5వ షెడ్యూల్‌లో నాన్‌ షెడ్యూల్డ్‌ ఆదివాసీలకు దిక్కేది?

వజ్రోత్సవ భారతావనిలో సమస్త ప్రజా నీకం అభివృద్ధి పేరుతో ముందుకు సాగు తుంటే రాజ్యాంగ రక్షణలు ఉండి అమలుకు నోచుకోని ఆదివాసీలు మరోపక్క అటవీ ఫలసాయంపై నిర్బం ధాన్ని ఎదుర్కొంటూ దుర్భర జీవితాన్ని గడుపుతు న్నారు. స్వాతంత్య్ర ఫలాలకు సుదూరంలో 5వ షెడ్యూల్డు హోదా పొందని ఆదివాసీ గూడేలు ఉమ్మడి రాష్ట్రంలో 805 దాకా ఉన్నాయి. అసలు వీరి జీవనానికి భరోసా ఏది? వీరికి కనీస హక్కు లేమిటి?వీరిపై పాలకులు వైఖరేమిటి ? ప్రజాస్వా మిక పాలనలో వీరికి ఏపాటి న్యాయం జరుగు తోంది? అనేవి సమాధానం లేని ప్రశ్నలు.- గుమ్మడి లక్ష్మీ నారాయణ
వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్న గిరిపుత్రుల దుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉం డటమే దీనికి కారణం.రాజ్యాంగంలో ప్రత్యేక హక్కు లున్నా,ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజ నులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పో తున్నారు.మరి,కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ?ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారా లు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామా లను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్ష ణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ గా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజనగ్రామాలను అయిదో షెడ్యూ ల్‌లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అం టారు.
2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 59,18,073 మంది గిరిజనులు ఉన్నారు.రాష్ట్ర జనాభాలో 6.6శాతం.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే తెగలు 30.మైదాన ప్రాం తాలలో నివసించే తెగలు 5కలిపి మొత్తంగా 35 ఉన్నాయి. గిరిజనులలో 70శాతం మంది షెడ్యూ ల్డ్‌ ఏరియా ప్రాంతంలో నివసిస్తుండగా,మరో 30 శాతంమైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. రాష్ట్రం లోని షెడ్యూల్డు ప్రాంతం31,485చ.కి.మీ. రాష్ట్రా లల్లోని ఉమ్మడి జిల్లాలపరిధిలో ఆదిలాబాద్‌, విజ యనగరం,వరంగల్‌,ఖమ్మం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,విశాఖపట్నం,శ్రీకాకుళం, మహ బూబ్‌ నగర్‌ (9)జిల్లాల్లోని 107మండలాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతము విస్తరించి యున్నది. వీటిలో 46మండలాల్లో పూర్తిగాను,61మండలాల్లో పాక్షి కంగాను ఆదివాసీలు నివసిస్తున్నారు. ఇందులో 5,948 గ్రామాలు రాష్ట్రపతి గెజిట్‌ లో గుర్తించబ డినవి. ఇంకా నాన్‌-షెడ్యూల్డు గ్రామాలుగా మిగిలి నవి 805. వీటికి షెడ్యూల్డ్‌ గుర్తింపు లేదు.1950 రాజ్యాంగ గెజిట్లో షెడ్యూల్డు గ్రామాలను గుర్తించే ప్రభుత్వ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతా లలోకి వెళ్ళేమార్గం లేక గుర్తించలేదు. అది ఒక కారణమైతే, సాంకేతికలోపంగా భావించిన ప్రభు త్వం1980 దశకంలో అప్పటి ప్రభుత్వం గిరిజన జిల్లాల్లో సర్వేచేయించింది. ఆసర్వే ప్రకారం మిగిలిన గ్రామాలు
జిల్లాలు నాన్‌-షెడ్యూల్డు గ్రామాలు
ఆదిలాబాద్‌ 164
విజయనగం 170
వరంగల్‌ 87
ఖమ్మం 18
తూ.గోదావరి 44
ప.గోదావరి 10
విశాఖపట్నం 55
మహబూబ్‌ నగర్‌ 18
శ్రీకాకుళం 240
మొత్తం 805
ఈ 805 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఫైలు పంపిం చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇలా 72 ఏళ్ల నిరీక్షణలో..రాష్ట్రంలో 78.24శాతం గ్రామాలకు నేటికి కరెంటు సౌకర్యం లేదు.68.8 శాతం గిరిజన విద్యార్థులు ప్రాధమిక విద్యలోను, ఉన్నత విద్యలోను వెనుకబడి ఉన్నారు. షెడ్యూల్డు ఏరియా విద్యార్థుల అక్షరాస్యత శాతం పురుషులది 17% మహిళలది 8.68% గా వున్నది. నేటికి 90శాతం గిరిజనులు కనీస వసతి సౌకర్యాలు లేక జీవిస్తున్నారు. 49 శాతం గిరిజనులు పౌష్టికాహార లోపంతో జీవిస్తు న్నారు.65% గిరిజనులు దారిద్య్రపు రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఆదివాసీ మహిళలలో ప్రతి 1000 మందికి 80మంది ప్రసవ సమయంలో బిడ్డతో సహాతల్లి కూడా మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రం లో ప్రసవ సమయంలో చనిపోయో మహిళల సగటు 3.65%గా వుంది. శిశు మరణాల రేటు రాష్ట్రంలో53శాతంగా వుండగా,ఒక్క ఆదిలా బాద్‌ ఏజెన్సీలోనే 63శాతంగా వుంది. రాష్ట్రంలో 90 శాతం మంది ఆదివాసీ గిరిజనులు రక్తహీన తతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో 9జిల్లాల్లో ఆదివాసీల అభివృద్ధికై సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి. డి.ఏ) లు పనిచేస్తున్నా నేటికీ నాన్‌-షెడ్యూల్డు గూడే లకు ఐ.టి.డి.ఏ.ల నుండి ఆర్థిక ఫలాలు అందక సతమత మౌతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో దేశం లోని ఆదివాసీల సామాజిక పరిస్థితిని మెరుగు పరుచుటకు ప్రత్యేక పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో గిరిజనులు కోసం నిర్దేశించిన 5వషెడ్యూల్‌లో ప్రత్యేక విధివిధా నాలు, షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన విధానం రాజ్యాం గంలో షెడ్యూల్డు క్రింద పేర్కొనబడిన రాజ్యాంగ అధికరణం 244 వివరిస్తుంది. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి విషయాలపై సలహా లు ఇచ్చేం దుకు గిరిజన శాసన సభ్యులతో కూడిన సలహా మండలి ఏర్పాటు జరుగుతుంది.పార్లమెంటు లేదా శాసనసభ్యులు చేసే చట్టాలు ఏజెన్సీ ప్రాంతాలలో అమలు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు అధి కారం ఉంటుంది.గవర్నర్‌ ఆమో దించిన నిబంధ నలు రాష్ట్రపతి ఆమోదంపై అమ లులోకి వస్తాయి. గవర్నరును సంప్రదించిన తరు వాత ఏప్రాంతా న్నైనా షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించక పోవడం వలన సుమారుగా రెండు లక్షలమంది ఆదివాసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ,సంక్షేమ అభివృద్ధి ఫలాలను పొందలేక పోతున్నారు.1939 సంవత్సరాల ముందు షెడ్యూ ల్డు ప్రాంత ఆదివాసీ గిరిజనులు ఎలాంటి పరిస్థితు లలో ఉండే వారో స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లకు కూడా నాన్‌-షెడ్యూల్డు ఆదివాసీలు అదే స్థితిలో వున్నారు.నాన్‌ షెడ్యూల్డు ఆదివాసీ గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదేమో?వారికి రాజ్యాం గం ఇంకా అమలు కావలసి వుంది. షెడ్యూల్డు ఏరియాలలో గత31సం.లుగా 805 గ్రామాలలో రెండులక్షల మంది ఆదివాసీలు తమ హక్కుల గురించి పాలకుల దృష్టికి తెచ్చినా ఫలించడం లేదు. 2005లో ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ సూచనలు (74)ఆమోదిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.నెం.1049సహితం నాన్‌-షెడ్యూల్డు గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతంలో కలపాలనే చూపుతున్నాయి. ఇన్నాళ్ళుగా 5వ షెడ్యుల్డు సాధన కమిటి మరియు వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు,సంస్థలు ఒత్తిడి తేగా కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మేల్కొంది. 2001 జనాభా వివరాలు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఫైలును తిరిగి రాష్ట్రగిరిజన సంక్షేమశాఖకు తిరిగి పం పింది. ఈలోగా ఎన్నోసార్లు మంత్రి మండలి సమా వేశాలు జరిగాయి. కానీ మన ప్రతిపాదన మాత్రం కేబినెట్‌ మంత్రిమండలి ఆమోదానికి పెట్టడం లేదు. ఎందుకంటే 5వషెడ్యుల్డులోని నాన్‌ -షెడ్యూ ల్డు గూడెంలలో అపారమైన ఖనిజ సంపద బొగ్గు నిక్షేపాలు, అల్యూమినియం బాక్సైట్‌, సున్నపురాయి గ్రానైట్స్‌, ఇసుక మొదలగు ఖనిజ సంపదతో నిండి వున్నాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదివాసీ గూడేలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించినట్లయితే 5వషెడ్యూల్డు ఏరియాలోని ఆది వాసులకు సర్వహక్కులు ఉంటాయి గనుక అక్కడి ఖనిజ సంపదను వెలికి తీయాలంటే ఫెసా చట్టం ప్రకారం ఆదివాసీలతో గ్రామసభ నిర్వహించి ఆ సభల తీర్మానం పొందిన తరువాతనే ఖనిజాలను వెలికి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రాజ్యం నాన్‌-షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించడంలేదని అనుకోవచ్చు. ఆదివా సీల సంక్షేమం కోసం పాటుపడవలసిన ఈ రాజ్యం ఆదివాసీల మనుగడను పూర్తిగా అంతం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అంటే ఆదివాసీ ప్రజా నీకం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంకాదా? వారి పట్ల ఈ రాజ్యాంగానికి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ? 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రధానంగా భూమి సమస్య షెడ్యూల్డు ఏరియాలో అమలయ్యే 1/70 వంటి చట్టాలు ఉన్నప్పటికి ఈ ప్రాంతాలలో 7.50 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఉన్నది.
షెడ్యూల్డు హోదాలేని ప్రాంతాలలో ఆదివాసీ భూముల పరిస్థితి అగమ్యగోచరం. ఈ చట్టం అమలులో లేనందున ఆదివాసీలు నష్టపో తున్నారు. కొన్ని వేల ఎకరాల భూములు భూస్వా ముల చేతులలోకి వెళ్ళినవి. భూవివాదాలు సివిల్‌ కోర్టు పరిధిలోకి వస్తున్నందున భూస్వాములు, ధనికులు, గిరిజనేతరులు అమాయక ఆదివాసీలను కోర్టుల చుట్టూ తిప్పుతూ ఆర్ధికంగా దివాళా తీయి స్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీసుల గురించి చెప్పన వసరం లేదు.నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని భూమి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు విఫలమయ్యారని ఉమ్మడిరాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ అభిప్రాయపడుతున్నారు.గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియాల అంశా లను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. ‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా,అటవీ హక్కుల చట్టాల కింద గ్రామసభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభు త్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది.ఈ విష యా లను గుర్తించి,మీరు తగినచర్యలను తక్షణమే తీసు కుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

  1. నిరుపేదలకు చెందవలసిన‘డి’పట్టాలు, ధనికులు భూస్వాములు పొందుతున్నారు.
  2. బంజరు భూములను ధనికులే ఆక్రమించు కుంటున్నారు.
  3. గిరిజనుల నుండి గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్న క్రమం తనాఖా-స్వాధీనం ‘‘డి’’ పట్టా భూములు
  4. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్నా పట్టాలు రాని భూములు.
  5. గిరిజనులకు పట్టాలు మంజూరైనా భూములు అప్పగించని కేసులు.
  6. గిరిజనుల పేరున ఇతరులు అనుభవిస్తున్న (సీలింగ్‌ బంజరు) భూములు.
  7. ఒక గిరిజనుడు సాగు చేస్తుండగా వేరొకరికి పట్టాలు మంజూరైన కేసులు.
  8. గిరిజనేతరుల భూములను సాగు చేస్తున్నా వర్తించని సాగు కౌలు హక్కులు.
  9. జిరాయితి భూమి సాగు చేస్తున్న రెవెన్యూ రికార్డులకు ఎక్కని గిరిజనులు.
  10. గిరిజనేతరులు తప్పుడు ఇంజక్షన్‌ డిక్రీలు తెచ్చి భూముల నుండి గిరిజనులను దౌర్జన్యంగా వెళ్లగొట్టేసే కేసులు.
  11. సర్వే స్టేట్మెంట్‌ వివాదాలు
    ఇలా చాలాభూవివాదాలు,నాన్‌-షె డ్యూల్డు గ్రామాలలో ఉన్నాయి. వీటిని పరిష్కరిం చుకోవాలంటే కోర్టు, రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై అవగాహన ఉండాలి. ఇవేవి ఆదివాసీలకు తెలియ నందున గిరిజనేతరుల ఆధిపత్యం కొనసాగు తున్నది. భారత రాజ్యాంగంలో 5వషెడ్యూల్డు (1) పేరా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ స్థానిక ఆదివాసీలచే భర్తీ చేయాలనిజి.ఓ.నెం.275 ను 1986లో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవరిస్తూ 2000లో జనవరి 10న జి.ఓ.నెం.03 ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగా లన్నీ స్థానికఆదివాసీలకే రిజర్వు చేయబడుతు న్నాయి. కానీ నాన్‌-షెడ్యూల్డు ఏరియా ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో అన్యాయం జరుగు తోంది. విద్య,ఉద్యోగ అవకాశాలు లేక ఆదివా సీలు నిరాశ్ర యులవుతున్నారు.కాగాఈ జీవో 3 గిరిజనేత రుల కారణంగా 2020ఏప్రిల్‌ 20నుంచి సుప్రీం కోర్టులో స్టే విధించ బడిరది.
    అధికరణలు330,332,334 ప్రకారం పార్లమెంటు నుండి క్రింది స్థాయి వార్డు సభ్యుల వరకు షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసీలకే చెందు తాయి. కానీ, నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని వీరు పరుల పాలనలో మగ్గుతున్నారు. వీరు ప్రత్యేకమైన సంస్కృతి,ఆచార,సంప్రదాయాలు, జీవన విధానం కలిగినను స్థానికేతరుల పాలనలో దోపిడికి గురౌ తున్నారు. కేవలం అటవీ ఫలసాయం, పరస్పర వస్తు మార్పిడితో సహజీవనం సాగించే ఆదివా సీలు నేటికి నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోఉండడం, సవరించిన చట్టాల వల్ల అటవీ అధికారుల దౌర్జ న్యాలు పెరుగుతున్నాయి. అటవితల్లి గుండెల్లో జీవించే ఆదివాసులకు బతుకు భారం అవుతుంది. వారు షెడ్యూల్డు ఏరియా హక్కులకు నోచుకొనేది ఎప్పుడు?కనీసం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా సంఘాలు, మానవ హక్కుల, పౌరహక్కుల సంఘా లు, ప్రధాన ప్రతిపక్ష, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు దీనినిగూర్చి మాట్లాడే పరిస్థితి లేదు. షెడ్యూల్డు హోదాకోసం నాన్‌-షెడ్యూల్డు ఏరియా గ్రామాల ఆదివాసీలు సంఘటితమై మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధంకాకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకమే!-
    వ్యాసకర్త : ఆదివాసీ రచయితల వేదిక,సెల్‌ : 9491318409