నిర్మలమ్మ బడ్జెట్‌(20232024) ఆశల ఆవిరి

75 ఏండ్లు పూర్తయిన స్వతంత్ర భారత తొలి బడ్జెటును నేను ప్రవేశ పెడుతున్నా’ అని గొప్పగా చెప్పిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయింపులకు వచ్చేసరికి పెదవి దాట లేదు. ప్రధానితో సహా మంత్రులం దరూ మాట మాటకు బల్లలు ఎట్ల రిథమ్‌ వచ్చేలా చర చాలని పార్లమెంట్‌ సాక్షిగా ప్రాక్టీస్‌ చేశారు. అధికార పార్టీ ఎంపీలైతే మోదీ నామాన్ని పోటీపడి స్మరించుకు న్నారు. ఇటు నిర్మలా సీతారామన్‌ కూడా అమృత్‌ కాల్‌, ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌, ప్రధానమంత్రి వికాస్‌ యోజన లాంటి పేర్లను జోడిరచి విన సొంపైన కవితలుగా కార్యక్రమాలను వల్లె వేశారు.
సప్తఋషిపేరుతో1)సమ్మిళిత అభి వృద్ధి 2)చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం 3)మౌలిక వసతుల కల్పన 4) పెట్టు బడులకు ప్రోత్సాహం(5)సంభావ్యతలు 6)హరి తవృద్ధి7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కలను దృష్టిలో పెట్టుకొని ఆరాష్ట్రానికి బడ్జెట్‌ కటాయింపులు చేయడం గమనించదగ్గ విష యం.బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు ఏవిధమైన రోడ్‌ మ్యాప్‌లేదు.ఏకలవ్య స్కూల్స్‌ లో మాత్రం 38,800 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న10లక్షల ఉద్యోగాలను ఎప్పుడుభర్తీ చేస్తారో చెప్పలేదు. వీటి కోసం కొన్నికోట్ల మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. అమె జాన్‌, మైక్రో సాఫ్ట్‌ లాంటిసంస్థలు కూడా ఉద్యోగులను తీసి వేస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎలాం టి నిధులు కేటాయించకపోవటం దురుదృష్ట కరం. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.75వేల కోట్లు ప్రకటించారు. అది కేవలం 100 నగరాలకు మాత్రమే. కానీ గ్రామీణ సడక్‌ పథకానికి కేటాయిం పులు పెరగలేదు. ఎస్టీల సంక్షేమాన్ని మరిచి 3 కోట్ల ఎస్టీ కుటుంబాలకు కేవలం 15 వేలకోట్లు మాత్రమే కేటాయించారు. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.స్కూళ్ళ నిర్మాణానికి ఖర్చు పెట్ట రు కానీ ఎంతో ఖర్చుతోకూడుకున్న డిజిటల్‌ లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. రాష్ట్రాలకువడ్డీ లేనిరు ణాలు మరో ఏడాదిపాటు ఇస్తామన్నారు. దీనికి బడ్జెట్‌లో రూ.13.7లక్షల కోట్లు కేటాయించారు. తిరిగి చెల్లించడానికి దీనికి 50ఏండ్ల వ్యవధి ఇస్తుం డగాబీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఈ కేటా యింపులు ఉండటం గమనార్హం. నిర్మలమ్మ మాట్లాడుతూ9ఏండ్లలో తలసరి ఆదాయం రెట్టింప య్యిందన్నారు. అదే సమయంలో చైనా తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగింది. ఇటు తెలం గాణలో మూడు రెట్లు పెరిగింది. అలాగే కేవలం 23 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న అదాని గ్రూప్‌ సంపద విలువ ఈకాలంలో దాదాపు 125రెట్లు పెరిగింది.నిర్మలా సీతారా మన్‌ బడ్జెట్‌ పునాదులపై దేశ నిర్మాణం చేపట్టేం దుకు ఈ వార్షిక బడ్జెట్‌ దోహదపడుతుందని చెప్పారు. కానీ వారిమాటలు తప్ప చేతలు ఆశా జనకంగా లేవు. దేశంలో వ్యవసాయ కూలీల స్థితిగతులు మార్చిన గ్రామీణఉపాధి హామీ పథ కానికి నిధులు పెంచలేదు.ఎంతో కాలంగా ఈ పథకాన్నివ్యవసాయానికి అనుసంధానం చేయా లని,అర్బన్‌ ప్రాంతంలో కూడ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు రావాలని కోరుతున్నా పట్టించుకోలేదు.ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20లక్షలకోట్లు.ఈ రంగంలో జీవనం సాగిస్తున్న56శాతం జనాభాకు ఇది ఏ మూలకు సరిపోదు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రేరణగా కిసాన్‌ సమ్మాన్‌ యోజ నను తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు మత్స్యకా రుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అనుకరించింది. మత్స్య సంపద పెంపుదలకు, మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్‌ విస్తరణ కోసం రూ.6000 కోట్లు పెట్టుబడు లు పెట్టనున్నట్లు ప్రకటించింది. చేనేతరంగాన్ని ఆత్మనిర్భర్‌ కిందఅభివృద్ధి చేస్తా మని చెప్పటం చేనేత కార్మికులకు కొంతఉపశ మనం.అలాగే తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్‌, హరితహారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వ నున్నది.నాణ్యమైన, ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్క లను ప్రోత్సహించడం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించింది. సిరి అన్నం పథకం ద్వారా చిరుధా న్యాలను రైతులకు అందించడం మంచి పరిణా మం. తెలంగాణలో సఫలమైన గురుకుల విద్యాల యాలను ఆదర్శంగా తీసుకొని ఏకలవ్య పాఠశాల లను పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం, అలాగే ఇంటింటికి నల్లా నీళ్లనిచ్చే మిషన్‌ భగీరథ లాంటి స్కీంలను కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ క్రింద దేశ వ్యాప్తంగా అమలు చెయ్యడం మంచి పరిమాణమే కానీ, తెలంగాణ కృషిని గుర్తించి, గౌరవించాలన్న కృతజ్ఞతను మాత్రం చూపలేదు.
మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకీకరణ,పెట్టుబడుల ఉపసంహరణలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొంటున్నది. ప్రతి ఏడాది రూ.50 వేల కోట్లకు తక్కువ కాకుండా కేంద్రఖజానాను మాత్రం నింపు కొంటున్నది. తనఅనుకూల కార్పొరేట్ల కడుపు నిం పటం కోసం ఈసారిరూ.51వేల కోట్లను సమీకరిం చాలన్న లక్ష్యాన్ని నిర్ధారించుకున్నది. అందులో భాగంగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ,స్టీల్‌ లిమిటెడ్‌,బి.ఇ.యం.ఎల్‌., హెచ్‌. ఎల్‌.ఎల్‌. లిఫ్కర్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీఐ బ్యాంక్‌, వైజాగ్‌ స్టీల్‌ అమ్మకానికి నిర్ణయం తీసుకోవడం దేశప్రజలకు తీరని అన్యా యం.
ప్రస్తావన లేని వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
రాష్ట్ర విభజన చట్టం హామీల్లో భాగం గా వెను బడిన జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున కేటాయించాల్సింది.ఉత్తరాంధ్రలోని విశాఖ, విజ యనగరం,శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ఈ నిధులు కేటా యించాల్సి ఉంది. 2015 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది రూ.50 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఆ నిధులను ఆపేసింది. తాజా బడ్జెట్‌లోనూ దాని ప్రస్తావన లేదు.
అన్నదాతలకు ఆశాభంగం
జిల్లాలో 3.90లక్షల మంది రైతులు ఖరీఫ్‌,రబీ సీజన్‌లో కలిపి 6లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమకు రాయితీలు ప్రకటిస్తుందని భావించిన అన్నదాతలకు భంగపాటే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలపై ఎదురుచూసిన రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది.పంటల మద్దతు ధరకు సంబం ధించి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు ప్రస్తావనే లేదు. ప్రతి ఏడాది రైతులకు అందిస్తున్న రుణాల అంశం తప్ప గిట్టుబాటు గ్యారంటీ చట్టంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దేశవ్యాప్తంగా సేం ద్రీయ విధానాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటిం చింది. చిరు ధాన్యాలకు ప్రోత్సాహం, వినియోగం పెంచుతామని బడ్జెట్‌లో పొందుపరిచింది. జిల్లాలో ప్రస్తుతం 25ఎకరాల్లో చిరు ధాన్యాలను సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పంటల విస్తీర్ణం మరింత పెరగనుంది.
పిఎసిఎస్‌లపై పెత్తనం కోసమేనా?
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘాలపై పెత్తనం సాగించేలా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రస్తావన తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పిఎసిఎస్‌లను మ్యాపింగ్‌ చేయనున్నామని పేర్కొంది. పిఎసిఎస్‌లకు నూతన బైలాస్‌ రూపొందించి వాటిని బహుళార్థక సంఘా లుగా తయారు చేస్తామని చెప్తోంది.
పిఎం పివిటిజి మిషన్‌తో ఒనగూరేనా?
ఆదిమ తెగ గిరిజన కుటుంబాల్లో (పివిటిజి) సామా జిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి పివిటిజి మిషన్‌ను ప్రారంభిస్తామని బడ్జెట్‌లో పేర్కొంది.మిషన్‌ ద్వారా గిరిజన ఆవాసా ల్లో గృహ నిర్మాణాలు, రక్షిత మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రహదారి సౌకర్యం, పౌష్టికా హారం వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తోంది.
వినపడని రైల్వే కూత
రైల్వే బడ్జెట్‌ అనగానే కొన్ని నెలల ముందు నుంచీ అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు. మన ప్రాం తానికి ఏమైనా కొత్త రైళ్లు వేస్తున్నారా?,గతంలో ఇచ్చిన మోడల్‌ స్టేషన్ల హామీకి కార్యరూపం దాలుస్తుందా? రైళ్లకు అదనపు హాల్ట్‌లు కల్పిస్తున్నారా అసలు ఏం ప్రకటిస్తారోనని ప్రజలు ఉత్కంఠగా చూశారు. ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్‌పై ఏదైనా ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రైల్వేపరంగా జిల్లాకు మొండి చేయి చూపింది. కొత్త రైళ్లు లేకపోగా జిల్లా మీదుగా వెళ్తూ ఆగకుండా వెళ్తున్న రైళ్లకు హాల్ట్‌లు కూడా దక్కలేదు.రైళ్ల పొడిగింపు, స్టేషన్ల అభివృద్ధి ప్రస్తావ నే లేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసం గాన్ని వీక్షించిన తర్వాత ఆ వివరాలేవీ కనిపించక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధి మినహా కొత్త ప్రాజెక్టులు, రైళ్ల ప్రకటన లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశ చెం దారు.
వేతనజీవులకు నిరాశే
పన్నుల విషయంలో ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితినిరూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచినట్లే పెంచిన కేంద్ర ప్రభుత్వం, వారికి ఇప్పటి వరకు కొన్ని సౌకర్యాలపై కల్పిస్తున్న మినహాయింపు లపై కోత పెట్టింది.పాతవిధానంలో ఉన్న హెచ్‌ ఆర్‌ఎ, సిపిఎస్‌, 80సి,80డి,ఇళ్ల రుణాలపై అంది స్తున్న మినహాయింపులను ఆపేసింది. దీంతో వేతన జీవులు బడ్జెట్‌పై తీవ్రఅసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ : సిఐటియు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కార్మికులు, రైతులు, శ్రమ జీవులు,సామాన్య ప్రజలకు నిరాశనే మిగిల్చిందని సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు,పి.తేజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ధరల నియంత్రణ, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ బడ్జెట్‌ సహాయపడదని తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్‌ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్యమిషన్‌,జాతీయ విద్యామిషన్‌, జాతీయ జీవనోపాధుల మిషన్లను కేటాయింపులు పెంచ లేదని పేర్కొన్నారు. ఉపాధి హామీకి కేటాయింపుల్లో కోత పెట్టిందని తెలిపారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను కేటాయించి సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు చెయ్యాలన్న కోర్కెనూ పట్టించుకోలేదని విమర్శిం చారు. ఇపిఎస్‌ పెన్షనర్ల కనీస పెన్షన్‌ పెంచాలని లక్షలాది మంది వద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు చేస్తున్న ఆందోళనలు కూడా మోడీ చెవికి ఎక్కలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లోనూ రూ.61 వేల కోట్ల మేర ప్రభుత్వ సంస్థలను అమ్మాలని ప్రతిపాదిం చిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల పేరుతో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాలకు సవరణలు చేస్తామని చెప్తూ ప్రభుత్వరంగ బ్యాం కులు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రయివేటీకరణకు దారులు తెరిచిందని విమర్శించారు.రోడ్లు, రైళ్లు, విద్యుత్‌, టూరిజం తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించిందని తెలిపారు. ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈబడ్జెట్‌లో.గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు కానీ, ప్రత్యేక ప్రోత్సాహకాలుగానీ ఇవ్వలేదు. తెలంగా ణకు ఒక్కటంటే ఒక్కటి కూడా పారిశ్రామికవాడను ఇవ్వలేదు. మరోవైపు, బడ్జెట్‌లో రైతులకు సంబం ధించిన కేటాయింపుల్లో భారీగా కోతపెట్టారు. ఎరు వుల సబ్సిడీలు తగ్గించడంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లోకోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థికసంఘం సిఫార్సుల అమలు ఊసే లేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఉద్యోగులను భ్రమ ల్లో పెట్టేలా ఉన్నాయి తప్ప ఆశాజనకంగా లేవు. పన్నుల భారం నుంచి సామాన్యులకు లభించిన ఉపశమనం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా భ్రమలబడ్జెట్‌. పేదల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌.ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కోత విధించింది.గత బడ్జెట్‌లోరూ.89,400 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.60వేలకోట్లకు కుదిం చింది. తద్వారా ఉపాధి హామీ కూలీల ఉసురు తీసే చర్యలకు పాల్పడిరది. పేదల ఆహార భద్రత కు గతేడాది రూ.2,87,194 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,97,350 కోట్లకు తగ్గించింది.ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. బడ్జెట్‌ లో మాత్రం దాని గురించి ఏమీ ప్రస్తావించక పోవటం శోచనీయం. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్‌ కాలే జీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీలను ఆప్రాంతాలకే ఇస్తున్నట్లు ప్రకటించింది.అంటే తెలంగాణకు నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ మొండి చేయి చూపి మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో,మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగ నున్న కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల అభి వృద్ధి కోసం రూ.5,300కోట్లను కేటాయిం చింది.అదే సమయంలో విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతా ల నిధిగా మూడేండ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ.1350కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఇది పక్షపాత వైఖరి కాక మరెమిటి? పీఎం కిసాన్‌ నిధి కోసం గతేడాది రూ.68వేల కోట్లు కేటాయించగా,ఈసారి60వేలకోట్లకు తగ్గించ డంతో పాటు లబ్ధి పొందే రైతుల సంఖ్యను సైతం కుదించింది. గతంలో కిసాన్‌ నిధితో11.27 కోట్ల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 8.99కోట్లకు తగ్గించింది.మరోవైపు రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో రూ.50,120 కోట్ల కోత విధించింది. రైతులు పండిరచే పత్తిని కొను గోలుచేసి మద్ధతుధర కల్పించేందుకు కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియాకు గతంలో రూ.9243 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్‌లో కేవలం ఒకలక్ష రూపా యలే కేటాయించారు. ఇది రైతులకు నష్టం చేయ డంతోపాటు కాటన్‌ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసే కుట్ర. ఇక రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు గతేడాది బడ్జెట్లో రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,283కోట్లు కోత విధించి రూ.7, 150 కోట్లకు తగ్గించింది. దీన్ని బట్టి కేంద్రానికి రైతుల మీదున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతున్నది. మరోవైపు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే, 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతిస్తామని షరతు పెట్టింది.అంటే బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి, రైతుల ఇంటికి బిల్లు పంపించాలని చెప్పకనే చెప్పిం ది.ఈ నిబంధన వల్ల మన రాష్ట్రానికి మరో రూ.6 వేల కోట్లు రాకుండా పోతాయి. మైనారిటీల సంక్షే మానికి గతంలో రూ.5,020 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,097 కోట్లకు కుదించింది. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కచ్చితంగా విడుదల చేయాలి. కానీవాటిలో కూడా కేంద్రం కోత విధించి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.22, 908 కోట్లు ప్రతిపాదించి, సవరించిన పద్దుల ప్రకారం దాన్ని రూ.15,026 కోట్లకు కుదించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.46, 513 కోట్లు ప్రతిపాదించగా, దాన్ని రూ.41 వేల కోట్లకు కుదించారు. ఈ చర్యలు పట్టణ, గ్రామీణ సంస్థలను చిన్నచూపు చూడటంలో భాగమనే భావించాలి.అదే విధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో కూడా రూ.4,297 కోట్ల కోత విధించారు. 2023-24 బడ్జెట్‌లో నికర అప్పులు రూ.17,86,816 కోట్లుగా ప్రతిపాదించిన కేంద్రం అందులో సింహభాగం అంటే రూ.8,69,855 కోట్లు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారు. అప్పులను క్యాపి టల్‌ ఎక్స్‌పెండీచర్‌ కోసం కాకుండా, 48.7శాతా న్ని రోజువారీ ఖర్చులకోసం ప్రతిపాదించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.1979-80 నుంచి కేంద్రంలో రెవెన్యూ లోటు క్రమంగా పెరుగుతున్నది. 1979-80లో రూ.694 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా, 2022-23 సవరించిన అంచనాల ప్రకారం రూ.11, 10,546 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధం. రాష్ట్రాలు ఆనిబంధనలను పాటి స్తున్నాయి. కేంద్రం మాత్రం పాటించటం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. బాగా పని చేసే రాష్ట్రాలపై కూడా ఎఫ్‌ఆర్‌ బీఎం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ వాటికి నిధులు లేకుండా చేస్తున్న కేంద్రం, తాను మాత్రం ఎప్పటికప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘి స్తున్నది. తద్వారా తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది.2022-23లో కేంద్రం మొత్తం పన్నుల వసూలు రూ.33,68,858 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల వాటా రూ.10,21,488 కోట్లుగా అంచనా వేశారు.అదే సమయంలో కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నది. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి. కానీ కేంద్రం సెస్సులు, సర్‌ ఛార్జీల విధింపుతో రాష్ట్రాలకు అందుతున్నది 30 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయి.ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగుల, రైతుల, సామాన్య పౌరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్నది. తొలి నుంచీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షనే ఈసారీ కేంద్రం కొనసాగించింది.
భ్రమాపూరిత బడ్జెట్‌..
మన దేశానికి కావాల్సిన విజన్‌.. బడ్జెట్‌-2023లో లేదు. ఇంకా చెప్పాలంటే అతుకుల బొంతలాగా ఉంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదన్న వాస్తవాన్ని ఆర్థికమంత్రి విస్మరించారు. అంతేకాదు ద్రవ్యోల్బణం, అభివృద్ధి లేమి, నిరుద్యోగం కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలను, ఆర్థికరం గంలో నెలకొన్న కఠిన వాస్తవాలను కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఆర్థికరంగం నిరాశాజనక పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా.. ఏడు ప్రాధామ్యాలను ఈ బడ్జెట్‌ ప్రాతిపదికగా చేసుకున్న ట్లు కనిపిస్తున్నది. అవి..సమీకృత అభివృద్ధి, చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్య వినియోగం, పర్యావరణ అనుకూల అభివృద్ధి,యువశక్తిజి, ఆర్థికరంగం. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అనేది బహిరంగసభల్లో నినాదాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదు. దేశంలో28రాష్ట్రాలు,8 కేంద్ర పాలితప్రాంతాలున్నాయి. వీటిలో చాలావరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు దశా బ్దాల వ్యవధిలో ఏర్పాటయ్యాయి. ప్రతీ రాష్ట్రం తనదైన అభివృద్ధి దశలో, నమూనాలో ఉంది. కాబట్టి ప్రతీ రాష్ట్రానికి తనదైన ప్రణాళిక అవసరం. ఇంత వైవిధ్యం ఉన్న మన దేశంలో అన్నింటికీ ఒక్కటే అన్న సిద్ధాంతం పనికిరాదు. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంగానీ, ఆర్థిక మంత్రిగానీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఎటువంటి చర్చలు జరుపలేదు. పారి శ్రామికవేత్తలను,ఇతర భాగస్వామ్యపక్షాలను మా త్రం వారు సంప్రదించారు. నిజంగానే ఇది ‘అమృ తకాలం’ అయితే, సమ్మిళిత అభివృద్ధి కోసం బడ్జెట్‌ పూర్వ చర్చల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కేంద్రప్రభుత్వం సంప్రదించి ఉండాల్సింది. ఎందుకంటే వాస్తవ కార్యాచరణ, ఫలితాలు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి.
బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు, మత్స్యరంగానికి కేంద్రం కొన్ని పథకా లను ప్రకటించింది. అయితే, ఈ రంగాల్లో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఉత్పాదకతను రెట్టింపు చేసిన తెలంగాణ ప్రభుత్వం కృషిని గుర్తిం చటం మాత్రం ఆర్థికమంత్రి మర్చిపోయారు. సహకార రంగం కింద ‘ప్రాథమిక వ్యవసాయ సంఘాల’ కంప్యూటరీకరణను మంత్రి ప్రతిపాదిం చారు. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం కిందటే ఈపని పూర్తి చేసిందన్నది ఈ సందర్భంగా గమనిం చాల్సిన అంశం. అదీగాక సహకార రంగం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అటువంట ప్పుడు కేంద్రప్రభుత్వం దీనిపై బడ్జెట్‌లో ఎందుకు ప్రతిపాదనలు చేసిందన్నది అర్థం కాని విషయం. చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు: గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులను నియ మిస్తామని బడ్జెట్‌ ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ.. కేంద్రం ఒక్క ఏకలవ్య పాఠశాలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఈ స్కూళ్లను కేటాయించాలి. తెలంగాణలో కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ విద్యాలయాలు కేటాయించాలని కోరితే వాటినీ ఇప్పటి వరకూ ఇవ్వలేదు.మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు,పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తగిన నిధులను కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్య యాన్ని ఈ కేటాయింపుల నుంచి చెల్లించే (రీయిం బర్స్‌ చేసే) అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి. యువశక్తి: ఉద్యోగ కల్పనకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, యువతలో నైపుణ్యాల పెంపు దల, అప్రెంటిషిప్‌లకు ట్కస్టెపెండ్‌ చెల్లింపు వంటి చర్యలు అమలులోకి వస్తే మంచిదే. కానీ, ఇప్పటి వరకూ ఏ మేరకు అమలు అయ్యాయి అన్నదే అసలు ప్రశ్న.సాధారణ పౌరుల సంక్షేమం, అభి వృద్ధే లక్ష్యంగా జవాబుదారీతనంతో, పారద ర్శకంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయటం కోసం పలు దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. దీంట్లో భాగంగా కృత్రిమ మేధోరంగంలో (ఆర్టిఫీ షియల్‌ ఇంటెలిజెన్స్‌) ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లలో ఒకదానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయమని కేంద్రప్రభు త్వాన్ని కోరుతున్నాం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవ టానికి ప్రకటించిన చర్యలను బాధ్యతాయుత రాష్ట్రంగా తెలంగాణ స్వాగతిస్తున్నది. ఇదే సంద ర్భంలో, ఈ రంగంలో తెలంగాణ జరిపిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరితహారం కింద గత ఏడేండ్లలో 240కోట్ల మొక్కలను నాట డం జరిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 28 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది.ఈ రంగా నికి ప్రతిపాదించిన పలు అంశాలు దీర్ఘకాలిక మైనవి. వీటిని ఏ విధంగా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ రూపకల్పనలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపలేదు. 7 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. కానీ, రాష్ట్రాల పాత్ర లేకుండా దీనిని సాధించటం ఎలా సాధ్యమవుతుంది?ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ వాస్తవాలను విస్మరించిన కసరత్తుగానే నిలిచి పోయింది.
-(డాక్టర్‌ బైరి నిరంజన్‌/బి.వినోద్‌కుమార్‌)