప్రపంచబ్యాంకు కర్బన వ్యాపార ఒప్పందాలను 2003లో చేసుకోవటం గమనార్హం. భూమి నీరు, అడవి, గాలి వ్యాపారానికి సరుకులుగా మారుతున్న క్రమం మనం గమని స్తున్నాం. ఈ మధ్య రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడి పంటలు, ఫలసాయాల సేకరణ, శుద్ధి, ప్యాకింగ్‌, అమ్మకాలు జరుగుతున్నాయి. ఆదివాసి ప్రాంతా లలో ప్రభుత్వం ఇటీవల సేంద్రియ పద్ధతిలో ఆహారపంటల ఉత్పత్తిని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవ సాయం పేరుతో ప్రారంభించింది.మార్కెట్ల డిమాం డ్‌కు అనుగుణంగా వాణిజ్య పంటలైనా, సేంద్రియ పంటలైనా పండిరచే రైతులుగా ఆదివాసీలు మారుతున్న పరిణామం ఇది.పెట్టుబడిదారీ విధానా లు ఆదివాసి జీవితాలను సంక్షోభాలకు గురిచే స్తుంటే మరో పక్కన ప్రాజెక్టులు, గనులు, పరిశ్రమ లు,అభయారణ్యాలు, జాతీయ పార్కులు, హైవేలతో ఆదివాసులునిరంతరం నిర్వాసితులు అవుతున్నారు. బోయ,వాల్మీకి,లంబలంబాడీ,ఐతా లంబాడీ తది తర కులాలనూ ఎస్టీజాబితాలో కలపాలనే ఉద్దేశ్యం లో జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ వేశారు. దాని మూలం గా ఆదివాసీల మనుగడ అతి దారుణంగా ప్రశ్నార్థక మౌతుంది.ఇదిరాజ్యాంగ విరుద్ధం. ఎస్టీ జాబితాలో కలపాలన్నా,తీసివేయాలన్నా రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం కావాలి. వలసవాద రిజర్వేషన్లు రాజ్యాం గ విరుద్ధం. ఇప్పటికీ ఎస్టీలో లంబాడీ, యనాదులు, ఎరుకుల కులాలను 1976లో (ఇందిరాగాంధీ) కాంగ్రెస్‌ ప్రభుత్వం కలిపింది. దీని పర్యవసానం 95శాతం ఉద్యోగాలు లంబాడీలు దోచుకున్నారు. ఆదివాసీల పరిస్థితి అన్నీవున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా వుంది. అందుకే జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి.స్వాతంత్య్రమొచ్చి 68 సంవత్స రాలు కావస్తున్నా ఆదివాసీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ లేడు అంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఏ ప్రజాస్వామిక హక్కులు గురించి తెరాస అప్పుడు మాట్లాడిరదో, అదే పౌర హక్కుల ఉల్లంఘన, అదే ప్రజాస్వామిక ఉల్లంఘన నేడు పకడ్బందీగా జరుగుతున్నది.ఆదివాసీ సమా జంపై ఇంతపెద్ద ఎత్తున విధ్వంసం,హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే తెలంగాణ బుద్దిజీవులు, మేధావులు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.ఆదివాసీ సమాజంపై కళాకారులు, రచయి తలు, మేధావులు ఇప్పుడు నిశబ్దంగా ఎందుకు వుంటున్నారు. ఈబూర్జువా పాలకవర్గానికి మేధావు లందరూ సరెండర్‌ ఎందుకు అవుతున్నారు. నామి నేట్‌ పదవుల కోసం, కార్పొరేట్‌ పదవుల కోసం, రాజ్యాంగబద్ద పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఈ బుద్ధి జీవులు ఎందుకంత తహతహలాడు తున్నారు. ప్రజల పక్షం, పీడిత వర్గాల కోసం, ఆదివాసీ సమాజం కోసం నిలబడాల్సిన మేథావులు ఈ వ్యవస్థకూ, ఈ సమాజానికి ‘’అధికారం’’ కోసం తహతహలాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనే ముసు గులో మైనార్టీలకూ విలువ లేకుండా పోతున్నది. నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అవతరణ వారోత్సవాల జరుపుకుంటే ఆదివాసీలు ఆర్తనా దాలతో మరో సమరానికి సిద్ధమౌతున్నారు. సామా జిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. నవతె లంగాణలో బంగారు తెలంగాణ కోసం ఆదివాసీ లనూ బలిచేయడం అత్యంత దారుణం. అభివృద్ధి కోసం ఆదిమతెగలనూ అంతం చేయడం మహా పాపం. నిజమైన సామాజిక తెలంగాణ కోసం ఆదివాసీ,అణగారినవర్గాల పౌర ప్రజతంత్ర హక్కుల కొరకూ మరో పోరాటం చేయాల్సిన సమ యం ఆసన్నమైనది. ఆదివాసీల ఆర్తనాదాలు పట్టించుకోకపోతే ఈ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం. – జిఎన్‌వి సతీష్‌

మారుతున్న ఉపాధి సంబంధాలు

సంపద సృష్టికర్తలు కార్మికులు అని, ఉత్పత్తి సంబంధాలన్నీ కార్మికులకు ఉత్పాదక శక్తులకు ఉంటాయని ప్రపంచవ్యాప్త పరిశోధనాత్మక నిర్ధార ణలు అనేక దశాబ్దాలుగా ప్రజా బహుళ్యంల్లో ఉన్నవి. కానీ పెట్టుబడి ప్రభావం పెరిగిన తర్వాత సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు పెట్టుబడు దారులే అంటూ స్వయానా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ప్రకటిస్తుంటే, కార్మికుల పాత్రను నామమాత్రం చేస్తూ సమాజం ఒక విపరీత ధోరణిని తీసుకుంటున్నది. అ ఈ రకమైన ప్రకటన ద్వారా కార్మికులను ద్వితీయ శ్రేణికి తోసి వేయడమే కాకుండా డబ్బు మాత్రమే సమకూర్చిన పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడం జరుగుతుంది.
ఇలా జరగడానికి ప్రధాన కారణం రాజకీయాలను, ప్రభుత్వాల ఏర్పాటును పెట్టుబడిదారులు శాసించగల స్థాయికి చేరుకోవడమే. అయితే ఇలాంటి భావనలు దారి తీయడానికి మరో కారణమేమంటే ఒకప్పుడు ఉత్పత్తి ఒకచోట ఒక కర్మాగా రంలో లేదా ఒక కాంప్లెక్స్‌లో ఉండే అనేక కర్మ గారాలలో వర్కర్లందరూ కలిసి ఉత్పత్తి చేసేవారు అందుచేత పిరియాడికల్‌గా బయ టకు వస్తున్న ఉత్పత్తి ఎంతో అందరికీ కనిపించేది.మారిన పరిస్థితులలో ఒక వినియోగ వస్తువుకు సంబంధించిన ఉత్పత్తి ఒకచోట జరగడం లేదు. ఒకే రకమైన నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా కాకుండా వివిధ నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా,వివిధ ప్రదేశాలలో వివిధ రకాల విడిభాగాలన్నీ వేరువేరుగా ఉత్పత్తి చేయబడి, అంతిమ వినియోగ వస్తువు మరోచోట తయారవుతుంది. దీని ద్వారా జరిగిన మార్పు ఏమంటే,ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్లు ఒకే చోట,ఒకే సమయానికి, ఒకే సారూప్యతతో పని చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎవ్వరూ ఐక్యతగా ఏర్పడి యాజమాన్యాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. అనగా ఉపాధిదారులు క్రమం తప్పకుండా ఒకేచోట పని చేసే అవ కాశం లేకపోవడంవల్ల సంఘటిత పడే అవకా శాన్ని కోల్పోయి యాజమాన్యాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక మరో రకమైన మార్పు ఏమంటే వర్క్‌ ఫ్రం హోం అనే కాన్సెప్ట్‌ మొదలైన తర్వాత ఉద్యోగులు ఎవరూ ఆఫీసు లకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయి, కేవలము కంప్యూటర్ల ద్వారా కమ్యూని కేషన్లు తీసుకొని,నెట్‌ బ్యాంకుల ద్వారా జీతభ త్యాలు స్వీకరించి,తమకు కేటాయించిన పనిని పూర్తి చేయడం వలన ఉద్యోగికి యజమానికి సంబంధాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అనేక సందర్భాలలో నెలలు సంవత్సరాలు ఒక కంపెనీకి సేవలు అందించిన ఉద్యోగులు చాలామంది, యజమాని పేరు తప్ప భౌతికంగా వారిని చూసిన పరిస్థితులే లేవు. అనేక మంది వుద్యోగులు తమకు నష్టం జరగనంతవరకు యాజమాన్యాన్ని తెలుసుకోవాలన్న ఊసే ఎత్తడం లేదు.ఒక దేశంలో ఉన్న వ్యక్తి వేరొక దేశంలోని కంపెనీకి సేవలు అందించడం, పారితోషికాన్ని తీసుకోవడం చక చక జరిగిపోతున్నాయి. దీనివల్ల నైపుణ్యానికి తగిన ప్రతిఫలం వస్తుందని సదరు ఉద్యోగి భావిస్తూ ఉండవచ్చు కానీ అటువంటి పనికి విపరీతమైన పోటీ ఉద్యోగికి కనిపించ కుండానే సృష్టించి, ఎక్కువ నైపుణ్యం గల వారికి తక్కువ చెల్లిస్తూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎంతోమంది పెట్టు బడిదారులు మోసం చేస్తున్న సంగతి గుర్తించే అవకాశం లేకుండా ఉన్నది. ఇలాంటి పని విధానంలో మహిళలని ఎక్కువగా విని యోగించుకుంటారు. వర్క్‌ ఫ్రం హోం కొంతమేర మహిళలకు అనుకూలంగా ఉండడం వలన మరియు బీరమడే శక్తి తక్కువగా ఉండడం వలన మరియు సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉండటం వలన మహిళలు ఏమాత్రం నైపుణ్యానికి తగిన ప్రతిఫలం కోసం బేరమాడకుండా ఇలాంటి ఉపాధికి ఒకరకంగా బలౌతున్నారు. అందుచేత మారుతున్న పని పద్ధతులలో మహిళలు సమిధలవుతున్నారు. ఉపాధి కాంట్రాక్టీకరణ నుండి జాబు కాంట్రాక్టీకరణ అనే పద్దతులకు పరిస్తితి ఇప్పుడు మారింది. అనగా ఒక ఉద్యోగిని నిర్ణిత పనికి కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునే వ్యవస్థను నూతన ఆర్థిక విధానాల మొదలైన తర్వాత చూసాము. ఇప్పుడు ఉద్యోగిని నియమించుకోకుండా అలాంటి వ్యక్తులకు పనిలో కొంత భాగాన్ని కాంట్రాక్టుకు ఇచ్చి పని చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుచేతనే శ్రమకు, శ్రామికుడికి గతంలో వున్నంత విలు8వ గుర్తింపు ఇప్పుడు లేవు. సెమీ సంఘటిత రంగంగా భావింపబడుతున్న నైపుణ్యాలతో పని జరిగే చోట కూడా శ్రామికునికి ప్రాధాన్యత కరువైంది.నూతన ఆర్థిక విధానాల అనం తరం శ్రమ దోపిడి ఎక్కువౌతది, శ్రామికులు కూడా వస్తువులుగా వాడబడతారు అని వాదించిన అభ్యుదయ వాదనను చాలా మంది నమ్మలేదు. అంతే కాకుండా అవకాశాలు మెరుగౌతాయని వాధించి, ప్రపంచీకరణలో భాగంగా విస్తరిం చిన అవకాశాలను చూపించి ఎద్దేవా కూడా చేశారు. ముప్పైఏళ్ళ తర్వాత గానీ దాని విశపూరిత ఫలితాలు అర్థమౌతున్నాయి. అసంఘటిత రంగంలో మొదటి నుంచీ మహిళలకు ద్వితీయ శ్రేణి గుర్తింపే. ఎందుకంటే భౌతిక శక్తి తక్కువగా వుండటం వల్ల తక్కువ ప్రాధాన్యతనిస్తూ తక్కువ చెల్లిస్తారు. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. అయితే సంఘ్హటితమై పోరాడిన చోట ఫలితాలు మెరుగైన మాట కూడా వాస్తవమే. అయితే వలస కార్మికుల తాకిడి పెరిగిన తరువాత స్థానిక మహిళా కార్మికులకు ఉపాధి కరువైన మాట వాస్తవం. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, తాలూకా మండల స్థాయిల్లోని నూనె, రైస్‌, నూలు వంటి ఇండస్ట్రీలలో ఈ ఇతర రాష్ట్ర వలస కార్మికులను కుటుంబాలతో సహా తెచ్చుకుని పెట్టుకోవడం వల్ల తక్కువ పారితోషికానికి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎక్కువ పని చేయించుకుని దోపిడీ చేస్తున్నారు. కుటుంభం మొత్తాన్ని పనిలో పెట్టుకోవడం వల్ల మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు. అయితే ఈ నియా మకాలు కూడా ఒక సబ్‌ కాంట్రాక్ట్‌ పద్దతిన యజమానికి వర్కరుకు మధ్యన ఒక దళారీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఏరకమైన రాతపూర్వక ఒప్పందాలూ వుండవు.ఫ్యాక్టరీ యాజమాన్యంతో సహా కుటుంబ యజమాని దాష్టీకానికి అబలలు బలౌతున్నారు. అంతే కాకుండా స్థానికులైతే సంఘటితమౌతారని, ప్రమాదాలకు నష్టపరిహారమడుగుతారనీ మరియు సంఘాలు-రాజకీయాలు కలుగజేసు కుంటారని కూడా ఈ యాజమా న్యాలు భావిస్తున్నాయి. గత్యంతరం లేని కారణంగా స్థానికులు మరో ప్రాంతానికి వెళ్ళి ఇదే రకమైన దోపిడికి గురౌతున్నారు. సిఐటియు అగ్ర నాయకులు ఎస్‌. వీరయ్యగారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల గల పారిశ్రామిక వాడల్లో జరిపిన పాద యాత్ర సందర్భంగా ఈ వాస్తవాలు అనేకం బయట పడ్డాయి. వలస కార్మికులపై సమగ్ర విధానం ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల ఈ దుస్థితి దాపు రిస్తుంది. ఇక సంఘటిత రంగంలోని మహిళలు, ముఖ్యంగా కుటుంబభారం పైబడిన వారిని టార్గెట్‌గా చేసుకుని కంపెనీల సతాయింపులుంటున్నవి. ప్రస్తుత మాంద్య పరిస్తితుల్లో అత్యధిక పారితోషికాన్ని పొందు తున్న వారిని మొదటగా తొలగించి వారి స్థానాల్లో అవసరం మేరకే కొత్తవారిని నియమించుకుంటున్నారు. సహజంగా కొత్తవారు తక్కువ జీతానికి అందుబాటులో వుంటారుగా! గత ఆరు నెలల కాలంలో ప్రైవేటు ఉపాధి కోల్పోయిన కారణంగా ఆత్మహత్యలు పెరిగి పోయాయని ఎన్‌.సి.ఆత్‌.బి తెలిపింది. రిపబ్లిక్‌ డే ఉపన్యాసంలో గవర్నర్‌ తమిళిసై తెలంగాణా సర్కారుపై అక్కసుతోనే చెప్పి9నప్పటికీ ఆత్మహత్యల్లో పెరుగుదల వుండటానికి కారణం అసంబద్దమైన తొలగింపులే. అయితే భాజపా అధికారంలో ఉన్న కర్నాటకా,మహారాష్ట్రల్లోనూ మరింత ఎక్కువగా ఈ ఆత్మహత్యలుండటం పాలనతో పాటు వైపరీత్యపు పెట్టుబాడిదారి వ్యవస్థ లోపాలకు అద్దం పడుతుంది.ఎక్కువె క్కువ ప్యాకేజీలతో,విపరీత పోటితత్వంతో ఈ అనిశ్చితితో(ప్రికేరియస్‌) కూడిన వ్యవస్థను బలపరుస్తున్నది కూడా నైపుణ్యంగల యువతనే. అయితే కొంత కాలం గడిచాక,బాధ్యతలు పెరిగాక గాని దీనిలో లోపాలనూ,సంఘ్హటిత ఐక్యతనూ వారు గుర్తించటం లేదు. కాంట్రాక్టు వ్యవస్థలో 27 రకాలున్నాయంటే దోపిడి కోసం దాని తీవ్రత చూడండి. వ్యక్తిని నియమించు కోకుండా పని(జాబ్‌)లోని కొంత భాగానిఇకి మాత్రమే అంగీకారానికి రావడంతో వివిధ రకాల విడిభాగాల పనికి దళారీ వ్యవస్థ పెరిగి వుద్యోగికీ యజమానికీ సంబంధాలు ఏర్పడే అవసరమే లేదు.ఉదాహరణకు మొబైల్‌కు సంబంధించిన విడిబాగాల ఉత్పత్తిలో ఈ పద్దతి కళ్ళకు కట్టిన సత్యం.పది పదేహేను దేశాల్లో ఉత్పత్తౌతున్న విడిబాగాలన్నీ కలిపితే ఒక సెల్‌ఫోని తయారౌతుంది. అలాంటప్పుడు ఆప్పిల్‌, వన్‌ప్లస్‌ వంటి కంపేనీల వుద్యోగులను ప్రత్యేకంగా గుర్తించే అవకాశమే లేదు. నియామ కాలు తొలగింపుల్లో పాటించవలసిన ప్రభు త్వాల నిభందనలను తప్పించుకునేందుకు దళారీ వ్యవస్థ కంపెనీలకు బాగా ఉపకరి స్తుంది. గత్యంతరం లేక నిరుద్యోగులు వారిని ఆశ్రయించాల్సి రావడం, దళారీల కమీషన్‌ పోగా మిగిలిందే తీసుకోవాల్సి రావడం తప్పని పర్స్థితిగా ఏర్పడిరది.ఈ క్రమంలో విదేశాల్లో విద్యాభ్యసించిన యువత ముఖ్యంగా మహిళలు తమ బ్యాంకు ఋణాల తీర్చే క్రమంలో ఇలాంటి దోపిడీలకు బాగా గురౌతున్నారు. వెరసి- కాంట్రాక్టీకరణ, ఔట్‌?సోర్సింగ్‌, ప్యాకేగీ వర్క్‌…వంటి పని విధానాలతో ఉద్యోగీ యజ మానీ మధ్య ఉపాధి సంబంధాలు కనీస స్థాయిలో వున్నవి. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడికి ఇవి మరింత దోహద పడుతున్నవి. ప్రపంచీకరణను ఎదుర్కునేందుకు పోరాటాలనూ ప్రపంచీకరించినట్లుగానే కార్మికుల ఐక్యతకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిందే.
సంస్కరణతో ఇబ్బంది
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్ర ప్రభు త్వం తీసు కొచ్చిన సంస్కరణలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో ఉపాధి కూలీలకు వేసవి భృతి లభిస్తుండగా సంస్కరణతో వేసవి భృతికి చెక్‌ పడిరది.ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్‌మెటిక్స్‌ సెంటర్‌) ద్వారా ఉపాధి పనుల్లో పూర్తి పారదర్శకత కోసం నేషనల్‌ మోబైల్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మే 21న ప్రారం భించగా, రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అధికారులు అమలు చేస్తున్నారు. తాజాగా రెండు పూటల పనిదినాలు అమలు చేయాలని ఆ దేశాలు రావడంతో ఉదయం 7నుంచి 11గంటల వరకు ఉపాధి కూలీలు పనిచేసే ఫొటో, మళ్లీ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు కూలీలు పనిచేసే ఫొటోను విధిగా మేటీలు, పంచాయతీ కార్య దర్శులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది కూలీలు పనులకు వచ్చారనే విషయాన్ని మేటీలు ఉదయం, మధ్యాహ్నం మస్టర్లలో నమోదు చేయాలి. కాగా ఈ వెబ్‌సైట్‌ లో కూలీలు పనిచేసే చోట 20మందికి పైబడి ఉంటేనే ఫొటో అప్‌లోడ్‌ అవుతోంది. ఫొటోతో పాటు హాజరైన కూ లీల పేర్లు, పనుల వివరా లు సమగ్రంగా క్రోడికరిం చాల్సి ఉండ డంతో ఉపాధి కూలీల అక్రమాలకు చెక్‌ పడే అవకాశ ముంది. వేసవి దృష్యా మధ్యాహ్నం పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని అందుకు మినహాయింపు కల్పించాలని కూలీలు కోరుతు న్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1,02,328 జాబ్‌ కార్డులు ఉండగా అందులో 32,101 యాక్టివ్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 280 గ్రామ పంచాయతీలకు గాను ఈనెల 19న 21,319 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ప్రతీ గ్రామ పంచా యతీలో 76మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. రోజు కూలి రూ.257 పడాల్సి ఉండగా గరిష్ఠంగా జిల్లాలో మాగనూర్‌, నర్వ మండలాల్లో రూ.174, కనిష్ఠంగా మక్తల్‌ మండలంలో రూ.119 కూలి పడుతోంది. వేసవి అలెవెన్స్‌ 30శాతం రాయి తీ కూడా తొలగింపుతో కూలీల సంఖ్య కూడా తగ్గి గిట్టుబాటు కావడం లేదని వెంటనే వేసవి అలెవె న్సును పునరుద్ధరించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.దినసరి కూలి రూ.200 తగ్గకుండా ఉండేలా ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలు,ఈసీలు,కార్యదర్శులు,టీఏలు, మేటీలు క్షేత్రస్థాయిలో కూలీలకు మార్కౌట్‌ ఇచ్చి పనులు జరిగేలా చూడాలని డీఆర్డీ వో గోపాల్‌నాయక్‌ తాజాగా నిర్వహించిన టెలీకా న్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం రోజుకూలి రూ. 257గా నిర్దేశించింది. కృష్ణ మండలంలో రోజుకూలి రూ.125, ధన్వాడలో రూ.127, పేటలో రూ.135,కోస్గిలో రూ.138, మద్దూర్‌లో రూ.167,దా మరగిద్దలో రూ.151,మరికల్‌లో రూ.155,ఊట్కూర్‌లో రూ.156,మాగనూర్‌,నర్వలో అధికంగా రూ.174కూలి పడుతోంది. గ్రామ పంచాయతీ స్థా యిలో నారాయణపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలకు 3020 కూలీలు పనులు చేయగా రోజు కూలి రమారమిగా రూ.107 గరిష్ఠంగా ఉండగా అత్యల్పంగా మాగనూర్‌లో 16 పంచాయతీ లకు 819మంది కూలీలు పనుల్లో పాల్గొనగా రమారమి రూ.51 కూలి కనిష్ఠంగా పడుతోంది. -జి.తిరుపతియ్య

గూడేలకు చెరగని గురుతు`బీడీ శర్మ

స్వతంత్య్ర దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా.బి.డి.శర్మ.తను బ్రహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో 1929లో పుట్టిన బి.డి.శర్మ కష్టపడి చదివి ఐ.ఎ.ఎస్‌గా వివిధశాఖలలో పనిచేసిన ఆయనఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా రిటైర్‌ అయ్యారు. 1996లో షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణచట్టం (ఫెసా)రావటానికి, దాని నియమాలు రూపొందించిందీ శర్మనే. దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి అసలు ఆదివాసీ ప్రాంతాలలో పెసాఅంటే ‘మావనాటే మావ సర్కార్‌’అంటే ‘మావూళ్లో మా రాజ్యం’,‘మా గూడెంలో మాపరిపాలన’ అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతో సహజీవనం చేసిన అనుభవంతో దీనిని గ్రహించారు. కనుకనే ఆదివాసీల జీవన విధానానికి, మైదాన ప్రాంతాల జీవన విధానానికి వ్యత్యా సం ఉంది. ఏజెన్సీ గూడేలలో ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు..సంస్కృతి సాంప్రదాయాలను విడిచి వారు బ్రతకలేరు. ఆదివాసీలకు నీరు,అడవి,భూమి(జల్‌ జంగల్‌-జమీన్‌)వారి నివాస ప్రాంతంపై స్వయం నిర్ణయం హక్కు కావాలని పరిత పించి దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి తాను స్వయంగా రిపోర్టు తయారు చేసి, ఆదివాసి స్వయం పాలన హక్కుకై పార్ల మెంటులో ప్రయివేట్‌ బిల్లు పెట్టించి పాస్‌ చేయించటంలో బి.డి.శర్మ కృషి కీలకం. 1953 మొదటి బ్యాచ్‌లో ఐ.ఏ.ఎస్‌గా బి.డి. శర్మకు అనేక అవకాశాలు వచ్చినా తన ఉన్నతిని వెతుక్కోలేదు. సమాజ ఉన్నతికై కలగన్నారు. 1958లో బస్తర్‌ కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు నాటి బస్తర్‌ అనుభవం ఆదివాసీలను చేరదీ సింది. నాడు బస్తర్‌ నేడు7జిల్లాలుగా అంటే సూక్ష్మబీజాపూర్‌,సుక్మా,దంతెవాడ,ఉత్తర,దక్షిణ బస్తర్‌, బైలాడిల్లా,కాంకీర్లుగా విడిపోయింది. అంత పెద్ద ఆదివాసీ జిల్లాకు తొలిసారి కలెక్టర్‌ గా వెళ్ళిన శర్మకు ఆదివాసీల ఆటవిక జీవనం, కడుదారిద్య్రం స్వాగతం పలికింది. బస్తర్‌ పూర్తిగా ఆదిమతెగలు గలకొండ ప్రాంతం. ఆకలితో అలమటించే ఆదిమ తెగలకు ఆహారం, కట్టుకోవటానికి బట్టలు,గూడేలకు విద్యుత్‌ వెలుగులు లేక విషజ్వరాలతో మృత్యువు బారినపడుతున్నారు. బడిలోకి చేరే ఆదివాసీకి కనీస వైద్యం,రోడ్డు సౌకర్యం,మంచినీరు అందించి వారి అభివృద్ధికి తోడ్పాలని ఒక కలెక్టర్‌ గా కలలుగన్నాడు.అబూజ్‌ మాడ్‌ (కనిపించని కొండలు)లను సైతం కాలినడకన పగలనక రేయనక తిరిగారు. ఆదివాసీ జీవ నాన్ని చక్కదిద్దాలని అభివృద్ధి నమూనాలు తయారు చేసి, కలలుగన్న శర్మకు అభివృద్ధి స్థానంలో విధ్వంసం అనే ప్రగతి నమూనా రావడంతో కలలన్నీ నిర్వీర్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టటంతో పాటు ఆకలెక్టర్‌ కే అధి కారికంగా ఉక్కు పరిశ్రమ చేపట్టాలని సూచిం చింది. కలగన్నది అభివృద్ధి నమూనా ఉక్కు పరిశ్రమతో విధ్వంస నమూనాగా మారింది. ఇనుప ఖనిజం త్రవ్వకం మొదలయితే ఆదిమ తెగలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని దీని నుంచి వచ్చే విషతుల్యం వలన అనేక మంది ఆదివాసీలు రోగాల బారినపడి మృత్యువాత పడతారని,దీంతో అమాయకులైన వారి మను గడ ఇక ప్రశ్నార్ధకమేనని గ్రహించారు.ప్రభుత్వ ఏజెంట్‌గా ప్రభుత్వం తరపునే నిలబడి ఉక్కు త్రవ్వకాలు చేపట్టాలి. కానీ ఒకకలెక్టర్‌గా తన అధికారాన్ని రాజ్యాంగబద్ధ నిబంధనలతో ఇది మానవహక్కులు, నిబంధనలకు వ్యతిరేకం అని, జీవించే హక్కుకు భంగకరమని అని,ఉక్కు పరి శ్రమ అనుమతులు రద్దు చేపించాడు.రాజ్యం తననేం చేస్తుందోనని ఆలోచించకుండా అన్నిం టికీ సిద్ధపడి రాజ్యాంగబద్ధంగా మానవత్వాన్ని చాటుకున్నారు. తదుపరి బి.డి.శర్మకు జరిగిన అవమానానికి ఆదివాసీలు ఏం చేసినా తీర్చు కోలేనిది.ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేశాడనే నెపంతో బి.డి.శర్మను బస్తర్‌ వీధుల్లో బిజెపి పార్టీ నాయకులు అధికారికంగా..అదీ అర్ధ నగ్నంగా చెప్పులు మెడలో వేసి ఊరేగిం చారు.ఒక కలెక్టర్‌గా తనఅధికారాలను కూడా స్వేచ్ఛగా, రాజ్యాంగబద్ధంగా ఉపయో గించుకునే హక్కు లేదని సామ్రాజ్యవాదులు కాళ్ళ కింద భారతరాజ్యాంగాన్ని తాకట్టు పెట్టే సార్వభౌమ, సార్వత్రిక, లౌకిక, గణతంత్ర అనే మాటలు విలువలు లేకుండా చేసిన,అదీ స్వయాన ప్రభు త్వమే అధి కారికంగా చేసిన దుర్మార్గపు సంఘ టన.అంత అవమానం జరిగినా బి.డి.శర్మ కృంగ లేదు. కృశించలేదు. ముఖంపై చిరు నవ్వుతో నేడు సామ్రాజ్యవాదులు వీరి కబం దహస్తాల క్రింద కుళ్ళుపట్టే రాజకీయ పెద్దలు పతనం అయి ప్రజల చేత,ప్రజల కొరకు పాలిం చబడే వ్యవస్థ ముందు భవిష్యత్‌ సమాజ రక్షణ కు చైతన్యంగా నా ఊరేగింపు నిలుస్తుందని, నేటి సమాజంలో ఆదివాసీల రక్షణకు ఇంత నిస్వార్థంగా త్యాగాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు! వాస్తవంగా బి.డి.శర్మ అబూజ్‌ మడ్‌ లో మావోయిస్టుల కంటే ముందు కాలు పెట్టాడు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే అతని ఆశయానికి అడ్డు అయినవి. ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న బి.డి.శర్మ ఒక అంశాన్ని మాత్రం నిస్సం కోచంగా మాట్లాడాడు. భారత స్వాతంత్య్య్ర సంగ్రామంలో మనదేశం స్వాతంత్య్ర దేశం 1947)గా ఏర్పడిరది. భారత ప్రజల మను గడను సుస్థిరం చేసుకుంది. కానీ అప్పటి నుండి ఆదివాసిల మనుగడ ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిందని,ఆదివాసీలు భవిష్యత్తులో విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పిన మాటలు నేటికీ నిజమవుతున్నవి. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న నాగా, మిజోరంలలో వున్న సంతాల్‌, గోండు ప్రాంతాలను బర్మా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఖాట్మండ్లుగా, విభజించారు.మధ్య భారతం లోని గోండులను ఒరిస్సా, చత్తీస్గఢ్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్రలుగా విభజించారు. విభజించిన అనంతరం నర్మద,సర్దార్‌ సరోవర్‌, గోదావరి పోల వరం, హీరాకుడ్‌,కంతనపల్లి లాంటి భారీ ప్రాజెక్టులను కట్టి అభివృద్ధి పేరిట ఆది వాసీలను జలసమాధి చేస్తున్నారు. పోస్కో, టాటా,మిట్టల్‌, జిందాల్లకు బాక్సైట్‌ ఎక్కు లాటరైట్‌, గ్రానైట్‌ లాంటివి కట్టబెట్టి తెగల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నారు. టైగర్‌ జోన్‌ల పేరిట అడవుల నుండి గెంటేస్తున్నారు.అడవిలో స్వేచ్చగా జీవించే ఆదివాసీలను మావోయిస్టుల పేరిట ఇబ్బంది పెడుతున్నారు.1956 సైనిక అధికారాలు చట్టం లాంటివి అమలు చేసి ఈశాన్య భారతంలో పౌరులని చంపి వేర్పాటువాదులుగా ముద్ర వేస్తున్నారు. ఆదివాసి మహిళలపై పాశవిక అత్యాచారం, హత్యలను సైన్యం జరిపి ప్రజాస్వామ్య రక్షణ కోసమని ప్రకటిస్తున్నారు. ఇటువంటి దురాగతాలను బి.డి.శర్మ ముందుగానే గ్రహించి తన జీవితాన్ని ఆదివాసీల కోసం ధారపోశారు. మావో యిస్టులు బస్తర్‌ కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను కిడ్నాప్‌ చేసి 18రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు,అనాటి ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా.. పోలవరం లాంటి ప్రాజెక్టు అయిన ఆగకపోతుందా అనే ఆశతో మావోయిస్టులతో మాట్లాడి ఒప్పించి,కలెక్టరును విడిపించటానికి దండకారణ్యానికి బయల్దే రాడు.కానీ,ప్రభుత్వం తన నీతిలేని బుద్ధిని నిరూపించుకుంది. కలెక్టర్‌ విడుదలయ్యాక ఏకంగా పార్లమెంట్‌ బిల్లు పెట్టి 5వ షెడ్యూల్‌, 1/70,ఎల్‌.టి.ఆర్‌ లాంటి చట్టా లకు విరుద్ధం గా పోలవరంని కట్టే ప్రక్రియను చట్టబద్దంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ లాంటి దుర్మార్గాలను సైతం ఆపటానికి బి.డి.శర్మ చేసిన కృషి ఎనలేనిది.భారత దేశంలో బి.డి.శర్మ అనేక ఆదివాసీ ప్రాం తాలు పర్యటించి 76పుస్తకాలు రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణాలతో బి.డి.శర్మ అనుబంధం మరువలేనిది.1996 ఆగస్టు 6న ఆదివాసి స్వయంపాలన,ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ‘తుడుందెబ్బ’గూడూరులో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే ప్రొ.బియ్యాల జనార్ధనరావు పిలుపు మేరకు బి.డి.శర్మ ఉద్యమ దిశా నిర్దేశాన్ని ప్రకటించారు.నిత్యం ఆదివాసీల సంక్షేమం కోసం పరితపించిన బి.డి.శర్మగారు 2015 డిసెంబర్‌ 8న కాల గమనం చెందారు.20ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ చైతన్యంలో దేశ వ్యాప్తంగా విద్యా, సామా జికంగా చైతన్యమై ఆదివాసీ అభివృద్ధి సమూ నాను సుస్థిరం చేసుకున్న రోజు,ఆదివాసి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను రక్షించుకున్న రోజు బి.డి.శర్మకు ఘనమైన నివాళి అవుతుంది.వ్యాసకర్త : – గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి, సెల్‌ : 9491318409

1 2 3 4 9