మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాల సాగు

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగామిరియాల సాగు, విస్తీర్ణం,వినియోగం,ఎగుమతుల్లో భారతదేశం మొదటిస్థానంలోఉంది.సంప్రదాయ సాగు ప్రాం తాలైన కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తి అధికంగా ఉంది. సంప్రదాయేతర ప్రాంతం అయినా అల్లూరిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు,నేల,శీతలవాతావరణం వం టివి అనుకూలంగా ఉన్నాయి.ఈపరిస్థితుల్లో చింత పల్లి,గూడెంకొత్తవీధి,పాడేరు,అరకు,అనంతగిరి వంటిప్రాంతాల్లోకాఫీలోఅంతరపంటగా మిరి యాల సాగు జరుగుతోంది.ప్రస్తుతంమన్యం వ్యాప్తం గా1.56లక్షలఎకరాల్లో కాఫీసాగు జరుగు తుండ గా అందులో అంతరపంటగా మిరియాలు50 వేల ఎకరాల్లో వేస్తున్నారు.ఏటా 3,300 మెట్రిక్‌ టన్నుల మిరియాల ఉత్పత్తిజరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటాఉద్యాన నర్సీరీల ద్వారా 9లక్షల మిరియాల మొక్కలను సిద్ధం చేసి గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.లి కేజీ కాఫీ గింజల ధర మార్కెట్‌లో రూ.100వరకూఉంటే అదే కేజీ మిరియాల ధర రూ.500 వరకూ ఉంది. ప్రధాన పంట అయిన కాఫీ కంటే నాలుగైదు రెట్లు ధరలు పలుకుతుండటంతో రైతులూ క్రమేణా మిరియాల సాగుపట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో కాఫీతోటల ద్వారా150కేజీల కాఫీని ఉత్పత్తి చేస్తు న్నారు. అదే తోటల్లో అంతరపంటగా వేసిన మిరి యాలవల్ల వంద కేజీల దిగుబడి వస్తోంది. అంటే సగటున ఎకరాకు ఒక్కో రైతుకు కాఫీ వల్ల ఏడాదికి రూ.15,000,మిరియాలవల్ల రూ.50వేల వరకూ ఆదాయం వస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంట లుగామిరియాలతోపాటుకమలా,నేరేడు,సీతా ఫలం,జాఫ్రా,అనాసపనస వంటివి పండిస్తు న్నారు. ఇవి కాఫీతోటలకు ఇటు నీడనిస్తూనే రైతులకు ఉద్యానఫలాలను అందిస్తున్నాయి.ప్రభుత్వ ప్రోత్సా హం..మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్లకాలవ్యవధితో కూడిన భారీ ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గిరిజన ఉప ప్రణాళికద్వారారూ.526.160కోట్ల భారీ వ్య యంతోఈప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015-2016లో మొదలైన ఈప్రాజెక్టు కాలపరిమితి 2024-2025వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తు తంఉన్న1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగావచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. కాఫీతోపాటు అనుసంధానంగా అంతరపంట అయి న మిరియాలసాగునూ ప్రోత్సహిస్తున్నారు. ఇందు లో భాగంగా ఏడాదికి పదివేల ఎకరాల చొప్పున కాఫీ తోటలను విస్తరించుకుంటూ వెళుతున్నారు.
జాతీయ ఉద్యాన మిషన్‌ సహకారంతో..
కేరళలోని కాలికట్‌లో అఖిల భారత సుగంధ ద్రవ్య పరిశోధనా కేంద్రం ఉంది. చింత పల్లి కేంద్రంగా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్య పంట లపై పరిశోధనల నిమిత్తం ఉద్యాన పరిశోధనా స్థానం పనిచేస్తోంది. దీని పరిధిలో సుగంధ ద్రవ్య సమన్వయ పరిశోధనా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులోభాగంగా మిరియాల్లో కొన్ని మేలు రకా లను గుర్తించివాటిని అభివృద్ధిపర్చి రైతులకు అంది స్తున్నాం.మిరియాల్లో17రకాలు అల్లూరి సీతా రామ రాజు జిల్లాలోని మన్యానికి అనుకూలమని అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి వాటిని సిఫార్సు చేస్తున్నాం. పన్నియూర్‌-1, 2, 3, 5, 6, 7, 8, 9రకాలతోపాటుశ్రీకర,శుభకర,పంచమి,పౌర్ణమి, మలబారు ఎక్సెల్‌,శక్తి,గిరిముండా,ఐఐఎస్‌ఆర్‌ దీపమ్‌, ఐఐఎస్‌ఆర్‌ శక్తి వంటి రకాలను మేలైనవిగా గుర్తించాం.
అదాయవనరుగా సాగు
మిరియాలుపంట కొండవాలు ప్రాంతా లు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనా భివృద్ధిసంస్ధ గిరిజనరైతులను మిరియాల సాగువైపు మిరయాల సాగుకు పెట్టింది పేరు కేరళ..ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ మన్యంలో మిరియాలు పంట సాగవుతుంది. మన్యంలో పండుతున్న మిరియాలు కేరళ మిరి యాలకు ఏమాత్రం తీసిపోవటంలేదు. దిగుబడితో పాటు నాణ్యత విషయంలోను మన్యం మిరియాలు ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించాయి. ఎలాంటి క్రిమి సంహార మందులు వినియోగించకుండానే కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తు న్నారు. కాఫీ తోటలతో ఎకరానికి 25వేల నుండి 40వేల వరకు అదాయంసమకూరుతుండగా, దానిలో అంతరపంటగా వేస్తున్న మిరియాల పంట తో40వేల నుండి60వేల వరకు అదనంగా అదా యం సమకూరుతుంది.ఈ ఏడాది ఒక్క మిరి యాల పంట ద్వారానే 150కోట్ల రూపాయల అదాయంన్ని మన్యంలోని గిరిజనరైతులు ఆర్జించారు. మిరియాల సాగుకు మన్యం ప్రాంతంబాగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడి గిరిజన రైతులకు మంచి అవకా శంగా మారింది. పస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు ప్రోత్స హిస్తోంది. కాఫీతోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్ల వద్ద మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు 60 నుండి 70కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో మిరియాల ధర 500 నుండి 600 రూపాయలు పలుకుతుంది.ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు4వేల మెట్రిక్‌ టన్నుల మిరి యాల దిగుబడి వచ్చింది.3.2 కిలోల పచ్చి మిరి యాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరి యాలతో సమకూరింది. అనే మిరియాల రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోజికోడ్‌ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి వేర్వేరు రకాల మొక్కలను తెచ్చి చింతపల్లి నర్సరీల్లో అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.- గునపర్తి సైమన్‌

ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్‌ ఎరువులు

వన్‌ నేషన్‌-వన్‌ ఫెర్టిలైజర్‌ విధానంలో భాగంగా అక్టోబర్‌ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్‌ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్‌ సంచులకు ఆర్డర్‌ ఇవ్వొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్‌ 31 లోపు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం యూరియా,డీఏపీ, ఎం వోపీ,ఎన్‌పీకే తదితర ఎరువులను వేరువేరు కంపెనీలు వేరువేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఈనేపథ్యంలో వన్‌నేషన్‌-వన్‌ఫెర్టిలైజర్‌ విధా నంలో భాగంగా దేశం మొత్తం ‘ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఉర్వారక్‌ పరియోజన’ బ్రాండ్‌ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్‌పై మార్కెట్లో అందు బాటులో ఉంటాయి. ఇక ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపు రేఖలు మారుస్తున్నారు..
బ్రాండ్‌…భారత్‌ .. ఒకే దేశం.. ఒకటే ఎరువు..
ఒకే దేశం-ఒకటే ఎరువు నినాదంతో కేంద్రసర్కార్‌?రసాయన ఎరువులు అమ్మే ప్రైవేటు కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయబో తోంది.డీఏపీ,యూరియా వంటి ఎరువులను భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో విక్రయించాలని నిబంధన పెట్టింది. ఈపథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలోని కొన్నిప్రాంతాల్లో అమల్లోకి తీసు కొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రసాయన ఎరువుల అమ్మకాల్లో ప్రైవేటు కంపెనీల గుత్తాధి పత్యానికి అడ్డుకట్ట పడబోతోంది. కృత్రిమ కొరత సృష్టించే సంస్థల ఎత్తుగడలను అడ్డుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీనిని ప్రాథమికంగా ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ‘ఒక దేశం-ఒకటే ఎరువు’ నినాదంతో డీఏపీ, యూరియాలను ఒకే బ్రాండ్‌ పేరుతో అమ్మాలని కేంద్రం అన్ని కంపెనీలకు నిబంధన పెట్టనుంది. భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో ఈ రెండు ఎరువులను కంపెనీలు మార్కెట్‌లో రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమలు ఇలా..
కేంద్ర ఎరువుల శాఖ సూచనల ప్రకా రం ఇకపై అన్ని కంపెనీలు తయారుచేసే బస్తాలపై ఒకటే లోగో ఉంటుంది. పక్కన ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అని పథకం పేరు ఉంటుంది. దానికింద ‘భారత్‌ యూరియా’ అనే బ్రాండు పేరు,దాని తయారీ,మార్కెటింగ్‌ కంపెనీ పేరు ముద్రిస్తారు.మొత్తం 16 భారతీయ భాషల్లో‘భారత్‌ యూరియా’అనే పేరు ఉం టుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలూ బస్తా లపై ఉంటాయి. ఈ పథకం అమలుకు చేపట్టా ల్సిన చర్యలపైఈనెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎరువులకంపెనీలు,రాష్ట్రవ్యవసాయ శాఖల అధి కారులతో ఆన్‌లైన్‌లో చర్చించాలని కేంద్ర ఎరు వుల శాఖ నిర్ణయించింది. అనంతరం ఎరువుల నియంత్రణచట్టంకింద నోటిఫికేషన్‌జారీ చేస్తారు. దీని అమలుకు కంపెనీలు,వ్యాపారులు,కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తారు. సోషల్‌ మీడియాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణ యించింది.ఇవీ ప్రయోజనాలు..కొత్త పథకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కంపెనీలు 31 ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తూ వివిధ బ్రాండ్ల పేర్లతో రైతులకు అమ్ముతున్నాయి. మరో 3 ప్రభుత్వ వాణిజ్య సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.15కంపెనీలు డీఏపీ,ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను తయారు చేస్తున్నాయి. దేశీయంగా 45 కిలోల యూరియా బస్తా ఉత్పత్తి వ్యయం రూ.1,350 కాగా రైతుకు రూ.266.50కి విక్రయిస్తున్నారు.మిగిలిన రూ. 1083.50 కేంద్రం రాయితీగా భరించి ఎరువుల కంపెనీలకు చెల్లిస్తోంది. విదేశాల నుంచి దిగు మతి చేసుకున్న యూరియా బస్తా రూ.2,433 కాగా అందులో రూ.2166.50 కేంద్రం రాయి తీగా భరిస్తోంది. ఏకంగా 90శాతం సొమ్మును కేంద్రం రాయితీ రూపంలో భరిస్తుంటే కంపెనీలు సొంత బ్రాండ్‌ పేరుతో అమ్ముకోవడం ఏంటన్నది కేంద్రం వాదన. పైగా యూరియాలో ఉండే రసా యనం నత్రజని ఒకటే అయితే తమ కంపెనీ యూరియా వాడితే అధికదిగుబడి వస్తుందని కొన్ని కంపెనీలు రైతులను పక్కదారిపట్టిస్తున్నాయి. దీనివల్ల ఆబ్రాండ్‌ మార్కెట్‌లో లేకపోతే యూరి యా కొరత ఉందని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ‘భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ’ అంటూ ఒకటే బ్రాండు పేరుతో అమ్మాలనేది ఈ పథకం లక్ష్యం. దీనివల్ల రూ.3వేల కోట్ల వరకూ రవాణా వ్యయం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది.
నూతన ఎరువుల విధానం ఎందుకోసం ?
కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 24న నూతన ఎరువుల విధానం ప్రకటించింది. ‘’ఒకే దేశం-ఒకే ఎరువు’’నినాదంతో2.10.2022 నుండి మార్కెట్‌లో భారత్‌ బ్రాండ్‌ ఒక్కటే ఉండాలని నిర్ణయించింది. దీనిని ‘ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఉర్వరక్‌ పరి యోజన’ పథకంగా ప్రకటిం చింది.ఈ పథకం ప్రకారం దేశంలోని ఏ ఎరువుల కంపెనీ అయినా భారత్‌ యూరియా,భారత్‌ డి.ఎ. పి,భారత్‌ యం.ఓ.పి భారత్‌ ఎన్‌.పి.కె పేర్లతో అమ్మాలి. ఎరువుల సంచులపై మూడిరట రెండు వంతుల భాగంలో ఎరువుల పేరుతో పాటు పథ కంపేరు ప్రముఖంగా ముద్రించాలి. కంపెనీ పేరు మిగిలిన వివరాలన్నీ మూడిరట ఒకవంతు భాగం లోనే ఉండాలి. 15.9.2022 నుండి కొత్త సంచు లు వినియోగించాలని, పాత సంచులు డిసెంబరు 31 అనంతరం వాడరాదని ఎరువుల కంపెనీలకు మెమో ఇచ్చింది. ఈ పథకం వల్ల రైతులకు గాని, కంపెనీలకుగాని ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. గత ఏడాది సకాలంలో ఎరువులు సరఫరా కాలేదు. రైతులు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. రైతులకు ఎరువులు అందని విషయాన్ని పార్లమెంటరీస్థాయీ సంఘమే చెప్పిం ది. రూ.267 అమ్మాల్సిన యూరియా రూ.430కు అమ్మినట్లు వార్తలువచ్చాయి.హెచ్చు ధరతో అమ్మ డంతోపాటు ఎరువుల వ్యాపారులు రైతులకు అవసరమైన ఎరువు ఇవ్వాలంటే …తక్షణం అవస రం లేని ఇతర ఎరువులను లేదా క్రిమిసంహారక మందులను కొంటేనే అవసరమైన ఎరువులు ఇచ్చారనిస్థాయీ సంఘం దృష్టికి వచ్చినట్లు పేర్కొం ది. 2021-22బడ్జెట్‌ కన్నా 2022-23 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కేటాయింపులను భారీగా తగ్గిం చడంపై స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-1985 ప్రకారం ఎరు వుల సరఫరాలో, అమ్మకాలలో జరుగుతున్న అవక తవకలను అరికట్టాలి. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయిన ప్పటికీ ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల నిల్వలన్నీ ఎన్నికలు జరుగు తున్న ఉత్తరప్రదేశ్‌కు తరలి వెళ్ళాయని పత్రికలలో వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధా నంలో…’ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-85’ను సక్ర మంగా అమలు చేయడం గురించిగాని, బ్లాక్‌ మార్కెట్టును అరికట్టేచర్యల గురించి గాని, అవస రానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిం చే అంశం గాని లేకుండా…’ఒకే దేశం ఒకే ఎరువు’ నినాదం ఎవరి ప్రయోజనం కోసమో ఏలిన వారికే తెలియాలి. మన దేశం స్వాతంత్య్రం పొందేనాటికి తీవ్రమైన ఆహార కొరత ఉంది. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. ఆహారధాన్యాలు పండిరచడానికి భూమితో పాటు నీరు, ఎరువులు, విత్తనం అవసరం. ఆనాటికి దేశంలో ఒకే ఒక్క ఎరువుల కంపెనీ ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎసిటి) మాత్రమే ఉన్నది. స్వాతంత్య్రం అనం తరం ప్రణాళికా విధానంలో భాగంగా ప్రభుత్వ రంగం లోనూ సహకార రంగంలోనూ పది ఎరు వుల కర్మాగారాలు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగం లోని రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ‘’మణి రత్నం’’గా ప్రఖ్యాతి గాంచింది. ఎరువుల తయారికీ అవసరమైన నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌ మూడు ప్రధానమైన ముడి పదార్థాలు. ఈ మూడూ నేటికీ 90శాతం దిగుమతి చేసుకోవాల్సిన స్థితిలోనే ఉన్నాయి. ఈకాలంలో క్రమంగా ఎరువుల రంగం లో ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కాంప్లెక్స్‌ ఎరువులకు మిక్సింగ్‌ ప్లాంట్లు వచ్చాయి. ఈ ప్లాంట్లు దిగుమతి చేసుకున్న సందర్భంలోనూ మిక్సింగ్‌ చేసిన సందర్భంలోనూ రెండుసార్లు సబ్సి డీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలం లో ఎరువులకు అవసరమైన ముడి సరుకుల దిగు మతి,ఎరువుల తయారీ,పంపిణీ,ఎరువుల ధరలు వంటి సమస్యలు ముందుకు వచ్చాయి. ఈ సమ స్యల పరిష్కారానికి సూచనలు చేయడం కోసం డజనుకు పైగా ఎక్స్‌పర్ట్‌ కమిటీలను వేశారు. ఈ క్రమంలోనే ఫెర్టిలైజర్‌ కంట్రోలు ఆర్డరు, ఎరువుల ధరల నియంత్రణచట్టం,ఎరువుల పంపిణీ విధా నం,సబ్సిడీల విధానాలు రూపొందాయి.సరళీకరణ విధానాల నేపథ్యంలోద్వంద్వధరల విధానం, కం ట్రోలు సడలింపులు వంటి ప్రయోగాలు బాగా జరిగాయి. సరళీకరణవిధానాలు అన్ని రంగా లలో వచ్చినా ఆంక్షలు తొలగించని రంగం ఎరు వుల రంగంగా ఉందని పేర్కొన్నారు. అయినా ఎరువుల కొరత సృష్టించడం, బ్లాక్‌ మార్కెట్‌ వంటి సమస్యలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఎరువుల రంగంలో ప్రయివేటు రంగం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వరంగం చిన్నచూపుకు గురవుతూనే ఉన్నది. ఈ కాలంలో ముడి కెమికల్స్‌ కన్నా, శుద్ధి చేసిన కెమికల్స్‌ దిగుమతి లాభసాటిగా మారింది. ప్రయి వేటు కంపెనీల వారు, మిక్సింగ్‌ ప్లాంట్ల వారు, శుద్ధిచేసిన కెమికల్స్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించడంతో ఎగుమతి చేసే దేశాలు ఎక్కువ లాభాలు పోగేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్ధలు అనేక వడిదుడుకులకు గురయ్యాయి. 1997-98 నాటికి ఉత్పత్తి సామర్ధ్యానికి మించి 118శాతంఉత్పత్తి చేసిన ప్రభుత్వ కంపెనీలు… 2009-10 నాటికి 79 శాతం ఉత్పత్తికి, 2014-15 నాటికి 66 శాతం ఉత్పత్తికి తగ్గిపోయాయి. గతనెలలో ప్రభుత్వ రంగంలోని ఎనిమిది ఎరు వుల కర్మాగారాలను ప్రెవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు వార్తలు వెలు వడ్డా యి. మణిరత్నంగా పేరుగాంచిన రాష్ట్రీయ ఫెర్టి లైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌,నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమి టెడ్‌,ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఎఫ్‌.సి.ఐ ఆరావళి జిప్సమ్‌ అండ్‌ మినరల్స్‌, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌,హిందుస్తాన్‌ ఫెర్టి లైజర్స్‌ కార్పొరేషన్‌ ఫ్యాక్టరీలు ప్రెవేటుపరం కానున్న జాబితాలో ఉన్నాయి.
ఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారు స్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో పైసా మిగలక రైతులు అప్పులపాలవుతున్న టైమ్‌?లో ఎరువుల ధరల పెరుగుదల రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పెట్టుబడిపై కనీస లాభాన్ని కళ్లజూడలేక పోతున్న రైతులు..ఏడాదికేడాది పెట్టుబడులు పెరుగుతుండడంతో వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది. పెట్టుబడికి సరిపోను రుణాలను బ్యాంకు లు ఇవ్వకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి తెచ్చి అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారు.అవిభారమై చాలామంది ప్రాణా లు తీసుకుంటున్నారు. ఇందులో 60 శాతం మంది కౌలు రైతులుంటున్నట్టు ఎన్‌సీఆర్‌బీరిపోర్టు చెబుతోంది.
మన దేశంలో తయారీపై దృష్టేది?
వ్యవసాయ ఆధారితమైన మన దేశం లో ఇంకా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో సగటున ఎకరాకు 75 కిలోల ఎరువులు వాడుతున్నాం. ఇతర దేశాల్లో ఎకరాకు200కిలోలు వాడుతున్నట్టు లెక్కలు చెబుతు న్నాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో కలిపి రసాయన ఎరువుల వాడకంపెంచడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు.గత పదేండ్లుగా దేశం లో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల స్థిరంగానే ఉంది. 2021-22లోకోటి టన్నుల ఉత్పత్తి పెరగ డంతో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.16 కోట్ల టన్నులకు పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. మిగిలిన పంటల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. వీటితోపాటు మరో రూ.3లక్షల కోట్ల విలువైన నూనెలు, పంచదార, పప్పులు, పత్తిని దిగుమతి చేసుకున్నాం.
రేట్లపై నియంత్రణ ఎవరిది?
మన దేశానికి ఎరువుల్ని దిగుమతి చేసే దేశాలులాబీగా ఏర్పడి రేట్లు, డిమాండ్‌?ను కం ట్రోల్‌? చేస్తున్నాయి. దీంతో మనం తీవ్రంగా నష్ట పోతున్నాం. చివరకు క్రిమిసంహారక మందులు, బయోపెస్టిసైడ్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌ తోపాటు వాటి తయారీ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకుం టున్నాం. దీంతో ఇండియా విదేశీ మారకద్ర వ్యాన్ని కూడా కోల్పోతున్నది.కాంప్లెక్స్‌ ఎరువుల కంపెనీలు ధరలు ఇష్టానుసారం పెంచుకోవడానికి చట్టం ఒప్పు కోదు. ప్రతి ఎరువు ధరను కేంద్రం నిర్ణయిం చాల్సిందే. కానీ ఇటీవల కంపెనీలు, వ్యాపారులు ధరలు పెంచుకోవడంతో రైతులు గతంలోకంటే ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వస్తోంది.
తయారీని ప్రోత్సహించాలె
రైతుల పెట్టుబడిని తగ్గించడంలో ఎరు వుల ధరలు కీలకం. ఎరువులు, ఉపకరణాల ధర లు పెంచి 2022లో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నహామీని కేంద్రం ఎలా నిలబెట్టుకుంటుం దో చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో రైతుల పెట్టుబడిని తగ్గించడం కేంద్రంపై ఉన్న ప్రధాన బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులు సక్రమంగా వ్యవసాయం చేయగలుగుతారు. ఎరువుల ధరల నియంత్రణ మన చేతుల్లో ఉండాలంటే ఇప్పటికైనా స్వదేశంలో తయారీని ప్రోత్సహించాలి. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఎరువుల వాడకం మోతాదును తెలియజెప్పాలి.ఎరువుల ధరలు, సప్లయ్‌,వాడకంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్లాన్‌?తో ముందుకెళ్లాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి రైతు గట్టెక్కాలంటూ వెంటనే ఎరువుల ధరల్ని తగ్గించాలి.
తగ్గిన సబ్సిడీ..
`2022-23ఏడాది మినహా పెరుగుతున్న బడ్జె ట్‌కు అనుగుణంగా,డాలర్‌ విలువ పెరుగు దలను లెక్కలోకి తీసుకుని ఎరువుల సబ్సిడీని కేంద్రం పెంచలేదు. గత ఏప్రిల్‌లో 58 శాతం పెంచిన ఎరువుల ధరలు ఆందోళన ఫలితంగా తగ్గిం చినప్పటికీ తిరిగి వ్యాపారులు సబ్సిడీ తగ్గిందన్న పేరుతో ధరలు విపరీతంగా పెంచారు. పెంచిన ధరలపై కేంద్రం స్పందించకపోవడంతో చాలా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ముంచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నత్రజని, భాస్వరం,పొటాష్‌ ఎరువుల వాడకం 272.28 లక్షల టన్నులు.ఇందులో పొటాష్‌ వాడకం 26.80 లక్షల టన్నులు. ఇది పూర్తిగా 100 శాతం దిగుమతి చేసుకోవాల్సింది. యూరియా, డీఏపీ కూడా దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న యూరియాపై2021-22లో రూ.53,619 కోట్లు సబ్సిడీని కేంద్రం చెల్లించింది. భాస్వరం, పొటాష్‌కు రూ.26,335 కోట్లు సబ్సిడీ ఇచ్చారు.
కేంద్రం తగ్గించినా..
కిందటి ఏడాది పెంచిన ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్రం వాటిని తాత్కాలికంగా పెండిరగ్‌లో పెట్టింది. 2022 జనవరి10వరకు పాత ధరలే ఉంటాయని చెప్పింది. కానీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కంపె నీలు అప్పటికే కేంద్రం ప్రతిపాదించిన ధరలను ఇంకాస్త పెంచి అమల్లోకి తీసుకొచ్చాయి. కేంద్రం తమకిచ్చే సబ్సిడీని తగ్గించడం వల్లే ధరలు పెం చాల్సి వచ్చిందని ప్రచారం చేసుకున్నాయి. ఈ రేట్ల కట్టడికి కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కం పెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తుంది. కానీ కంపె నీలు షార్టేజ్‌ సృష్టించి బ్లాక్‌ లో అమ్మి రైతులకు రాయితీని దూరం చేశాయి.ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు సబ్బిడీ అందక రైతులు నష్ట పోయారు. –వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం సీనియర్‌ నాయకులు

ఉసురి తీస్తున్న ఊపిరి

పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన అవసరం.కాలుష్య నివారణకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యంకాని విధా నాలు, ప్రయోగాలు చేస్తూ రోజురోజుకు సమస్యను జటిలం చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం విషతుల్యంగా మారుతున్నది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. మరెం దరో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి మంచానికే పరిమి తమై కృంగికృశించి అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంత కంతకు కమ్ముకోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా దేశంలోని అనేక నగరాల్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతున్నది. ఒక్క వాయు కాలుష్యమేకాదు నీటి కాలుష్యం కూడా పరిస్థితిని పతా నంచునకు తీసుకు పోతున్నది. రోజురోజుకు గ్రామాల నుండి నగరాలకు వలస వచ్చేవారు ఎక్కువ కావడంతో పాటు సమస్య మరింతజటిలంగా మారు తున్నది. మురికి వాడల నిర్మూలనకు దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడ ఎప్పటి కప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి.
ప్రధానంగా పీల్చేగాలిలో ప్రమాదకరమైన దుమ్ముకణాలు పెచ్చరిల్లుతుండటంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు దేశంలోని ఆరు మెట్రోనగరాలు ఢల్లీి, కోల్‌కతా, చెన్నై,ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్‌ లో జరిపిన సర్వేల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢల్లీి పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది.ఢల్లీి పరిసరప్రాంతాల్లో ఉన్నకొందరు రైతులు తమ పంటవ్యర్థాలను దగ్ధం చేయడం పెనుశాపంగా పరిణ మిస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు పాలకులు నిషేధం విధించి, భారీగా జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏమాత్రం తగ్గకపోగా ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలో దీనిని తొలగించాలనే డిమాండ్‌ కూడా ఒకటిగా మా రింది. అనేక నగరాల్లో నీటి,గాలి నాణ్యత వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాలపై జరిపిన అధ్య యనంలో వాయుకాలుష్యం నగరజీవి ఊపిరితి త్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం బయట పడిరది.హైదరాబాద్‌ నగరంలో నీటి,వాయు కాలుష్యంతోపాటు నిర్మాణ రంగంవల్ల పీల్చే గాలిలో ధూళికణాలు అధికంగా ఉన్నట్లు వెలుగుచూసింది.హైదరాబాద్‌నగర శివారుల్లో పరిశ్రమలు గాలిలో వదులుతున్న కాలుష్యానికి అడ్డూఅదుపులేకుండా పోతున్నది. అలాగే నీటి కాలుష్యం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కరంగా తయారవుతున్నది. దేశంలో సగానికి పైగా చెరువ్ఞలు, జలాశయాల్లో ఉన్న నీరు తాగడానికి పనికిరాకుండాపోయాయి. ఒకనాడు తాగునీరు అందించిన కొన్ని నీటివనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకారకంగా మారి వెదజల్లుతున్న దుర్వాసనలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగి స్తున్నాయి. నగరాల రోడ్లపై నడుస్తున్న వాహ నాలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయ త్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు.1989 నాటి మోటారు వాహనాల చట్టం రూల్‌నెం.5 ప్రకారంనిర్ధారిత ప్రమాణాలకు మించి పొగవదిలితే జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే ఏకంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలు ష్యం చేస్తూ మోతాదు కుమించి పొగలు వదులు తున్న ఏ వాహనం అయినా ఈచట్ట పరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రస్తుతం తెలుగురాష్ట్రాల వరకు పరిశీలించినా సగానికిపైగా వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1993లో మొదటి సారిగా వాహనకాలుష్య నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలిని (పిసిబి)ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియ మిస్తూ నిబంధనలను రూపొందిస్తూనే ఉన్నారు.మార్పులు చేర్పులు చేస్తూ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ఫలితాలు రాలేదు.ఎన్ని చట్టాలు తెచ్చినాఅవన్నీ దాదాపు కాగితాలకే పరిమితమవ్ఞతు న్నాయి. ప్రయోగాలు విఫలమవుతున్నాయే తప్ప ఫలితాలు రావడం లేదు.ఫలితంగా వాతా వరణం కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, దుమ్ముధూళి పెరిగిపోతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పర్యావరణం అంతగా కలుషితమైపోతున్నది. పెట్రోలులో జరుగుతున్న కల్తీ సమస్యను మరింతగా పెంచుతుందనే చెప్పొచ్చు.గతంలో పర్యావరణ శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో భారత్‌ దాదాపు వంద దేశాల కంటే అట్టడుగున ఉన్నట్లు బయట పడిరది.అంతేకాదు భారత్‌ వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదు రెట్లు అధికంగా ఉండి శ్వాసకోశ సమస్యల నుంచి కేన్సర్‌ దాకా అనేక వ్యాధులకు కారణమవ్ఞతున్నా యనే విషయం బయట పడిరది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకుదీపాలను కాలుష్యం ఛిదిమేస్తుంద నేది ఆందోళన కలిగించే అంశం.ఐదేళ్లలోపు బాలబాలికల్లో దాదాపు పదిహేను శాతం శ్వాస సంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తు న్నారు. వాయు కాలుష్యం నుంచి మంచి కొలె స్ట్రాల్‌ చెడు కొల టస్ట్రాల్‌గా మారడం గుండె జబ్బులకు, పక్షవాతానికి, ఊపిరి తిత్తుల కేన్సర్‌కు మూలం అవుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడు తున్నారు.ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్న ఈ కాలుష్య తీవ్రతను పాలకులు ఇప్పటి కైనా గుర్తించి నివారణకు ఆచరణ యోగ్యమైన విధానాలను ప్రకటించి త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణం పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్దఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముంచుకొస్తున్న కాలుష్య ముప్పు!
కాలుష్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణయోగ్యం కాని విధానాలతో ప్రయో గాలతో సమస్యను రోజురోజుకు జఠిలం చేసు ్తన్నాయి. ఫలితంగా పర్యావరణ విషతుల్యంగా మారుతున్నది. కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు లోనవ్ఞతున్నారు. మరెందరో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికి పరిమితమై అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంతకంతకు కమ్ముకోవడం ఆందో ళన కలిగించే అంశం. నగరాల పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయాంవు తున్నది. నీటి కాలుష్యం నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికితోడు రోజురోజు గ్రామాల నుండి నగరాలకు వసల వచ్చేవారు ఎక్కువ కావడం సమస్య మరింత ప్రమాదకరంగా మారుతున్నది మురికివాడల నిర్మూలనకు ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా పాలకులు ఎంత ప్రయత్నం చేస్తున్నా మరొకపక్క కొత్తకొత్తవి పుట్టుకు వస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితుల వల్ల వలసలు పెరిగిపోతున్నాయి. అందుకే నగరాలు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో సమస్యలు అంతకు రెట్టింపుస్థాయిలో తయాంవు తున్నాయి. భారతదేశంలో ఆరు మెట్రో నగరాల్లో ఢల్లీి, చెన్నై,ముంబాయి,కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గతంలో జరిపిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పర్యావరణం,నీరు,గాలి నాణ్యత,వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాల్లో జరిపిన సర్వేల్లో వాయుకాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం వెలుగు చూసింది. కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం అంచనాలకు మించి పెరిగినట్లు బయటపడిరది.హైదరాబాద్‌తోపాటు మరికొన్ని నగరాల్లో పారిశ్రామిక కాలుష్యం అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌ నీటి,వాయుకాలుష్యంతో పాటు నిర్మాణ రంగం వల్ల వీచే గాలులు ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు బయటపడిరది. నగరశివారులోని పరిశ్రమలు, గాలిలో వదులుతున్న కాలుష్యానికి అదుపులేకుండా పోతుంది. మరొకపక్క దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమలు మూసీలో వదులుతున్న వ్యర్థాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఒకనాడు మంచినీరు అందించిన అనేక నీటి వనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకాసారాలుగా మారి వెదజల్లుతున్న దుర్వాసనను చుట్టుపక్క ప్రాంతాల వారికి ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇక నగర రోడ్లపై నడుస్తున్న వాహనాల కాలుష్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారిం చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. 1889 నాటి మోటార్‌ వాహనాల చట్టంలోని రూల్‌నెం.115 ప్రకారం నిర్ధారిత ప్రమాణాలకు మించి పొగ వదిలే వాహనాలపై జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ మోతాదుకు మించి పొగలు వదులుతున్న ఏవాహనమైనా ఈ చట్టపరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే అటు రోడ్డు రవాణా సంస్థలోకానీ, ఇటు ప్రభుత్వ వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. 1993లో మొదటిసారిగా వాహన కాలుష్య నియంత్రణ కోసం కాలుష్యనియంత్రణ మండలినిఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియమిస్తు న్నారు. నిబంధనలను రూపొందిస్తున్నారు. మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఎయిర్‌ యాక్ట్‌ 1887సెక్షన్‌ 31ఎ కింద హైదరాబాద్‌ లోని పెట్రోల్‌ పంపుల్లో దాదాపు ఇరవైకిపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిబంధన లను అతిక్రమించిన వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. జంటనగరా ల్లో తిరిగే ప్రతి వాహనం విధిగా పరీక్షించుకోవాలని నిబంధనలు కూడా విధించారు. నాలుగేళ్ల తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొత్త ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చారు. కాలుష్యసర్టిఫ్టికేట్‌ (పీయూసీ) ఉన్న వాహనాలకే ఇంధనం పోయాలని కొత్త నిబంధనలు విధించారు.ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రయోగాలు విఫలమవ్ఞతున్నాయి తప్ప ఫలితాలు రావడం లేదు. ఫలితంగా వాతావరణంలో కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆసిడ్‌, దుమ్ముధూళి పెరుగుతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ వాతావరణం అంతా కాలుష్యం అవ్ఞతున్నది. పెట్రోల్‌ జరుగుతున్న కల్తీ కూడా ఈ కాలు ష్యాన్ని పెంచుతున్నది. ఈ కల్తీని నిరోధిం చేందుకు అధికార గణం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. మొత్తం మీద తీవ్ర స్థాయిలో వెలువడతున్న విషవాయువ్ఞలవల్ల పర్యావరణం విషతుల్యమై ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. భారత్‌లో వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదురెట్లు అధికంగా ఉండి శ్వాస కోశ వ్యాధుల నుంచి క్యాన్సర్‌ దాకా అనేక రోగాలకు కారణమవ్ఞతున్నాయని పరిశోధనల్లో ఎన్నోసార్లు వెల్లడైంది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకు దీపాలను కాలుష్యం చిధిమేస్తున్నట్లు అయింది. ఐదేళ్లలోపు బాలబాలికలు 14శాతం శ్వాససంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తున్న విషయం ఆందోళన కలిగి స్తున్నది. వాయుకాలుష్యం మంచి కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా మారుస్తూ గుండెజబ్బులకు పక్షవాతానికి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మూలం అవ్ఞతున్నాయని వైద్యనిపుణులే చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్యభూతాన్ని నియంత్రించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. సమస్యతీవ్రతను అర్థం చేసుకొని నివారణకు ఆచరణయోగ్యమైన విధానాలను ప్రకటించి అమలుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.
ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తు న్నట్లు చెప్పారు. సముద్రాన్ని కాపాడుకు నేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశులను హరించివేస్తు న్నాయి. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీరం వెంట ఉన్న ప్లాస్టిక్‌ను తొలగించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, బీచ్‌ పరి రక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అనం తరం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే…: ఈ రోజు గుర్తుండిపోయే రోజు. నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌, లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ జీఏఎస్‌పీ, రాజీవ్‌ కుమార్‌, సెక్రటరీ జనరల్‌, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్లానెట్‌ సత్య ఎస్‌ త్రిపాఠి, సీఈఓ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ సిరిల్‌ గచ్చ్‌తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు.
ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో హాజరై భారీ ఎత్తున బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. దాదాపు 22 వేల మంది ప్రజలు,40 ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 28 కిలోమీటర్లు మేర గోకుల్‌ బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు శుద్ధి చేశారు. 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్య క్రమం ఇది. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతమైనది, అదే వైజాగ్‌ను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది.
పర్యావరణ పరిరక్షణ దిశగా…
పర్యావరణం, ఎకానమీ రెండూ కూడా నాణేనికి రెండు కోణాలు. పర్యావరణాన్ని పరిరక్షించక పోతే.. మనకు మనుగడ ఉండదు. సుస్ధిరత, సమగ్రత అన్నవి మన ప్రధాన లక్ష్యాలు. మనం స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే.. దీర్ఘకా లికంగా మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్దిక వనరులతో ఈ దిశ లోనే సుస్ధిర ప్రగతి కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పరిరక్షిస్తోంది. దాన్ని రాబోయే తరాల ఉత్తమ భవిష్యత్తుకు కూడా అందించాలి.
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం…
ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని ఎలా సాధించాలన్నదే ముఖ్యమైన అంశం. మన ముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి. గత కొన్ని నెలలుగా చూస్తే… ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అక్టోబరు 2, 2021న క్లాప్‌ ప్రొగ్రాం ప్రారంభించింది. 4097 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిం చింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈకార్యక్రమాలను ప్రారంభించాం. దీనివల్ల గ్రామాల్లో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతం పెరిగింది. 100 శాతం సేకరణ లక్ష్యం గా అడుగులు వేస్తున్నాం. అయితే కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవాలి. భూమి మీద మనకు లభించే ఆక్సిజన్‌లో 70 శాతం మెరైన్‌ ప్లాంట్స్‌ నుంచే వస్తోంది. అంటే మన రెయిన్‌ ఫారెస్ట్స్‌ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్‌ మాత్రమే లభిస్తోంది. అంటే ఫైటో ప్లాంక్టన్‌, కెల్ఫ్‌, ఆల్గల్‌ ప్లాంక్టన్‌ వంటి ప్లాంట్స్‌ కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఫైటో ప్లాంక్టన్‌లో ముఖ్యమైనది ప్లో క్లోరో కాకస్‌. వాతావరణంలోకి అత్యధిక ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌ ఇది. చాలా కొద్ది మందికి మాత్రమే అవగానహన ఉన్న వాస్తవాలు ఇవి. – జిఎన్‌వి సతీష్‌

న్యాయ వ్యవస్థపై తెలుగు సంతకం

‘నాది సాధారణ వ్యవసాయ కుటుంబం. వైకుంఠపాళిలో నిచ్చెనలే కాదు,పాములూ ఉన్నట్లే నా ప్రగతి ప్రస్థానంలో కూడా పగబట్టిన పాములున్నాయి. వాటినుంచి తప్పించుకొని, లక్ష్యాన్ని అధిగమించాను. న్యాయవ్యవస్థలోని లోపాలు, వ్యవస్థలోని విషయాల గురించి మాట్లాడితే వ్యక్తిగా నా స్థాయి తగ్గడమే కాదు, న్యాయవ్యవస్థ కూడా పలచనవుతుంది. పదవిలో ఉండగా చేసే పనులు, వ్యక్తిగత నడవడికలే నిలిచి ఉండేవి. అందుకే నేనేమీ మాట్లాడను’ – సీజేఐ హోదాలో చివరిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ వ్యాస రచయితతో జస్టిస్‌ ఎన్వీ రమణ అన్న మాటలివి’. ధర్మం,న్యాయ మే లక్ష్యంగా ఉద్యోగ జీవితాన్ని సాగించిన తెలుగు బిడ్డ జస్టిస్‌ ఎన్వీ రమణ. మధ్య తరగతి కుటుంబం నుంచి న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి చెరగని ముద్ర వేశారు. సంస్కరణలకు శ్రీకారం: సీజేఐగా పగ్గాలందుకున్న ఎన్వీ రమణ 2021 ఏప్రిల్‌ 24 నుంచి పదవీ విరమణ దాకా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సుప్రీం కోర్టుకు 11మంది,హైకోర్టులకు 250 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేశారు. వారిలో 224 మంది నియమితు లయ్యారు. 15 హైకోర్టులకు సీజేలను నియ మించారు. సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మహిళా న్యాయమూర్తుల భర్తీకి పెద్దపీట వేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి 2027లో మహిళ ప్రధాన న్యాయ మూర్తిగా నియామకం అయ్యే పరిస్థితిని సృష్టించారు. ఇవన్నీ కొలీజియం లో ఒక సభ్యుడిగా చేశానని చెప్పుకోవడం ఆయన వినయానికి నిదర్శనం.
తెలంగాణకు అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైనప్పుడు 24 మంది జడ్జీలుండేవారు.ఈ సంఖ్య 42కు పెరిగేందుకు కృషిచేశారు. రాష్ట్ర హైకోర్టుకు రికార్డు స్థాయిలో 24 మంది న్యాయమూర్తుల నియామకాలు జరిగేలా చేశారు. మరో జడ్జీని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. ఇతర రాష్ట్రాల హైకోర్టుల్లో జరిగిన నియామ కాలతో పోలిస్తే తెలంగాణ హైకోర్టుకే అత్యధిక మందిని న్యాయమూర్తులుగా నియమించిన ఘన త జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియానికి దక్కుతుంది.
ఆన్‌లైన్‌ విచారణ
సీజేఐగా ఎన్వీ రమణ 16 నెలలు పనిచేస్తే అందులో సుప్రీంకోర్టు 55 రోజులే భౌతి కంగా కేసులను విచారించింది. కరోనా కారణంగా కేసుల విచారణ ఆన్‌లైన్లో చేసేందుకు సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆన్‌లైన్‌లో కేసుల విచారణ తెలంగాణలోనే మొదలైంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చేసిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణకు దక్కుతుంది.
మౌలిక వసతుల కోసం ఆరాటం కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఆ చర్యలు సీజేఐ అయ్యాక కొనసా గించారు. దేశ వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు ఉండాలన్న ఆకాంక్షను కార్యరూపంలో పెట్టారు. జాతీయస్థాయిలో ‘నేషనల్‌ లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టం’ పేరిట ఒక కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. సీఎంల సదస్సులో చేసిన ఆ ప్రతిపాదన అమలు జరిగి ఉంటే కోర్టులు ప్రజలకు మరింత చేరువయ్యేవన్నారు. కోర్టులు ల్యాండ్‌మార్కుగా నిలవాలని జస్టిస్‌ రమణ చెప్తారు. అనేక రాష్ట్రా ల్లో కొత్త కోర్టు భవనాలను ప్రారంభించారు. ప్రజల ముంగిట్లోకి న్యాయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. పది జిల్లా కోర్టుల సంఖ్యను ఏకంగా 32కు పెంచడాన్ని దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఉద్యోగాల నియామాకాలకు సీఎం కేసీఆర్‌ సత్వరమే సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు.
హైదరాబాద్‌ సిగలో కలికితురాయి అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ, పరిష్కార కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటు ప్రతిపాదనను స్వయంగా సీజేఐ హోదాలో సీఎం కేసీఆర్‌ ముందుంచారు. తక్షణమే సీఎం సాను కూలంగా స్పందించడం,ఆపై తాత్కాలిక భవ నంలో ఐఏఎంసీ ఏర్పాటు జరిగిపోయింది. గచ్చిబౌలిలోని ప్రభుత్వం స్థలంలో ఐఏఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగేందుకు దోహదపడ్డారు.
కీలక మలుపు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు 1995లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌ సభ్యుడి పదవికి ఎంపికయ్యారు. కానీ ఆనాడు ఆయన ఆ పద విని స్వీకరించి ఉంటే భవిష్యత్‌ మరోలా ఉండే ది. కానీ న్యాయవాదిగానే ఉంటూనే అనేక కీలక పదవులు అలంకరిస్తూ దేశ అత్యున్నత న్యాయ శిఖరంపై ఆసీనులయ్యారని జస్టిస్‌ రమణ సన్నిహితులు చెప్తారు.
సీజేఐగా కీలక తీర్పులు బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహ చట్టంపై సుమోటోగా స్పందించారు.124సెక్షన్‌ కింద నమోదు చేసిన పెండిరగ్‌ కేసులు,వాటిపై అప్పీళ్లు అన్నింటినీ నిలిపివేస్తూ చారిత్రక ఉత్త ర్వులు ఇచ్చారు. ఆసెక్షన్‌ను కేంద్రం తిరిగి సమీక్ష చేసేవరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించారు. పెగాసస్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్‌వీ రవీంద్రన్‌ సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు.యూపీలోని లఖింపూర్‌ ఖేరి ఘటనలో రైతులు మరణించడంపై అందిన లేఖను సుమోటోగా విచారణ చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు అశీష్‌ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌ ధరలు ఇష్టానుసారంగా ఉండటంపై సుమోటోగా స్పందించి ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా కేంద్రం 18ఏండ్లు నిండినవారికి ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్ట పగలు నడిరోడ్డుపై వాహనంతో ఢీకొట్టి హత్యచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు స్పందించిన తీరు కారణంగా ఏడాదిలోపే హంతకులకు శిక్ష పడిరది. నిందితులకే కాదు, ఖైదీలకు కూడా హక్కులుంటాయని ఉత్తర్వు లిచ్చిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్‌ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగు తున్నారు. కాగా, 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారంచేశారు. రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ యూయూ లలిత్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఇక, యూయూ లలిత్‌ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు.- (పెమ్మరాజు శ్రీనివాస్‌)

నిధులు లేకుండా విద్యాప్రమాణాలెలా?

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు. విద్యా వ్యవస్థకు ఉన్నతవిద్య ఆకాశ హర్మ్యమైతే, పాఠశాల చదువు పునాది. ఈ రెండిరటికీ సమతూ కంగా నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలు పెంచుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికపర మైన ప్రోత్సాహం అవసరం. కానీ తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఈసారైనా కేంద్రం తగిన నిధులను ఇవ్వాలి’

Read more

ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?

‘‘పోలవరం ముంపు మండలాల్లో నివాసయోగ్యత కనిపించడం లేదు. ఈ వరదలు అదే చెబుతున్నాయి. వరద నీరు ఎగువన తగ్గినా మారుమూల గిరిజన గ్రామాలే కాకుండా మండల కేంద్రాలు కూడా కోలుకోవడం లేదు. నీరు తగ్గడం లేదు. గతంలో ఎంత వేగంగా వరద వస్తే అంతే వేగంగా తగ్గేది. ఈసారి మాత్రం వరద తగ్గడం లేదంటే ఇక మా ఇళ్లల్లో మేము ఉండాలంటే కష్టమే. అందుకే ఖాళీ చేస్తామని చెబు తున్నాం. కానీ పునరావాసం ఇవ్వడం లేదు. మాకు ప్యాకేజీ ఇవ్వకుండా మా ఊళ్లను ముంచేశారు. మేము ఏమి చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? కనీసం కూడా ఆలోచించరా.. వరదల్లో ఇచ్చే సహాయంతో మా కుటుంబాలు గడిచిపో తాయా? ప్రభుత్వం ఆలోచించాలి’’

Read more

కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి

కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది చిన్నారులు అనాథలైనట్లు లాన్సెంట్‌ చైల్డ్‌ అండ్‌ అడోలసెంట్‌ హెల్త్‌లో ప్రచురించిన కొత్త మోడలింగ్‌ అధ్యయనం చెబుతోంది. 20 దేశాల చిన్నారులపై చేసిన ఈ అధ్యయనంలో జర్మనీ నుంచి 2,400 మంది ఉంటే భారత్‌ నుంచి 19 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు తేలింది. అత్యంత ప్రమాదకర పరిస్థితి దక్షిణాఫ్రికా పెరూలో కనిపించింది. అక్కడ ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 8 లేక ఏడుగురు అనాథలుగా మిగిలిపోయారు. 0-4 సంవత్సరాల మధ్య వయసు వారు ఐదు లక్షల మంది, 5-9 సంవత్సరాల మధ్య వాళ్లు 7.4 లక్షల మంది కోవిడ్‌ కారణంగా అనాథలుగా మారిపోయారు. 10-17 సంవత్సరాల పిల్లల్లో 21 లక్షల మంది ఈ మహమ్మారి వల్ల ఒంటరివారయ్యారు.
ప్రతి ముగ్గురులో ఇద్దరు కోవిడ్‌ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయారు. సంతానోత్పత్తి, అదనపు మరణాలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వే అధ్యయనం ప్రకారం… 52 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్యకాలంలో కోవిడ్‌ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయి అనాథ లుగా మిగిలారు. మొదటి 14 నెలల కాలంలో జరిగిన మరణాలతో పోలిస్తే 2021 మే 1 నుంచి అక్టోబరు 31 మధ్య ఆరు నెలల్లో సంరక్షకుల మరణాల సంఖ్య రెట్టింపైందని సర్వేలో తేలింది. యు.ఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనై జేషన్‌, ఇతర పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కోవిడ్‌ వల్ల జరిగిన మరణాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉందని గణాం కాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కలనుబట్టి తండ్రులను కోల్పోయిన చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. మన దేశంలో ఈ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కోల్పోయిన పిల్లల సంఖ్య 19.17 లక్షలని తేలింది. 10-17 మధ్య వయసు పిల్లల్లో 49 శాతం మంది తండ్రులను కోల్పోయారు. 15 శాతం మంది తల్లులను కోల్పోయారు. వాస్తవానికి 2021 జులైన సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల వివరాలతో మొదటి సర్వే విడుదలైంది. దానిప్రకారం 15 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ మధ్యకాలంలో అనాథలైనట్లు వెల్లడైంది. అయితే న్యూ మోడలింగ్‌ చేసిన అధ్యయనంలో ఆ సంఖ్యను పున:పరిశీలించి (కోవిడ్‌ ప్రభావిత మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని) 27 లక్షలుగా తేల్చారు (మొదటి సర్వేలో 2021 జులైలో 15,62,000 ఉంటే తాజా సర్వేలో 27,37,300). తాజా ప్రపంచ నివేదికతో కోవిడ్‌, కోవిడ్‌ కారక మరణాలు మరోసారి పెరిగే అవకాశముందని అధ్యయన కర్తలు వెల్లడిస్తున్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆఫ్రికా దేశాల్లో కోవిడ్‌ మరణాల నివేదికలు కచ్చితంగా ఉన్నాయని భావించింది. కాని వాస్తవ అంచనాలు ప్రస్తుతం నివేదించిన సంఖ్యకు మించి 10 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలే కోవిడ్‌ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను కూడా తక్కువ సంఖ్యలో అంచనా వేశాయి.
తాజా సర్వే అక్టోబరు 2021 నాటి అంచనాలను బట్టే ఉంది. ఆ తరువాత కూడా మనదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కోవిడ్‌ విజృంభించింది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం జనవరి 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనాథలైన పిల్లల సంఖ్య 67 లక్షలకు చేరుకుందని భావిస్తున్నారు.ఈ అధ్యయనంలో తేలిన మరో బాధాకరమైన విషయమేమంటే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బారినపడి సంరక్షకులు, తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలు పదేళ్లలో 50 లక్షల మంది ఉంటే కోవిడ్‌ ప్రభావంగా కేవలం రెండేళ్లలోనే అంతమంది పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఖ్యలు ఒమిక్రాన్‌ విజృంభించక ముందు నాటివి.
అనాథలైన ఈ పిల్లల సంరక్షణను జాతీయ కోవిడ్‌ ప్రతిస్పందన ప్రణాళికలో చేర్చాలి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ వేయడం, నియంత్రణ, చికిత్సలపై దృష్టి పెట్టాలి. సంరక్షకుల మరణాలను నివారించాలి. బాధిత పిల్లలకు మద్దతుగా ఆయా కుటుంబాలను సిద్ధపరచాలి. పేదరికం, ప్రతికూలత, హింస వంటి ప్రమాదాల బారిన పడకుండా పిల్లలను రక్షించాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు దిక్కుతోచకుండా మిగిలిపోయారు. అనాధలై, సహారా కోల్పోయిన చిన్నారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.కరోనా మహమ్మారి (జశీతీశీఅa ూaఅసవఎఱష) కారణంగా అనాధలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పిల్లల చదువుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. 2020-21లో కోవిడ్‌ కారణంగా 6 వేల 8 వందలమంది చిన్నారులు తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారు. అనాధలైన చిన్నారులు ఎక్కైతే చదువుతున్నారో అక్కడే కొనసాగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం కింద అక్కడే చదువు చెప్పించనుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన 6 వేల8 వందల మంది చిన్నారుల్లో 4 వేల 333మంది పిల్లల పూర్తి వివరాల్ని అధికారులు సేకరించారు. వీరిలో 1659 మంది ప్రభుత్వ పాఠశా లల్లోనూ,2 వేల150 మంది ప్రైవేటు విద్యా సంస్ధల్లోనూ చదువుతున్నారు. మరో 524 మంది శిశువులున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి స్కూల్స్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల(ూతీజూష్ట్రaఅ జష్ట్రఱశ్రీసతీవఅ)వివరాల్ని ఆయా విద్యాసంస్థలు ప్రభుత్వ ఛైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాల్సి ఉం టుంది. పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగించాలి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల్ని తొలగించకూడదు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువును నిరాటంకంగా కొనసాగించేలా చూడాలి. జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్‌, షూ, సాక్స్‌, బెల్ట్‌, డిక్షనరీల్ని మొదటి ప్రాధాన్యతగా అందించాలి. ఇదే విషయమై ఇప్పటికే పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు (Aజూ Gశీఙవతీఅఎవఅ్‌) మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ బాలల హక్కుల సంరక్ష కమీషన్‌ కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది.
పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న వారి పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం పవ్రేశ పెట్టింది. మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. వారి భవిష్యత్‌ అంతా అగమ్యగో చరంగా మారింది. ఈ సమ యంలో కేంద్ర ప్రభుత్వం మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మే 29, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను లాంచ్‌ చేశారు. పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను మహిళల,శిశు అభివృద్ధి మంత్రి త్వ శాఖ నిర్వహిస్తోంది.ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశ్యం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా వారి సంక్షేమానికి పాటుపడటం, విద్యాబోధన ద్వారా సాధికారత కల్పించడం,23 సంవత్సరాలు వచ్చే నాటికి ఆర్థికంగా స్వావలంబన వచ్చేలా వారిని తీర్చిదిద్దడం తద్వారా వారికి సంక్షేమానికి పాటుపడటం. ఈ పిల్లలకు18ఏళ్ల వయసు నుంచి నెలసరి స్టయిఫండ్‌ను అందించడంతో పాటు 23 ఏళ్ల వయసు వచ్చే సరికి దాదాపు రూ.10 లక్షల మొత్తాన్ని అందించడం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌ కింద అర్హులైన వారు ఎవరు..?కరోనా కారణంగా తల్లిదం డ్రులను ఇద్దరిని కోల్పోవడం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా చట్టబద్ధమైన సంరక్షకు లను, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. ఈ పథకం కింద ప్రయోజనం పొందా లంటే.. తల్లిదండ్రులు మరణించే నాటికి పిల్లల వయసు 18ఏళ్లు పూర్తి కాకుండాఉండాలి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేర్‌ సెంట్రల్స్‌ నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
లభించే ప్రయోజనాలు..
ౌ 18 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలసరి స్టయిఫండ్‌, 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షల ఫండ్‌
ౌ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య
ౌ ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్‌, పీఎం కేర్స్‌ నుంచి రుణాలకు వడ్డీ చెల్లింపు
ౌ ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచితంగా రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రీమియాన్ని కూడా పీఎం కేర్స్‌ ద్వారానే చెల్లింపు
ౌ ఉచిత భోజన, వసతి ప్రయోజనాలు
ౌ ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం, పాఠశాల విద్యకు ముందస్తు సాయం, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, ఆరోగ్య రక్షణకు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంగన్‌వాడీల ద్వారా సపోర్టు
ౌ పదేళ్ల లోపు పిల్లలకు సమీపంలోని పాఠశాలలో ప్రవేశం, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్‌ పాఠశాలలో ప్రవేశానికి వీలు కల్పించడం
ౌ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం కింద పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందివ్వడం
ౌ ప్రైవేట్‌ పాఠశాలలో చేరే పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(1)(సీ) సెక్షన్‌ కింద వారికి బోధనా రుసం చెల్లింపుల నుంచి మినహాయింపులు కల్పించడం
ౌ 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు తమ కుటుంబీకుల సంరక్షణలో జీవిస్తే.. వారికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్‌ పాఠశాలలో ప్రవేశం కల్పిం చేందుకు జిల్లా మెజిస్ట్రేట్‌ చర్యలు తీసుకుంటారు.
ౌ ఉన్నత విద్య కోసం దేశంలోని ప్రొఫెషనల్‌ కోర్సులు లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సులను అందించేందుకు అవసరమైన విద్యా రుణం సాయం అందిస్తుంది ప్రభుత్వం – (ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌, సౌజన్యంతో…) – జి.ఎన్‌.వి.సతీష్‌

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు-2022-2023


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించి టాప్‌ -5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్‌ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్‌ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్‌ గురువారం ఢల్లీిలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది.
పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవర త్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్‌ 81 శాతం స్కోర్‌ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం,సంక్షేమంలో రాష్ట్రం 77శాతం స్కోర్‌ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపు మాపుతున్నారని నీతి అయోగ్‌ ప్రశంసిం చింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది.ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్‌లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్‌లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది.
సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది.
అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్‌ వెల్లడిరచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రు లను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషిం చింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది.
పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. నీతి ఆయోగ్‌ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగు తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్‌ అందు తోందన్నారు మంత్రి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపా యలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022-23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్రి జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్య లోటు 3.64శాతంగా ఉండవచ్చని తెలి పారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం నవరత్నాలు, ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి, సంస్థాగత బలోపేతం, సామాజిక చేరకల వల్ల అన్ని ఏస్జీజీలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానం దిశగా పయనిస్తోంది. అంతకు ముందు వార్షిక బడ్జెట్‌కు సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి సీదిరి అప్పల రాజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనసభ లో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్న బాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడ తారు. కేబినెట్‌ భేటీకి ముందుఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బడ్జెట్‌ ప్రతులకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్తిసారా మరణాల,పెగాసెస్‌ల పై దద్దరిల్లిన అసెంబ్లీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై మూడోరోజు శాసనమండలి దద్దరిల్లింది. శాసనసభను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పిన సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం చర్చకు అనుమతించాలని ప్రతిక్ష నేతలు పట్టుపట్టడంతో సభ సంభించింది. అలాగే పెగాసస్‌పై అసెంబ్లీ భగ్గుమంది. ఇప్పటికే దేశమంతా మార్మోగినన ఈఘటనపై అసెంబ్లీలో అధికార పార్టీనేతలు ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని అసంబ్లీ వ్యవహా రాలశాఖ మంత్రి బుగ్గన విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తున్నది. బడ్జెట్‌ అంటే కేవలం జమాఖర్చుల చిట్టా మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, ప్రజాసంక్షేమం,అభివృద్ధి ప్రాధాన్యతలు ఇందులో ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ రంగా న్ని బడా కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. వారికి కావలసిన సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరిం చింది. దానికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పేరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పోటీ పడడానికి ప్రోత్సా హకాలను ఇస్తున్నది. మరోవైపు అభివృద్ధికి మూలాధారంగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసింది. కార్పొరేట్‌ బోర్డుల తరహాలో నీతి అయోగ్‌ను నియమించింది. గతంలో ప్రభుత్వ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌,విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలు ప్రభుత్వ రంగం పునాదిగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని కూడా ప్రైవేటు రంగానికి వదిలేశారు. రియల్‌ ఎస్టేటే పట్టణాల అభివృ ద్ధిని శాసిస్తోంది. అందువల్ల బడ్జెట్‌లో అభివృద్ధి నిధులు క్రమంగా తగ్గిపోయి నిర్వహణా వ్యయా లు మాత్రమే మిగులు తున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చివరిదాకా అలాగే ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. రివైజ్డ్‌ బడ్జెట్‌ పేరుతో అన్నీ తలక్రిందులవుతుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిధుల కేటాయింపులు అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరుగుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థను బలహీనపరిచే పరిణామం. ఈ బడ్జెట్‌తోనైనా ఈ ఒరవడికి స్వస్తి చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్‌ ప్రసంగం పాలక పార్టీ ఆలోచనలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పథకాల చిట్టాను ఆయన చదివేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలు బ్రహ్మాండంగా జీవిస్తున్నారని, సంతృప్తికరంగా ఉన్నారని పాలక పార్టీ భ్రమల్లో ఉంది. అందువల్లే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను గాలికి వదిలేసింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదాయ కోటాలను ఇచ్చింది. డబ్బులు రాబట్టడానికి వారు ప్రజల మెడపై కత్తి పెట్టి వసూలు చేయాలని చెబుతోంది. ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలతోపాటు ప్రజల నుండి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ‘’ప్రభుత్వ ధనార్జన స్కీము’’లను కూడా ప్రవేశపెట్టింది.– జె.వి.శ్రీనివాసరావు

చిన్న జిల్లాలు సామాజిక పరివర్తన సాధనాలు

‘‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’’ అని ఎప్పుడో అన్నాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి ఇయఫ్‌.స్కుమాచెర్‌. అఅనుభూతి ఆచరణలోకి వచ్చింది తెలంగాణాలో అదీ దశరా పర్వదినాన. ఇరవైనొక్క కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాడవాడలా,పల్లె పల్లెన,పట్టణాల్లో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు చూసి తరించాల్సిందే తప్ప వర్ణశక్యం కాదు.అదిలాబాద్‌, మెదక్‌ వంటి పెద్ద జిల్లాల్లో-వైశాల్యం దృష్ట్యా-జిల్లా అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈపరిణామాన్ని ఆహ్వా నించే వాళ్ళలో నేనొకడిని. మారుమూల ప్రాం తాలైన బెజ్జూరు,దహెగాం,తిర్యాణి మండలాల నుండి జిల్లాకేంద్రమైన అదిలాబాద్‌ చేరుకోవా లన్నా, అలాగే జగదేవ్‌పూర్‌,దుబ్బాక నుండి సంగా రెడ్డి (మెదక్‌ జిల్లా కేంద్రం) రావాలన్నా సామాన్య ప్రజానీకం పడే బాధలు అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవి అలివి కాని ఇక్కట్లు. అందుకే అనుకుం టాను నానివాసం (క్యాంపు ఆఫీసు) ముందు ప్రొద్దు న్నే ధరఖాస్తుదార్లు వేచివుండడం చూసి మనసు కరిగి పోయేది. అంతకు క్రితం రోజంతా బస్సులో ప్రయాణించి, దూరా భారాలు ఓర్చి,రాత్రికి కలెక్టరేటు ఆరు బయట ప్రదేశంలో తలదాచు కుని ప్రొద్దున్నే జిల్లాఅధికార్ల సందర్శనార్థం ఎదురుచూసే ఈ అభాగ్య జీవులకష్టాలు ఎపుడు గట్టెక్కుతాయా అని ఆక్రోశించేవాణ్ణి. అయినాపని పూర్తవుతుందన్న నమ్మకం లేదు. పదిగంటలు దాటిందంటే దౌరా (టూరు)కు పోవటమో, మీటింగుల్లో మునిగి పోవ టమో జరిగితే, అధికార్లు అందుబాటులో లేకపోతే, మరొకరోజు జిల్లాహెడ్‌ క్వార్టరులోఉండాల్సి వచ్చే ది. అదృష్టవశాత్తు పెద్దగా రద్దీలేని సంగారెడ్డి, అదిలాబాద్‌ లాంటి పట్టణాల్లో, ఆఫీసుల ఆవరణ లోనే మకాం. వీళ్ల కోసం దేవాలయ ప్రాంగణాల్లో వున్నట్లు సత్రాలు ఏర్పటు చేస్తే బాగుం టుదేమో అన్న ఆలోచన కూడా మెదిలేది. ప్రత్యామ్నా యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళ ఆవరణలో వాళ్ళకు ఆశ్రయం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆబాధలు తప్పినట్లే.
చిన్న జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజానీకానికి ఎంతో వెసులుబాటు కల్పిం చింది. దూరాలు దగ్గరయ్యాయి కదా అని అలస త్వంతో జిల్లా అధికార్లు ప్రజానీకానికి అందుబాటు లో లేకపోయినా,వారి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేసినా,హెడ్‌ క్వార్టర్‌ లో మకాం లేకపోయి నా,చిన్నజిల్లాలకు,పెద్దజిల్లాలకు అట్టే తేడా వుండ దు. సగటు మనిషి ఆశలు ఆడియాసలు కాకుండా చూసుకోవడం అధికార్ల బాధ్యత.
జాతీయ సగటుకు మూడు రెట్లు విస్తీర్ణం
జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం4000 చదరపుకిలోమీటర్లు వుంటే తెలంగాణలో 11,000 చ.కి.మీ.వుండేది గతంలో.జనాభా రీత్యా చూసినా, జాతీయ సగటుకు రెట్టింపు జనసాంద్రత వుండేది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో నలభైశాతం వున్న పంజాబు,హర్యానా,రాష్ట్రాల్లో నలభై, యాభై జిల్లాలు ఉండడం ఈదిశగా గమనార్హం.చిన్నజిల్లాల సంఖ్యా పరంగా చూస్తే, జాతీయ స్థాయిలో తెలంగాణాది 9వ స్థానం.జనాభా రీత్యా,12వ స్థానంలో వుంది. ఈ లెక్కన చూస్తే, 31జిల్లాల తెలంగాణ రాష్ట్రం సముచితమే అనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా. ఎన్ని జిల్లాలు వుండాలి? ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి? రెవెన్యూ డివిజన్లు, మండలాలుఎన్ని?అన్న విశ్లేషణ ఎడ తెగని తర్కం.అదినిరంతర ప్రక్రియ.విధాన నిర్ణ యాల్ని పాలకులవిజ్ఞతకు వదిలేసి,అధికార్లు, ఉద్యోగులు జిల్లాల పునర్విభజానంతరం ఉద్యమ స్ఫూర్తితో,ఈ మార్పులు చేర్పులు ప్రజోపయోగం కోసమే కానీతమకోసం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలాగున పని చేయటం తక్షణ కర్తవ్యం.
బూజుపట్టిన బ్రిటిష్‌ కాలంనాటి వ్యవస్థ
ప్రస్తుతం మనదేశంలో వేళ్ళూనుకున్న పాలనా వ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో రూపొందింది. ఒకవిధంగా చెప్పాలంటే శిస్తువసూలు వ్యవస్థ అది .దానికి కాల దోషం పట్టటం సహజం. 1984లో మొదలైన గ్రామ పరిపాలనా, మండలీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికి చిన్నజిల్లాల ఏర్పాటు తో రూపాంతరం చెందటం ఆహ్వానించదగ్గ పరిణా మం.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునర్వ వ్యస్థీకరణ పాలన. గ్రామాలు పాలనా వ్యవస్థ ఆయు వుపట్టులు. పునాది రాళ్ళ. గ్రామపాలన ప్రాచీన కాలం నుండి గ్రామాధికారులు చూస్తుండేవారు. వంశపారంపర్య గ్రామాధి కార్ల వ్యవస్థ రద్దై ముప్పై ఏళ్ళుదాటినా,పటిష్టమైన, ప్రత్యా మ్నాయ గ్రామపా లనాయంత్రాంగం లేదు. ఉదా హరణకు మాలీ పటేళ్ళ వ్యవస్థ. మద్రాసు ప్రెసిడెన్సీ పాలనకు భిన్నంగా,తెలంగాణా ప్రాంతంలో పోలీస్‌ పటేల్‌ (గ్రామమునసబ్‌),పట్వారీ(గ్రామకరణం), మాలీ పటేల్‌ గ్రామాధికార్లుగా వుండేవారు. మాలీ పటేళ్ళ అజమాయిషీలో గ్రామీణ సాగు నీటి వనరులుగ్రా మస్థులు సమష్టి కృషితో నిర్వహింపబడేవి.
సుపరిపాలన దృష్ట్యా వ్యవస్థలో మార్పులు
సుపరిపాలన దృష్ట్యా, ఇప్పటివరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు, మండల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి,కానీ గ్రామాల పునర్వ వ్యవస్థీకరణ అలాగే వుండిపోయింది. ఇప్పటికీ ఎంతో పెద్ద రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబం ధంగా మజరాలు (హమ్లెట్లు) డిపాపులేటెడ్‌ మరి యు ఫారెస్టు గ్రామాల శివార్లు అలాగే వుండిపో యాయి. భూకమతాల సంఖ్య, విస్తీర్ణం దృష్ట్యా, పట్టేదార్ల వారిగా చిన్న చిన్న రెవెన్యూ గ్రామాలుగా విడగొడితే పాలనా సౌలభ్యం, పర్యవేక్షణ పటిష్టం కావటానికి వీలుపడుతుంది. గ్రామస్థాయిలో సర్వే సిబ్బంది నియామకం తెలంగాణా జిల్లాలో తక్షణా వసరం. మరీ ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్టు తగా దాల దృష్ట్యా. మజల్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా నోటిఫై చేయాల్సిన అవసరం పరిశీలనా యోగ్యం, సమాంతరంగా (పంచాయితీలవిభజన కూడా సబబుగా వుంటుంది. మేజర్‌,మైనర్‌,నోటిఫైడ్‌ అన్న బేధంలేకుండా,పరిపాలనకు అనువుగాచిన్న పంచా యితీల్ని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి, వాటికి మిగులు నిధులు,విధులు,తగినంత మంది సిబ్బం దిని సమకూరుస్తే సమగ్ర గ్రామీణాభివృద్ధి చేకూరు తుంది. జనాభా సాంధ్రత, పంచాయితీ విస్తీర్ణం ప్రామాణీకలుగా,చిన్న చిన్న పరిపాలనా సౌలభ్య యూనిట్లు ఈ దిశలో ఎంతో అవసరం. షెడ్యూలు కులాలు,తెగలు అవాసముంటున్న పల్లెల్ని, తండా ల్ని ప్రత్యేక గ్రామపంచాయితీలుగా ప్రకటిస్తే, పంక్తి లో చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే ఈదిశలో తెలంగాణా ప్రభుత్వం చొరవతీసికోవటం ఆహ్వా నించదగ్గ పరిణామం.
అట్టడుగు ప్రజల అభివృద్ధికి వీలు
చిన్న జిల్లాలు సామాజిక పరివర్తనకు సాధనాలు కావాలి. గతంలో తెలంగాణా ప్రాంతంలో నెల కొన్న అనిశ్చిత,సాంఘిక,ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, చిన్న జిల్లాలు బడుగు, బలహీన వర్గాల ప్రయో జనాలు కాపాడటంలో అట్టడుగు ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద వహించటానికి వీలవుతుంది కూడా. తనను కాపాడే ప్రభుత్వ యంత్రాంగం తన చెంతనే వుందన్న భరోసా సామాన్యుడికి ఎంతో ఊరట నిస్తుంది.అదే వరవడిని జిల్లాలో కొనసాగిస్తే మం చిది. అలాగే జిల్లా అధికార్లందరూ కేంద్ర కార్యాల యాల్లో వుండే పని చేయాల్సిన అగత్యమూ లేదు. వారి పర్యవేక్షణ, నిపుణత ఏఏమండలాల్లో కావల్సి వస్తుందో, ఆ సామీప్యంలోనే వారి హెడ్‌క్వార్టర్‌ వుంటే మంచిది. ప్రయాస, దుబారా ఖర్చులు వుం డవు. అవసరమైతే రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తే బాగు. క్షేత్రస్థాయి అనుభవం బట్టి, నేను జిల్లా అధికారిగావున్న రోజుల్లో కొన్ని శాఖల జిల్లా అధికార్ల ముఖాలు కూడా చూసివుండను. ఉదాహ రణకు, కమర్షియల్‌ ట్యాక్స్‌,రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌, జియాలజి,దేవాదాయశాఖ,నీటివనరులశాఖ ప్రత్యేక డివిజన్ల అధికార్ల వునికే జనానికి ఎరుకే వుండదు.
మెరికల్లాంటి గ్రూప్‌1,2 అధికారులు
సిబ్బంది కొరత,నిపుణత లోపించటం వంటి పలు కులు పాలనావ్యవస్థలోపరిపాటి.ఎప్పుడూ వుండేదే. అవసరం వున్న శాఖల్లో సిబ్బంది కరువు. అవగా హన లేని సంస్థల్లో పనిలేక యాతన పడేవాళ్ళు ఎందరో.మరీ ముఖ్యంగా జిల్లా, డివిజన్ల స్థాయిల్లో, పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ద్వారానియామకమైన సిబ్బం ది, అధికార్లు మెరికల్లాంటివారు. అఖిల భారతీయ సర్వీసు అధికార్లకు ఏమాత్రం తీసిపోరు కొన్ని సంద ర్భాల్లో.మరీ ముఖ్యంగా గ్రూప్‌-1,2సర్వీసు అధి కార్లు. రిక్రూట్‌ అయినప్పటినుండి అదేశాఖలో మగ్గిపోవాల్సినదుస్థితి.అలాగాకుండా ఓపదేళ్ళు ఆయాశాఖల్లో పనిచేసి నిపుణతను సంతరించుకున్న తరువాత జనరల్‌ పూల్‌లోకి లాక్కొని వారి సేవలు అన్ని శాఖలకు విస్తరింపచేస్తే మంచిది. ఆ క్రమంలోనే స్టేట్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు చెందిన వారిగా పరిగణించి (గతంలో హైద్రాబాద్‌ సివిల్‌ సర్వీసు, ఆంధ్రప్రదేశ్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు ల్లాగా), వాళ్ళ నుండే ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ వంటి అఖిల భారతీయ సర్వీసులోకి ఎంపిక జరిగేలా చూడాలి. దీంతో ఒక సర్వీసు గొప్పది. మరొక సర్వీసు చిన్నది అన్న భావన తాజాగా పోతుంది.
పాలనా పద్ధతులు మారాలి
చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పాలనా పరమైన పద్ధతులు, సంప్రదాయాలు, మ్యాన్యువల్స్‌ మార్చా ల్సిన అవసరం ప్రభుత్వం ఈపాటికే గుర్తించి వుం టుంది. ఏప్రతిపాదనలు వచ్చినా,ఏదరఖాస్తు వచ్చినా రొటీన్‌ గా ‘తగుచర్య నిమిత్తం’, పరిశీల నార్థం (ప్లీజ్‌ ఎగ్జామిన్‌) అని అంటూ విలువైన సమయాన్ని,శక్తి యుక్తుల్ని వృధా చేయరాదు. అలాగే కిందిస్థాయి నుండి నివేదికలు కోరటం కూడా తప్పే. ఉదాహరణకు ఏదరఖాస్తు దారుడైనా క్రింది స్థాయిలో పని కావటం లేదని ఫిర్యాదు చేస్తే, నా పైనా,నాపని తీరు పట్లపై అధికార్లకు కంప్లైంట్‌ చేస్తావా అని కక్షకట్టిన సందర్భాలు ఎవరివల్ల తన పని కావటం లేదో,అదే అధికారికి ఆపిర్యాదును తగు చర్య నిమిత్తం పంపటమో, నివేదిక కోరటం లో ఔన్నత్యం లేదు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు దారు సంబంధిత అధికార్లను సంప్ర దించినపుడు, ‘‘నన్ను కాదని పై అధికార్ల దగ్గరికి పోయావు కదా! అక్కడే నీ పని చేయించుకోపో’’ అంటూ వ్యంగంగా వ్యవహరించటం కూడా కద్దు. ఈఅడ్మినిస్ట్రేటివ్‌ పద్ధతులు అవమానీయం.ఆక్షేపణీయం.
విప్లవాత్మక సంస్థాగత మార్పులు అవసరం
తెలంగాణాలో పట్టణాల సంఖ్య అతి తక్కువ అని మనకు తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం జనాభా పట్టణాల్లో నగరాల్లో నివాసమున్నట్లుగా గణాం కాలు సూచిస్తున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో జనసాంధ్రత యాభైశాతానికి మించిపోయే అంచ నాలు. ఉదాహరణకు 38ఏళ్ళ క్రితం(1978)లో ఏర్పాటైన కొత్త జిల్లా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ వలయంగా, నాడు 6లక్షల జనాభాతో,6అసెంబ్లీ నియోజక వర్గాలతో ప్రారం భమైన జిల్లానేడు 14అసెంబ్లీ నియోజక వర్గాలతో 52లక్షలజనాభాతో మరో మహనగరానికి తెరలే పింది. అలాగే ఇప్పుడు ఏర్పాటైన కొత్త మండల, డివిజన్‌,జిల్లాకేంద్రాలురాబోయే రోజుల్లో పట్టణా కృతుల్ని సంతరించుకునే అవకాశం వుంది.
ఈ గ్రోత్‌ సెంటర్ల క్రమబద్దీకరణకు ఇప్పటి నుండే పునాదులు వెయ్యాలి. ప్రణాళికలు తయారు చేసు కోవాలి. ఈ దిశలో టౌన్‌ మరియు కంట్రీ ప్లానింగు శాఖను అన్ని గ్రామ,మండల,జిల్లా కేంద్రాల పరిధి లో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈశాఖ రియల్‌ ఎస్టేటు, డెవల పర్లకే కాకుండ, సామాన్యప్రజానీకానికి ఉపయోగ పడేలా రూపాం తరం చెందాలి. ఈశాఖ ఆధ్వ ర్యంలో ప్రణాళిక బద్దమైన నమూనాలకు లోబడి, గ్రామ, మునిసిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్‌ ప్లాన్లు సవరించు కోవవాలి. గతంలో ఈ నమూ నాలు కాగితాలకే పరిమితం కావటం కద్దు. ఈది శలో విప్లవాత్మ కమైన సంస్థాగత మార్పులు అవ సరం. లేదంటే భవిష్యత్తులో వగచాల్సి వస్తుంది. ఇపుడు జంటనగ రాలు ఎదుర్కొంటున్న రుగ్మతులు అధిగమించాల్సిన అవసరం పట్టణీకరణ దిశలో ఎంతైనా వుంది.
తెలంగాణ జిల్లాలు పసికూనలు
రెండున్నర ఏళ్ళు కూడా నిండని పసికూనలు తెలం గాణా కొత్త జిల్లాలు. ముప్పై ఒక్క చేతులతో (జిల్లాల సంఖ్యాపరంగా) పొదివి పట్టుకొని, ఉద్యమ స్ఫూర్తి తో సాధించుకున్న రాష్ట్రాన్ని, సవరించుకుని సాదు కోవాల్సిన తరుణమిది అంటూ ప్రభుత్వాది నేత పలు సందర్భాల్లో గుర్తు చేయటం గమనార్హం. ఇటీవలే సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) వెల్లడిరచిన మానవ వనరుల అభివృద్ధి సూచికలు (హెచ్‌.డి.ఐ)గుర్తించి రాష్ట్రప్రభుత్వ పని తీరును మెరుగు పర్చాల్సి వుంటుంది. గతంలో వున్న పదిజిల్లాలో,ఏడు జిల్లాలు పారిశ్ర మీకరణలో శరవేగంగా ముందుకు దూసుకుపోతు న్నాయి. వ్యవసాయపరంగా మూడుజిల్లాలు ముందుడగులో వున్నాయి. అక్షరాస్యత,అరోగ్య పోషణాపరంగా ఇంకా సాధించాల్సింది ఎంతైనా వుంది.
ఐటీ చిరునామా రంగారెడ్డి జిల్లా
విభజించిన జిల్లాలపరంగా చూస్తే, ఐ.టి.రంగా నికి రంగారెడ్డి జిల్లా చిరునామా. పారిశ్రామికంగా మేడ్చెల్‌, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు పెద్దపీట వేయాల్సి వుంటుంది. విత్తన క్షేత్రంగా కరీంనగర్‌, సాగునీటిపరంగా ఖమ్మం నేతన్నల జిల్లాగా సిరి సిల్ల,అడవుల జిల్లాగా అదిలాబాద్‌,సాంస్కృతిక వార సత్వ జిల్లాలుగా వరంగల్‌,యాదాద్రి,భద్రాద్రి, జగి త్యాల జిల్లాలు మచ్చుకుకొన్ని. సాంస్కృతిక వారసత్వ పరంగా కూడా తెలంగాణాకు ప్రత్యేకం కృష్ణా, గోదావరి లాంటి పవిత్ర నదీమ తల్లుల నట్టనడుమ మైదాన ప్రాంతంగా ఆవరించిన గడ్డ, పాలపిట్ట, తంగేడు చెట్టు జింక ప్రభుత్వ చిహ్నలు ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు ప్రతిబింబం. బతుకునే దేవతగా చేసి పూజించే పుణ్య భూమి. అదే బతు కమ్మ వేడుక.తెలంగాణాకే ప్రత్యేక ఆకర్షణ.
రచయిత: – డా.దాసరి శ్రీనివాసులు ఐ.ఎ.యస్‌., సంచారి ఉద్యమ కార్యకర్త.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-26 కొత్త జిల్లాలు

పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన జిల్లాల విభజనలో హేతుబద్ధతలేదు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన చేయాలి. భౌగోళిక, ప్రాంతీయ సమతూకం పాటించకుండా కేవలం రాజకీయ ప్రయోజ నాలు,స్వార్థంతో విభజన చేపట్టడం సబబు కాదు.రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అవసరాల ఆధారంగా జిల్లాల విభజన జరగాల్సిన అవశ్యకత ఉంది.
జిల్లాల విభజనలో హేతుబద్ధత కరువు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటం మరొకసారి మారి పోతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన వెంటనే దీని పనులు శరవేగంగా సాగుతు న్నాయి. నూతన జిల్లా కేంద్రాలయాల్లో ఆఫీసులు,స్థలాలు,ఉద్యోగుల విభజన వంటి పనులు జరుగుతున్నాయి. ఉగాదినాటికి కొత్త జిల్లాలో పాలన కొనసాగాలని ప్రభుత్వం భావి స్తోంది. జిల్లా కార్యాలయాలు ప్రజల సమీ పానికి వస్తాయనేది చిన్న జిల్లాల ఏర్పాటును సమర్థించుకుంటూ ప్రచారమవు తున్న సిద్ధాం తం. దీనివల్ల పాలనాపరమయిన ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంగీకరిస్తూనే ఈ ఆశయం నెరవేరే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు తీసుకువచ్చిన పరిపాలనలో గుణా త్మక మార్పేమి లేకపోవ డాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. ఇప్పు డున్న జిల్లాల సరిహ ద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూల మయిన కొత్త సరిహద్దులను సృష్టించడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభి వృద్ది సుగమం అవు తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఇది కేవలం భ్రమ అని,రాజకీయలబ్ది కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని జిల్లాల ఏర్పాటును చూస్తే అర్థమవుతుందని చాలా మేధావులు, రాజకీయ నాయకులు చెప్పారు.
ప్రజల ముంగిట పాలన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని పాలనా వికేంద్రీకరణగా,ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లడంగా,పాలనా సంస్కరణగా ప్రభు త్వాలు పిలుస్తున్నాయి. ప్రజల ముంగిటికి పాలన అనేమాట 1986లో మొదట వినిపిం చింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈ నినాదంతోనే ఒక శతా బ్దానికిపైగా చరిత్ర ఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాహ శీల్దార్‌ పదవికి ఉన్న హోదాను,హంగును తీసే శారు.‘పవర్‌ ఫుల్‌’ తాహశీల్దార్‌ని మండల రెవిన్యూ అధికారిగా మార్చి జనం మధ్యకు తీసుకువచ్చారు. అయితే, తర్వాత సంస్కరణలు ఆగిపోయాయి. జిల్లాను సంస్కరించే పని ఎవరూ చేయలేదు. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన తర్వాత,ఎప్పుడో బ్రిటిష్‌ కాలం లో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరి పేసి చిన్న జిల్లాలను సృష్టించి కలెక్టర్‌ పదవిని కూడా జనం మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది.ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీ నం చేసి ముఖ్యమంత్రులను ఇంకా శక్తివం తులను చేస్తుందా అనేది ప్రశ్న.కలెక్టర్‌,ఎస్పీల గ్లామర్‌ తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లా లను సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ అధికార విస్తృతి,దర్పం తగ్గిపోతాయి. కలెక్టర్లు ఇపుడు డివిజన్‌ హెడ్‌ క్వార్టర్‌ కంటే చిన్న ఊర్లలో కూర్చోవలసి వస్తుంది. ఇదే పరిస్థితి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి కూడా ఎదురవు తుంది. ఉదాహరణకు కడప జిల్లాను విడదీసి రాయచోటి జిల్లాను సృష్టించారు. ఇది డివిజినల్‌ హెడ్‌ క్వార్టర్‌ కూడా కాదు. ఇప్పుడు ఈఊరి లో కలెక్టర్‌ ఆఫీస్‌ వస్తుంది. ఎప్పుడో గాని కన్పించని కలెక్టర్‌ని,జిల్లా ఎస్‌పీని ఈఊరి ప్రజ లు రోజూ చూస్తారు. వారితో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఎందరో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆ చిన్న ఊర్లో రోజూ తారసప డతారు. ఇలా కొత్త జిల్లాలు ఒక వినూత్న పాలనానుభవాన్ని తీసుకువస్తున్నాయి. ‘సాధార ణంగా ప్రజల్లో ‘అబ్బో కలెక్టర్‌ ఆఫీస్‌ చాలా దూరం, కలెక్టర్‌ని కలుసుకోవడం చాలా కష్టం,’ అనే భయభావం ఉంటుంది. దీని వల్లే సాధా రణ ప్రజలకు ఈ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ఒక మధ్యవర్తి జోక్యంగాని,రాజకీయ నాయకుడి సాయంగాని అవసరమయింది,ఊరికి దూరం, ఉన్నతాధికారి అంటే ఉన్న భయభావం చిన్న జిల్లాల ఏర్పాటుతో పోయే అవకాశం ఉంది’’ ‘‘అంటే చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పైరవీ కారుల అవసరం తగ్గే వీలుంది. అదే సమ యంలో చిన్న జిల్లాల అధికారులకు పెద్ద జిల్లాల నాటి హుంగు ఆర్భాటాలు తగ్గిపో తాయి. ఇది ఆశించదగ్గ పరిణామం’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్‌ శ్రీనివాసులు అన్నారు. ఇలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మరొక విశ్రాంత ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు.‘‘1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు9జిల్లాలుండేవి.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1970 ఫిబ్రవరి 1న గుంటూరు,నెల్లూరు,కర్నూలు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఆపైన 1979 జూన్‌ 1న విజయ నగరం జిల్లా ఏర్పడిరది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగూతూ వచ్చింది. తెలం గాణ నుంచి కొన్ని మండలాలు కలవడంతో తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగింది. ఈ కారణాలతో కొత్తగా చిన్న జిల్లాలను సృష్టిం చడం ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ. ముఖ్యం గా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది’’‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా జంగారెడి గూడెందాకా 500 కి.మీ పరిధి గిరిజన ప్రాంతం ఒకే ఎంపీ కింద ఉండేది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రెండు జిల్లాలుగా మార్చారు. జిల్లాల పరిమాణం బాగా కుంచించుకుపోతుంది. ఇదొక మంచి ప్రయోగం’’ అని ప్రొఫెసర్‌ చలం అన్నారు.
చిన్న జిల్లాల పెద్ద ఆశయం నెరువేరుతుందా?
ఆశయపరంగా చిన్న జిల్లాలను సృష్టించడం చాలా మంచి నిర్ణయం అనే విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిలో ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఈ ఆశయం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో నెరవేరుతుందా అనే దాని మీద అందరిలో అనుమానా లున్నాయి. ప్రజలకు పరిపాలన చేరువ కావడం అంటే ఏమిటి?జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని 250 కి.మీ దూరం నుంచి 100కి.మీ దూరా నికి మార్చినందున పరిపాలన దగ్గరవుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి? చిన్న జిల్లా ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ అవుతుందా?ఈ ప్రశ్నలకు ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన తెలంగాణలో సమా ధానం దొరకడం లేదు. రేపు ఆంధ్రలో కూడా ఇదే పరిస్థతి వస్తుంది. జిల్లాలొస్తాయి గాని, ఆశయాలు నెరవేరుతాయన్న గ్యారంటీ లేదు.1986లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ప్రజల వద్దకు పాలన’అని నినాదమీయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ లేదు. మీ-సేవా కేంద్రాలు, ఇ-సేవా కేంద్రాలు లేవు.ఏదయినా సర్టిఫికేట్‌, రిజస్ట్రేషన్‌, దరఖాస్తు అవసరమయితే, ఎపుడొస్తుందో తెలియని ఆర్టీసీ ఎర్రబస్సును నమ్ముకుని తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రా నికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసి బస్సు అంటే ‘రాదు, తెలియదు, చెప్పలేము’ అని నవ్వులాటగా ఉండే రోజులవి. అపుడు జిల్లా కార్యాలయానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. ఇపుడా పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యాల యాలకు ప్రజలు రానవసరమేలేకుండా ఆన్‌లైన్‌ సేవలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలను కార్యాలయాల్లోకి రానీయడం లేదు. మీ-సేవా కేంద్రాలు వచ్చాయి. ఇ-సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే దరఖాస్తు చేసు కోవచ్చు. అంతేకాదు, కొన్ని రకాలసేవలను ప్రజలు స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి పొందుతు న్నారు. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ పాఠశా లలు,ఆన్‌లైన్‌ వైద్యం, జూమ్‌ మీటింగులు అందుబాటులోకి వచ్చాయి. అధార్‌ కార్యాల యానికి వెళ్లకుండా ఆధార్‌ కార్డు వస్తున్నది. ఇలాగే ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌ ముఖం చూడకుండా పాన్‌ కార్డు వస్తూ ఉంది. ఇలాంటపుడు ప్రజలు ఇంకా ప్రభుత్వకార్యాలయాలకు రావడం ఎందుకు? కొత్త జిల్లాలు ఎందుకు? కాకపోతే, ఎప్పుడో ప్రారంభమయిన ఉపప్రాం తీయ జిల్లా డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. భావోద్వేగం సృష్టిస్తున్నాయి. అందువల్ల కొత్త జిల్లా ఏర్పాటు కూడా, కొత్త రాష్ట్రం ఏర్పాటు లాగా రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడయితే, కొత్త జిల్లా ఏర్పాటు కేంద్రంలో ‘రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ’ తీసుకువస్తుంది.ప్రజల భావోద్వేగాలను వాడుకునేందుకు తప్ప కొత్త జిల్లాలు అదనపు ప్రయోజనం తీసుకువచ్చే అవకాశం లేదని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘కొత్త జిల్లాల సృష్టి అవసరమే. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉన్నతాశయం నెరవేర్చే వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు చూపు లేకుండా ప్రారంభించిన అనేక పథకాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపాయి. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బిసి)లను తెరిచారు. మూసే శారు. ఇపుడు ఉద్యోగస్థులకు జీతాలు కూడా చెల్లించే స్థితి లేదు. వాళ్ళకి పిఆర్‌సి అమలుచేయకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దానికి కావలసిన భవనాలు, ఇతర వసతులు సమకూర్చుకు నేందుకు వ్యయం తడిసి మోపెడవుతుంది. ఈ నిధులెక్కడి నుంచి తెస్తారు?’’ ‘‘మొదట ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించి, రాబడి పెంచుకుని,కొత్త జిల్లాల గురించి ఆలోచిం చాల్సి ఉంది. అయితే, జగన్‌ ప్రభుత్వానికి ప్రజాసౌలభ్యం కంటే రాజకీయ సౌలభ్యం ముఖ్యం. ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటించి, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలందుకే తప్ప, పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడం కాదు’’ అని అంటు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధత లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పాలన వికేంద్రీకరణ కోసం అని, పరిపాలనను ప్రజలకు చేరువచేయడం అనే ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలా చోట్లా అది ఆశయాన్ని దెబ్బతీసింది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు కొత్త సమస్య తీసుకువస్తాయని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఇఎఎస్‌ శర్మ అన్నారు. ఆలోచించదగ్గ రెండు అంశాలను ఆయన పేర్కొన్నారు.1) కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కొన్ని గిరిజన గ్రామాలకు జిల్లా హెడ్‌ క్వార్టర్లు దూరమవు తున్నాయి. ఉదాహరణకు, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి అరకు కొత్త జిల్లా కేంద్రానికి రావాలంటే అక్కడి గ్రామస్థులు 5 నుండి 7 గంటలు ప్రయాణిం చవలసి ఉంది. దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉపయోగం ఉండదు. 2) కొత్త జిల్లాల కారణంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో హెడ్‌ క్వార్టర్‌ లో జన సాంద్రత పెరగడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం వలన అక్కడ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు భంగం కలుగు తుంది. అది కాకుండా భూ బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించే ప్రమాదం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, గిరిజన గ్రామాలకు రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాలివ్వకుండా కొత్త జిల్లాలను సృష్టించి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిం చారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 1986లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకుని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న 800కు పైగా గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిం చింది. కేంద్రం ఆ ప్రతిపాదనకు సూత్రప్రా యంగా అనుమతి తెలిపింది. ‘‘మండలాల వారీగా ఆ గ్రామాల లిస్టులను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాలు రెండు ఆ విష యంలో కేంద్రానికి ఇంతవరకు జవాబు ఇవ్వ కుండా ఆలస్యం చేస్తూవస్తున్నాయి. దీని వలన గిరిజనులకు అపారమైన నష్టం కలిగింది. ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఉండవలసింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 50శాతం గిరిజన జనాభా ఉన్న మండలాలను షెడ్యూల్‌ 5లో చేర్చాలి. ‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సరవకోట, పాతపట్నం, మెళియపుట్టి మండలాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని గిరిజన జిల్లాలో చేర్చాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇలాగే,73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అధికారాలను పంచాయతీలకు బదలాయించాలి. ఇదింత వరకు జరగలేదు. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగి తీరాలి. అపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -జి.ఎన్‌.వి.సతీష్‌

1 2 3 4 5 7