అంతర్ధానమవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృ భాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్ల వాడు, తన భాషా సామర్ధ్యాన్ని తల్లి నుండి నేర్చుకుం టాడు. ఏతల్లీ కూడా అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా,తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయా లను గమనించడం ద్వారా,ఆమె మాటల ధ్వని, ఆమాటల కూర్పును గ్రహిం చడం ద్వారా ఆపిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని వంట బట్టించుకుంటాడు.పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రా యం ఉంది.అది మాతృభాషేతర భాషల విషయం లో వాస్తవం కావచ్చు.ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకర ణం,అనువాదంద్వారా నేర్చు కోవా ల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్స రాల వయసొచ్చే సమయా నికి మాతృభాష లోని దాదాపు అన్ని సంక్లిష్టతలను నేర్చుకోవడానికి అను గుణంగా మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రాత) అనేది వేరే అంశం. కొన్ని లక్షల సంవత్స రాల మానవ జాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమా చారాన్ని అందించే,జ్ఞాపకాలను నిల్వ చేసే సాధనం గా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడ టం.లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘ కాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధ వ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నాబాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జనసమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. అప్పట్లో రేడియో అనేది మా గ్రామంలో ఓకొత్త యంత్ర పరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కదిలిస్తుండేవాడ్ని.వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలు సుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశా ను.దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబి తాలో చివరన ఃఃఅన్ని ఇతర భాషలు అని ఉంది. అంటే 108భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నా యనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసు కోవాలనే ఉద్దేశంతోయూనివర్సిటీ లైబ్రరీలో 1961 జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాం కాలలో నేను దిమ్మతిరిగే విషయాలను గమనిం చాను.ఆజాబితాలో 1652 భాషల్ని తమ మాతృ భాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహ రించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10 సంవత్సరాల కాలం లో (అంటే 1961-1971మధ్య కాలంలో) భారత దేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది. భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజిం చలేం.దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీ య జనగణన రిజిస్ట్రార్‌ దగ్గర పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణాతుల సాహిత్యం లో నమోదుచేయబడిన మాతృభాషల పేర్లు (జనా భా లెక్కల సమయంలో ప్రజలు చెప్పినవి) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాల యాలలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకా లను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాం కాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది.తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారి న తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది,భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి వున్నట్లైతే, అది సహజమేనని భావిం చాలి.అందుకుగాను ప్రభుత్వం ఃఃపది వేల (భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్యఃః పరిమితిని విధిం చింది.ఈసంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించా లంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు.1970 ప్రాంతంలో 1544మాతృ భాషలు ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు.అవికొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్నిభాషలు అంత ర్ధానయ్యాయో తెలుసుకోవాలంటే1971 జనగణ నను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించ డానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లా డుతున్నట్లు 2011జనగణన నిర్ధారించింది. రెండు సంఖ్యలను పోల్చి చూడడం ద్వారా 1961 నుండి 2011వరకు…అంటే50 సంవత్సరాల్లో (1,652 -1,369¸283)283 భాషలు అంతరించి పొయ్యా యనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవ త్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు అంతర్ధానమైనఃః భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే, భారత దేశంలో భాషల అంత ర్ధానరేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణనమాతృభాషలనే మాటను ఉపయోగించి నప్పుడు,వాటిలో చిన్న లేదా అల్ప సంఖ్యాక భాష లు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా అంత తేలిగ్గా స్ఫురణకు వస్తుందనుకోలేం.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాలవారీగా చూస్తే, 1961 లో బంగ్లా మాట్లాడేవారు మొత్తంజనాభాలో 8.17 శాతం ఉండగా అర్ధశతాబ్దం తరువాత వారి సంఖ్య8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62 శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16 శాతం నుండి 6.70 కి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎని మిది భాషలు-బంగ్లా,మరాఠీ, తెలుగు,తమిళం, గుజరాతీ,ఉర్దూ,కన్నడం,ఒడియా మొత్తం జనాభా లో 2011జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగు తూనే ఉంది.1961లో36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారిసంఖ్య 2011నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం,గుజరాతీ భాషలను మినహాయిస్తే మిగి లిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్ధానం కొన సాగుతూనే ఉందని 2011జనగణన తెలియ జేస్తుంది.196లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారిసంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు. తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది.కన్నడం,మరాఠీ భాషలు సుమా రు రెండు వేల సంవత్సరాలుగా,మలయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది.దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారిసంఖ్య జనగణనలో 2,59, 878గా చూపబడిరది.ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడులక్షల గ్రామాల్లో, రెండు వేలనగరాలు, పట్ట ణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి.ఇంగ్లీష్‌ టీవీఛానళ్ల రేటింగ్‌ పాయిం ట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరుగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్ధారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్పసంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న ట్లుగా బహు భాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారత దేశానికి ఇది మంచిది కాదు.(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో).
` వ్యాసకర్త:ఒబైడ్‌ సిద్ధిఖీ చైర్‌ ప్రొఫెసర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌,బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, బెంగళూరు
-గణేష్‌ దేవీ