మన్యం కాఫీ తోటల కథ..

చల్లటి సాయంత్రానా..వేడి వేడి కాఫీని తాగుతూ..ఓ మంచి పుస్తకాన్ని చదువు తుంటే… ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓకప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ..పొగలు కక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రాలోను పండుతుం దండోయ్‌?.అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు… కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మరి ఈ కాఫీ కథేంటో కాస్త చూద్దామా…
ఓ మంచి కాఫీ… తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ… కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి. నర్సీపట్నం కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ ప్రస్థానం…మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్‌ డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడిరది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) ,ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు … ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది. తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న… నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయ కంగా ఉండేది. దీని ద్వారా కోట్లరూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మహిళా ఉపాధి…ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు…దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలిరోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం… దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.
లాభ, నష్టాల బేరీజు…ఈ ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ తోటలు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. గతంలో స్థానిక గిరిజనుల సహాయంతో బెంగ ళూరు వంటి పట్టణాల్లో ఈ గింజల విక్రయాలు జరిపేవారు. ప్రస్తుతం ఆన్‌?లైన్‌? లో వేలం వేస్తున్నారు. ఈ పంట వల్ల ప్రతి ఏటా 18 కోట్లు ఆదాయం వచ్చేది. ఏజెన్సీలో వీటి సేకరణపై మావోయిస్టుల ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం…వంటి కారణాలతో ఈ వ్యాపారానికి నష్టాలు తప్పటం లేదు. గత ఏడాది శుద్ధిచేసిన 234 టన్నుల గింజలు మాత్రమే విక్రయించగలిగారు . దీంతో 4.5 కోట్ల ఆదాయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సీజన్‌ ప్రారంభం కావడంతో కాఫీ శుద్ధి పనులకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. ఈ సంవత్సరం మన్యంలో కాఫీ పంట విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఆదా యం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నాలుగేళ్లుగా కొత్త వ్యాపారం. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నీలగిరి వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.మునుపు విశాఖ డివిజన్‌ లో దీనిని చేపట్టేవారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఆ డివిజన్‌ మూసి వేసి నర్సీపట్నంలో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని కసింకోట మండలం , కన్నూరు పాలెం…వంటి ప్రాంతా ల్లో ఏపీఎఫ్‌?డీసీకి చెందిన నీలగిరి తోటలను టెండర్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. వీటి ద్వారా సుమారు 10కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ కు తోడు టన్ను ధర 8వేల నుంచి 4వేల దిగిపోవడంతో అమ్మకాలు ముందుకు సాగడం లేదు.
అరకు కాఫీ’కి వందేళ్లు..
భారతదేశంలో అరకు కాఫీ టాప్‌ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసు కుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది.
చెట్ల మధ్య తోటల పెంపకం…
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌) మాజీ ఎండీ రవి ప్రకాష్‌ గతంలో వివరించారు.‘‘1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతా ల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువ గా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10వేల ఎక రాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగిం చింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిర పడిరది’’ అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిం చారు.వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు,అనంతగిరి,జీకే వీధి, చింతపల్లి, పెదబయలు,ఆర్వీనగర్‌, మిను మలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా… ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరిం చాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే…
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యం లోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యా లయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. ‘‘సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ…పొడవాటి మిరియాలు,సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్యలో సాగవు తాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది’’ అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండిరచే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.బ్రెజిల్‌ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో…12 రాష్ట్రా లు కాఫీని పండిస్తుండగా…అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమి ళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరి చారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్ట మొదటి ‘అరకు కాఫీ’ షాప్‌ ఇది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌ నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్‌ లో ఏర్పాటు చేసింది. ఆతర్వాత అరకు కాఫీ రుచులు జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్‌ లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌-2018 పోటీలో (ూతీఱఞ జుజూఱషబతీవం) అరకు కాఫీ గోల్డ్‌ మోడల్‌ గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాం డులకి పేరుపొందిన బ్రెజిల్‌, సుమత్రా, కొలం బోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.-(కిల్లో సురేంద్ర)

విఫత్తులు..మానవాళికి పెనుశాపాలు

అంతా నేతల చేతుల్లోనే : భూతాపాన్ని తగ్గించ డానికి ఏమాత్రం గడువు లేదు. వెంటనే స్పందిం చాల్సిందే.కానీ,ఇప్పుడిది ప్రభుత్వాధినేతలు, రాజ కీయ నేతల చేతుల్లో ఉంది. భూమిని రక్షించుకోవ డానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలను పట్టాలెక్కిం చడానికి ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు కానీ స్పందించకపోతే ఆ తరువాత వారు వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ఇంతకుముందు పారిస్‌ ఒప్పందం చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నంత మాత్రానసరిపోదు’ అని ప్రొఫెసర్‌ జిమ్‌ స్కీ అన్నారు. ప్రపంచదేశాల నేతలు ఈ నివేదికను చదివి వారి లక్ష్యాలను పెంచుకోవడానికి నిర్ణయించడంతో పాటు వెంటనే కార్యరంగంలోకి దిగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడం అసాధ్యమేమీ కాదని జిమ్‌ అభిప్రాయపడ్డారు. పర్యావరణవేత్తలు, భూతాప నివారణకు పనిచేస్తున్నవారు ఈ అంశంపై మాట్లాడుతూ,ముప్పు ముంచుకొస్తుండడంతో దీనిపై చర్చించడానికి కూడా సమయం లేదని, మార్పులకు సత్వరం శ్రీకారం చుట్టాల్సిందేనని చెప్పారు.

పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి ప్రళయాలు, విపత్తులు సర్వసాధారణంగా మారాయి. మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీల వంటి దుస్థితికి మానవ తప్పిదాలే ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. ప్రభుత్వాల చొరవకు తోడు.. పౌర బాధ్యతతోనే ప్రకృతి వనరుల పరిరక్షణ, మానవ ప్రేరిత విపత్తులను నివారణ సాధ్యమవుతుంది. జిఎన్‌వి సతీష్‌
భారీవర్షాలు,వరదల ధాటికి పాకిస్తాన్‌, బెంగళూరు,కేరళ,ఉత్తరాఖండ్‌ అతలాకుతలమవు తున్నాయి.వేలసంఖ్యలో మరణాలు నమోదయ్యా యి. వేల మంది నిరాశ్రయులయ్యారు.వరద బీభ త్సం-దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్ను లను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. పశ్చిమ, తూర్పు కనుమల్లో విచ్చలవిడిగా సాగుతున్న వనాల విధ్వంసం,సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరి రక్షణలో అంతులేని నిర్లక్ష్యం,వాతావరణ మార్పుల చేదు ఫలితాలు ఎక్కడికక్కడ విపత్తులతాకిడిని పెంచుతున్నాయి.ముందు జాగ్రత్తల ద్వారా నష్టా లను తగ్గించే కార్యాచరణ లోపిస్తుండటమే విచా రకరం!
బుట్టదాఖలవుతున్న నివేదికలు : భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగిన భారతదేశంలో ఏటారుతుపవనాలు ప్రవేశించాక వరదలు, తుపా నులు సంభవించడం సర్వసాధారణం.కొన్నేళ్లుగా లెక్కకుమిక్కిలిగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు- జనజీవనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే తుపానుల్ని ముందే పసిగట్టి హెచ్చ రించే సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆసరాతో సమర్థ చర్యలు చేపడితే నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. కేంద్ర జల సంఘం, విజ్ఞానశాస్త్ర-పర్యావ రణ కేంద్రం(సీఎస్‌ఈ) సమాచారం మేరకు గడిచిన అరవై ఏళ్లలో వరదల మూలంగా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు. దాదాపు 62 కోట్ల ఎకరాల్లో పంటలు, ఎనిమిది కోట్లకు పైగా గృహాలు నాశనమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ నివేదికల ప్రకారం దేశంలో అధిక శాతం నదులు 2019లో భారీ వరద ఉధృతిని చవిచూశాయి. వందేళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముంచెత్తిన వరదల ధాటికి 2018లో కేరళ బాగా దెబ్బతింది. ఉత్తరాఖండ్‌,గుజరాత్‌,రాజస్థాన్‌,బిహార్‌,పశ్చిమ్‌ బంగ,ఈశాన్య రాష్ట్రాలూ గడచిన కొన్నేళ్లలో భీకర వరదల తాకిడికి గురయ్యాయి. శ్రీనగర్‌,చెన్నై, హైద రాబాద్‌,ముంబై నగరాలూ అలాగే శోకసంద్రాల య్యాయి. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌హుద్‌,తిత్లీ వంటి తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల మంది వరదల బారిన పడుతున్నారు. దేశంలో జూన్‌-అక్టోబర్‌ మధ్య కాలంలో భారీ వర్షాలతో నదుల్లోకి అధికనీటి ప్రవాహంచేరుతోంది.ఆ సమ యంలో పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే ప్రదే శాలు,నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విచక్షణారహితంగా సాగు తున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి.అనేక నగరాల్లో దశా బ్దాల నాటి మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఇప్ప టికీ మెరుగుపడలేదు.దాంతో వరద నీరు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.గుజరాత్‌,మహా రాష్ట్ర,గోవా,కర్ణాటక, కేరళ,తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు1.60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అక్కడి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణ కోసం 2010లోకేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యా వరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలో అధ్యయన సం ఘాన్ని నియమించింది. పశ్చిమ కనుమలను పర్యా వరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిం చాలని ఆ సంఘం సూచించింది. నిర్దేశిత ప్రాంతా ల్లో నూతన ఆర్థిక మండళ్లు, హిల్‌స్టేషన్ల ఏర్పాటు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సిఫార్సు చేసింది. కనుమల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూములను బదిలీ చేయ కూడదని పేర్కొంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని అమలు చేయకుండా 2012లో శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కేంద్రం మరోసంఘాన్ని కొలు వు తీర్చింది.గాడ్గిల్‌ కమిటీ బాటలోనే-కనుమ లలో గనులతవ్వకం,క్వారీ కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. కనుమలలో37శాతం భూభాగాన్ని సున్నిత పర్యా వరణ ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. వీటినిఅమలు చేసి ఉంటే- వరదల తీవ్రత తగ్గి ఉండేది. ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల దుస్థితీ ఇలాగే ఉంది. ఒడిశా, ఆంధ్రపరిధుల్లోని కనుమలలో లేటరైట్‌, బాక్సైట్‌ వంటి ఖనిజాల తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నదుల గమనంలో మార్పులతో భవిష్యత్తులో వరద ప్రమాదాలు అనూహ్య స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. వాస్తవ పరిస్థితులను మదింపు వేయ డానికి అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కరం.
పటిష్ఠ కార్యాచరణ అవసరం : ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలతో సమన్వయం కొరవడుతోంది. విపత్తు లకు కారణమయ్యే వాతావరణ మార్పుల ప్రభా వాలను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠ ప్రణాళికలు అవసరం. వాటికి అనుగుణంగా ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు ఇతోధి కంగా నిధులు కేటాయించాలి. ఖనిజ తవ్వకాలు, ఆనకట్టలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులపై లోతైన చర్చ తరవాతే ముందడుగు వేయాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థలను నెలకొల్పాలి. విపత్తుల నిర్వహణ,యాజమాన్య సంస్థలను వేగంగా పటిష్ఠీకరించాలి.చాలా రాష్ట్రాల్లో వరదలు, తుపా నుల బాధితులకు దీర్ఘకాలంలో మేలు చేకూర్చేలా ప్రభుత్వాల కార్యాచరణ ఉండటం లేదు. ఈ వైఖరి లో మార్పు రావాలి. వరదలు, తుపానుల్ని ఎదుర్కొ నేలా ప్రకృతివిపత్తుల సంఘాల్లో స్థానికుల భాగస్వా మ్యాన్ని పెంచి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి. ప్రకృతి వనరుల వినియోగం, యాజమాన్యాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిం చాలి. స్థానికుల సాయంతో వాటి అమలుకు ప్రభు త్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే విపత్తు ల దాడిలో కకావికలమవుతున్న జనావళికి భవిష్య త్తుపై భరోసా కలుగుతుంది.విచ్చలవిడిగా ఆన కట్టలు..భారతదేశంలో ప్రధాన పర్వతశ్రేణులైన హిమాలయాలు,పశ్చిమ-తూర్పు కనుమల్లో పర్యావ రణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఫలితం గా వరదల తీవ్రత ఏటా అధికమవుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ-సామాజిక నష్ట ప్రభావాల అంచనా, నష్ట భర్తీలపై సమగ్ర చర్యలు పూజ్యమవుతున్నాయి. భవిష్యత్తు ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాల రూప కల్పనా కొరవడుతోంది. వాతావరణ మార్పులతో హిమగిరులు వేగంగా కరిగిపోతుండటంతో అక్కడి సరస్సులు,నదులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడు తోంది.దానికి మానవ తప్పిదాలుతోడై ఆ పర్వత రాష్ట్రాల్లో విపత్తుల తాకిడి పోనుపోను ఇంతలం తలవుతోంది. ముందుచూపు లేకుండా, ప్రత్యామ్నా య మార్గాలజోలికి పోకుండా సాగు,విద్యుత్‌ అవస రాల పేరుతో నదీప్రవాహాలకు అడ్డంగా నిర్మి స్తున్న భారీ ఆనకట్టల మూలంగానూ సమస్య తీవ్రత అధికమవుతోంది.
భూతాపం :
పెరుగుతున్న భూతాపం మానవజాతిని కబళించే రోజు ఎంతో దూరంలేదంటూ శాస్త్రవేత్తలు అత్యం త తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వ రాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టా లని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.’1.5డిగ్రీల సెల్సి యస్‌కు మించి పెరగకుండా నియంత్రించడం లక్ష్య మైనప్పటికీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాన్ని మించి పోయే దశలో ఉన్నాయి. అదే జరిగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవ కాశముంది’’అంటూ నివారణోపాయాలనూ సూచి స్తున్నారు.
మూడేళ్ల అధ్యయనం : అనంతరం దక్షిణ కొరి యాలో వారంపాటు శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య సమగ్రచర్చ తరువాత ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యా నెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌’ (ఐపీసీసీ) భూఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కీలక నివేదిక విడు దల చేశారు.శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చల సారాంశాన్ని ఆ నివేదికలో పొందు పరిచారు.ఇందులో కొన్ని విషయాల్లో రాజీపడినట్లు గా కనిపిస్తున్నప్పటికీ పలు అంశాలపై విస్పష్టమైన సూచనలు చేశారు. ‘ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలుం టాయి.వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్ఫలి తాలను ఇది తగ్గిస్తుంద’ని ఐపీసీసీ ఉపాధ్యక్షుడు జిమ్‌ స్కీ అభిప్రాయపడుతున్నారు.‘భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలనుకుంటే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలి. ఇంధన వ్యవస్థలో తేవాల్సిన మార్పులు.. భూవినియోగం తీరుతెన్నుల్లో మార్పులు..రవాణా రంగంలో తీసుకు రావాల్సిన మార్పులు అన్నీ ఆలోచించాలి’ అని అభిప్రాయపడ్డారు.
టార్గెట్‌ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ : ‘తక్షణం చర్యలు తీసుకోండి’ అని పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని శాస్త్రవేత్తలు అనుకునే ఉంటారు.వారువాస్త వా లను,గణాంకాలను చూపుతూ ఆ మాట చెప్పాల్సి ఉందని చర్చల్లో పరిశీలకురాలిగా పాల్గొన్న గ్రీన్‌ పీస్‌ సంస్థ ప్రతినిధి కైసా కొసోనెన్‌ అన్నారు.ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతామన్న ఇంతకు ముందు ఉండేది.కానీ,1.5 డిగ్రీలసెంటీగ్రేడ్‌ను మించి ఉష్ణోగ్రతలుపెరిగితే భూమిపై జీవనయోగ్య త విషయంలో పాచికలాడినట్లేనని ఈకొత్త అధ్య యనం హెచ్చరిస్తోంది.
ఈపరిమితి సాధ్యమే : అయితే, ఇది అత్యవసరంగా జరగాల్సి ఉంది.ప్రభుత్వాలు,వ్యక్తులు..ఇలా ప్రతి స్థాయిలోభారీ ఎత్తున మార్పులు రావాల్సి ఉంది. అంతేకాదు,రెండు దశాబ్దాల పాటు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో2.5శాతం ఇలాంటి చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. అప్పుడుకూడా వాతావరణంలోని కర్బనాన్ని సంగ్ర హించడం కోసం చెట్లు ఉండాలి, సంగ్రహణ యం త్రాలను ఉపయోగించాలి. అలా సంగ్రహించిన కర్బనాన్ని భూగర్భంలో పాతరేయాలి. ఈ ప్రక్రియ నిత్యం కొనసాగుతుండాలి.
మనమేం చేయాలి? : ప్రధానంగా ఇంధన, భూవిని యోగం,నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగలమని ఈ నివేదిక వెల్లడిరచింది. అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరు కోవడం కష్టం. ఇందుకు గాను వ్యక్తిగతంగా తీసుకు రావాల్సిన మార్పులనూ ఈ నివేదిక సూచించింది.
ా మాంసం,పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.
ా తక్కువ దూరాలకైతే నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి.
ా విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.
ా వ్యాపార పరమైన సమావేశాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి అందరూ ఒక చోటికి వచ్చే కంటే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ా దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.
ా కొనుగోలు చేసే ప్రతి వస్తువూ కర్బన రహి తమో..లేదంటే తక్కువ కర్బనాలను విడు దలచేసేదో అయ్యుండేలా చూసుకోవాలి.
ా జీవనశైలిలో ఇలాంటి మార్పులను తీసుకు రావడంవల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగు తుందని ఐపీసీసీకి చెందిన మరో ఉపాధ్యక్షురాలు డెబ్రా రాబర్ట్స్‌ చెప్పారు.
ా ఉష్ణోగ్రతలు1.5డిగ్రీలసెంటీగ్రేడ్‌కు తగ్గించ డానికి 5మార్గాలు
ా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 2010 నాటి స్థాయితో పోల్చితే 45 శాతం తగ్గాలి.
ా 2050 నాటికి ప్రపంచ విద్యుత్‌ అవసరాలలో 85 శాతం పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చాలి.
ా బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.
ా ప్రపంచవ్యాప్తంగా 70మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంధన పంటలు(జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు) ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా అంత విస్తీర్ణంలో జీవఇంధనాల తయారీకి ఉప యోగపడే మొక్కలను సాగు చేయాలన్నమాట.
ా 2050 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి.

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..!

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్‌ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించారు.

Read more

వ‌ల‌స ప‌క్షులు…మ‌న అతిథులు

ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల్లో దైవ స్వరూపంగా భావించే పక్షలు మానవుని స్వార్థానికి బలైపోతున్నాయి. పక్షులు సహజ సిద్ధంగా ఏర్పడే ఆహారం.. ఆవాసం.. సంతానోత్పత్తి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సురక్షిత ప్రాంతంలో కొంత కాలం పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వలస పక్షులను పరిరక్షించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నది. ఏలూరు జిల్లా కొల్లేరు ఒకప్పుడు వలస పక్షుల నిలయం.. ఇప్పుడు కొల్లేరులో పక్షులు లేవు.. వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధిక గాడతతో కూడిన క్రిమి సంహార మందుల వాడకం వల్ల పక్షుల సంతతి అంతరించి పోతున్నది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…
వలస పక్షల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం మేనెల రెండవ శనివారం, అక్టోబర్‌ నెల రెండవ శనివారాలను ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. 2010 నుంచి వలస పక్షుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తు న్నారు. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పక్షులను సంరక్షించుకుందాం’ అనేది 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ముఖ్య నినాదం..
పక్షులు ఎందుకు వలస వెళతాయంటాయి?
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు తమ సంతానోత్పత్తి కోసం,శీతాకాలంలో తమ ప్రాణ రక్షణ కోసం వలసలకు సిద్ధపడుతుంటాయి. వేలాది కిలో మీటర్లు ఆకాశ మార్గంలో ప్రయాణించి తమ సంతానోత్పత్తికి అనువైన సురక్షిత ప్రాంతాలను అన్వేషించి అక్కడ కొన్ని నెలలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ధృవ ప్రాంతాల నుంచి శీతాకాలంలో పక్షులు తీవ్ర చలిగాలుల నుంచి రక్షణ కోసం అనువైన ప్రాంతాలకు వలసలు కడతాయి. పక్షులు ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రాంతానికి వలసలు కడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వలస పక్షులు ప్రత్యేక దారుల గుండా సూర్యగమనం, చంద్రగమనం ఆధారంగా తమ వలస ప్రాంతాలకు దారుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర ధృవం నుంచి ధక్షిణ ధృవానికి సైబీరియన్‌ ప్రాంతం నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి .పక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి అంటార్కిటికా ప్రాంతానికి వలసలు సాగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు తొమ్మిది ప్రాముఖ్యత గల వలస పక్షులదారులను గుర్తించారు. ఉత్తర దిక్కు నుంచి చలికాలంలో దక్షిణ దిక్కున గల ఉష్ణ మండల ప్రాంతానికి వచ్చి గుడ్లు పొదిగి పిల్లలతో తిరిగి తమ ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి. హిమాలయాలు,ఆండిస్‌ పర్వత ప్రాం తాల్లో కూడా వలస పక్షలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వలస పక్షుల కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌ వలస పక్షులకు నిలయం. పర్యా వరణహితంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో వలస పక్షుల కేంద్రాలు కోకోల్లలుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురంలో ఫెలికాన్‌,గుడాబాతు పక్షులు రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. కృష్ణాగోదావరి జిల్లాల మధ్య ఉండే కొల్లేటి ప్రాంతంలో ఫెలికాన్‌,నైటికేల్‌,టిల్ట్‌ పక్షులు ఆస్ట్రేలియా,ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చి కొన్ని నెలల పాటు సేదతీరుతుం టాయి.పులికాట్‌ తీరంలో ఫ్లెమింగో పక్షుల కేం ద్రం ఎంతోఆహ్లాదకరంగా ఉంటుంది.నెల్లూరు జిల్లాలోని నేలపాడులో ఫ్లెమింగో,హేలాన్‌ పక్షు లు వలస వచ్చి సేదతీరుతుంటాయి
కొల్లేరు వలస పక్షుల స్వర్గ ధామం
కొల్లేరు ప్రాంతం వలస పక్షులకు స్వర్గ ధామం గా నిలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్ప డిన కొల్లేరు 72కిలోమీటర్ల వైశాల్యంతో సహజ సరస్సుగా ఏర్పాడటంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కొల్లేటి తీరానికి అక్టోబర్‌ నెలలో వచ్చి ఐదు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చి నెలలో పిల్లలను తీసుకుని తమ సొంత ప్రాంతానికి పోతుంటాయి. ఆసియా,ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి వచ్చే ఫెలికాన్‌,గుడాబాతు, నత్తకొట్టు,చింతఉప్పు,చిట్టిబెల్ల గువ్వాపక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఫెలికాన్‌తో పాటు టిల్ట్‌,వైట్‌ టైల్‌,భార్గని,రిటెల్‌ గ్రీబ్‌,ఫ్లోవర్‌ మొద లైన పక్షులు హిందూ మహాసముద్రం,బంగాళా ఖాతం మీదుగా ప్రయాణించి కొల్లేరు చేరు కుం టాయి. 2021పక్షుల లెక్కల ప్రకారం కొల్లేటి తీరంలో5నుంచి8ల క్షల వరకు 120రకాల పక్షుల ఆవాస ప్రాంతంగాఉందని లెక్కల్లో తేలింది.
ప్రమాదం అంచున పక్షులు
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఒక మిలియన్‌ పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. మానవుడు ప్రతీ సంవత్సరం 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి ఉపయోగించుకుని భూమిపై, నీటి వనరుల్లో వదిలేస్తున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మంచినీటి వనరులను సముద్రాల్లో విపరీతంగా కలవడం వల్ల పక్షు లకు సహజసిద్ధ ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ను స్వీక రిస్తున్నాయి. ఆస్ట్రేలియా,అమెరికా తీరాల్లో వలస పక్షులు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని వంద లాదిగా మృత్యువాతకు గురవుతున్నాయి. పక్షి పరిశోధకులు మృత్యువాత పడిన పక్షులను కోసి చూస్తే వాటి పొట్ట నిండ ప్లాస్టిక్‌ వ్యర్థాలేఉండ టం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వ్యవ సాయ క్షేత్రాల్లో అధిక గాడతతో కూడిన క్రిమి సంహారక మందులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు శీతాకాల ప్రాంతంలో విషపు ఎరలు పెట్టి వందలాది పక్షులను అంతం చేసున్నారు.
ఫ్లెమింగో పక్షులు మనుగడ ప్రశ్నార్ధకం
జీవ వైవిధ్యానికి ముఖ్యంగా మానవ మనుగ డలో ముఖ్యపాత్ర వహిస్తున్న అనేక లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్ర ప్రమాదాన్ని కలుగచేస్తున్నాయి. విద్యుత్‌లైన్లకూ ట్రాన్స్‌ఫా ర్మర్లకు, ఎత్తయిన విద్యుత్‌ స్తంభాలకు తగిలి విద్యుత్‌ఘాతంతో పక్షులు ప్రానాలు కోల్పో తున్నాయి. ఇదేగాక బొగ్గు,నీరు,జీవఇంధనం, సముద్రం,సౌరశక్తి, పవనశక్తి ఉపయోగించి నిర్మించే విద్యుత్‌ కేంద్రాల వలన పక్షులు తమ నివాసాలను, సంతానోత్పత్తి, ఆహార స్థలములను కోల్పోవడం గాని పాడయి పోవటముగాని జరుగుతున్నది. తరగని వనరులు ఉపయోగిం చుట వలన కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కాకుండా కొంత మేలయినప్పటికీ విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణానికి,విద్యుత్‌ సరఫరాకు సరిjైు్నన ప్రణాళిక, డిజైను రూపకల్పన,నష్టాలను అంచనా వేయటం లేదు. దీనివలన జీవ వైవి ధ్యానికి ముప్పు వాటిల్లటమే కాకుండా లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్రప్రమాదం కలుగుతోంది.ఫ్లెమింగోలు,స్టార్కు జాతి కొంగలు పెలికాను పక్షులు, గ్రద్ధ జాతి పక్షులు, ఇతర అనేక జాతుల పక్షులు వాటి సుదూర ప్రయా ణంలో విద్యుత్‌ తీగల గ్రిడ్‌లకు తగిలి విద్యుద్ఘా తముతో చనిపోతున్నాయి. 2011 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 70మిలియన్ల కిలోమీటర్ల పవర్‌ లైన్లు ఉన్నట్టుగా అంచనా వేయబడినది.వలస పక్షులకు ఇప్పటికే వాటి నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాలు సంతా నోత్పత్తి ప్రదేశములు నశించి పోవటం,పాడై పోవటం,గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ముప్పు వాటిల్ల డమే కాకుండా అదనంగా విద్యుత్‌ ఘాతము వలన వాటికి కలిగే ముప్పు తీవ్రతరమౌతున్నది. ఇదిపెద్ద పక్షి జాతులు నశించి పోయేందుకు కారణం. ప్రకృతి సిద్ధంగా వాటి సంతానోత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, పెద్ద పక్షులు చనిపో వుట వలన వాటి గుడ్లు పాడై పోవటం,గూటి లోని పిల్లలు చనిపోవటం జరుగుతూ కొన్ని జాతులకు ముప్పు ఏర్పడుతోంది. తూర్పు ఐరోపాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ‘జాన్‌ ఒసల్లివాన్‌’ రాయల్‌ సొసైటీ పక్షుల పరిరక్షణ సంస్థ మాజీ సభ్యులు తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 12శాతం ‘బ్లూ క్రేన్స్‌’ (ఆ దేశ జాతీయ పక్షి) విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నట్లుగా తెలిపారు. ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ అధిక మొత్తం లో ఎలక్ట్రిక్‌ పవర్‌ లైనులు వేస్తుండటం వలన ఈ సమస్య తలెత్తబోతుందని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈసమస్య ఇప్పటికే ఉన్నది. గుజరాత్‌లో ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫ్లెమింగో పక్షులు విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నాయి. ఈవిద్యుత్‌ తీగలను ఫ్లెమింగో పక్షుల నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాల గుండాను, పక్క నుంచి నిర్మించుట వలన వాటి తలల విద్యుత్‌ తీగలకు గుద్దుకొని చనిపోతు న్నాయి. ఈఫ్లెమింగో పక్షులు వందలు,వేల సంఖ్యలో ఉండి రాత్రి సమయాలలో కూడా ప్రయాణిస్తుండడం వలన కరెంటు తీగలకు చనిపోతున్నాయి. ఊర కుక్కలు వీటి ప్రదే శాలలో చేరి వీటిని చిందరవందర చేయుట వలన ఆ గాభరాలో విద్యుత్‌ తీగలకు గుద్దుకొని మరణిస్తున్నాయి. మన దేశంలో రాబందుల సంఖ్య తీవ్ర ప్రమాద స్థాయికి తగ్గిపోవుటకు కారణాలలో విద్యుత్‌ తీగలే ప్రధానం. అమెరికా, యూరప్‌లలో ఎండిపోయిన ప్రదే శాలలో విద్యుత్‌ ఘాతముచే మంటలతో కాలి పడిపోయిన పక్షుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ప్రిన్సన్‌’ అనే అధ్యయనవేత్త తెలిపారు. విండ్‌ పవర్‌వల్ల కూడా పక్షులు చని పోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అధ్యయనం జరిగినట్లుగా భారత దేశంలో అధ్యయనం జరగకపోవడం విచారకరం. పక్షులకు జరిగే తీవ్ర నష్టాన్ని తగ్గించడానికి వాటి సంతానో త్పత్తి, ఆహార ప్రదేశాలకు,నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్‌ లైనులు నిర్మించాలి. ఇన్సులేటెడ్‌ వైర్లను ఉపయోగించాలి. బల్గేరి యాలో 2009-2013 మధ్యలో గుర్తింపబడిన ‘ఈస్ట్రన్‌ ఇంపీరియల్‌ ఈగల్స్‌’ 67శాతం వరకు విద్యుత్‌ ఘాతం వలన మరణించాయి. అదే విధంగా సూడాన్‌లో కూడా ‘ఈజిప్షియన్‌ వల్చర్సు’ కూడా విద్యుత్‌ తీగల వల్ల చనిపోతు న్నాయి. దాంతో సూడానీస్‌ ఎలక్టిక్ర్‌ కంపెనీ, బల్గేరియా పక్షుల సంరక్షణ సంఘం ఇన్సులేటెడ్‌ తీగలను అమర్చి పక్షులను తీవ్ర ప్రమాదం నుంచి రక్షించడం గొప్ప విషయం. కావున జీవ వైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న పక్షులను రక్షించుటకు, వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ లైనుల రూపకల్పన, నిర్మాణం జరగాలి.
వలస పక్షుల దినోత్సవం ప్రత్యేకత
యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్స వాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అల వాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవు తున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారా నికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు వ్యర్థ పదా ర్ధాలు, కాలుష్యం వంటి కారణంగా నష్టం జరుగుతుంది. రోజురోజుకు పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్‌, ఇతర వస్తువు లను ఇష్టానుసారం వేయకుండా వలస పక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా పర్యాట కులపై ఉందంటూ సూచించింది యూనె స్కో. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. పలు వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్లాస్టిక్‌, పారి శ్రామిక వ్యర్థాలు పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. –(కోకా మృత్యుంజయరావు/ ముప్పళ్ళ అప్పారావు)

నైజరు తేనె

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజుథింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన సుప్రిసిద్ద సాహితీవేత్త ‘బలివాడ కాంతరావు ’ కథా రచన ‘ నైజరు తేనె ’ కథా చదవండి..! – సంపాదకులు
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వాటిలో ఒక గిరిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977.కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది. అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు.
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వారి కథల్లో కొన్ని గిరిజన జీవితాలకు అద్దం పట్టే కథలు ఉన్నాయి.వాటిలో ఒక రిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977వ సంవత్సరం.
కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం.రచయిత తాను అనుభూతి చెందిన సంఘటనల సమాహారమే ఈకథ. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది.అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు. భాష రీత్యా నాటి పలుచని గ్రాంథిక వాతావర ణం కనిపించిన, కథ ఆద్యంతంఉత్తమ పురుషలో కొనసాగడంతో పఠన సౌలభ్యం నిండుగా ఉందనిపి స్తోంది.అలాగే కథ పేరు కూడా ఆడబిడ్డలకు చెందిన ముఖ్యమైన అటవీఉత్పత్తిని ఎంపిక చేయడం, అందునా రచయితకు,అడవి బిడ్డల సంస్కృతిపట్ల ఆందోళనను కథ నామౌచిత్యంతో అన్వ యించి చెప్పడం మొదలైన లక్షణాలన్నీ రచయిత ప్రతిభ కు అద్దం పడతాయి.ఇక కథ విషయానికి వస్తే ఒకసంపన్న కుటుంబానికి చెంది న యువకుడు (రచయిత) తన తాతల నుండి తమ కుటుం బంలో జరిగిన సంఘట నలు గుర్తు చేసుకుం టూ తన ప్రయాణంలో పొందిన ఆనందపు పరవశంతో కథ ప్రారంభ మవుతుంది. నవం బరు నెల ఆఖరి వారంలో…. అంటే చక్కని సోయగాలతో ప్రకృతి అలరారే శీతాకాలపు వేళ,ఈ కథా నాయకుడు అడవి అందాలను ఆస్వాదిస్తూ చేసిన కారు ప్రయాణమే ఈ కథ ల్లోని ఇతివృత్తం.అందుకు ముందు పది సంవ త్సరాల క్రితం తాను మొదటిసారిగా ఈ అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా పొద్దుగూకే వేళ రోడ్డు పక్క తన కారు చెడిపోవడం, అటుగా వెళుతున్న గిరిజన యువతి తనను చూడటం పడుచు యవ్వనంలోని అడవి బిడ్డ ‘‘పర్బతి’’ అందానికి కథకుడు తనకు తెలియ కుండానే ఆకర్షితుడు కావడం,అంతలోనే ఆ యువతి చేరువలోని తన గిరిజన గూడెం వెళ్ళే దారిలో కలిసిపోవడం జరుగుతుంది. కొద్ది సేపట్లో దేవుడు నుంచి 10మంది దాకా గిరిజ నులు కారు ఆగిన చోటికి రావడం అతనికి వారు మాట్లాడే భాష అర్ధం కాకపోయినా సైగల ద్వారా రాత్రి ఇక్కడ క్షేమం కాదని తమ గుడేనికి రమ్మని పిలిచినట్టు గ్రహిస్తాడు. వారితో కలిసిగూడెం బయలు దేరుతారు, ముందే అనుకున్న ప్రకారం డోలు సన్నాయి నాదస్వరం వాయిద్యాలతో తనకు ఎదురు వచ్చి బంతి పూల దండ వేసి అతనికి స్వాగతం పలికి నృత్యాలతో గూడెం తీసుకువెళతారు, వారి ఆచారం ప్రకారం ఆడామగా కలిసి గదబ నృత్యం చేస్తూ తమ గూడెం వచ్చిన అతిథికి మర్యాదలు చేస్తారు. గూడెం మధ్య మర్రిమాను వద్ద జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కథకుడు ఆరాత్రి గూడెం పెద్ద ఇంటి ముందు ఆతిథ్యం తీసుకుని ఆరాత్రి ఆనందం నిండిన సంతృప్తితో నిద్రపోతాడు. రాత్రి ఆగిరి జన గూడెం ‘‘చిక్కర పార’’లో ఆరుబయట వెన్నెల్లో అతడు పొందిన సంతృప్తి,ఆనందం, తన జీవి తంలో మరి ఎక్కడ దొరకలేదు. సంతృప్తికర రాత్రి నిద్ర అయ్యాక తెల్లవారి పొద్దున పనులు పూర్తి చేసుకోవడానికి ఆగూడెం నీటి ఆధారం చెరువుకు వెళ్లడంతో…. ముందు రోజు సందెకాడ రోడ్డుపక్క తనకు ఎదురైన యువతి నీళ్ల కుండతో కనిపిస్తుంది.అతడిలోని ఆర్తి చూపులు ఆమెకు అందాయి, మూగభాషలో నే గూడానికి ఓమూలనున్న తన ఇంటివైపు రమ్మని సైగల స్వాగతం పలకడంతో అందు కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నా అతని మనసు ఊయల లూగు తుంది,భూమికి పసుపు చీర పరిచినట్టు ఉన్న పసుపు పూల నైజర్‌ నూనె గింజల పంట చేనుకు గుండా నడుస్తున్న అతగాడి చిలిపి మనసు దారిలోనే ఒకసారి దాహం నటిస్తోంది!! తన భుజం మీది నీటి కుండ సాక్షిగా ఆమె అతడి దాహం తీరుస్తుంది. అందమైన అడవి దారి గుండా అంతే అందమైన అడవి యువతి నివాసపు పాకకు చేరిన వారి ప్రయాణం ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన అనురాగపు అనుబంధాన్ని పంచి రచయితకు జన్మకు సరిపడా అనుభూతి అందుతుంది.ఆ పడతి సీసాతో ఇచ్చిన ‘‘నైజరు తేనె ‘‘రుచి కూడ అంతే మధురాతి మధురంగా అతడి మనసుకు అల్లుకుపోయింది. అలా ఆనాటి మధుర స్మృతులు మూటగట్టుకుని పదేళ్ల తర్వాత అరమరికలు లేని అడది బిడ్డలతో కొన్నాళ్లు కలిసి ఉండి మనశ్శాంతి పొందాలనే ఆశయంతో అక్కడికి వచ్చిన అతడికి ఎదురైన చేదు అనుభవాలతో ఈ కథ ముగుస్తుంది. రచయితకు ఆడబిడ్డలకు ఆవహించిన ఆధునిక అసమానతలు పట్ల గల ఆవేదన అర్థమవు తుంది.పదేళ్ల తర్వాత అక్కడి అడవి బిడ్డలులో ఆధునిక జీవన విధానం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. కొత్తగా వచ్చిన కరెంట్‌ వెలుగులు,మట్టి కుండల స్థానంలో స్టీల్‌ బిందెలు,పూరి గుడి సెలున్న చోట పెంకుటిళ్లు, వంటి మార్పులు చూసిన రచయిత ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వారిలో అంతకు ముందు కాలం నాటి ఆత్మీయతలు అనుబంధాలు లేవు అంతా కృత్రిమత్వం, అభద్రత,రాత్రి గూడెంలో ట్యూబ్‌ లైట్‌ ల వెలుగులో సాగినవారి నృత్యంలో అంతా కృత్రి మత్వమే. అది ఏదో ఆశిస్తూ చేస్తున్న స్వార్ధతత్వం, అడుగడుగునా కనిపి స్తాయి. ఆరాత్రి గూడెంలో అతడు గదిలో నిద్రపోయినా నమ్మకం లేనట్టు ఎవరి ఇంటి తలుపులు వారు గడియలు పెట్టి బిగించు కున్నారు.అంతటా అభద్రతే ఆత్మీయతలు లేని ఆతిథ్యం,అతడిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. తెల్లవారి ఉన్న ఒక్క అనురాగపు ఆశకోసం చెరువు గట్టుకు వెళ్ళిన, అతనికి అందమైన మామిడి చెట్లు, నైజర్‌ పంటచేలు, కనిపించ లేదు.చెరువు నీళ్ళకు వచ్చిన వారి చేతుల్లో కుండలు లేవు ఇత్తడి బిందెలు, స్టీలు బిందెలు ఉన్నాయి, అక్కడి వారికి ఉపాధి ముసుగు వేసి కట్టబడ్డ విమానం కంపెనీ సాయంగా అక్కడి అడవి అందాలు అంతర్ధానం అయ్యి కాలుష్యపు మేఘాలు వారికి తెలియ కుండానే అడవికి,వారి జీవితాలకు ఆవహించాయి. ఇంత మారిన తన ఊహల సుందరి ‘‘ప్రేమ తునక’’ పర్బతిలో తాను తొలిసారి చూసిన స్వచ్ఛత ఉంటుందని ఆశ తో అటుగా అడుగులు వేసిన అతనికి పిల్లలకు పాలు పడుతున్న ఆమె కనిపించింది, ప్రేమ తాలూకు పరిమాణం తో సిగ్గుపడుతూ తన వైపు చూసిన, ఆమె పిల్లల్లో తెలియని భయం కోపపు చూపులు,ఆమె శరీరానికి కొత్తగా జాకెట్‌ వచ్చి చేరింది. ఆమె భర్త విమానం కంపెనీలో తోట మాలి మరి, నోరు తెరిచి తానే అడిగాడు ‘‘నైజరుతేనె’’ అని,ఇంట్లోకి వెళ్లి గాజుసీసాలో తేనె తెచ్చి అతని చేతికి అందించి ‘‘దాని విలువతే’’ అన్నట్లు చేయి చాపుతుంది. ఆ తేనె చుక్కలు నోట్లో వేసుకున్న అతడికి మధురం స్థానంలో చిరుచేదు అనిపిస్తుంది. పది రూపాయల నోటు ఆమె చేతికి అందించిన అతడికి భయంకరమైన పళ్ళతో ఆమె ముఖం కనిపిస్తుంది, మొదటిసారి అతని కళ్ళకి ఆమె జలపాతంల కనిపించింది. ఈ పదేళ్లకు ‘‘కుళ్లు కాలవలా’’ తయారయింది. గబగబ ఆ కృత్రిమ గూడెం నుంచి కదిలిపోయి రోడ్డు పక్కన గల తన కారు చెంతకు చేరేసరికి, ఓ పదిమంది గ్రామ పెద్దలు అతడిని వెంబడిరచారు… డబ్బులు ఇమ్మనే చేతులతో. అతడి మనసులో సుడులు తిరుగుతున్న కోపాన్ని దాచుకోలేక పర్సులోని డబ్బంతా కాగితపు ముక్కల్లా వాళ్ళ మీద చల్లి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కథ ముగుస్తుంది. విభిన్నమైన కల్పితకథనమైన, అక్షరాల వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత బలివాడ కాంతారావు కృతార్థులయ్యారు.అందమైన అడవిబిడ్డల సంస్కృతి సాంప్ర దాయాలకు ఆధునికతతో కూడిన రక్షణ అత్యవసరం. కానీ ఆఅభివృద్ధి తాలూకు మార్పు వారిలోని అసలైన మనుగడకు చేటు రాన్నివ్వ రాదని ఆనాడు ‘‘బలివాడ’’ వారు ఆశించినదే ఈనాడు అందరూ ఆశిస్తున్నాము. ఆవిధంగానే అడవి బిడ్డల మనుగడ,అభివృద్ధి సాయంతో అంత రించి పోకూడదు,అని అందరం కోరు కుం దాం..చక్కని కథా వస్తువు ఎంత చక్కని శైలి అలవర్చిన రచయిత కథా కథనం అందరికీ ఆరోగ్యదాయకమైన విషయ విశేషం.

విశాఖ తీరంలో సాహ‌స విన్యాసాలు

‘‘ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఫ్లీట్‌ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో పయనించారు. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు గౌరవ వందనం చేశాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్‌ మెరైన్స్‌, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఫ్లీట్‌ రివ్యూలో నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకా దళ తీర పెట్రోలింగ్‌ నౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో రాష్ట్రపతి కోవింద్‌ బంగాళాఖాతంలో నాలుగు నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని గౌరవ వందనం స్వీకరించారు ’’
ప్రశాతంగా కనిపించే విశాఖ సాగర తీరం భయంకర శబ్ధాలతో దద్దరిల్లింది.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు పరిస్థితి చూసుంది. దూరం నుంచి చూసేవారికి ఏదో జరుగు తోందనే భయం వేస్తుందేమో..కానీ అక్కడ జరిగింది మాత్రం అద్భుత విన్యాశాలు.. భారత నౌకాదళ యుద్ధ విన్యాసాలు తెలిసేలతో ప్రత్యేక ప్రదర్శనలు సాగాయి. మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ లో భాగంగా Iచీూవిశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్‌.జగన్‌. నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాం తర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ జలంతర్గామిలో ప్రత్యేకలను సీఎం జగన్‌, భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వం దనం స్వీకరించారు. ఐఎన్‌ఎస్‌ విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలం దించనుంది. విశాఖ బీచ్‌లో ఫిబ్రవరి 27న మిలాన్‌ 2022 కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గోన్నారు.6000 అడుగుల ఎత్తులో 6గురు ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్‌, ప్రమాదంలో ఉన్నవా రిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతాతో ఆ సాగర తీరం దద్దరిల్లింది.యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు,మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు,యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రతిబిం బించాయి. తరువాత మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్‌ స్వయంగా సమీక్షించారు. తూర్పునౌకాదళం వేదికగా ఈ మిలాన్‌ విన్యాసాలు మార్చి 4 వరకూ జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్‌..ఐఎన్‌ఎస్‌ మీద డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణజింకను ముద్రించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్‌ డెస్టినీ అని అన్నారు. సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్‌ తెలిపారు. ఇది చాలా అరుదైన వేడుక.. విన్యాసాల పండగ అని కొనియాడారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్‌ అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నంలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించ దగ్గ రోజు అని అన్నారు. భవిష్యత్తులో విశాఖ మరిన్ని అంతర్జాతీయ వేడుకలకు వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌)2022 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,రాష్ట్ర గవర్నర్‌ ఆంప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌లు హజరూ సుమిత్రి నౌక నుంచి ఫ్లీట్‌ రివ్యూను ప్రారం భించారు. ఫ్లీట్‌ రివ్యూ ద్వారా మరోసారి భారత నౌకాదళం తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించింది. భారత తూర్పు నావికాదళం శక్తి సామర్ధ్యాలు మరోసారి తెలిసి వచ్చేలా విన్యాసాలు సాగాయి. విశాఖ సాగర తీరంలో సాగిన సాహస విన్యాసాలు ఆంధ్యంతం అబ్బురపరిచేలా సాగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 27న జరిగిన మిలాన్‌2022 ఉత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హజరై ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేశారు. ఫిబ్రవరి 21న జరిగిన రాష్ట్రపతి కార్యక్రమంలో నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. పీఎఫ్‌ఆర్‌-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాద ళాలను,యుద్ధనౌకలు, కోస్ట్‌ గార్డ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు,10 వేల మంది సిబ్బందితో కూడిన జలాం తర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తి సామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్స రాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఫ్లీట్‌ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే విన్యాసాలు అద్భుతం అనేలా సాగాయి. ఈ రివ్యూను చూసేందుకు జనం కూడా భారీగానే తరలి వచ్చారు. ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ…‘‘కోవిడ్‌-19’’ మహ మ్మారి సమయంలో నేవీ పాత్రను కొని యాడారు. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించి సేవను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. భారత నౌకా దళం నిరంతర నిఘా,సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ప్రపపంచ దేశాలన్నింటికీ పోటీ ఇచ్చేలా మన బలగాలు పెరగడం సంతోషించే పరిణమమన్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ మాట్లాడుతూ..రాష్ట్రపతికి మొదట ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నావికా దళంలో నౌకలు,విమానాలు,జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించాయి అన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేం దుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహా సముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం,ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్‌ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు,జలాంతర్గాములు,విమానాలు,మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ చొరవలో ముందంజలో ఉందని గుర్తు చేశారు. భారత దేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్‌ పేర్కొన్నారు. 1971 యుద్ధ సమయం లో విశాఖపట్నం నగరం సహకారం మరువ లేనిది అన్నారు. అంతర్జాతీయ కార్యక్ర మాలకు విశాఖ వేదికగా నిలుస్తోంది.
ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ అంటే ఏంటి?
ప్రపంచ దేశాలు ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించడాన్ని ఒక సంప్రదాయంగా భావి స్తాయి. ముందస్తుగా ఎంచుకొన్న చోట నౌకాద ళానికి చెందిన యుద్ధ నౌకలను ప్రదర్శిస్తారు. దేశ రక్షణలో నౌకాదళం పాత్ర,సాధించిన అభివృద్ధిని చాటడంటో భాగంగా ఫ్లీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే సరికి కనీసం ఒక్కసారి అయినా ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహిస్తారు. రిపబ్లిక్‌ డే రోజున నిర్వ హించే సైనిక ప్రదర్శన మొదటిదని,ఆ తరహాలో చేపట్టే రెండో కార్యక్రమం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ అని నేవీ అధికారులు వివరించారు. ఇండియాలో మొట్టమొదటి సైనిక, ఆయుధ ప్రదర్శనను 18వ శతాబ్దంలో మరాఠా రాజులు నిర్వహించారు. తీరప్రాంతంలోని కోటరత్నగిరిలో అప్పటి సర్కీల్‌ కన్హోజీ అంగ్రీ నేతృత్వంలో గురబ్స్‌,గల్లివట్స్‌గా పేర్కొనే సైనికుల ప్రదర్శన జరిగింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 11సార్లు ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహించారు. అందులో రెండు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్స్‌ ఉన్నాయి. 2001,2016లో అంతర్జాతీయ స్థాయి ఫ్లీట్స్‌ను ఇండి యన్‌ నేవీ చేపట్టింది. ప్రస్తుతం విశాఖ పట్నంలో రెండోసారి ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహి స్తున్నారు.2016లో కూడా విశాఖలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ జరగ్గా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హాజరయ్యారు. ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో నౌకలను చూసి రాష్ట్రపతి ఇచ్చే ప్రశంసలు విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, దేశరక్షణలో ఇండియన్‌ నేవీ పాత్రను సత్తాను ప్రదర్శన చాటుతుందని నేవీ అధికారులు తెలిపారు.2020లో అండ మాన్‌ నికోబార్‌ దీవుల్లో జరగాల్సిన ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిరది.
ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో ప్రత్యేకతలు
‘ఇండియన్‌ నేవీ- 75 ఇయర్స్‌ ఇన్‌ ది సర్వీస్‌ ఆప్‌ ది నేషన్‌’ అనే నినాదంతో ప్రస్తుతం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవు తున్న సందర్భంగా ఈ ఫ్లీట్‌ను ప్రత్యేకంగా జరుపుతున్నారు. ప్రదర్శనలో 60 నౌకలు, సబ్‌ మెరైన్స్‌, 50 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ పాల్గొంటాయని అధికారులు పేర్కొన్నారు. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోస్టుగార్డ్‌కు చెందిన నౌకలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన సబ్‌మెరైన్స్‌ కూడా ఫ్లీట్‌లో పాల్గొన్నాయి.
రాష్ట్రపతి పర్యాటన ఇలా జరిగింది..
నౌకల ప్రదర్శన,ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ విన్యాసాలు ఉం టాయి. కార్యక్రమం అనంతరం ప్రత్యేక కవర్‌, పోస్టల్‌ స్టాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడుదల చేశారు. ప్రత్యే కంగా సిద్ధం చేసిన ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ ద్వారా మ్యారిటైమ్‌ ఆర్గనైజేషన్స్‌కు చెందిన నౌకలు,యుద్ధ నౌకలు., సబ్‌మెరైన్స్‌ను రాష్ట్రపతి పరిశీలించారు యాచ్‌ లో ప్రయాణిస్తూ ఆయా నౌకల్లోని అధికారుల గౌరవవందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. గాల్లో ఎగురుతూ సెల్యూట్‌ చేసే వంటి విన్యాశా లను ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ చేశాయి. ఇండియన్‌ నేవీకి చెందిన ఏవియేషన్‌ వింగ్‌ ఆధ్వర్యంలో 50 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కనువిందు చేశాయి. ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌
ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధంతో భయానక వాతావరణం కనిపిస్తోంది. సేమ్‌ అలాంటి యుద్ధ వాతావరణమే విశాఖలోనూ కనిపించింది. అయితే ఇదంతా కేవలం విన్యాసాలు మాత్రమే.. భారత నౌకాదళం శక్తి తెలిసేలా అద్భుతమైన విన్యాసాలు చేశారు. మరోవైపు ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్‌.జగన్‌. తర్వాత జలాంతర్గామిలో సిఎం జగన్‌ దంపతుల సందర్శించి అలరించి విన్యాసాలు వీక్షించారు. వేగంగా కదిలే నౌకలు, గగనతలంపై భారీ శబ్ధాలను చేసు కుంటూ రెప్పపాటు క్షణంలో మాయ మవుతూ ఉండే ఫ్లై పాక్‌,యుద్ధ విమానాల విన్యాసాలతో ఒక్కసారిగా యుద్ధవా తావరణం కనిపిం చింది. సముద్ర జలాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని పై నుంచి వెళ్లే విమానాలు,అక్కడ నుంచి నీటిపైకి వేసే లావుపాటి తాళ్లు,నిచ్చెనల నుంచి మెరైన్‌ కమోండోలు (మార్కోస్‌), సైలర్లు దిగి వారిని కాపాడే ప్రక్రియ అత్యంత గగుర్పాటుకు గురి చేసింది. సుమారు 60 నౌకలు, జలాంత ర్గాములు,55 యుద్ధ విమానాలు బంగాళా ఖాతంలో సందడి చేశాయి. 44యుద్ద నౌకలు 4వరుసలుగా కొలువు దీరగా వాటి మధ్యనుంచి ఐఎన్‌ఎస్‌ సుమిత్ర (Iచీూ ూబఎఱ్‌తీa) నౌక ముందుకు సాగింది. – గునపర్తి సైమన్‌

ఎంత కాలం ఈ పోరాటం

  • నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల వెతలు …..
  • ” పుట్టింది..పెరిగింది… నివసిస్తున్నది…అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే. అయినా కొందరు గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేక పోతు న్నారు. కొందరు మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా.. కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజనులు ఆ హక్కులను, చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు. మరి కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు? ఎవరు తొలగిం చారు. ఎందుకు తొలగించారు..? అనే విషయాలు తెలుసుకుందాం..!!”
    నాన్‌ షెడ్యూల్‌ గిరిజన ప్రాంతాలను ఐదోవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో చేర్చాలనే నినాదంతో ఉపప్రణాళిక ప్రాంత గిరిజనులు, గాంధే యమార్గం లో చేస్తున్న పోరాటం ఆగలేదు.ఈసుదీర్ఘ ఉద్య మ ప్రస్థానంలో వారు న్యాయంకోసం,సాయం కోసం తొక్కని గడపలేదు.కలవని రాజకీయ నాయ కుడు లేడు.అనేక మంది నాయకులకు,అధికారులకు లేఖలురాస్తూ,విజ్ఞపన పత్రాలు అందిస్తున్నారు.ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆపార్టీ ముఖ్య మంత్రిని, మంత్రులను,నాయకులను కలసి మద్దతివ్వాలని అభ్యర్ధించారు. వానొచ్చినా,వరదోచ్చినా,ఎండలు నిప్పులు చెరుగుతున్నా..కరోనా భూతం కోరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పిల్లపాపలతో కలెక్టర్ల కార్యాలయాలు,ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయాలు తిరగని రోజంటూ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో తాము ఆదివా సులమే..అందరం అడవి బిడ్డలమే కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి.. అయి నా అభివృద్ధికి ఆమడదూరం..అటవీవనరులు పరిరక్షణ,తమహక్కులు సాధన కోసం ఎన్ని అవంత రాలు ఎదురైనా అహర్నిశులు శ్రమించి సాధించే వరకు పోరాటం ఆపేది లేదని నాన్‌షెడ్యూల్‌ ఏరి యా గిరిజన ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తు న్నారు.
    వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్నగిరిపుత్రులదుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్నిగ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండ టమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలాప్రభుత్వ రికార్డుల కార ణంగా గిరిజనులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు.మరి,కొన్ని గ్రామాలుఏజెన్సీ ఏరియా రికార్డుల్లో లేకపోవడం కారణంగా వారిబ్రతుకులు నేటికీ అగమ్యగోచరంగానే ఉన్నాయి.
    బ్రిటిష్‌పాలనలో…గిరిజన తెగలు నివ సించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొ న్నారు.అందుకోసం(ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874)అమల్లోకి తెచ్చారు.మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్య వేక్షణ లో ఈప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలోఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొన సాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌ లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామా లను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర,ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటివి 800 గ్రామాలు ఉన్నాయి.
    అయిదవ షెడ్యూల్‌లో ఏముంది…
    అయిదో షెడ్యూలులోని క్లాజ్‌ 6 ప్రకా రం ప్రభుత్వం నోటిఫైచేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొం దుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార,సంప్ర దాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయి దో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొల గించడం లేదా కొత్తగాఏర్పాటు చేయడం వంటి వాటిపైఅధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ఏరియాలోఉంటున్న గిరిజనులకు… హక్కులు,చట్టాలు,రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70 వంటి చట్టాలు అమలులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు,అమ్ముకోవచ్చు. ఈ భూములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయవచ్చు’’ కేంద్ర ప్రభు త్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తాయని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టంలాంటివి అమల్లో ఉంటాయి. మైనింగ్‌ అనుమతులు ఇవ్వా లన్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు.‘నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసాచట్టం,గ్రామసభల అనుమతులతో పని లేదు.ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణ ను పొందలేక పోతున్నారని విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన నాన్‌ షెడ్యూల్‌ గిరిజన సంఘం ఉద్యమకారుడు, గిరిమిత్ర కార్యదర్శి బండి గంగరాజు ఆవేదన.
    ఉద్యోగాలు రావట్లేదు
    ప్రభుత్వ రికార్డులు ప్రకారం నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలుగా ఉన్న గిరిజన గ్రామాలు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా శంఖవరం,రౌతులపూడి, ఏలేశ్వరం,ప్రత్తిపాడు,కోటనందూరు మండలాల్లో 56నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామా లున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈగ్రామాల్లోని గిరిజనులు మౌలిక వస తులు,అభివృద్ధి,హక్కులు,రక్షణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీడీఏ పరిధిలో ఏదైనా ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు వెళ్లినా షెడ్యూల్డ్‌ ఏరియా లో లేని ఆదివాసీలుగా భావించి…ఉద్యోగాలు ఇవ్వ డం లేదని నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామానికి చెందిన వసుంధర చెప్పారు.కనీసం కులధృవీకరణ పత్రాలు సైతం మంజూరు చేయడం లేదని పెదమల్లాపురం కు చెందిన షెడ్యూల్‌ ఏరియా గిరిజన సాధన కమిటీ అధ్యక్షుడు బాలరాజు చెప్పారు.
    రాజకీయంగా కూడా దెబ్బే…
    ‘షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామ పంచాయి తీ సర్పంచ్‌ పోస్టులు,మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షు డి పోస్టులు అన్ని ఆదివాసీలకే రిజర్వు అయి ఉం టాయి. కానీ,నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న ఆది వాసీలకు మాత్రంరోస్టర్‌ విధానం(వంతుల వారీగా) ఉంటుంది. అందువల్ల గిరిజనులున్న ప్రాంతాల్లో కూడా అధికారం చాలాసార్లు గిరిజనేతరులకు వెళ్తుంది. దీని వలన రాజకీయంగా కూడా మేం ఎదగలేకపోతున్నాం’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా అజయ్‌పురానికి చెందిన కిల్లో రాంబాబు చెప్పారు. ‘ఉపాధి హామీ పనులకు కూడా మమ్మల్ని పిలవడం లేదు. పేరుకే ఆదివాసీలం. హక్కులు లేవు’ అని రాంబాబు అన్నారు.
    షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చమంటే… వీఎం ఆర్డీఏలోకి
    ఇప్పుడు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న ఆదివాసీలకు మరో సమస్య వచ్చింది. ఇప్పటి వరకు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా నుంచి షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనిగిరిజనులు డిమాం డ్‌ చేస్తూంటే…వారి గ్రామాల్ని వీఎంఆర్డీఏ (విశాఖ మెట్రోపాలిటన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ)లో చేర్చారు.‘రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ ఏరి యాలోఉన్న11మండలాలను మినహాయించి… మిగిలిన జిల్లా అంతటినీ కూడా వీఎంఆర్డీఏ పరిధి లోకి తీసుకు వచ్చింది. ఇదంతా కూడా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో మైనింగ్‌ యధేచ్ఛగా సాగిం చేందుకే.విశాఖ జిల్లాలోని నాతవరం మండ లంలో సరుగుడు పంచాయితీ ఏరియా పరిధిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలే ఇందుకు ఉదాహ రణ. అలాగే తూర్పుగోదవరి జిల్లా శంఖవరం మండలం పెద్దమల్లాపురం,వేళింగి పంచాయితీ నాగులకొండపై కూడా లేట్‌రైట్‌ తవ్వకాలపై కన్ను పడిరది. ఇప్పటికే ప్రత్తిపాడు మండలం వంతాడ కొండంతా లేట్‌రైట్‌ తవ్వకాలు చేపట్టి ఆ ప్రాంతాన్ని శ్మశానవాటికల చేసి వదిలేశారు. విశాఖజిల్లా రావి కమతం మండలంలో ఆదివాసీ గ్రామాలు ఎక్కువ గా ఉన్నాయి. కానీఈగ్రామాలేవీ షెడ్యూల్డ్‌ ఏరియా లోఉండవు.ఇక్కడే మైనింగ్‌ ఎక్కువగా జరుగు తుంది. అయిదో షెడ్యూలు ఏజెన్సీ ప్రాంతాల్లో పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే… రాష్ట్ర గిరిజనసలహామండలి,రాష్ట్ర గవర్నర్‌ సిఫార్సు, సలహాలతో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఖనిజ వన రులు దోపిడీ,భూములఅమ్మకాలు,కొనుగోళ్లు యధే చ్ఛగా జరుగుతున్నాయి.అయితే ప్రజాప్రతినిధుల మాట మాత్రం వేరుగా ఉంది. వీఎంఆర్డీఏ కలిసే ప్రాంతాలన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందు తాయి. నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాంతాలు కూడా కల వడంవల్ల అవి త్వరగా అభివృద్ధి చెందుతాయి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.
    సరుగుడు పంచాయితీయే ఉదాహరణ…
    1985 వరకూ సరుగుడు ఏజెన్సీ ప్రాంతమంతా కొయ్యూరు తాలూకాలో ఉండేది.ఈపంచా యితీలో 16గ్రామాల్లో లేటరైట్‌ గనులు విస్తారంగా ఉన్నా యి. అయితే సరుగుడు ఏజెన్సీ మండలాల విభజ నలో నాతవరం మండలంలోకి మారింది. నాతవ రం మండలంనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంది. ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు గిరిజనేత రులకు,బినామీలకు ఇవ్వడం చట్ట విరుద్ధం. సరు గుడు ప్రాంతంలో లేటరైట్‌ ఖనిజ తవ్వకాల ప్రక్రి యలో ఈ నిబంధనలేవి పాటించడం లేదు. ఇక్కడ పూర్తిగా గిరిజన కుటుంబాలే ఉన్నాయి. అయినా అధికారుల దగ్గరవారు తాము గిరిజనులమని నిరూ పించుకోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో సరుగుడు ప్రాంతాన్ని వీఎంఆర్డీఏలో చేర్చారు. ఇదంతా లేట రైట్‌ మైన్స్‌ కోసమే’’ అని నాతవరం గిరిజన సంఘం నాయకులు అంటున్నారు.
    షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
    విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాం తాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పుపడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు.ఈమండలంలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా లో 33 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఎస్టీ జనాభా 50 శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత,సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌లో ఉంది. రావికమతం మండ లంలో 5గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు అని కనకరావు చెప్పారు.
    గతంలో జరిగిన ప్రయత్నాలెన్నో
    1976లో ఉమ్మడిరాష్ట్రంలో 800 గిరి జన గ్రామలునాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్నా యని…వాటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 2007లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న రెడ్యా నాయక్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 800 గిరిజన గ్రామాలను (శ్రీకాకుళం-240,విజయనగరం-181,విశాఖపట్నం-90, తూర్పుగోదావరి-40,పశ్చిమగోదావరి-01) షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన ఉన్నట్లు అసెంబ్లీలో తెలిపారు. ఆతర్వాత దీనిపై మళ్లీ చర్చ జరగలేదు. అయితే 2018లో రాజ స్థాన్‌లోని 6జిల్లాలలో ఉన్న 9మున్సిపాలిటీలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’అని విశాఖ జిల్లా గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు డిమాం డ్‌ చేస్తున్నారు.
    వైఎస్సార్‌ హామీని…జగన్‌ నెరవేరుస్తారా
    2004లో పాదయాత్ర సందర్భంగా వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విశాఖజిల్లా వడ్డాదిలో నిర్వ హించిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఈ ప్రాం తంలోని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని హామీ ఇచ్చారు.అయితే,వైఎస్సార్‌ మరణం, రాష్ట్రం లో సమైక్య, ప్రత్యేక ఉద్యమాలు,రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈఅంశం తెరమరుగైంది.అయితే ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉం దని…అర్హతలున్న అన్ని నాన్‌-షెడ్యూల్డ్‌ గ్రామాల్ని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేరుస్తామని పాడేరు ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ స్పష్టం చేశారు.
    కల నెరవేరేనా?
    తూర్పు,విశాఖజిల్లానాన్‌షెడ్యూల్‌ ప్రాంత గిరిజనగ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరం లో కొట్టుమి ట్టాడుతున్నాయి. మారుమూల గ్రామా ల్లో కనీస సదుపాయాలులేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఉచితవిద్య అందించే ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు,జూనియర్‌ కాలేజీలులేవ్వు. ఇక్కడనివసించే గిరిజన విద్యార్ధులకు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు.పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీఓ కార్యాలయాన్ని పెదమల్లాపురంలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన గ్రామాల్లో 1/70చట్టం వర్తించకపోవడంవల్ల గిరిజనేతరులు దళారీ చేతుల్లో తమ భూములను చేజిక్కించుకొని అన్యాయానికి గురవుతున్నారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం తాము సాగుచేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలు మంజూరు చేయాలి.ఈ ప్రాంత సమస్యలపై ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులు, అధి కారులను కలసి మొరపెట్టుకున్నాం. అయినా పట్టిం చుకోవడం లేదని గిరిజన సంక్షేమ సంఘం కార్య దర్శి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.– గున‌ప‌ర్తి సైమ‌న్‌

గోరపిట్ట

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన తెలుగు కథా ప్రియుల పాలిట ‘సువర్ణముఖి’గా సుపరిచితుడైన ‘రౌతు బంగా రు నాయుడు’’ కథారచన ‘ గోరపిట్ట ’ కథా చదవండి..! – సంపాదకులు

సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపిస్తుంది… ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా కథాసారాంశం. ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయాని కొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం1999.
మనిషి జీవితమే నిత్య పోరాటాల మయం..కొన్ని కనిపించేవి మరికొన్ని కనిపించనివి.. ఈమానవ జాతికి మూలవాసులుగా చెప్పబడే అడవిబిడ్డలకు…పోరాటాలకు విడదీయరాని నిత్య సంబంధాలు సదా కనిపిస్తూనే ఉంటాయి. కాలాలు మారిన పోరాటాలు మారలేదు అవి చేసే మను షులు,విధానాల్లో మార్పులు ఉండవచ్చు గాక కానీ వాటి అంతిమలక్ష్యం ఒకటే!! ఆర్థికలేమి, అమా యకత్వాలు,సొంతం గిరిబిడ్డలుచేసే పోరాటాల్లో వాళ్ళంతా సేవకులే తప్ప,నాయకులుగా ఉండక పోవడం దురదృష్టం,వారిలోని శారీరక శక్తిని పెట్టు బడి పెట్టుకుని కొందరు మానసిక శక్తిగల వారు, వారి స్వార్ధ పోరాటాల్లో ‘గిరిపుత్రులశ్రమను’ విని యోగించుకున్న వినియోగించుకుంటున్న సంద ర్భాలు అనేకం.
అలాంటి అరణ్యవాసుల శ్రమతో సాగిన పోరాటాలను చేరువనుంచి పరిశీలించిన సామా జిక చైతన్య కలం యోధుడు, తెలుగు కథా ప్రియుల పాలిట‘సువర్ణముఖి’గాసుపరిచితుడైన‘రౌతు బంగా రు నాయుడు’’ విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద దరి పెదమేరంగి గ్రామనివాసి. ఆయన కథల కలంకన్ను నిత్యం గిరిజనజీవితాల పోరాటాలను చూస్తూ స్పందిస్తూ ఉంటుంది. ఆయన రాసిన కథ లన్నీ అడవిబిడ్డల జీవన పోరాటాలు,సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంపడుతుంటాయి. ఇక సువర్ణముఖి రాసిన అనేక గిరిజనకథల్లో ఒకటి ‘‘గోరపిట్ట’’సాధారణంగా ‘మైనా’ పిట్టగా పిలవబడే మాటలు నేర్చే ఈపక్షిని ఉత్తరాంధ్ర గిరిజనులు, సవరలు,గోరపిట్టగా పిలుచుకుంటారు. ప్రాంతీయ అభిమానంతో స్థానికనేపథ్యాలు,విషయాలను కథ ల్లో నమోదు చేసే ఉత్తమ రచయిత లక్షణాలు జాలువారిన తనకలం ద్వారా సొంతం చేసుకు న్నారు. ఇక సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపి స్తుంది. ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా పఠించాల్సిందే!!
పాత్రోచితమైన సంభాషణలు,పాత్రోచితమైన వ్యక్తులను,తీసుకుని కథకు నిండుదనాన్ని హుందా తనాన్ని నింపడంలో ఈకథకుడు బహునేర్పరి. కథ లోని వాస్తవ సంఘటనలు రచయిత అనుభవాలే తప్ప ఎక్కడా అభూతకల్పనలకు చోటు లేదు. అది రచయిత రచనలోని ప్రామాణికతకు మూలా ధారం.ఈరచయిత ఎన్ని సంఘటనలు, ప్రాంతాలు, తీసుకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా తాను ఎంచుకున్న అంత సూత్రం ఆధారంగా నడిపించడం ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయానికొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం 1999.సోములు-బంతెమ్మ అనే సవర గిరిజన దంపతులకు మనెమ్మ,శిరిమెల,జ్యోతి,అనే ముగ్గురు ఆడబిడ్డలు,ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం కూడా దీనిలో ఒక భాగం చేయబడిరది. కథ మొత్తం ప్రారంభం ఎత్తుగడ ముగింపువంటి ప్రాథమిక విషయాల మీదగాక పాత్రల జ్ఞాపకాల తలపోతలు వివిధ ప్రాంతాలు,సంఘటనలు,మేళవింపుతో రచయిత తనదైన శైలిలో సుదీర్ఘంగా కొనసాగుతుంది. మల్లు, భార్య శిరిమెలలు తమకు అడవిలోదొరికే గుమ్మడి కాయ,ఇతర అటవీఉత్పత్తులు,తీసుకుని పట్టణం లోని మనెమ్మను కలవడానికి బస్సెక్కి పోవడానికి సిద్ధమైవస్తూ మార్గమధ్యలో జన్మభూమి కార్యక్రమం కు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు తార సపడటం వారి మాటల సందడి వీరువిన డండంతో కథ ప్రారంభమవుతుంది.గ్రామాల్లో జరిగే కాంట్రాక్టులు అప్పగించడంలో నీతిపరుల కన్నా….అవినీతిపరులకే ఎందుకు అప్పగించాల్సి వస్తుందో….స్థానిక ఎమ్మెల్యేకి ఓరాజకీయ నాయ కుడికి మధ్య జరిగిన సంభాషణ సాయంగా రచ యిత ఇందులో ఎరుక పరుస్తారు.అంతలోనే పట్ట ణం పోతున్నమల్లు,శిరిమెలను చూసిన ఎమ్మెల్యే వారి వద్ద గల కుందేలు పిల్ల మీద మనసు పడటం, వారి నుంచి అందుకునే లోపు అది తప్పించు కోవడం,గోరపిట్ట,అంతకుముందే ఎగిరి పోవడం, తప్పించుకు పోయిన వాటిని వెతకడంలో విఫల మైన మల్లు,గీదరయ్యల,స్థితి చెబుతూనే అడవి జంతువులపై పట్టణవాసులు ఎలాఆశపడి అనుభవి స్తున్నారు.అడవిబిడ్డలను కూడా అదేతీరుగా దోచు కుంటున్నారు అనే ‘అక్షరదృశ్యము’ రచయిత ఈ సంఘటన ద్వారా చూపిస్తూ బావు ఎక్కడికెళ్లి పో తుంది బావు! మనుషులు అయినా జంతువులైన, పిట్టయినా,ఒడుపు దొరికితే పారిపోతాయి, కుదరక పోతే అమిరిపోతాయి.పోయినప్రతిదీ మన సంపద ఐతే,మనకు దొరక్కుండా ఎక్కడికెలిపోతది!? అంటూ ఎమ్మెల్యే గారితో మైదాన ప్రాంత నాయకు లనడంలోని మాటల ద్వారా అడవిబిడ్డల అభద్రత ఎలా ఉందో రచయిత స్పష్టం చేస్తారు.అదే సభలో ‘కందికొత్తపండుగ’కు రమ్మని గీదరయ్య, ఎమ్మెల్యేని ఆహ్వానించిన అందుకు సుముఖత చూపని అతనికి గిరిజనుల ఓట్లుమాత్రం ముఖ్యంగాని,వారి పండు గలు, సంప్రదాయాలు, అవసరం లేదనే విషయం వ్యంగ్యంగా చెప్పబడిరది. అంతేగాక జన్మభూమి మీటింగ్‌ అంటే ప్రజల కోసం పొద్దస్తమానం కొనసా గదని, కేవలం నాయకుల కోసమే అలా మొదలై ఇలా ముగిసిపోతుందని మాటలు నేర్చినగోరపిట్ట ప్రజనాయకుల కళ్లుకప్పి దూరం నుంచి ఎదురు వచ్చి తన భుజంమీద వాలగ,దాంతో మల్లు అన్న మాటల్లో రచయితకు జన్మభూమి కార్యక్రమంపై గల అభిప్రాయం అర్థమవుతుంది. మరోమారు జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, పాల్గొని గ్రామస్తుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రజల కోరికలు తీర్చడంలో వాళ్ళుచూపిన అనాసక్తి, నిర్ల క్ష్యం కూడా రచయిత అక్షరీక రించారు.గ్రామ రచ్చబండ వద్దకు వచ్చిన శిరిమెల పెంపుడు గోర పిట్ట మీద ఒకఅధికారి కన్నుపడటం,చేసేది లేక శిరిమెమలకు నచ్చచెప్పి ఆపిట్టను అధి కారికి అప్పజెప్పడం,గోరపిట్ట అధికారి చేతుల్లోగిల గిల కొట్టుకోవడం,దానికోసం శిరిమెల హృదయ విదా రకంగా ఏడవడం గురించి రచయిత కరుణ రసా త్మకంగా వివరించడం విశేషం. అంతేకాదు అడవి బిడ్డల్లోని ప్రేమ,ఆప్యాయతలు,అనుబంధాలు, కేవ లం మనుషులపట్ల మాత్రమేగాక పశుపక్షా దులు, పట్ల కూడా ఎలాఉంటాయో వివరిస్తారు. గోర పిట్టను ఇప్పుడు అధికారి తీసుకెళ్లినట్టు ఇరవై ఏళ్లక్రి తం శిరిమెల అక్క మనెమ్మను మరో అధికారి పట్టణం తీసుకుపోయిన వైనం, గీదరయ్య జ్ఞాపకాల ద్వారా రచయిత పాఠకులకు పరిచయం చేస్తాడు, పెద్ద బిడ్డను బలవంతంగా కోల్పోయిన బాధ వర్ణనా తీతం.ఒకపక్కఉద్యమంలో అమరుడైన భర్త సోము లు జ్ఞాపకాలు..మరోపక్క తమ ఆచారం ప్రకారం చేరదీస్తానని ముందుకు వచ్చిన మరిది. ఆత్మాభి మానంతో ..ఏడ్చి,ఎడ్చి,చివరికి జ్యోతి,శిరిమెలలను వదిలేసి భర్తదగ్గరకు చనిపోతుంది.భర్తచని పోయిన స్త్రీని ఆమెమరిది వివాహం చేసుకునే ఆచా రాన్ని చెప్పడంఇక్కడ మరొక ప్రధాన విషయంగా గమనిం చాలి. అలాగే పట్టణంలో గిరిజనేతరుని వివాహం చేసుకున్న మనెమ్మ తిరిగి తనభర్త సూర్య రావుతో విడాకులు తీసుకోవడంలో ఎదు ర్కొన్న చట్టపరమైన చిత్రమైన ఇబ్బందులు కూడా ఇందులో చూపించ బడతాయి., ఆదివాసి వివాహం హిందూ వివాహ చట్టం పరిధిలోకి రాదని కోర్టు తీర్పు ఇవ్వడం ఇందులో గమనించదగ్గ విషయం.అందుకే గిరిజను లు తమ తగువు లను కుటుంబ పంచాయితీలు ద్వారా తీర్చుకుం టారు అనిపిస్తుంది. ఇక కథ చివరి అంకంలో మారుమను వు చేసుకున్న సిరిమెల మల్లుల పెళ్లి విషయంరచయిత గుర్తుచేస్తూ గిరిజను ల్లో వుండే ‘ఓలి విధానంపెళ్లి’ విషయం చెబుతూ అలా ఓలిరూపంలో ఖర్చుచేసి కట్టుకున్న గిరిజనస్త్రీ తనకు ఆభర్త ఇష్టం లేకపోతే తనకు నచ్చిన వ్యక్తిని మారుమనువు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని, అయితే మొదటి పెళ్లి సమయంలో గిరిజనస్త్రీ తండ్రికి ధనం పశువులు,ధాన్యం,రూపంలోముట్టచెప్పినఓలిని మొదటిభర్తకు ప్రస్తుతం చేసుకున్న భర్త అప్ప చెప్పాల్సిన పద్ధతి, ఆచారంగురించి శిరిమెల-మల్లు ల మారుమనువు సంఘటనద్వారా రచయిత వివరి స్తారు.అలాగే ఈముగ్గురు అక్కచెల్లెళ్ళల్లో చివరిదైన జ్యోతి, అడ్డయ్యను పెళ్లి చేసుకోవడం అతడు క్రైస్తవ మతం లోకి వెళ్లి ‘జేమ్స్‌’గా…జీవనం సాగించడం, ఒక రోజు ఊహించని పరిణామంగా, జ్యోతి తన భర్త జేమ్స్‌తో రాత్రిసినిమాచూసి వస్తుండగా పోలీసులు అడ్డగించి‘నక్సలైటుజ్యోతక్క’గా… భావిం చి జ్యోతిని అన్యాయంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు పోవడం,అనంతరం ఆచుట్టుపక్కల గ్రామాలన్నీ గతంలోచేసిన పోరుబాటపట్టి జరిగిన అన్యా యాన్ని ఎదిరించడంకోసం గుంపులు గుంపులుగా మణెమ్మ సారధ్యంలో తరలిరావడం,చివరికి జరిగిన పొర పాటును గుర్తించిన పోలీసులు జ్యోతిని విడుదల చేయడం,ఇంతటి జనాదరణగల మణమ్మను రాజకీ యాల్లోకి ఆహ్వానించాలని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆశిం చడం,కథలో ముక్తాయింపుగా చెప్పబడిరది.గూడెం చేరినమణెమ్మ,శిరిమెల,జ్యోతిలు వారి కుటుంబ సభ్యులతో పాల్గొనడం దారిలోనే తమ పాత కాలపు సంఘం సభ్యులు తిరిగిరావడం.అంతేకాక, మనెమ్మ తండ్రిలాగే పోరుబాటకు తనవారితో కలిసి సిద్ధం కావడం,శిరిమెల ప్రాణప్రదంగా పెంచుకున్న ‘‘గోర పిట్ట’’బలవంతంగా పట్టణం పంపబడ్డ, తిరిగి తన గూటికే మరలివచ్చి ‘‘పరాయి చేయి తగిలి మాడి పోయిన అడవి’’లూజ్‌ చనిపోవడంతో ఈకథ సాం కతిక సందేశంతో ముగుస్తుంది. కథ ఆద్యంతం ఆదివాసీపోరాట నేపథ్యంలో సాగిన..అంతర్గ తంగా,అంతర్లీనంగా,వారి సంస్కృతి సంప్రదా యాలు జీవన విధా నాలు కలుపుకుని నడుస్తుంది అడవిబిడ్డల జీవన చిత్రాన్ని నూతనకోణంలో ఆవిష్కరించిన కథ ఈ గోరపిట్ట. (వచ్చే మాసం… మీకోసం కె. సీతారాములు కథ ‘‘తెలంగాణ గట్టు మీద పోలవరం)

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

‘‘ గిరిజనులకు ప్రధాన జీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ప్రతీ గిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’పచ్చని పొలాలపై కాల్సైట్‌ చిచ్చు రగులు తోంది. అగ్ని ఆరదూ..పురుగు చావదు చందంగా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎం డీసీ)కాల్సైట్‌ మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరుగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా,పీసా చట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి మైనింగ్‌ తవ్వకాలు చేపడితే సహించమని గిరిజన రైతులు ప్రతిఘటి స్తున్నారు. మరోపక్క మైనింగ్‌ కాంట్రాక్టర్ల మైనింగ్‌ ప్రభావిత గ్రామాల్లోని గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారికి వివాదాలు పెట్టి కాల్సైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల మూడు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన గ్రామసభ దీనికి తార్కాణం. విశాఖ జిల్లాలోని అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామా ల గిరిజన ప్రజల మధ్య కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు. ప్రభు త్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దుచేసి స్థానిక గిరిజన సొసైటీలకే మైనింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు గ్రామసభలో ప్రతిఘటించారు. తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతంగా అమలు చేయాలని గ్రామసభ సాక్షిగా కోరారు. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు. సమతజెడ్జిమెంట్‌, పీసా చట్టం,అటవీహక్కులచట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగ బద్దమైన చట్టా లను వ్యతిరేకించి.. మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కులు, మైనింగ్‌ తవ్వకాలపై పూర్వంనుంచి సమత పలు ఉద్య మాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం,అధికార యంత్రాంగాలు కంచెచేను మేసే చందంగా వ్యవహరింస్తోందని గ్రామసభ లో గిరిజనరైతులు ధ్వజమెత్తారు. ఈప్రాంతం లో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు, అమయక త్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read more

సంప‌ద శాపం

వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవుతుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారాలలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించినట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది.
‘‘ అత్యంత ధనవంతుల భారీ పర్యావరణ ప్రభావాలను మనం ఎందుకు సహిస్తాం? ధనవంతుల పట్ల మక్కువ చూపడం వల్ల మనలో చాలా లోపాలు ఏర్పడతాయి. లాబీయిస్టుల (లాభదాయకమైన ప్రైవేట్‌ ప్రయోజనాలతో రాజకీయ నాయకులతో సహా) ప్రజా స్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు అను మతించిన విధానం, కార్పొరేషన్లు, ఒలిగార్చ్‌లు, భూస్వా ములు తమ కార్మికులు, అద్దెదారులను నొక్కేసేం దుకు అనుమతించే నియంత్రణ సడలింపు మహమ్మారి సమ యంలో లాభదాయకత కోసం అనుమతించే వాతా వరణం ప్రైవేటీకరణ వైపు నిరంతర డ్రైవ్‌తో ఆరోగ్యం, విద్య,ఇతర ప్రజాసేవలక్షీణత. ఇవన్నీ ఒకేపరిస్థితి లక్ష ణాలు. మన కష్టతరమైన పరిస్థితు లకు కూడా ఇది వర్తి స్తుంది.! ’’

మన జీవిత-సహాయక వ్యవస్థలను నాశనం చేయడం. మనమందరం ఆధారపడిన గ్రహాల స్థలంలో సింహభాగాన్ని చాలా ధనవంతులు తమకు తాముగా గర్విస్తారు. మన ఉమ్మడి ప్రయోజనాలపై ఈ దాడిని ఎందుకు సహిస్తు న్నామో అర్థం చేసుకోవడం కష్టం. ప్రపంచం లోని అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది (సంవత్సరానికి సగటున 172,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు) ప్రపంచం లోని 15శాతం కార్బన్‌ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నారు. పేద 50శాతం కంటే రెట్టింపు ప్రభావం. సగటున, వారు ప్రతిసంవత్సరం ఒకవ్యక్తికి 70 టన్ను లకు పైగా కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. మనంగ్లోబల్‌ హీటింగ్‌లో 1.5శాతం సెల్సియస్‌ మించకుండా ఉంటే మనం ప్రతి ఒక్కరూ విడుదల చేయగలిగిన దానికంటే 30 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోని మధ్యతరగతి ఉద్గా రాలు వచ్చే దశాబ్దంలో బాగా తగ్గుతాయని అంచనా వేయబడినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థల సాధారణ డీకార్బనైజేషన్‌ కారణంగా,అత్యంత సంపన్నులు ఉత్పత్తి చేసే మొత్తం ఏమాత్రం తగ్గదు. మరో మాటలో చెప్పాలంటే..వారు దీనికి బాధ్యత వహిస్తారు. మొత్తం శాతం సెల్సియస్‌ 2లో ఇంకా ఎక్కువ వాటా. మంచి ప్రపంచ పౌరులుగా మారడం అంటే వారి కార్బన్‌ వినియోగాన్ని సగటున 97శాతం తగ్గించడం. జనాభాలో 90శాతం మంది కార్బన్‌ను ఉత్పత్తి చేయకపోయినా,రాబోయే తొమ్మిదేళ్లలో ధనవంతులైన 10శాతం (సగటున 55,000 కంటే ఎక్కువ సంపాదిస్తు న్నవారు) ఊహించిన ఉద్గారాలు దాదాపు మొత్తం ప్రపంచ బడ్జెట్‌ను ఉపయోగిస్తాయి. పర్యావరణ ప్రభావంలో అసమానత దేశం యొక్క అసమానతకు అద్దం పడుతుంది. సంపన్న దేశాలకు చెందిన సంపన్న ప్రజలు తమ నిందను చైనాకు లేదా ఇతర వ్యక్తుల జననాలకు మార్చడానికి చాలా ఆసక్తిని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. కొన్నిసార్లు వారు తమ స్వంత ప్రభావాలకు హాజరయ్యే ముందు ఏదైనా ప్రయత్నిస్తారని అనిపిస్తుంది. 20మంది బిలియనీర్ల జీవనశైలిని ఇటీవల విశ్లేషణలో ప్రతిఒక్కరు సగటున 8,000 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేశారని కనుగొన్నారు. 1.5శాతం సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి చేయడానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలో వారి సరసమైన వాటా 3,500 రెట్లు.ప్రధాన కారణాలు వారి జెట్‌లు,పడవలు. కొంతమంది బిలియనీర్ల బోట్‌ల వలె శాశ్వత స్టాండ్‌బైలో ఉంచబడిన సూపర్‌యాచ్‌ మాత్రమే సంవత్సరానికి 7,000 టన్నుల శాతం సెల్సియస్‌ 2ని ఉత్పత్తి చేస్తుంది.వాతావరణ ఛాంపి యన్‌గా తనను తాను నిలబెట్టుకున్న బిల్‌ గేట్స్‌కు పడవ లేదు. అయినప్పటికీ,అతను మంచి ప్రపంచపౌరుల కంటే 3,000 రెట్లు పెద్ద పాదముద్రను కలిగి ఉన్నాడు. ఎక్కువగా అతని జెట్‌లు,హెలికాప్టర్‌ల సేకరణ ఫలి తంగా. అతను ‘గ్రీన్‌ ఏవియేషన్‌ ఇంధనం కొనుగోలు’ అనిపేర్కొన్నాడు. కానీ అలాంటిదేమీ లేదు. జెట్‌లకోసం జీవ ఇంధనాలు,విస్తృతంగా అమలు చేయబడితే,పర్యావరణ విపత్తును ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఒకే విమానానికి శక్తినివ్వడానికి చాలా మొక్కల పదార్థం అవసరం. దీని అర్థం పంటలు లేదా తోటలు తప్పనిసరిగా ఆహారఉత్పత్తి లేదా అడవి పర్యా వరణ వ్యవస్థలను స్థానభ్రంశం చేయాలి. ఇతర ‘‘గ్రీన్‌’’ ఏవియేషన్‌ ఇంధనాలు ప్రస్తుతం అందు బాటులో లేవు.గేట్స్‌ కార్బన్‌ ఆఫ్‌సెట్‌లను కొను గోలు చేయడం ద్వారా అటువంటి వైరుధ్యా లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభా వాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవ ర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవు తుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారా లలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించి నట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది. కానీ వారి కర్బన దురాశకు పరిమితులు లేవు. కొంతమంది అత్యంత సంపన్నులు ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణించాలని ఆశిస్తున్నారు. అంటే వారు ప్రతి ఒక్కరు10 నిమిషాల్లో 30మంది సగటు మానవులు విడుదల చేసే కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తారని అర్థం. చాలా ధనవంతులు సంపద సృష్టికర్తలుగా చెప్పుకుంటారు. కానీ పర్యావరణ పరంగా,అవి సంపదను సృష్టించవు. వారు అందరి నుండి తీసుకుంటారు. ఎక్కువ డబ్బున్నవాడు ఇప్పుడు ప్రతిదీ కొనుగోలు చేస్తున్నాడు. ఈలోపాలను పరిష్కరించే సమావేశాలకు కూడా యాక్సెస్‌. కొన్ని ఖాతాల ప్రకారం, కాఫ్‌`26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేక మైనది. పేద దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు బైజాంటైన్‌ వీసా అవసరాలు,కోవిడ్‌ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తామనే విరుద్ధమైన వాగ్దా నాలు,స్థానిక ధరలను పరిమితం చేయడంలో లేదా గదులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వ వైఫల్యాలకు కృతజ్ఞతలు. వసతి కోసం పిచ్చి ఖర్చుల,క్రూరమైన కలయికతో అడ్డుకు న్నారు. పేద దేశాల నుండి ప్రతినిధులు ఈ గోడలను స్కేల్‌ చేయగలిగినప్పటికీ,వారు తరచుగా చర్చల ప్రాంతాల నుండి మినహా యించబడతారు అందువల్ల చర్చలను ప్రభా వితం చేయలేరు. దీనికి విరుద్ధంగా,500 కంటే ఎక్కువ శిలాజ ఇంధన లాబీయిస్ట్‌లకు యాక్సెస్‌ మంజూరు చేయబడిరది. ఇది ఇప్పటికే వాతా వరణ విధ్వంసం కారణంగా దెబ్బతిన్న ఎని మిది దేశాల సంయుక్త ప్రతినిధుల కంటే ఎక్కువ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మొజాంబిక్‌,మయన్మార్‌,హైతీ,ప్యూర్టోరికో, బహామాస్‌. నేరస్తులు విన్నవించారు. బాధితు లను మినహాయించారు. తరచుగా కోట్‌ చేయబడిన సిద్ధాంతం ఉంది.పెట్టుబడిదారీ విధానం అంతం కంటే ప్రపంచ ముగింపును ఊహించడం సులభం. పెట్టుబడిదారీ విధానమే ఊహించడం కష్టంగా ఉండడమే కారణం. చాలా మంది వ్యక్తులు దానిని నిర్వ చించడానికి కష్టపడతారు.దాని ఛాంపియన్‌లు సాధారణంగా దాని నిజమైన స్వభావాన్ని మరుగుపరచడంలో విజయం సాధించారు. కాబట్టి సులభంగా గ్రహించగలిగేదాన్ని ఊహిం చడం ద్వారా ప్రారంభిద్దాం. కేంద్రీకృత సంపద ముగింపు మన మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుంది.అన్ని పర్యావరణ చర్యలలో ముఖ్యమై నది సంపద పన్ను అని నేను నమ్ముతున్నాను. దైహిక పర్యావరణ పతనాన్ని నివారించడం అంటే విపరీతమైన సంపదను అంతరించి పోయేలా చేయడం గ్రహం భరించలేనిది మొత్తం మానవాళి కాదు. ఇది అల్ట్రా రిచ్‌.
జార్జ్‌ మోన్‌బియోట్‌

1 2 3 4 5