అటవీ హక్కుల చట్టం..ఆదివాసీలకు అన్యాయం

‘‘ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10 లక్షల కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దానిపై తానే స్టే తెచ్చుకుంది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17 రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో 10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశించింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని ఎన్విరాన మెంటల్‌ జర్నలిస్ట్‌ నితిన్‌ శేఠీ అన్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని.. అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషన్‌దారులు అంటున్నారు. గిరిజనానికి మద్దతుగా మాట్లాడుతున్న వారు మాత్రం ఈ చట్టం అమలు లోపభూయిష్ఠంగా ఉందంటున్నారు. ..’- గునపర్తి సైమన్‌

భారత్‌ 10కోట్ల మంది గిరిజనులకు ఆవాసం.. ఓచరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే వారు అణగారిన అల్పసంఖ్యాకులు. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో వీరు మనుగడ కోసం పోరాడుతూ దుర్భర జీవనం గడుపుతున్నారు. దేశంలోని మొత్తం గిరిజన జనాభాలో 40 లక్షల మంది రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో సుమారు 500 వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీలు, 90జాతీయ పార్కులు ఉన్నాయి. ఇది భారతదేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు 5శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005డిసెంబర్‌13కి పూర్వం నుంచి అడవిలో నివిసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న భూమిలో నివసించే హక్కు ఉంటుంది. అడవుల్లోని ఇతర సంప్రదాయ తెగలు ఎవరైనా నివాసం ఉంటే వారు 2005 డిసెంబరు 13కి పూర్వం నుంచి మూడు తరాలు అక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. అప్పుడే వారి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వారికి హక్కు ఉంటుంది. ఇక్కడ తరం అంటే చట్టంలో 25ఏళ్లుగా తీసుకున్నారు. అంటే.. 2005 డిసెంబరు 13కి ముందు 75 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నవారై ఉండాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10లక్షల కుటుంబాలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17రాష్ట్రాలు ఇచ్చిన సమా చారం ఆధారంగా సుప్రీం ఈఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈరాష్ట్రాల్లో సుమారు 18లక్షలదరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశిం చింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని పర్యావరణం, అటవీ సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..

కొండరెడ్లకు కొండంత కష్టాలు

కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. – గునపర్తి సైమన్

కొండరెడ్ల ఉనికి ప్రశ్నార్థకమే…!
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో కొండరెడ్లు ప్రధానమైనవారు. శతాబ్దాలుగా సజీవంగా ఉన్న గిరిజన తెగ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థమైంది. విలక్షణమైన వీరి జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు ఇక కాలగర్భంలో కలిసిపో తాయని చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు ఆందోళన చెందుతు న్నారు. ఇంతకాలం పచ్చటి అడవుల్లో, కొండల్లో ప్రశాంతంగా జీవించిన కొండరెడ్లు పోలవరం ప్రాజెక్టు కారణంగా చెల్లాచెదురై పోతారని, వారి బతుకులు అధ్వానమైపోతాయని అంటున్నారు. పోలవరం కారణంగా కూనవరం మండలంలోని ఏరువాడ గట్టుపై ఉన్న మూడు కొండరెడ్ల గ్రామాలు, కూనవరం నుంచి చింతూరు వరకూ ఉన్న కూనూరుగడ్డ గుట్టలపై ఉన్న 12 గ్రామాలు, రేఖపల్లి నుంచి తుమ్మలేరు వరకు ఉన్న కొండరెడ్ల గ్రామాలు కనుమరుగ వుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగల్లో కొండరెడ్ల తెగ ఒకటి. ఈ తెగ రాతియుగానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. తూర్పుకనుమల్లో ముఖ్యంగా గోదావరికి ఇరు పక్కలా గుట్టలపై దట్టమైన అరణ్యాల్లో నివసించే అరుద్కెన గిరిజనులు కొండరెడ్లు. కొండరెడ్డి అంటే కొండలపై నివసించే మనిషి అని అర్థమట…! తాము సూర్యవంశానికి చెందినవారమని చెప్పుకునే కొండరెడ్లు స్వాభావికంగా అమాయకులు. నిగర్వంగా,నిరాడం బరంగా, ఆధునిక సమాజానికి దూరంగా గుట్టలపై జీవిస్తుం టారు. వీరి గ్రామాల్లో ఈనాటికీ మౌలిక సౌకర్యాలు లేవు. రహదా రులు, విద్యుత్తు, విద్య, వైద్య మొదల్కెనవి కరువే. మూఢ నమ్మకాలు, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, మంత్రతంత్రాలు ఇలాంటివెన్నో వీరి జాతిలో ఈనాటికీ ఉన్నాయి. విచిత్రమేమిటంటే ఆధునికులుగా, నాగరికులుగా చెప్పుకునే గిరిజనేతరులు వీరి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. కొండరెడ్లను ప్రధాన జన జీవన స్రవంతిలో కలపాలని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా ఈనాటికీ అది పూర్తి ఫలితాలు ఇవ్వలేదు.
పోడు వ్యవసాయమే జీవనాధారం
గుట్టలపై నివసిస్తున్న కొండరెడ్లకు పోడువ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండలపైవాగులకు దగ్గరగా ఉన్న భూము లను చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తుంటారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు మొదల్కెన వర్షాధార పంటలు పండిస్తారు. వీరు నిరక్షరాస్యులు కావడం, నాగరిక సమాజానికి దూరంగా ఉండటంతో ఆధునిక వ్యవసాయ విధానాలు తెలియవు కాబట్టి ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. అయితే ఆధునిక పోకడలు సంతరించుకున్న కొందరు కొండరెడ్లు సాధారణ రైతులతో పోటీ పడి పంటలు పండిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటివారు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపి పట్టుదలగా చదవిస్తున్నారు కూడా. అయితే మొత్తం మీద చూస్తే ఇలాంటివారి శాతం చాలా తక్కువ. పోడు వ్యవసాయంతో పాటు వెదురుతో తట్టలు, బుట్టలు, చాపలు, తడికెలు మొదల్కెనవి తయారుచేసి వారపు సంతల్లో అమ్ముతారు. అడవుల్లో లభ్యమయ్యే తేనె, జిగురు, చింతపండు తదితరాలూ విక్రయిస్తారు. వర్షాకాలంలో పనులు దొరక్క ఆకలితో అల్లాడు తుంటారు. శనగగడ్డలు, జీలుగుచెక్క, మామిడి టెంకలు వీరికి ఆహారం. కొండరెడ్లలో 30శాతం మంది అడవుల్లో లేదా వాటికి దగ్గరగా నివసిస్తుంటారు. వీరు ఇళ్లలోనే అనేక పండ్లచెట్లు పెంచు తుంటారు. చింతచెట్లను ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. అనేక గిరిజన జాతుల్లో మాదిరగానే కొండరెడ్లకు కూడా వేట ప్రధాన వ్యాపకం. మగవారు ఎప్పుడూ విల్లంబులతో తిరుగుతూ జంతువులను వేటాడుతుంటారు. వేటాడిన జంతువుల మాంసాన్ని సమష్టిగా పంచు కుంటారు. చేపల వేట కూడా ఉమ్మడిగానే సాగిస్తారు.
సంప్రదాయాలు…వేషధారణ
కొండరెడ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వారు వీటిని కట్టుబాట్లు అంటే, ఆధునికులు మూఢ నమ్మకాలు అంటారు. ప్రధానంగా చెప్పుకోవల్సినవి బాలికలు రజస్వల లేదా పుష్పవతి (మెచ్యూర్‌) కాగానే ఇళ్లకు దూరంగా ‘కీడుపాక’ పేరుతో ఓ చిన్నఇల్లు తయారుచేసి వారంరోజులు అక్కడే ఉంచుతారు. గర్భవతులను కూడా ప్రసవ సమయంలో అక్కడే ఉంచి ప్రసవమ య్యాక వారం రోజుల తరువాత ఇంటికి తీసుకొస్తారు. ముత్యాలమ్మ, గంగానమ్మ, భూదేవి, గండమ్మ మొదల్కెన దేవతలను కొలుస్తారు. వీరిని కొండ దేవతలంటారు. భూత వైద్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. అనారోగ్యం కలగ్గానే భూతవైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. అంటురోగాలొస్తే రకరకాల పూజలు చేస్తుంటారు. వీరిలో ఎక్కవ మంది కొండలు దిగి ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇష్టపడరు. దానికితోడు డబ్బు లేకపోవడం, రహదారులు, బస్సులు కరువువడంతో స్థానకం గానే నాటు వైద్యం చేయిస్తుంటారు. ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు పురుషులు ఎక్కువమంది చొక్కా లేకుండా గోచీలతో కనబడతారు. ఆడవారు చినిగిన, మాసిన బట్టలతో ఉంటారు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు మగవారు నిక్కర్లు, చొక్కాలు వేసుకుంటారు. ఆడవారు చీరలు కట్టుకుంటారు. మహిళలు చెవులకు వెండి దిద్దులు, ముక్కుపుడకలు పెడతారు. మెడలో రకరకాల కడియాలు వేసుకుంటారు. కాళ్లకూ కడియాలు, పట్టలు ధరిస్తారు. సంతల్లో దొరికే గిల్టు నగలు ఎక్కువగా కొంటారు. కొండరెడ్ల యువతులు, యువకులు ఫ్యాషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
వివాహాలు
కొండరెడ్లలో వివాహాలు మూడు రకాలుగా జరుగుతాయి. వీటిల్లో బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఒక రకం. దీన్ని ‘మొగనాలు’ అంటారు. పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం వంటిదే ఇది. అమ్మాయి, అబ్బాయి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకో వడం మరోటి. పెద్దలు కుదిర్చినపెళ్లి ఇంకోటి. వీరి వివాహాల్లో కట్నం ప్రసక్తి ఉండదు. బహుభార్యత్వం, పునర్వివాహాలు వీరిలో సాధారణం. ముఖ్యంగా తమ్ముడు చనిపోతే అతని భార్యను అన్న వివాహం చేసుకునే ఆచారం ఉంది.
పండుగలు
కొండరెడ్లు మూడు రకాల పండుగలు జరుపుకుంటారు. వానలు కురవగానే జరుపుకునే పండుగను భూదేవి పండుగ అంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు పందిని బలి ఇచ్చి పనులు ప్రారంభిస్తారు. పంటలు చేతికొచ్చే సమయంలో కోతల పండుగ చేస్తారు. మరొకటి మామిడికాయల పండుగ. కొండరెడ్లు నివసించే ప్రాంతాల్లో మామిడికాయలు ఎక్కువగా కాస్తాయి. అవి పక్వానికి వచ్చేవరకూ ఎవ్వరూ ముట్టుకోరు. పక్వానికి వచ్చాక గ్రామ పెద్ద అయిదారు కాయలు కోసి పూజ చేసి (దీన్ని గొందికి పెద్దడం అంటారు) పెద్దలకు పంచుతాడు. అప్పటి నుంచి మామిడి పండ్లు తినడం ప్రారంభిస్తారు. పండుగులు, జాతర్లు సమయంలో ఆట పాటలతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆసమయంలో ప్రత్యే కంగా వస్త్రధారణ చేస్తారు. జంతువుల కొమ్ములతో, నెమలి ఈకలతో అలంకరించుకుంటారు. పురుషులు కోయడోళ్లు వాయిస్తారు. ఆడవారు గిల్లలు మోగిస్తారు. వీరి గిరిజన నృత్యాలు చూడముచ్చటగా ఉంటా యి. వీరి డప్పు నృత్యం, కొమ్ము డ్యాన్స్‌ పాపులర్‌. పండుగల సమయాల్లో తెల్లవారేవరకూ ఆడ,మగ కలిసి కల్లు సేవిస్తారు. జీలుగు కల్లు వీరి ప్రత్యేకత.
అంతరిస్తున్న గిరిజన జాతుల్లో ఇదొకటా?
ప్రపంచంలో ఇప్పటికే అనేక ప్రాచీన గిరిజన జాతులు అంతరించిపోయాయి. ఇప్పడు పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా కొండరెడ్ల జాతి కూడా అంతరించే అవకాశముందని సామాజిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. వారుకొన్ని శతాబ్దాలుగా జీవించిన ప్రాంతం మునిగిపోయిన తరువాత కొత్త ప్రాంతంలో కృత్రిమంగా జీవితం సాగించాల్సిందే తప్ప ఆసహజత్వం ఉండదు. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు ఎంత చక్కగా అమలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ఏదిఏమైనా కొండరెడ్ల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీద ఉంది.
మర్యాదస్తులు కొండరెడ్లు
కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. ఆవిశేషాల సమాహారమేనని ప్రముఖ గిరిజన ప్రరిశోధ కులు డా॥విఎన్‌వికె శాస్త్రి అభిప్రాయపడ్డారు. కొండరెడ్లపై ఆయన చేసిన పరిశోధన..జీవన శైలి విశేషాలు..!
కొండరెడ్ల జీవన విధానాలపై1945లో హేమండార్ఫ్‌ రాసిన ‘రెడ్డీస్‌ ఆఫ్‌ బైసన్‌ హిల్స్‌’ పుస్తకం ఇప్పటికీ ప్రామాణికమే. నేను 1968-72 ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తూటిగుంట, గెడ్లపల్లి, ప్రాంతంలోని కొండరెడ్డి గ్రామాలలో నెలలతరబడి నివసించాను. ఇంకా చాలామంది కొండరెడ్ల మీద పరిశోధనా పత్రాలు, వ్యాసాలు రాశారు. వీటి సారాంశమే ఈ వ్యాసానికి ఆధారం. కొండరెడ్ల ప్రాంతం సందర్శించి వచ్చిన వారి మొట్టమొదటి అవగాహన వారి భాషమీద ఉంటుంది. వారి మాతృభాష తెలుగే అయినా ఆ స్వచ్ఛత నేను మైదాన ప్రాంతంలో కూడా ఎక్కడా చూడలేదు. 1972 ప్రాం తంలో నేను అక్కడ ఒకపరిశోధన నిమిత్తం వెళ్లాను. వారిఆర్థిక జీవనంపై పరిశోధన జరపాలి. పశ్చిమగోదావరి జిల్లా గెడ్డపల్లి గ్రామంలో మకాం పెట్టి ఆచుట్టుపక్కల గ్రామాలు తిరగాలి. అసలు గెడ్డపల్లి గ్రామంలో నలభై ఏండ్ల క్రితం నివాసం అంటే ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు అధికారులు. పోలవరం నుంచి తూటిగుంట వరకు లాంచిలో ప్రయాణం చేసి ఆరాత్రికి అక్కడే బస చేశాను. అప్పటికే గెడ్డపల్లి పాఠశాలలో పనిచేసే కొండరెడ్డి తెగకు చెందిన సహాయకుడు తూటిగుంటకు వేరే పనిమీద వచ్చి ఉన్నాడు. అతడి సాయంతో గెడ్డపల్లికి వెళ్లాలి. నా బెడ్డింగు, వంట సామాగ్రి, కిరోసిన్‌ స్టౌ అతడు తన కావిడిలో సర్ది ఉంచాడు. ఉదయం 9గంటల ప్రాంతంలో ఫల హారం ముగించి అడవిలో,కొండల్లో నడక ప్రారంభిస్తే సాయంత్రానికి గెడ్డపల్లి చేరు కున్నాం. అసలే చలిరోజులు. పాఠశాల ఉపాధ్యాయునికి కేటాయించిన ఒక చిన్న గుడిసెలో నా మకాం. పేరుకు గుడిసే కాని అది విశాలంగా, వెచ్చగా ఉంది. గ్రామస్తుల పరిచయం ఆరాత్రే జరిగింది. నేను నా పరిశోధన గురించి వివరించా. ఒక్కొక్క కుటుం బంతో వివరంగా మాట్లాడటానికి, రాసుకోవటానికి గంటకు పైగా సమయం పడు తుందని, అట్లాగే గ్రామంలో అన్నికుటుంబాల సర్వే చేయాలని చెప్పా. కొండరెడ్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వారి అభి వృద్ధికి ప్రణాళిక రచించడం నా వృత్తిలో భాగం అని కూడా వివరించా. దీంతో వారిలో వారికి చర్చ ప్రారంభమ యింది. ఉదయంపూట కొందరు, సాయంత్రం పూట కొందరు నాకుఅందుబాటులోఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వారిలోని ప్రజాస్వామ్యం, సమిష్టి నిర్ణయ తత్వం నాకు ఎంతగానో నచ్చింది. వారిలో వారు చర్చించుకునేటప్పుడు ‘’రెడ్డిగారు మీరు ఉండువారా వెళ్లువారా?’’ అని అడగటం చూశాను. ఎంతటి మర్యాదయిన భాష. చర్చ అంగీకారం తెలుసుకోవటం ప్రజా స్వామ్యానికి పరాకాష్ట. అయితే ఇవే గ్రామాలు ఇప్పుడు వారి అంగీ కారం లేకుండానే, పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతు న్నాయని తెలిసిన తరువాత ఎంతో క్షోభ అనుభవించాను. ఎంతటి ఉన్నతమైన సంస్కృతి మునిగి పోతుంది! వారితో చర్చించవలసిన అవసరమే లేదనే భావన పాలకుల్లో ఉందంటే ఏమనాలి? మాటల్లో నేను పోడుపొలాలను కూడా చూస్తానని ఓరెడ్డిగారికి చెప్పాను. ఆయన ‘’అయ్యా నేను ఓపలేను’’ (నాకు ఓపిక లేదు), రామిరెడ్డిగారి పోడుకు వెళ్లండి. మాఅందరిదీ ఒకేపద్ధతి అని వివరించారు. వారి భాషపై అభిమానం వారి మర్యాద పూర్వక సమాధా నాలు అబ్బురమ నిపించాయి. కొండరెడ్లు భాషలోనే కాదు రూపంలో కూడా ఆకట్టుకుం టారు. మరీఎత్తు, పొట్టి కాని ఎత్తుతో, బలమైన శరీరంతో విశాలమైన ముఖంతో, పసుపురంగుచర్మంతో, మిగిలిన ప్రజలకంటే వేరుగా ఉంటారు. వారంవారం జరిగే సంతల్లో వారిని వెంటనే గుర్తుపట్టవచ్చు. కొండరెడ్ల సమాజంలో చాలా ఇంటిపేర్లు ఉంటాయి. వల్లాలు,పోటేరు, కడపల, సాయంత, కత్తులలాంటి వాటిని పరిశోధకులు పేర్కొన్నారు. వీరిది పితృస్వామ్య సమాజం. అందువల్ల ఆస్తి తండ్రి నుండి కుమారునకు బదిలీ అవుతుంది. అట్లాగే అధికారం కూడా. పెండ్లి తరువాత భర్త ఇంటికే స్త్రీవెళుతుంది. పురుషుడు ఓలి కట్టడం సర్వ సామాన్యం. పోడు వ్యవసాయం, వేట, అటవీ సంపద సేకరణ లాంటి ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉండటంవల్ల చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు కూడా చిన్నవే. పని ముట్లు కూడా చాలా తక్కువ. పెద్దకత్తి, చిన్న కత్తి, విల్లంబులు అందరి దగ్గర ఎప్పుడూ ఉంటాయి. పోడువ్యవసా యంలో జొన్నలు పండిస్తారు. అయితే గోదారిఒడ్డున గ్రామాల్లో స్థిర వ్యవ సాయం, పొగాకు వంటి వాణిజ్యపంటలను పండిరచడం 1970 వ దశకంలోనే చూశాను. తూర్పుగోదావరిజిల్లాలో పండ్ల తోటల పెంప కం కూడా చేపట్టారు.
ఒకరికొకరుగా..
కొండరెడ్ల పంచాయితీవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.గ్రామ సరిహద్దు లోపలి వనరులు అందరికీ అందుబాటులో ఉంచడం వారి కర్తవ్యం. ‘’ఒక్కరి కోసం అందరు, అందరికోసం ఒక్కడు’’ అనే భావం ప్రతి పనిలోను కనిపిస్తుంది. ఇండ్లు కట్టుకునే సమయంలో బంధువు లందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అట్లాగే పెండ్లిళ్లు, చావు లాంటి సందర్భాల్లోనూ సమిష్టి తత్వం కనిపిస్తుంది. వేటాడి జంతు మాంసం అందరూ పంచుకుంటారు. పెద్దమనిషి, పిన్న పెద్ద మనిషి, పెద్దకాపు లాంటి పేర్లు వారి సామాజిక స్థాయిని చూపిస్తాయి. వీరందరూ కలిసి పంచాయితీ నిర్వహిస్తారు. పంచాయితీలో ప్రజా స్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది. పంచాయితీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం. కొండరెడ్లు పోడు వ్యవసాయమే కాకుండా అటవీ శాఖ నిర్వహించే పనుల్లో కూలీలుగానూ పనిచేస్తున్నారు. ముఖ్యంగా వెదురు కూపుల్లో వారు చూపే నైపుణ్యంవల్ల వీరినే కూలీలుగా ఎంచుకుం టారు. వారి దేవతలందరూ చుట్టుపక్కల అడవిలోనే ఉండి కాపా డుతారని వారి నమ్మకం. అయితే అతి సున్నితమైన జీవన విధానం కలిగిన వీరి నివాస ప్రాంతం ముంపుకి గురైతే వీరు వేరే చోట ఎట్లా జీవించగలరనేది నాభయం. సామాజిక ప్రభావం అంచనా కట్టవలసిన అవసరమే లేదు అనేది పాలకుల అభిప్రాయం. కేంద్రప్రభుత్వం రెండు సార్లు ఆర్డినెన్సులు కూడా ఇచ్చింది. అయినా అది చట్టం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పాలకుల్లో వచ్చిన ఈభావన మరో రూపంలో ప్రత్యక్షమవుతుంటే ఇటువంటి అతి సున్నిత నాగరి కత కలిగిన తెగలు ఏమైపోతాయనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. వారి సాంస్కృతిక వైభవం ఎట్లా కాపా డాలనేది ముఖ్యమైన అనుబంధ ప్రశ్న.

రాష్ట్రాన్ని వెంటాడుతున్న ప్రకృతి విఫత్తులు

ఏదోక ప్రాంతంలో తుఫాన్లు వెంటాడుతున్నాయి. కోస్తాంధ్ర, తీరాలను పెథాయ్‌ తుపాను వణికించింది. అక్టొబరులో తిత్లీ, డిసెంబరు 15న పిథాయ్‌, గత ఏడాదిలో గజ, 2014లో హూదూద్‌..ఇలా ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఏదో ఒకప్రకృతి విపత్తు భయపెడుతూనే
ఉంది.- గునపర్తి సైమన్

‌రాష్ట్రంలో తుపాన్లు వెంటాడుతున్నాయి. ఏపీలో మూడు, నాలుగు నెలలకోసారి వచ్చి పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట తుపాను తన ప్రతాపాన్ని చూపుతోంది. మొన్న తిత్లీ, నిన్న గజ, నేడు పెథాయ్‌.. ఇలా వరుసగా తుపాన్లు వస్తూనే ఉన్నాయి. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలం కాగా, గజ తుపాను మరికొన్ని జిల్లాలను గజగజ వణికించింది. తాజాగా పెథాయ్‌ కూడా హాయ్‌ అని పలకరించింది. తుపాను తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ- రాజోలు మధ్య తీరం దాటి తన ప్రభావాన్ని తగ్గించుకుంది. అయితే తుపాను ధాటికి ఆ జిల్లా అతలాకుతలమైంది. భారీగా వీచిన గాలులు, జోరుగా కురిసిన వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్డు రవాణా నిలిచిపోయింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది.
2014లో హుదూద్‌.. 2018లో తిత్లీ తుపాన్లు ఉత్తరాంధ్రను వణికించాయి. అక్టోబరు, నవంబరు తుపాన్ల సీజన్‌లో మళ్లీ తుపాను వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర వాసులు హడలిపోతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుదూద్‌ మిగిల్చిన విషాదం నుంచి తేరుకోని కుటుంబాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. తాజాగా తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయనగరంల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పంట పొలాలు, కొబ్బరి, జీడి, నివాసాలు, పశువుల పాకలు ఇలా అన్నింటినీ తుడిచిపెట్టింది. పది రోజులు దాటినా శ్రీకాకుళం ప్రజలకు తాగునీరు, విద్యుత్‌, ఆహారం వంటివి పునరుద్ధరించలేదు. అదే విధంగా డిసెంబరు 15న సంభవించిన పిథాయ్‌ తుఫాన్‌ ఉభయగోదావరి,కృష్ణ, కోస్తాతీరప్రాంతంలోని వ్యవసాయాన్ని విచ్ఛన్నం చేసింది. లక్షలాది ఎకరాల్లో చేతకందిన పంటలు నీటమునిగి సర్వనాశనమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల పంటనష్టం వాటిల్లింది. ఎంతోమంది రైతులు, రైతుకూలీలు మృత్యువాత పడ్డారు.
తుపాను బారిన పడిన వారిని ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వాలు నష్ట నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా అపారనష్టం కలిగేలా తీరాన్ని ధ్వంసం చేసే విధానాలకు తెరతీస్తున్నాయి. తుపాన్లను ఎటూ అడ్డుకోలేం. కనీసం అవి కలిగించే నష్టాన్ని తగ్గించేందుకు తీర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకూ మడ అడవులను పరిరక్షించాలి. ఉన్నవాటిని నరికేయకుండా ఉండటం, లేని చోట వాటిని పెంచడం వల్ల తుపాన్లు తీరాలను తాకేటప్పుడు సముద్రం నుంచివచ్చే తీవ్ర, పెనుగాలల వేగాన్ని అడ్డు కుని కొబ్బరి చెట్లు, నివాసాలు, ఇతరత్రా కూలిపోకుండా మడ అడవు లు రక్షిస్తాయి. వీటిని ద ృష్టిలో పెట్టుకునే 2011లో కేంద్ర అటవీ, పర్యావరణ, సాంకేతిక మంత్రిత్వశాఖ తీరప్రాంత నిర్వహణ (సిఆర్‌ జెడ్‌) పేరుతో పలు నిబంధనలను రూపొందించింది. అధిక పోటు పాటు (హెచ్‌టిఎల్‌) నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదని చట్టం చేసింది. అయినా కూడా ఫార్మా కంపెనీలు, హోటల్‌ యజమాన్యాలు వాటిని ఉల్లంఘించి ఎప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుంచి జిఒలు పొంది యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాలతో ఎపికోస్టల్‌ జోన్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాన్స్‌ (సిజెడ్‌ఎంపి) ప్రకారం హెచ్‌టిఎల్‌ నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదన్న వాటికి స్వస్తి పలికి 100 మీటర్లు, కొన్ని చోట్ల 200 మీటర్లకు కుదించారు. వీటిపై తాజాగా ఎపిలోని అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు. వీటి వల్ల తీర ప్రాంత నిర్వహణ అస్తవ్యస్తమవుతోంది. తీరం అంచునే వందల అడుగుల లోతులో బోరు బావులు వేయడం, మడ అడ వులను నరికేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడు తున్నారు. వీటి వల్లే తుపాను సమయాల్లో సముద్రం ముందుకు రావడం, పెను గాలులు విరుచుకుపడటంతో అపారమైన నష్టాలను చవిచూడాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈవిపత్తులు ఎందుకు జరుగుతున్నాయి?
దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు సేఫ్‌ జోన్‌లో లేవా? ఎందుకు కేవలం పట్టాణాలే ముంపుగురవుతున్నాయి. కారణాలు ఎన్నో..కానీ బలవుతున్నది మాత్రం సామాజిక జనమే. కాంక్రిట్‌ జంగిల్‌, అల్ట్రా మోడ్రన్‌ సిటీగా మారుస్తామని చెబుతున్న ప్రజాప్రతి నిధులు, అధికారపార్టీలు..ఎందుకు ఈ విపత్తుపై సమగ్రంగా ఎదురు కోవడం లేదు అన్న ప్రశ్నలు సామాన్య జనంలో ఉత్పన్నమౌతున్నాయి. దేశంలో ఎన్ని పట్టణాలు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి… అధికారుల నోటిలో సమాధానం ఉందా? అంటే దాదాపుగా దొరకదు. తాజాగా ఘోర విఫత్తు ఎదురుకుంటున్న చెన్నై,కేరళ ఇంతటి ధారుణానికి గురికా వడానికి పలు కారణాలు కూడా లేకపోలేదు. ఇందుకు గల కారణాలు పర్యా వరణ శాస్త్రవేత్తలు అంచనాలు వేచారు. ముఖ్యంగా చెన్నై లో మూడు నదులు ప్రవహిస్తాయి. కొసస్తతలయార్‌, కూవూం, అడయార్‌ నదులు ప్రవహిస్తాయి. అయితే ఈనది పరివాహక ప్రాంతాలు ఆక్రమణకు గురికావడం వల్ల నదులు యొక్క పరిమాణం తగ్గాయి. అంతే కాకుండా బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన బంగింగ్‌ హామ్‌ కెనాల్‌ నిర్వహణ గురించి ప్రస్తుతం ఉన్న పాలకులు పట్టించుకోకపోవడం. చెన్నై నగరంలో డ్రైనేజీ సిస్టమ్‌ సరిగా లేకపోవడం, ఇకపోతే గత ప్రభుత్వ హాయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వరదనీరు నేరుగా నదుల్లో పడే విధంగా కాలువలు తొవ్వారు, అయితే వాటిని తాజా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిచిపోవడమే ప్రదాన కారణాలుగా కనిపిస్తు న్నాయి. చెన్నై నగరంలో దాదాపుగా 600 పైగా చెరువులు ఉండేవి, కానీ ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా కనిపించుకుంటా పోయాయి. దీనికి చెరువులు కూడా ఆక్రమణకు గురికావడమే ప్రధాన కారణం. అయితే ఇవ్వనీ సక్రమంగా ఉంటే చెన్నై లో ఇంత భీభత్సం ఉండక పోయేదని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఓ ప్రణాళిక లేకుండా జరిపిన నిర్మాణాల వల్లనే ఈదుస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి పదేండ్లలో ఒకసారి ఇటువంటి భారీ వర్షాలు చెన్నై కి అనుభవమే. 1969, 1976, 1985, 1996, 1998, 2005, 2015 లో కుండపోత వర్షాలు కురిశాయి.
పెరుగుతున్న విఫత్తులు :
ఇటీవలి కాలంలో సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అలాప్రకృతి విపత్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ ప్రచురిం చింది. ఆ జాబితాలో భారత్‌ పొరుగు దేశం బంగ్లాదేశ్‌ కూడా ఉంది. భూకంపాలు, సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న 172 దేశాలను ఈ రిపోర్ట్‌ అధ్యయనం చేసింది. దాంతో పాటు ఆవిపత్తులకు ఆయా దేశాలు స్పందించే శక్తిని కూడా అంచనా వేసింది. జర్మనీకి చెందిన వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్య యనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తు న్నారు. గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది 18 ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది. ప్రమాదం పొంచి ఉన్నప్రాం తాలు (ఆధారం:వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2018)
వ.స దేశం ప్రమాద తీవ్రత సూచీ (100కు)

  1. వానువాటు 50.28
  2. టోంగా 29.42
  3. ఫిలిప్పీన్స్‌ 25.14
  4. సోలోమన్‌ దీవులు 23.29
  5. గుయానా 23.23
  6. పపువా న్యూ గినీ 20.88
  7. గ్వాటెమాలా 20.60
  8. బ్రూనే 18.82
  9. బంగ్లాదేశ్‌ 17.38
  10. ఫిజీ 16.58
  11. కోస్టారికా 16.56
  12. కంబోడియా 16.07
  13. ఈస్ట్‌ టైమర్‌ 16.05
  14. ఎల్‌ సాల్వడర్‌ 15.95
  15. కిరీబాటీ 15.42
    ఈ జాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అన్నిటి కంటే దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదంతో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను రూపొందించారు. అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్‌, చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపించలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్‌ కూడా జాబితాలో 65వ స్థానంలో ఉంది. ఈ దేశాలు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆ నివేదిక చెబుతోంది. ఈఅధ్యయనం ప్రకారం అత్యంత తక్కువ ప్రమాదం పొంచి ఉన్న దేశం ఖతార్‌.
    ప్రకృతి విపత్తుల ప్రమాదం తక్కువ
    2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా. ఈ విపత్తులు ప్రజల జీవితాలను నాశనం చేయడంతో పాటు దేశాలను మరింత పేదరికంలోకి నెట్టేస్తాయి. ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతా ల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది. ‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవిం చిన ఫైలిన్‌ తుపానునే తీసుకుంటే ఆ తుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే. కాబట్టి ఆప్రాంతానికి ఆర్థిక సాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఓడీఐ)కు చెందిన డాక్టర్‌ మిషెల్‌ వివరిస్తారు. ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారిపోయే దేశాల జాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్‌ తొలి స్థానంలో ఉంది.
    ‘తిత్లీ’ తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్‌
    2012 నాటి ‘మ్యాపిల్‌ క్రాఫ్ట్‌’ నివేదిక ప్రకారం…ఆసియాకు చెందిన బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌, భారత్‌, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రక ృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది. విపత్తులను నివారించలేకపోయినా, వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆవిషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకో వచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు. 1999లో ఒడిశాలో సంభ వించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలా పాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సహకారంతో దాదాపు 900 తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది. ‘1999 పెను తుఫాను తరువాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆపైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థం గా ఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.
    1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?
    ఐఐటీ-ఖరగ్‌పూర్‌ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు. లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మించారు. తీర ప్రాంతాల్లో 122 సైరన్‌ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 17 జిల్లాల్లో ‘లొకేషన్‌ బేస్డ్‌ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందించారు. బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పరిచారు.మత్స్యకారుల కోసం ప్రత్యక వార్నింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు
    తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
    తుపాను వచ్చినపుడు ఏం చేయాలి? తుపాను నుంచి ఎలా తప్పించుకోవాలి? తుపాను రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? భారత వాతావరణ శాఖ చెబుతున్న సూచనలు ఇచ్చాంది. తుపాను వస్తుందన్న సమాచారం అందిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. పెంకులు,పైకప్పు,తలుపులు,కిటికీలు ఎలా ఉన్నాయో చూసి తగిన మరమ్మతులు చేయాలి. ఇంటి పరిసరాలనూ పరిశీలిం చాలి. ఎండిన చెట్లు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను తొలగిం చాలి. గాలికి ఎగిరి వచ్చి పడే అవకాశమున్న హోర్డింగ్‌లు, ఇతర భారీ వస్తువులను తొలగించాలి. కిటికీల దగ్గర, గాజు పదార్థాలకు ముందు చెక్కలను అడ్డుగా పెట్టాలి. దీని వల్ల గాలికి కొట్టుకుని వచ్చి తగిలే వస్తువుల నుంచి వాటికి, ఇంటికి రక్షణ లభిస్తుంది. ఒకవేళ చెక్క పదార్థాలు లేకుంటే.. కిటికీలకు, గాజు పదార్థాలకు కాగితాలను అంటించాలి. కరెంటు పోయి నపుడు వెలుగు కోసం లాంథర్లు, కిరోసిన్‌ దీపాలు, ఇతర ఫ్లాష్‌ లైట్లు, బ్యాటరీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పాడైన, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి. కరెంటు పోయినపుడు టీవీలు పని చేయవు. మరి వాతావరణ సంబంధిత హెచ్చరికలు అందుకోవడం ఎలా? అందు కోసం మొబైల్‌ ఫోన్లను చార్జ్‌ చేసి పెట్టుకోవాలి. లేకుంటే రేడియోలను సిద్ధం చేసుకోవాలి. మీకు అందిన తుపాను సంబంధిత అధికారిక సమాచారాన్ని ఇతరులకూ చేరవేయాలి. విపత్తు సమయాల్లో వదం తులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందువల్ల మీకు అధికారిక వెబ్‌ సైట్లు వార్తా సంస్థలు అందించిన సమాచారాన్నే ఇతరులకు చేరవేయండి. అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయొద్దు. భారీ అలలు ఎగసి పడే అవకాశమున్న సముద్రతీరాల వద్ద తుపాను సమయంలో ఉండకూడదు. వరదవచ్చే అవకాశం ఉన్నచోట ఉంటే.. వెంటనే ఖాళీ చేసి పునరావాస శిబిరాలు, లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విలువైన వస్తువులను వీలైతే తీసుకెళ్లాలి. లేకుంటే ఎత్తైన చోట ఉంచాలి.వండాల్సిన అవసరం లేకుండా వెంటనే తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రెండు మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అలాగే సురక్షిత తాగునీరు, దుస్తులు కూడా. గాలి బలంగా వీస్తున్నపుడు దానికి ఎదుటివైపు తలుపులను, కిటికీలను తెరవకూడదు. గాలి ప్రభావం లేని వైపు తలుపులు, కిటికీలు తెరవ వచ్చు. మీరున్న చోట నుంచి తుపాను తీరం దాటుతున్నా లేకుంటే తీరం దాటి వస్తున్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గంటల పాటు భారీ వర్షాలు, బలమైన గాలులకు సిద్ధంగా ఉంటూ సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి. చిన్నారులను మరింత సురక్షిత ప్రదేశాలకు పంపాలి. వేలాడే విద్యుత్తు తీగలు కనిపిస్తే వాటిన తాక వద్దు. ఆ ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక రిపేర్లు చేయించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉన్న సమాచా రాన్ని మీ బంధువులకూ చేరవేయాలి. వాహనాలను నడుపుతున్నపుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలి.

1 3 4 5