కడలిని..కాపాడుకుందాం..!

సముద్రపు కోత
సముద్రపు నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని అందరికీ తెలుసు. ఉష్ణోగ్రత, లవణీయత, సాంద్రత మొదలైన విభిన్న భౌతికలక్షణాల ప్రభావంతో సముద్రపు నీరు కదులుతూ ఉంటుంది. అందుకు సూర్యుడు, చంద్రుడు గాలుల వంటి బాహ్యశక్తుల ప్రభావం ఉంటుంది. సముద్రాల్లో ఏళ్ల తరబడి జరుగుతున్న మార్పుల కారణంగా రాకాసి అలలు సముద్రాన్ని కోతకు గురిచేస్తున్నాయి. దీంతో దగ్గర్లో నివశిస్తున్న మత్య్సకారుల జీవనం అయోమయంలో పడుతోంది.అయినా, లాభాలకోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ విధ్వంసం కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ కాలుష్యం వల్ల చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి.మత్య్సకారుల జీవనం ప్రమాదంలో పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కడలిని,దాన్ని నమ్ముకున్న మత్స్యకారులను కాపా డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మన రాష్ట్రంలో ఉప్పాడ బీచ్‌ అందుకు ఓ ఉదాహరణ.
వాతావరణంలో మార్పులు
వర్షాలకు పూర్తిగా మహాసముద్రాలే కారణం. ఆవిరైన సముద్రపు నీరు నుండి వర్షంగా పడుతుంది. నీటిని మాత్రమే కాకుండా సముద్రం నుండి తీసుకున్న సౌరశక్తిని బదిలీ చేస్తుంది. అంతే కాదు.. సముద్రపు మొక్కలు ప్రపంచంలోని చాలా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సముద్రపు నీరు గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌లో సగం తీసుకుం టుంది. ఇది భూతాప ప్రభావాలను తగ్గిస్తుంది. సముద్రం యొక్క ప్రవాహాలు ఉష్ణమండల నుండి ధ్రువాల వైపు వెచ్చదనాన్ని తీసుకువెళతాయి. ప్రవా హాలు మారినప్పుడు, వాతావరణం కూడా మారు తుంది. వీటివల్లే మనుషులు తమ జీవనాధారమైన కార్యకలాపాలు జరుపుకుంటున్నారు. వ్యవసా యానికి అనువైన వాతావరణం కల్పించడంలో సముద్రాలే మూలకారణం.ఆ తర్వాత అడవులు. అటువంటి సముద్రాలను కొందరు చెత్తమయం చేస్తున్నారు. లక్షల టన్నుల వ్యర్థాలను సముద్రాల్లో కలుపుతున్నారు.దీంతో కాలుష్యకోరల్లో చిక్కు కొని, సముద్రజీవులు కూడా అంతరించి పోతు న్నాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి.
నీటి అడుగున ఉష్ణతరంగాలు
అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఒఎఎ) శాస్త్రవేత్తలు గత ఏడాది సముద్రం అడుగున పరిశో ధన చేశారు. వారు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనుగొన్నారు.నీటి అడుగున ఉష్ణతరంగాలను కను గొన్న ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌ఒ ఎఎ ఫిజికల్‌ సైన్స్‌ లాబొరేటరీ వాతావరణ శాస్త్ర వేత్త డిల్లాన్‌ అమయా తన అనుభవం వెల్లడిర చారు. ఉత్తర అమెరికా చుట్టుపక్కల ఉన్న ఖండాం తర తక్కువ లోతు సముద్ర నీళ్లలో ఈ పరిశోధన సాగించారు. సముద్రాలుపైనే కాకుండా అడుగున కూడా నీళ్లు నిరంతరం వేడెక్కుతున్నాయని కనుగొ న్నారు. ఇది సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఉపరితలంపై ఉండే వేడి కన్నా,అడుగున మరింత ఎక్కువగానూ సుదీర్ఘ కాలం ఉంటోందని వెల్లడైంది.ఈ వేడి ఒక తీరా నికీ మరో తీరానికీ వేర్వేరుగా ఉంటుందని ఆయన వివరించారు.
పారిస్‌ ఒప్పందం అమలులో వైఫల్యం
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్త చర్చలకు కేంద్ర బిందువుగా పనిచేసే పారిస్‌ ఒప్పందం 2015లో కుదిరింది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత,గత ఎనిమిదేళ్లు (2015-2022) వరుసగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల, ప్రపంచ వాతావరణ సంస్థ (ఔవీఉ) తన గ్లోబల్‌ క్లైమేట్‌ 2023 నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుపై పారిస్‌ ఒప్పందం, దాని ఎజెండాను నెరవేర్చడంలో ఆయా దేశాల్లో చర్యలు అసమ ర్థంగా ఉన్నాయని చెప్పింది. వాతావరణ సంక్షో భానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు శూ న్యం. వాతావరణ వ్యవస్థపై శీతలీకరణ ప్రభా వాన్ని చూపే లానినా వాతావరణ సంఘటన గత మూడేళ్లలో సంభవించకపోతే పరిస్థితి చాలా దారు ణంగా ఉండేది.
పీడిస్తున్న ప్లాస్టిక్‌ భూతం
భూమిలో కరగని ప్లాస్టిక్‌ పదార్థాలను పరిశ్రమలు సముద్రాల్లో విడుదల చేస్తున్నాయి. 2018లో అమెరికా 31 మిలియన్‌ మెట్రిక్‌ టన్ను ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపం చంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. చెత్త, ము రుగు,చమురు లీకేజీల వంటి మానవ కార్యకలా పాల చర్యల వల్ల నిత్యం సముద్రంలో విధ్వంసం జరుగుతుంది.సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్‌ సంచులు,డిస్పోజబుల్‌ వస్తువుల్లో చిన్న చిన్న జీవు లు,అరుదైన చేపలు చిక్కుకుపోయి చనిపో తున్నాయి.ఈ విధంగా వందల సంవత్సరాలు ప్లాస్టిక్‌ పదార్థాలను తినడంవల్ల జీవుల జీర్ణవ్య వస్థల్లో ప్లాస్టిక్‌ నిల్వ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ కాలుష్యపు నీటిలో అరుదైన జీవ జాతులు కూడా అంతరించిపోతున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి, సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా వారికి అవగాహన కల్పించాలి.
ఎలా వచ్చిందంటే..
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌లో మొదటిసారిగా ప్రతిపాదన వచ్చిం ది. మహాసముద్రాలు మన జీవితాలలో కీలకపాత్ర పోషిస్తాయని..వాటిని రక్షించడంలో ప్రజలకు సహాయపడే మార్గాల గురించి అవగాహన పెంచడానికి ఓరోజును పాటించాలని దేశాధి నేతలు సూచించారు. దాన్ని ఆమోదిస్తూ ఐక్యరాజ్య సమతి ప్రతి ఏటా జూన్‌ 8న ‘ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. సముద్రాలు బాగుం డాలి.. జీవులూ బాగుండాలి.. అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌.
నివారణకు చర్యలు
సముద్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ప్లాస్టిక్‌ వస్తువులను పడేయకూడదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇ-వ్యర్థాలను, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లను తగ్గించడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను అవలంబించాలి. పేపర్‌ బ్యాగులను ఉపయోగించాలి.ప్లాస్టిక్‌ బదులు ప్రత్యామ్నా యంగా పేపర్‌,అల్యూమినియం వస్తువులు వాడాలి.ఇంటి సామాగ్రికి గాజు వస్తువులను వాడాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తిరిగి రీసైక్లింగ్‌కి పంపించాలి.
అవగాహన పెంపుదల
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కప్పులు, కత్తులు,ప్లేట్లు,టేక్‌అవే ఫుడ్‌బాక్స్‌ల తయారీ, అమ్మ కాల్ని 2016లో నిషేధించి, ప్రపంచంలో తొలి దేశంగా ఫ్రాన్స్‌ అవతరించింది. ప్లాస్టిక్‌ కాలు ష్యంపై అవగాహన పెంచడానికి దేశంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి బంగ్లాదేశ్‌ ప్రభు త్వం పెద్దఎత్తున రీసైక్లింగ్‌ చేపట్టింది. ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని, మిగిలిన దేశాలూ అనుస రించాలి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులుబాగుంటాయనే విషయాన్ని గుర్తించాలి. చైత న్యంతో అందరం కలిసి కడలిని కాపాడు కోవాలి.
వ్యాసకర్త : సముద్ర పరిరక్షణ నిపుణురాలు- (పద్మావతి)

కార్పొరేట్‌ రాజకీయ పర్యావసానాలు

ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఎన్నికల ప్రక్రియను రాజకీయ రహిత క్రీడగా మార్కెట్‌ వ్యవహారంగా మార్చడం అతి పెద్ద మార్పు.నిజానికి పరిభాష కూడా మారిపోయింది. ప్రజలను ఓటర్ల డేటాగా చూడటం.బిగ్‌ డేటా వుంటే రకరకాల పద్ధతుల్లో బుర్రలు నింపేయొచ్చని భావించడం ఇందులో మొదటిది.బిగ్‌ డేటా,డేటా ఎనలిస్టులు, మార్కెటింగ్‌ సర్వే సైన్యంతో బయలుదేరడమే. వీలైతే సొంత టీములు,లేదంటే ఉమ్మడిగా,అదీ కాదంటే నాయకులకుపార్టీలకు అనుబంధంగా వుండి డీల్‌ కుదుర్చు కోవడం.ఈ క్రమంలో వారి సమస్యలు మనోభావాలు కూడా ఓట్ల ఆకర్షణ కోణంలోనే. ఏది వారిని ప్రభావితం చేస్తుందంటే కాస్త చర్చించి ఏదో పేరుతో ఏదో రూపంలో అది చేయడం. అది కుల మత ఛాందసమా అసభ్యత అసహనం పెంచేదా వంటి కొలబద్దలేమీ వుండక్కర్లేదు. ఉద్వేగాలు పెంచడానికి పనికి వచ్చేదైతే మరీ మంచిది.అలాంటి వ్యక్తిగత అంశాలను అనుకూలంగానూ ప్రతికూలంగానూ వెతికి తెచ్చి మరీ రచ్చ చేయడం.టీవీ రేటింగులలాగే ఈ పనుల వల్ల కలిగిన లాభనష్టాలను బేరీజు వేసి మరో చోట అదే రకమైన ప్రయోగం.అంతే.దీర్ఘకాల ప్రజా ప్రయోజనం ప్రజాస్వామిక విలువల వంటి సంకోచాలే వుండక్కర్లేదు. కావాలంటే మరో పక్షాన్ని లేదా ప్రత్యర్థిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఏం చేసినా ఫర్వాలేదు. పైగా ఫలానా వారు ఫలానా పార్టీలోనే వుడాలనీ లేదు. గిట్టుబాటయ్యే బేరం వస్తే పార్టీలో చీలిక తేవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో ఒక కోణం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ రోహిత్‌ రెడ్డిని బిజెపి నేతలు కదిలించడం, మరికొందరిని కలుపుకోవాలని చూడటం, దాన్ని కెసిఆర్‌ వాడుకున్నారనే ఆరోపణ ఒకటైతే అసలా అనైతికత విషయమేంటి? వచ్చిన రాజకీయ దళారులలో వ్యాపారులు, పూజారులు కూడా వుండటమేమిటి? ఆర్థిక వనరులు పుష్కలంగా వున్న వారు ఎప్పుడు ఏ పార్టీ మారినా స్వాగతమే.తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లోనే చూస్తే ఒక కూటమిగా ఏర్పడిన పార్టీలలో కూడా అటూ ఇటూ దూకి పోటీ చేసినవారు కనిపిస్తారు. అందుకోసం అత్యధిక సంపదలు కలిగిన అభ్యర్థుల వేట. అవకాశాలతో అన్వేషణ. టికెట్‌ ఇచ్చే పార్టీకి రూ.వంద కోట్లో యాభై కోట్లో ముందే నిధి. తాము పోటీ చేసే పార్లమెంటు సీటు పరిధిలో అసెంబ్లీ స్థానాలకు పెట్టుబడి. వీలైతే ముందే అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయించుకుని హంగామా చేయడం. టికెట్‌ కోసం ప్రయత్నం చేయడానికి ముందే నియోజక వర్గంలో ఓటర్ల కులాల పొందికపై ప్రత్యేక పరిశీలన. నిజం చెప్పాలంటే ప్రశాంత కిశోర్‌తో సహా ఈ వ్యూహకర్తలు ఎక్కువ సార్లు చెప్పేది కులం లెక్కలేనని పాలక పార్టీల నేతలు ఒప్పుకుంటున్నారు. ఒకే వ్యూహకర్త ఒకోసారి ఒకవైపున పని చేయడం వెంటనే మరోవైపు దూకడం ఆశ్చర్యం కలిగించే వాస్తవం. మోడీకి,రాహుల్‌ గాంధీకి ఒకే ప్రశాంత కిశోర్‌ పనిచేస్తాడు. జగన్‌కు పని చేసి మళ్లీ చంద్రబాబుతో మంతనాలు జరుపుతాడు. ఆయన పని చేసిన ఐ ప్యాక్‌ సంస్థ వారే రెండు వైపులా వుంటారు. ఈ మధ్యలో చాలా విన్యాసాలు చేస్తాడు. కానీ బడా మీడియా ఆయనకే అగ్రతాంబూలం ఇచ్చి అభిప్రాయాలు ఆణిముత్యాలన్నట్టు ప్రచారం ఇస్తుంది.ఎందుకంటే ఆ పార్టీలకూ కార్పొరేట్‌ మీడి యాకు పనిచేయించుకునే పార్టీలకూ కూడా రాజకీయ సైద్ధాంతిక పట్టింపులేమీ వుండవు. ఇవన్నీ డీల్స్‌ మాత్రమే.
ఇమేజి గేమ్‌
ఒక డ్రైవరో కండక్టరో ఎక్కిన వాళ్లను ప్యాసింజర్లుగా మాత్రమే లెక్కపెడతారు. ఒక హోటల్‌ యజమాని ఎన్ని టిఫన్లు, ఎన్ని మీల్సు లెక్క కడతాడు. అలాగే ఎన్నికలు, ఓట్లు, ఓటర్లు, వారిపై ఖర్చు అంతా మార్కెట్‌ భాషలో చూడటమే. ఈ పని రాజకీయ విధానాలతో సేవలతో కాకుం డా చిట్కాలతో ఎత్తులతో పూర్తి చేయాలి. ఓటరు ప్రొఫైల్‌ ఏమిటి? కులం, మతం, లింగం, నేపథ్యం తెలుసుకుంటే ఏవిధంగా పడగొట్టొచ్చు. ఓట్ల కొను గోలు దీనికి అదనం. దానికి కూడా మెథడాలజీ. పోల్‌ మేనేజిమెంట్‌ అంటే మనేజ్‌మెంటు అని సరదాగా అనేదందుకే. ఇవన్నీ గతంలో కార్యకర్త లు లేదా స్థానిక దాదాలు చేస్తే ఇప్పుడు కార్పొరేట్‌ స్టయిల్‌లో చేసేవాళ్లు వచ్చేశారు. మీరు సోషల్‌ మీడియాలో లేదా మీడియాలో ఏం చూస్తున్నారు మీ స్నేహితులెవరు. అభిరుచులేమిటి తెలుసుకుని ఆ రూట్లో చేరుకోవడం. మార్కెట్‌ భాషలో గ్యారం టీలు ప్రకటించడం. గ్యారంటీ వారంటీ డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇలాంటి భాష ఇప్పుడు రాజకీయా ల్లో సర్వసాధారణమైపోయింది. ఒటర్లే కాదు, అభ్య ర్థులూ సరుకులే. మొదటిది వారి బడ్జెట్‌ ఎంత? స్వంతంగా భరించగలరా లేక భరించేవారి తర పున ఏజంటుగా పనిచేస్తారా? ఈ తతంగం మార్కె టింగ్‌ టీం కూడా సహకరించే విధంగా జరగొచ్చు. ఆ మేరకు నేతలను కలిసి ఆఫర్లు ఇచ్చి పార్టీలు మార్పించడం చేర్చుకోవడం జరగొచ్చు. అది కాస్త ముగిశాక ఇమేజ్‌పెంచడం. మేకోవర్‌. మోడీ చారు వాలాగా బయిలుదేరి గారు వాలాగా మారి, రామ్‌ చే లాగా ఎదిగి ఇప్పుడు సాగర్‌ రaూ లా వూగుతు న్నారంటే ఇదంతా ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం జరుతున్నదే.ఆయన వేషభాషలు,సందేశాల సంకే తాలు మకాం వేసే నేపథ్యాలు ఏవీ ఊరికే నిర్ణయం కావు. మార్కెట్‌ ప్రొడక్టు అభ్యర్థి అయితే తనను కష్టమర్లయిన ఓటర్లకు ఆకర్షణీయంగా తయారు చేయాలి.అదే బ్రాండ్‌ ఇమేజి.మోడీ బ్రాండ్‌, చంద్ర బాబు బ్రాండ్‌, అమరావతి బ్రాండ్‌. ఇలా చాలా చెప్పొచ్చు. ఇందుకోసం ప్రత్యేక అధ్యయనాలు. అభిప్రాయ సేకరణలు చాప కింద నీరులా సాగిపో యాయి. నిజానికి ఇది 1980లో ఇందిరాగాంధీ పనిచేసే ప్రభుత్వం అంటూ తిరిగివచ్చిన సమయం లోనే మొదలైంది. తర్వాత వాజ్‌పేయి హయాంలో ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌, ఇండియా షైనింగ్‌ వంటి నినాదా లు కూడా వచ్చాయి. ప్రపంచీకరణ మీడియా విస్తరణతో పాటు ఇప్పుడు ఈయంత్రాంగం కూడా విస్తరించిందన్నమాట.ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ సభల క్యాప్షన్‌,బొమ్మ ప్రసంగాలలో ఎత్తుగడ అన్నీ స్క్రిప్టులే.ఈ అయిదేళ్లు ఐప్యాక్‌ టీము ఏదో రూపం లో ఆయనతో వుంటూనే వచ్చింది కదా? విధా నాల పరమైన ప్రణాళికలు పోయి గ్యారంటీలు వాటికి మోడీ గ్యారంటీలని గొప్పలు చెప్పడం వ్యా పార భాష కదా?
వాట్సప్‌ నుంచి యూ ట్యూబ్‌
ఇక ప్రచారంలో సాధనాలు సంస్థలు కూడా సిద్ధంగా వుంటాయి. ఒక మీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మన ప్రమోషన్‌ చూసి పెడుతుంది. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంత కవరేజి అన్నీ సాగిపోతాయి. మనను కవర్‌ చేయడంతో పాటు ప్రత్యర్థిని బద్‌నాం చేసే పని కూడా వాళ్లదే. ఇందుకు సోషల్‌ మీడియా ఆర్మీలు. అసలైన సమస్యలు పక్కన పెట్టి అవతలివారిని దెబ్బ తీయ డం మనను పైకి లేపడం మాత్రమే టార్గెట్‌గా పనిచేయడం. తక్కువ జీతాలకే యువత దొరుకు తారు గనక వారిని పనిలో పెట్టుకుంటే బతుకు తెరువు కోసం అన్నీ చేసి పెడతారు. మన ప్రచారం మోత మోగిస్తారు. 2019లో వాట్సప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రధానంగా వుంటే ఈసారి నేరుగా యూ ట్యూబ్‌ ఛానళ్లు లేదా మన స్వంత ఛానల్‌ పెట్టు కుని అప్‌లోడ్‌ చేసుకోవడమే.ఎవరికీ బాధ్యత లేదు. ఏదైనా వివాదం వస్తే తప్ప, వివాదాలు పెంచడం కూడా ఇందులో భాగమే. అంటే రాజకీయ నిబద్దత ఎంత మాత్రం లేని అభ్యర్థులు వ్యూహకర్తలు ప్రచార యంత్రాంగం పనిచేసి పెడతాయి. మీడి యాలో కూడా నిబద్దతతో పని చేసేవారిని వేటాడ టం,ఆసంస్థలనే కొనేయడం రివాజుగా మారిపో యింది. ప్రణరు రారు వంటి వారు కూడా స్వంత వేదికలు ఏర్పాటు చేసుకోవడం తప్ప పెద్ద తరహా సంస్థల్లో చోటు కాపాడుకోలేని పరిస్థితి. బడా కుటుంబాలు లేదా వ్యాపారాల్లో గుట్టలు పోసుకున్న వారు కాదంటే సినిమా సెలబ్రిటీలు, కార్పొరేట్‌ వర్గాల సేవకులు ఎన్‌ఆర్‌ఐలు మీడియాలో రాజకీ యాల్లో దిగిపోవడమే. విశేషించి తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతి సంపన్నులైన అభ్యర్థులు రంగంలో నిలవడం దేశమంతా చర్చనీయాంశమైంది. వామ పక్షాల వరవడి వుంది గనక సమస్యలపై చర్చ కొంతైనా జరిగింది గానీ లేకపోతే కేవలం మార్కె టింగ్‌ వ్యూహాలతోనే గడిచిపోయేది. సంఘ సంస్క రణ,స్వాతంత్రోద్యమం,కమ్యూనిస్టు ఉద్యమం వంటి బలమైన సంప్రదాయాలు గల చోట కార్పొ రేట్‌ బాబులు కుల శక్తుల కుమ్ములాటగా ఎన్నికలు జరగడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఇవన్నీ సర్వసాధారణమైనట్టు భావించడం మరింత దారు ణం. ఇరువైపుల ఆటగాళ్లు ఒకేఆట ఆడుతూ ఆశ యాలు ఉద్యమాల కోసం పాటు పడేవారిని అప హాస్యం చేయడం అలక్ష్యం చేయడం ఇక్కడ కొస మెరుపు.బ్యూరోక్రసీ కూడా ఇందుకు తగినట్టే వ్యవ హరిస్తుంది.ప్రైవేట్‌ భాగస్వాములను కూడా సలహా దారులై సర్కార్లను నడిపిస్తున్నారు. ముప్పయ్యేళ్ల ప్రపంచీకరణ పర్యవసానమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రతిఫలనమే ఇది.పైగా కార్పొరేట్‌ మార్కెటింగ్‌ రాజకీయం మితవాద, మతవాద రాజకీయాలను తప్ప ప్రగతిశీలతను సహించదు. ఎందుకంటే ఉద్యమ చైతన్యం దోపిడీని ప్రశ్నిస్తుంది గనక ఆశక్తు లను లేకుండా చేసే కుట్ర సాగిపోతుం టుంది. ఎందుకంటే ప్రపం చీకరణ మౌలికంగా ప్రజాస్వా మిక విలువలకు వ్యతిరేక మైంది. అందుకే తక్షణ రాజకీయ పోరాటంతో పాటు దీర్ఘకాలంలో ప్రజా స్వామిక పునాదులు కాపాడు కోవడానికి గట్టి కృషి అవసరం.పూర్తి ఫలితాల తర్వాత ఇందుకు సంబం ధించిన మరింత నిర్దిష్టత రావచ్చు. ప్రజాశక్తి సౌజన ్యంతో…)-(తెలకపల్లి రవి)

నా ఆరోగ్యం నా హక్కు చట్టం చేయాలి

ఆరోగ్యహక్కు ద్వారా గౌరవంగా, ఆనందంగా జీవించడం.. దేశ పురోగతుల్లో పాలు పంచుకోవడం..అవసరమైన భౌతిక,మానసిక, సామాజిక పరిస్థితులను మెరుగైన ప్రమాణాలతో అందుకునే అర్హత ప్రతి పౌరునికీ కలుగుతుంది. ఆరోగ్యం సమకూరుతుంది.అందుకే అందరికీ ఆరోగ్యం అందాలంటే..ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాలపై ఆధారపడటం కాకుండా ఆరోగ్యమన్నది హక్కుగా ఉండాలి.అందుకొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలన్నీ తప్పక ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకు రావాలి. చట్టాన్ని తీసుకురావడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టాలి.అప్పుడే అందరికీ ఆరోగ్యం అందే పరిస్థితి వస్తుంది. పేదవాడికి వైద్యం సరిగా అందక..వైద్య ఖర్చులకు తనసొంత జేబులో నుంచి ఖర్చు పెట్టుకోలేక..మరింత పేదవాడిగా మారు తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర ఆరోగ్య పరిస్థితిలో ప్రజలందరికీ ఆరోగ్య హక్కును ప్రాథ మిక మానవహక్కుగా సూచించడమే మంచి పరిణామం.2000 సంవత్సరాల నాటికి అందరికీ ఆరోగ్యం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1977లోనే నిర్ణయించింది.1978లో జరిగిన అల్మా-అటా ప్రకటనలో ప్రజలందరికీ ఆరోగ్యం అందే విధంగా అడుగులు వేస్తామని సంతకాలు చేసిన జాబితాలో మన దేశం కూడా ఉంది. కానీ పేదవానికి అందుతున్న ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరోగ్య అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
చట్టం అవసరం. : మనిషి జీవనశైలిలోను, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనేక వ్యాధులు విపరీతంగా విస్తరిస్తున్న పరిస్థితిలో మనం జీవిస్తున్నాం.మలేరియా,డెంగ్యూ, అతిసార, మీజిల్స్‌,కరోనాలాంటి అంటువ్యాధులు..బి.పి, షుగర్‌,కొలెస్ట్రాల్‌, ఊబకాయం, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో ప్రతి నాలుగో వ్యక్తికి షుగర్‌ ఉందని, భవిష్యత్తులో ఈసంఖ్య మరింత ఎక్కువ కాబోతుందని అంచ నాలు తెలుపుతున్నాయి. వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.వైద్యం ఎంతో అభివృద్ధి చెం దింది.ఈ ఆధునిక వైద్యం పేదవాడికి అందే పరిస్థితిలో లేదు.వీరికి అవసర మైన వైద్యం ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా అంద డం లేదు.డబ్బులు పెట్టి కొనుక్కోగల పరిస్థితి వారికి లేదు. విపరీతం గా పెరుగుతున్న మందుల ధరలు,వైద్యం కోసం అయ్యే ఖర్చులను పేద ప్రజలు భరించలేక మరింత పేదరికంలోకి నెట్టబడు తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు..: జబ్బు చేసిన తరువాత వైద్యం చేయడం మాత్రమే ఆరోగ్యంకాదు. జబ్బుకు వైద్యం చేయడంతో పాటు జబ్బు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఆరోగ్యంలో భాగమే.మంచినీరు అందించడం,పారిశుధ్య కార్య క్రమాలు సక్రమంగా నిర్వహించడం,టీకాలు వేయించడం,పౌష్టికాహారాన్ని అందించడం నివా రణ మార్గాలలో అత్యంత ప్రధానమైనవి. వీటిని సరైన పద్ధతిలో ప్రజలకు అందించకపోవడంతో అనేక అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. వైద్య శాస్త్రంలో వస్తున్న ఆధునిక పద్ధతులు సాధారణ ప్రజలకు అందుబాటులో లేక వైద్య రంగంలో అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనకున్న వైద్యరంగం దరిదాపుగా 80 శాతం ప్రైవేటురంగం చేతుల్లోనే ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి వైద్య సేవలు సాధారణ ప్రజలకు కొంత ఊరట కలిగించినా,ఎక్కువ సందర్భాలలో పేద వాని జేబులో నుంచి వైద్యం కొరకు ఖర్చు చేయా ల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరాలకు సరిపడా వైద్యం అందడం లేదు. ప్రజలందరికీ సమగ్రమైన,నాణ్యమైన ఆరోగ్య సేవలను, పౌష్టి కాహారాన్ని, మంచి నీటిని, పారిశుద్ధ్యాన్ని అందిం చగలిగితే సాధారణ ప్రజలు ఉన్నత ప్రమాణాలతో, భరోసాతో జీవించగలుగుతారు. అప్పుడు సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అసమానతలు లేని మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలందరికీ అందించాలంటే వైద్యం ప్రభుత్వాల దయాదాక్షి ణ్యాల మీద ఆధారపడకుండా, ఆరోగ్యమన్నది ప్రభుత్వ బాధ్యతగా, ప్రజల హక్కుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపయోగాలు..
పుట్టుక నుంచి చివరి శ్వాస విడిచే వరకు నిరాకరణ లేని, అసమానతలు లేని నాణ్య మైన వైద్య సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉచితంగా పొందవచ్చు.
రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ, ప్రైవేటు / స్వచ్ఛంద ఆసుపత్రులలో దేనిలోనైనా ముందుగా ఫీజు చెల్లించకుండా..వెంటనే, అసమా నతలు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఎల్లవేళలా పొందగలిగే అవ కాశం ఉంటుంది.
మెడికో లీగల్‌ కేసైనా, చికిత్సలో ఆలస్యం లేకుండా అన్ని స్థాయిలలో వైద్యం అందు కునే పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు అన్ని ప్రాథమిక,ద్వితీయ,తృతీయ స్థాయి ఆసుపత్రులకు త్వరగా చేరుకునే రెఫెరల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగు తుంది.
ప్రభుత్వం తప్పనిసరిగా ఆసుపత్రుల వద్ద పాలియేటివ్‌ కేర్‌ (దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే సేవలు), చికిత్స పొంది పూర్తిస్థాయిలో కోలుకుని..తమ పనులు తాము చేసుకు నేలా ప్రోత్సహించే పునరావాస సంరక్షణ సేవలు కూడా ఏర్పాటు చేయబడతాయి.
జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయడమే కాకుండా వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణ, ప్రోత్సాహక వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
వయసు పైబడిన ముసలివారికి కలిగే దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. వీరి జీవితానికి కావలసిన ఆర్థిక, సామాజిక ఉపశమన సదుపాయాలు కూడా కలిగించబడతాయి.
ప్రభుత్వాలు చేయాల్సినవి..
ఆరోగ్యం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఆరోగ్య మన్నది ఒకహక్కుగా ఉండాలి. ఈ హక్కును కల్పించడం కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలి. ఆ¸రోగ్యమన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాలి. ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.2శాతం నుంచి 2.1శాతం వరకు ఖర్చు చేస్తుంది. దిగువ,మధ్య ఆదాయ దేశాలు చేస్తున్న సగటు వ్యయం 5.2శాతంగా ఉంది.పొరగు దేశాలతో పోల్చుకుంటే మన ఆరోగ్య రంగం బడ్జెట్‌ ఎంత తక్కువగా వుం దన్నది ఈసంఖ్యలు తెలుపుతున్నాయి. Ê ఆరోగ్య రంగ కేటాయింపులను శరవేగంగా పెంచుతూ జాతీయ స్థూల ఆదాయంలో 3.5శాతానికి చేరేలాగా చూడాలి. ఆరోగ్య వ్యయం కోసం రాష్ట్రాలు ప్రత్యేక ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవాలి.
ఆరోగ్యంపై జరిగే ఖర్చులు భరించడం వల్ల ఎవరూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూ డదు. వైద్య ఖర్చుల కొరకు ప్రజలు వారి జేబులో నుంచి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న 80శాతం నుంచి కనీసం 25శాతానికి వెంటనే తగ్గేలాగా చూడాలి.
ఖాళీగా ఉన్న పోస్టులను పూరించాలి. ఆరోగ్య కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలి. ఆరోగ్య సదుపాయానికి కూడా ఖాళీ స్థానం ఉండకుండా చూడాలి. ప్రజారోగ్య సంస్థల్లో కాంట్రాక్టు సిబ్బందితో పూరించకూడదు. కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తలందరినీ క్రమబద్ధీకరించాలి. తగిన వేతనాలు, కార్మిక చట్టాల ప్రకారం రక్షణ కల్పించాలి.
ఆరోగ్య వ్యవస్థలను నిర్వహించడం కోసం ఆర్థిక,పరిపాలన అధికారాలను ప్రాంతీయ సంస్థలకు అప్పజెప్పాలి.
మందులను సరసమైన ధరలకు అందు బాటులోకి తేవాలి.నాణ్యతలో తేడా లేకుండా చూడాలి.
ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత. పిఎం.జె.ఎ.వై.ఆరోగ్యశ్రీ, పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లవంటి ప్రభుత్వ నిధులతో కూడిన ఆరోగ్య బీమా పథకాలను దశల వారీగా తొలగించాలి.
మెరుగైన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రైవేట్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌ను నియంత్రించాలి.
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యొక్క వాణిజ్యీకరణను ఆపాలి.
వైద్యసేవలను ప్రజల హక్కుగా గుర్తించి, మనదేశంలో ఆరోగ్యహక్కు చట్టాన్ని తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్‌. ఈ ఆరోగ్య హక్కు బిల్లుని 2023,మార్చి 21న రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం ఆచరణ ప్రారంభదశలో ఉన్నారు. అలాగే మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యహక్కు చట్టాన్ని తీసుకురావాలి. ప్రస్తుతం మనం శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల వాడి వేడి వాతావరణంలో ఉన్నాం. ఎన్నికలలో నిలబడిన పార్టీల వారు నెగ్గితే ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారన్న విషయాన్ని వారివారి ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసుకుంటారు.ఆరోగ్య హక్కు చట్టాన్ని కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరచాలి. ఆమేరకు ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేయాలి. ఆరోగ్యహక్కు చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వారికే ఓటు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన విభజన బాధ్యతలు ఆరోగ్యాన్ని ఉమ్మడి జాబితాలో ఉంచాయి. ఈ ఆరోగ్య హక్కును సాధించే దిశగా ఇరు ప్రభుత్వాలు కలసి పనిచేయాలి.
వైద్యం కోసం స్వంత ఖర్చులు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసూతి మరణాల రేటు,శిశు మరణాల రేటుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇది హర్షించదగ్గ పరిణామం. అయితే, రెండు ప్రధాన పోకడలు తీవ్రమైన ఆందోళనను సూచిస్తున్నాయి.ఒకటి సంక్రమిత వ్యాధులు. రెండు, ప్రజలకు స్వంత జేబుల్లోంచి అయ్యే వైద్య ఖర్చు.మొదటి విషయానికి వస్తే,సంక్రమిత వ్యాధు లు మొత్తం వ్యాధి భారంలో మూడిరట ఒక వంతు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ భారం 29శాతం కాగా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 13 శాతం మాత్రమే. కుష్టు వ్యాధులు, టీబీ,ఎయిడ్స్‌ (హెచ్‌ఐవి) ఐరన్‌ లోపం,రక్తహీనత, ముందస్తు జనన సమస్యలు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు, అతిసార వ్యాధులు, పోషకార లోపం,కిడ్నీ జబ్బులు, మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి మొదటి 10 ప్రాణాంతక వ్యాధులలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా కొనసాగుతుంది. రెండవది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ కింద 90 శాతం కుటుంబాలు అందులో ఉన్నప్పటికీ వైద్యం కోసం తమ సొంత జేబు నుంచి పెట్టే ఖర్చు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.
వ్యాధుల భారం.. ఆరోగ్య అసమానతలు
రాష్ట్ర విభజన (2014)తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తన మొత్తం రాష్ట్రబడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయిం చింది కేవలం 4.2శాతం మాత్రమే.కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కొంచెం ఎక్కువ 6శాతం 2021-22లో కేటాయించారు. జాతీయ ఆరోగ్య వ్యయం 40.8శాతం అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. అయితే ఇదంతాఎక్కువ భాగం ఎక్కడ నుండి వస్తోందని చూస్తే దాదాపు 67శాతం తమ స్వంత జేబుల్లోంచి వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది.ఇది జాతీయ సగటు (48.8శాతం) కన్నా ఎక్కువే. దీని ప్రభావం అన్ని వర్గాలు, కులాలు, జెండర్స్‌ మీద ఒకే రకంగా ఉందా అంటే కాదు అనే చెప్పాలి.కింది వర్గాలు, కులాల మీద విపరీత మైన భారం పడుతోంది. వీళ్లకు ఖర్చులు సమ కూర్చుకోగలిగితే వైద్యం దొరుకుతుంది.. లేకుంటే వైద్యం జోలికి వెళ్ళలేరు. ఇవన్నీ ఏమి సూచిస్తు న్నాయంటే ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగువర్గాలు, కులాలు, స్త్రీ-పురుషులకు పెరిగిన వ్యాధి భారం, అసమానతలు,దుర్బలత్వాన్ని స్పష్టంగా సూచి స్తుంది.మనదేశంలో ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స ప్రక్రియలో ప్రజలు ఏమేరకు పేదరికానికి గురవుతున్నారో వ్యయ విశ్లేషణ వెలుగులోకి తెస్తుంది. జనాభాలో 3 శాతం-4 శాతం మంది సగటున ప్రతి సంవత్సరం దారిద్య్ర రేఖకు దిగువన నెట్టివేయబడుతున్నారని అంచనాలు చూపిస్తున్నా యి. దీని ఫలితంగా ఆరోగ్య అసమానతలు పెరుగుతున్నాయని ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం ఇన్‌-పేషెంట్‌ (ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకునేవారు) ఆసుపత్రి చికిత్స అన్న విషయం ప్రాథమిక అధ్యయనాలు చెపుతున్నాయి. ఇన్‌ పేషంట్‌ ఆసుపత్రి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొన్న కారణంగా వైద్య ఖర్చులు కింది వర్గా లకు భారమయ్యాయి. కోవిడ్‌-19కోసం సగటు వైద్య వ్యయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు రూ.17,000 చెల్లిస్తే, ప్రైవేట్‌ ఆసుపత్రుల విషయంలో ఇది ఐదు కంటే ఎక్కువ రెట్లు. అంటే వారికి సగటున రూ.90,000 ఖర్చు అయిందని కరోనా ఎకల్‌ మహిళ పునరివాసన్‌ సమితి,జన్‌ ఆరోగ్య అభియాన్‌ చెప్తున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో ఆసుపత్రి చికిత్సకు రూ.13,010 సగటున ఖర్చయితే,పట్టణ ప్రాంతాల్లో రూ.30, 112 ఖర్చవుతోంది. ముఖ్యంగా 50శాతం పైగా వ్యయం మందుల మీదే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌..
వ్యాధి ప్రారంభమైన తర్వాత ఆసుపత్రి చికిత్సపై దృష్టి పెట్టడం కంటే వ్యాధిని నివారించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనేక అధ్యయనాలు సూచించాయి. నిర్ణయాత్మకంగా జీవితాన్ని, శ్రేయస్సును పొడిగించగల ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. ఔట్‌ పేషంట్‌ చికిత్స లో ప్రధానంగా మందులకు వివిధ రకాల టెసు ్టలకు అయ్యే ఖర్చు వల్లే పేదరికంలోకి నెట్టబడు తున్నారు. కార్పొరేట్‌ వైద్యం, ఇన్సూరెన్సు ద్వారా నడిపిస్తున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య సంరక్షణ చేయ కపోగా, అసమానతలు, అంతరాలు పెంచుతున్నా యి.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పటిష్టం చేయాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా (యూనివర్శల్‌ హెల్త్‌ కేర్‌) ప్రభుత్వాలు అడుగులు వేయడం తప్ప వేరే మార్గం లేదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నమూనాలను అధిగమించి, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వైపు అడుగులు వెయ్యాలి.
మానసిక ఆరోగ్యం..
మానసిక ఆరోగ్యం అనేది మానసిక శ్రేయస్సు స్థితి. ఇది ప్రజలు జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కొనే క్రమంలో వస్తోంది.వారివారి సామర్థ్యాలను గ్రహించడానికి,బాగా నేర్చుకోవడానికి, బాగా పని చేయడానికి ఒత్తిడికి గురవుతున్నారు. దీని ప్రభా వం సమాజంపై ఉంటుంది. ఇటీవల అనేకమంది విద్యార్థుల నుంచి స్త్రీలు,యువకులు, మధ్య వయ స్కులు, వృద్ధులు..ఒకరని కాదు..అన్ని వయస్సుల వారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది అంతర్గత సమస్య అయినా..అది బాహ్య ప్రభా వాన్ని కలుగజేస్తుందనేది అంతే వాస్తవం. మానసిక ఆరోగ్యంతోనే మనశ్రేయస్సు సమగ్రతను సంతరించుకుంటుంది. ఏసమయంలోనైనా, మాన సిక ఆరోగ్యాన్ని రక్షించడానికి, అణగదొక్కడానికి విభిన్నమైన వ్యక్తిగత,కుటుంబం,సంఘం, నిర్మాణా త్మక కారణాలు మిళితం కావచ్చు. చాలా మంది వ్యక్తులు స్థితిస్థాపకంగా ఉన్నప్పటికీ, పేదరికం, హింస, వైకల్యం, అసమానతలతో సహా ప్రతికూల పరిస్థితులకు గురయ్యే వ్యక్తులు మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.అనేక మానసిక ఆరోగ్య పరిస్థితు లను సాపేక్షంగా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.,అయినప్పటికీ ఆరోగ్య వ్యవ స్థలు గణనీయంగా తక్కువగా వనరులను కలిగి ఉన్నాయి. చికిత్స అంతరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తతంగా ఉన్నాయి. డెలివరీ చేయబడినప్పుడు మానసిక ఆరోగ్య సంరక్షణ తరచుగా నాణ్యతలో తక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్య పరిస్థితు లు ఉన్న వ్యక్తులు చులకనగా చూడబడుతున్నారు. హేళనకు గురవుతున్నారు. వ్యాసకర్త : అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- డాక్టర్‌ ఎం.వి.రమణయ్య

ఆగని వలసలు..మారని బతుకులు

కార్మికులకు పరాయి పంచన తప్పని ఆగచాట్లు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కార్మికులకు పరాయి పంచన ఆగచాట్లు తప్పడం లేదు.స్థానికంగా ఉపాధి లేమి,ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ వేతనం వంటి కారణాలు వీరిని వలస వెళ్లేందుకు అడుగులేయిస్తు న్నాయి.తీరా అక్కడికి వెళ్లి వేతనాలు దొరక్క కొందరు,చిత్రహింసలు భరించలేదక మరికొం దరు సొంత ఊళ్లకు తిరుగు పయనమ వుతు న్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు లేక ఎంతోమంది వందలాది కిలోమీటర్లు కాలి నడకన చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అనారో గ్యాలకు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలొదులు తున్న వారు కోకొల్లలు.ఇటుక బట్టీలు,రొయ్యల,వస్త్ర పరిశ్రమలు తదితర రంగాల్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతూ నరకయాతన అనుభవి స్తున్నారు.పరిస్థితి ఇలా ఉన్న ఇటు కార్మికశాఖ అధికారులు,అటు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుండటం వలన కార్మికులకు శాపంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెతుకు దొరకని వలస బతుకులు..
దేశ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర ఎంతో కీలకం. వలస వెళ్ళిన చోట సరిగ్గా పని దొరక్క, రేషన్‌ కార్డులు లేక వారికి ఆకలి కేకలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరిం చేందుకు సరైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ‘వైరస్‌ కన్నా ముందుగా ఆకలి భూతమే మా ప్రాణాలు మింగేసేలా ఉంది. కొవిడ్‌ కల్లోల సమయంలో కాలే కడుపులతో నిస్సహాయ స్థితిలో కాలినడకన సొంత ఊళ్ల బాటపట్టిన వలస కార్మికుల ఆవేదన ఇది.దేశీ యంగా ఆకాశహర్మ్యాలు,రోడ్డు,రైలు మార్గాలు, ఇతర ప్రాజెక్టులన్నీ వారి శ్రమతోనే రూపుదిద్దు కొంటున్నాయి. అయితే పట్టణాలు,నగరాల్లో నిత్యం పని దొరక్క వలస కార్మికులకు సరైన ఆదాయం లభించడం లేదు. చౌక ధరలకు ఆహార ధాన్యాలు అందుకొనేందుకు రేషన్‌ కార్డులూ లేక ఎంతోమంది వలస కార్మికులకు ఆకలి మంటలు తప్పడంలేదు. వీటిని నిలువ రించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు తాజాగా సూచిం చింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందేలా వలస కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్లో పేరు నమోదు చేసుకునేలా చూడాలని నిర్దేశించింది.
దక్కని లబ్ధి..
తొలి విడత కొవిడ్‌ విజృంభణ సమయంలో వలస కార్మికుల ఆకలి బాధలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. దేశీయంగా ఎవరూ ఆకలితో అల్లాడిపోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అది సరిగ్గా అమలుకు నోచుకోకపోవడంతో వలస కార్మికుల సంక్షేమంపై పలువురు సామాజిక కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు.ఆ పిటిషన్లపై విచారణ సంద ర్భంగా..జాతీయ ఆహార భద్రతాచట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జనాభా నిష్పత్తి లెక్కలు సక్రమంగా లేవనే కారణంతో వలస కార్మికు లకు రేషన్‌ కార్డులు నిరాకరించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కొన్నిసార్లు దాహంతో ఉన్నవారి దగ్గరికే బావి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పింది.నిజానికి వలస కార్మికుల కోసం కేంద్రం 2019లో ఒకే దేశం,ఒకే రేషన్‌ కార్డు పథకాన్ని తెచ్చింది.2022 నుంచి అది దేశవ్యా ప్తంగా అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఒక చోట రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడి నుంచి అయినా చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. అందుకోసం రేషన్‌ కార్డులను బయోమెట్రిక్‌, ఆధార్లతో అనుసంధానించారు. నిరుడు జులై నాటికి దేశీయంగా ప్రతి నెలా మూడు కోట్ల మంది ఇలా ఇతర ప్రాంతాల్లో రేషన్‌ సరకులు అందుకుంటున్నారు. 2019 ఆగస్టు నుంచి చూస్తే ఈ సంఖ్య దాదాపు 78కోట్లు. అయితే, ఇండియాలో అర్హులైన లబ్ధిదారులు ఎంతో మందికి నేటికీ రేషన్‌ కార్డులు లేవన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.
విధానం మారాలి…
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం- అంతర్గత వలస కార్మికులు 45 కోట్లు.నాటి జనాభాకు అనుగుణంగానే ఇప్పటికీ రేషన్‌ కార్డులు అందిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం భారత్లో 67శాతం జనాభాకు రేషన్‌ కార్డులు దక్కాలి. ప్రస్తుతం అరవై శాతానికే అవి అందినట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. 2011 జనగణన ప్రకారం ఇండియా జనాభా 121కోట్లు.ఇటీవల భారత్‌ చైనాను అధిగ మించి ప్రపంచంలోనే అత్య జనసంఖ్య ఉన్న దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇండియా జనాభా 142 కోట్ల పైమాటే. 2011 జనగణ నను అనుసరించే రేషన్‌ కార్డులు జారీ చేస్తు న్నందువల్ల పది కోట్ల మంది అర్హులు నష్టపోతు న్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సమగ్ర జనగణన జరిపి రేషన్‌ కార్డులు దక్కాల్సినవారి అసలైన సంఖ్యను నిర్ణయిం చాలి. దేశంలో ఎవరూ ఆకలితో అల్లాడకుండా పటిష్ఠ చర్యలు సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం! తీసుకోవడం సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం.
వలసలను నియంత్రించేదెప్పుడు?
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్లిళ్ల రీత్యా, చదువుల నిమిత్తం ఒక్కెత్తెట్కతే బ్రతుకుదెరువుకై కొందరు, వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెళ్ళడం ఇంకొకెత్తు.
తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుండి వలస కూలీలు మహారాష్ట్ర, హైదరాబాద్‌, కువైట్‌, దుబాయ్‌.. వంటి ఇతర ప్రాంతాలకు బ్రతుకుదెరువుకై వలసలు వెళ్ళిన సందర్భాలెన్నో చూశాము. వివిధ దినపత్రికలు, టీవీలలో, మాస పత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రాల ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ అనుకు న్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం. ఏదో ‘గుడ్డికంటే మెల్ల నయ్యం’ అన్నట్లుగా ఉన్నదన్నది నగ్న సత్యం.మన తెలంగాణ రాష్ట్ర వలస బ్రతుకులు అందరికీ తెలిసినవే. కానీ మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వలసలు వచ్చిన వారి బ్రతుకులను ఒక్కసారి పరిశీలిస్తే…ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాలను కాంట్రాక్టర్లకు అప్పగిం చడం ఆనవాయితీ.ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌,ఉత్తర ప్రదేశ్‌,బిహార్‌,ఒడిషా,తెలంగాణ ప్రజలు భాగ్యనగరంలో చేసే పనులను చూస్తే… ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న, చితక పనులు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. వారి సంపాదన తక్కువగా వుండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాలలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపు తుంటారు.బిహార్‌ రాష్ట్రం నుంచి వచ్చే వలస కార్మికులు కొంత మంది తెలంగాణలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవం తులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధపండ్ల తోటల పెంపకం చేపడుతూ,అందులో పనిచేయడానికిఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది.అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జీలు,వంతెనలు,ప్రాజెక్టులు,డ్యాముల నిర్మా ణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాం తానికి చెందిన వారుంటారు.బోర్‌వెల్స్‌లో పని చేసే కార్మికులలో అత్యధిక మంది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆదివాసులే వుంటారు. కుటుంబానికి దూరంగా ఉంటూ,ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికే పరిమితమై పనిచేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపు తుంటారు. భాగ్యనగ రంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందిన వారుంటారు.వారు నామ మాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు.పేదరికంతో ముందు గానే వారివద్ద డబ్బులు తీసుకొని, అప్పు తీర్చు టకు నెలలకొద్దీ పనిచేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ నుండి తెలంగాణకు వలసల వచ్చి పండ్ల తోటలలో పనిచేస్తున్నవారు కొందరు. జార్ఖండ్‌ నుండి ఇక్కడకు పనిచేయుటకు వచ్చి ఆకలితో చనిపోవడం లాంటి వార్తలను వివిధ దిన పత్రికల్లో చూస్తున్నాము.హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ సమీపంలోకి వెళ్ళి చూస్తే ప్రత్యక్షంగా వలస కూలీల బ్రతుకులను దగ్గరగా చూడవచ్చు. వారితో సంభాషిస్తే వారి బాధలను కథలుగా వినవచ్చు. ఏదో బ్రతుకు దెరువుకై వచ్చి నాలుగు డబ్బులు సంపాదించు కొని సంతోషంగా గడుపుతున్నారంటే అదీ లేదు, ఉద్యోగ భద్రత లేకుండా, యజమానుల క్రింద వెట్టిచాకిరీ చేస్తున్న…యజమానులకు కాసుల పంట పండుతుంది కానీ,వీరికి మాత్రం దినదినం గండంగానే ఉంటుంద నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలస కూలీల బ్రతుకులను మార్చేదెవరు? అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికెళ్తున్నాయో అర్థంగాని పరిస్థితి.దేశంలో సైతం వృద్ధిరేటు పెరుగుతుందని ఏవో సర్వేలు చేసి ఘనంగా చెప్పుకుంటారు తప్ప, ఎక్కడున్నది అభివృద్ధి? వీరి బ్రతుకులు మారేదెప్పుడు? మార్చేదెవరు? వీరి భద్రతకు ఎవరు భరోసానిస్తారు? అర్థంగాకుండా వున్నదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వలసలు పోవడంలో తప్పలేదు గానీ, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రక్షణగావిస్తూ, నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుం బంతో సంతోషంగా గడిపే విధంగా యజమా నులు వుండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.దేశంలో రోజురోజుకు నిరుద్యోగత పెరిగిపోతున్నది, ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. పేదవారి పరిస్థితులను తెలపా లంటే వ్రాస్తే రామాయణమంతా, చెబితే మహాభారతమంతా ఉంటుందనడంలో నిజం లేకపోలేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రభుత్వాలు పునఃపరి శీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. నేటి ఈ ప్రజాస్వా మ్య వ్యవస్థలో పాలనాధికారులు ఇచ్చే ఉపన్యా సాలు అంతా ఇంతా గాదు, కానీ ఆచరణలో మాత్రం అనుకున్నంత మేరలో ఉండదు. ఎవ్వరైనా అవే విషయాలను ప్రస్తావిస్తే మేమన లేదని,అవి సాధ్యపడవని మాటలు మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి.ఏ ప్రభు త్వం వచ్చినా పేద, నిమ్న వర్గాలకు చెందిన ప్రజల బ్రతుకులకు భరోసా లేనప్పుడు ఈ ప్రభుత్వా లెందుకో అర్థంగాని పరిస్థితి.దేశం లో ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన యంత్రాంగం మాటలు ఆపి ఆచరణలో సాధ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఏవో పథకాలను చేపట్టి, డబ్బులు లెక్కలు చూపించి, పేపర్లకు పరిమితంగాకుండా క్షేత్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.సొంతూరిలో ఓ గూడు కట్టుకోవాలన్నది వారి ఆలోచన.ఈ దంపతులకు నాలుగేళ్లు, అయిదేళ్లు, ఎనిమి దేళ్లు,11ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. నలు గురు చిన్నారులూ తమ సొంతూరిలోనే 54 ఏళ్ల నానమ్మ దగ్గరే ఉంటు న్నారు.ఈ ఒక్క కుటుంబమే కాదు. కర్గిస్థాన్‌లో ఇలాంటి వలస లు సర్వసాధారణం.ఈ దేశం లోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఉపాధి కోసం పరా యి దేశాలకు వలసవెళ్లినవారే. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం, ఇలాంటి వలస కార్మికులు తమ స్వదేశాలకు పంపే డబ్బు విలువ మధ్య ఆసియా దేశాల జీడీపీలో మూడో వంతుకు పైనే ఉంటుంది.అలా పంపే డబ్బు విలువ 2018లో 528 బిలియన్‌ డాలర్లకు చేరిందని అంచనా.దిగువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల పురోగతికి ఆడబ్బు ఎంతో దోహదపడుతోంది.కానీ, ఆకార్మికుల పిల్లలు తమ జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తోంది. పసి పిల్లలను సొంతూళ్ల లో వదిలేసి తల్లిదం డ్రులు కనిపించకుండా వలసెళ్లిపో తున్నారు.దాంతో ఎంతోమంది చిన్నారులకు అమ్మానాన్నల ఆప్యాయత కరువవుతోంది.ఒక తరం పిల్లలంతా తమ బంధువుల సంరక్షణలోనే ఉండాల్సి వస్తోంది. నిరాదరణకు,వేధింపులకు కూడా గురవుతు న్నారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలపట్ల,శ్రామిక వర్గాలపట్ల అండగా వుంటూ,రక్షణనిస్తూ,ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగాచట్టాలను గావించా ల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం.ఆదిశగా ఆలోచిస్తూ వలసల నియంత్రణగావిస్తూ, వారికి ఆర్థికపరమైన భరోసానివ్వాలని ఆశిద్దాం.- సైమన్ 

స్వేఛాయత వాతావరణంలో ఎన్నికలు`2024

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 2024 మే13న జరుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛా యుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేం దుకు సహకరించాలని జిల్లాఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి,నామినేషన్లు,ప్రచారం, పోలింగ్‌,కౌంటింగ్‌ తదితర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక వుడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మార్చి 20నవిస్తృత అవగా హన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అనగా జూన్‌ 6వ తేదీ వరకు ఈకోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్ని కల సంఘం,రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి ఆదే శాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పక్షం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్వేచ్చా యుత వాతావరణంలో, పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన క్షణం నుంచి జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విగ్రహాలకు ముసుగులు వేశామని,ఏడు వేలవరకుకటౌట్లు,జెండాలు, హోర్డింగులను తొలగించామని పేర్కొన్నారు. ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు,పోస్టర్లు, బ్యానర్లను అనుమతించబో మని తేల్చిచెప్పారు. హైవేలు, ప్రధాన రహదారులు సమీపంలో ఇప్పటి వరకు ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్‌ అధికారి అనుమతితో కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన ప్రదేశాల్లో హోర్డింగులు పెట్టు కునేందుకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇంటి పైకప్పులపై కటౌట్లు, జెండాలు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకోవా లన్నారు. ర్యాలీలు, పాఠశాల, కళాశాల మైదానాలు, అతిథి గృహాలు వంటివి వినియోగించుకోవాలన్నా రిటర్నింగ్‌ అధికారి అనుమతి తప్పనిసరి అని, అయితే ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, అందు లో ముందుగా 48గంటల ముందు నమోదు చేసుకున్నవారికి రాజకీయ పక్షాలపై వివక్ష లేకుండా తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్ధి రూ.95 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.40లక్షల వరకు వ్యయం చేసుకునే వెసులుబాటు ఉందని, అయితే ఎన్నికల నియమావళి అమలు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం వరకు చేసిన ఖర్చులన్నీ ఆయా పార్టీ ఖాతాల్లో నమోదు చేస్తామని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి వ్యక్తిగత ఖాతాల్లో నమోదవుతా యని చెప్పారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతి అభ్యర్ధిపై నిఘా ఉంటుందని,వారు ఖర్చుచేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయంలో లెక్కిస్తామని పేర్కొ న్నారు.ఆర్‌ఓ అనుమతి లేకుండా బైకు ర్యాలీ, ఇతర ర్యాలీలను నిర్వహించరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, కోడ్‌ ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనరాదని, ఒకవేళ ఎక్కడైనా పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభు త్వ ఉద్యోగులు,ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లోతప్ప,ఇతర కార్యక్రమాల్లో పాల్గొన రాదని,అలా పాల్గొన్నారని తమ దృష్టికి వస్తే ఏమా త్రం ఉపేక్షించబోమని,అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు.పౌరులు కోడ్‌ ఉల్లం ఘన సంబందించి చర్యలు గుర్తించినచో సి.విజల్‌ యాప్‌ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయ వచ్చని,నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించి ఫిర్యాదుదారునికి తీసుకున్న చర్యలు గురించి తెలియజేస్తామని చెప్పారు. సి-విజిల్‌ యాప్‌ లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు అందాయని, వాటిపై వివరాలు తెలియజేసినట్లు కలెక్టర్‌ వివరించారు. అభ్యర్ధి, ఏజెంట్లు, అనుచరులు వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండరాదని, అలాగే వస్తు రూపేణా రూ.10వేలకు మించి ఉండరాదని,డొనేషన్స్‌ రూపేణా రూ.20వేలకు మించి స్వీకరించరాదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు.లక్ష రూపాయలకు మించి నగదు బదిలీ చేసినట్లయితే నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగానికి, ఆదాయపు పన్నుశాఖ వారికి తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెయిడ్‌ ఆర్టికల్స్‌ విషయంలో అటు అభ్యర్థులు,ఇటు మీడియా ప్రతినిధులు అప్రమ త్తంగా ఉండాలని,అటువంటి వాటిని ఎం.సి. ఎం.సి.(మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మీడియా మోన టరింగ్‌) కమిటీ పరిశీలించి తదుపరి చర్యలకై ఆర్‌.వో.కు రిఫర్‌ చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రా నిక్‌ మీడియాకు అందిస్తామని తెలిపారు. ఊహాగా నాలకు తావిస్తూ ధృవీకరణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, వార్తలను ప్రచారం చేసేముందు జిల్లాఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్‌ అధికారి వద్ద నుంచి సరైన సమాచారాన్ని పొందిన తదుపరి మాత్రమే ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులకు సూచిం చారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ః జీవీఎంసీ కమిషనర్‌ నోడల్‌ అధికారి- సీ.ఎం.సాయికాంత్‌ వర్మ : రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల వేళ ప్రజలు నచ్చిన విధంగా ఓటు హక్కు ను వినియోగించుకునేలా చేయడం ఎన్నికల ప్రవర్త నా నియమావళి ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూ లుతో ఎం.సి.సి.అమల్లోకి వచ్చిందన్నారు. పర్య వేక్షణ నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది బృందాలను నియమించామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఎం.సి.సి. అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగులు,కటౌట్లు,జెండాలను తొలగిం చామ ని,విగ్రహాలను మూసివేశామని గుర్తు చేశారు. ఇకపై రాజకీయ పక్షాలు హోర్డింగులు, జెండాల కొరకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరిఅని,కరపత్రాలు,గోడపత్రికలపై ఆర్‌.ఓ. అనుమతితో పాటు ప్రచురించిన ముద్రణ సంస్థ పేరు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. ఏ విధంగానైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పక్షాల అభ్యర్ధులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలు,ర్యాలీలు,సభల నిర్వహణ కోసం వినియోగించుకునే ప్రాంగణాల కోసం సువిధ యాప్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని లేదా ూఱఅస్త్రశ్రీవ ఔఱఅసశీష జశ్రీవaతీaఅషవ జవశ్రీశ్రీ ద్వారా సంబంధిత Rూనుండి అనుమతులు తీసుకో వచ్చు ను. ముందుగా చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 10 వాహనాలను ఒక యూనిట్‌ గా వినియోగించుకోవాలని, పది వాహనాలకు దాటితో 100అడుగులు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయా లని స్పష్టం చేశారు. వాహనాలు ఎవరి పేరున తీసుకున్నారో,వారు మాత్రమే వినియోగించు కోవాలని,వేరే వ్యక్తులు వినియోగించినట్లయితే కోడ్‌ ఉల్లంఘన కింద వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమావేశాలు, లౌడ్‌ స్పీకర్లను వినియోగించరాదన్నారు.పోలీసు అధికా రులు చెప్పిన ప్రకారం రోడ్‌ షోలు, ర్యాలీలు చేసుకో వాలని సూచించారు. ఓటర్ల స్లిప్పులను బి.ఎల్‌.ఓ లు పంపిణీ చేస్తారని, పార్టీల ప్రతినిధులు చేయాల్సి వస్తే తెల్ల కాగితంపై ఉన్న ఓటరు స్లిప్పులనే విని యోగించాలే తప్ప,ఇతర రంగులు వినియో గించ రాదని,అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణి స్తామని పేర్కొన్నారు. పోలింగ్‌ సమయంలో హో టళ్లు, అతిథి గృహాల్లో బయట వ్యక్తులు ఉండరాదని సూచించారు. ఎటువంటి చీరలు,నగదు, వస్తువులు ఇతరులకు పంపిణీ చేయరాదని,అలా చేస్తే ఆ వాహనాన్నిసీజ్‌ చేస్తామని అన్నారు.మంత్రులు అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించ రాదని, అధికారిక పనులను ఎన్నికలకు వినియోగిం చుకునేలా చేస్తే అటువంటి వాటిని కూడా కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణిస్తామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య గొడవలు సృష్టించరాదని,దేవాల యాలు,చర్చిలు,మసీదులను రాజకీయాలకు వినియో గించరాదని స్పష్టం చేసారు. ఓటరును ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం చేయరాదని, అలాగే అభ్యర్థుల ఇళ్ల ముందు ధర్నాలు చేయరాదన్నారు. ఒక పార్టీ సమావేశాలను ఇతర పార్టీలు ఆటంకం కలిగించేలా వ్యవహరించరాదని, ఎటువంటి ఆయు ధాలు కలిగి ఉండరాదని ఆయన రాజకీయ పక్షా లకు వివరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహ రించాలి ః సీపీ డా.ఎ.రవిశంకర్‌ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయ పక్షాలు వ్యవహరించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని పోలీస్‌ కమిషనర్‌ డా. ఎ. రవిశంకర్‌ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలు నిర్వహించే సమావేశాలు, సభలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లు వినియోగించుకునే ముందు ఆయా రిటర్నింగ్‌ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, సువిధలో నమోదు చేయలేని వారు రిటర్నింగ్‌ అధికారి వద్ద అనుమతి పొందవచ్చ న్నారు. సమావేశాలు నిర్వహించే తేదీ, సమయం, ర్యాలీలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య తదితర వివరాలు స్పష్టంగా ఉండాలని, అన్ని పార్టీల దరఖాస్తులను పరిశీలించిన పిదప అనుమతిని మంజూరు చేస్తా మని తెలిపారు.రాజకీయ పక్షాల చేసే ప్రతి పనినీ సర్వేలైన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌,ఎం.సి.సి.,తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని అన్నారు. వీటిలో పోలీసు అధికారులు ఉంటారని, అయితే ఈ బృందాలకు ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధిపతిగా వ్యవహ రిస్తారని చెప్పారు. రాజకీయ పక్షాలు ముందుగా నమోదు చేసిన రూటులో కాకుండా వేరే మార్గాన ర్యాలీలు నిర్వహిస్తే వాటిని కోడ్‌ ఉల్లంఘనగా గుర్తిస్తూ, పంచనామా చేసి ఎంపీడీవో నివేదిక ఇస్తారన్నారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ లలో హాజరయ్యే వారి వివరాలు ముందుగా ఇవ్వాలని, వారి వివరాలు పరిశీలించి అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు. మతపరంగా గొడవలు, వ్యక్తిగత తగాదాలు ఉం డరాదని, ముగ్గురు వ్యక్తులతో కూడిన గ్రీవెన్స్‌ కమిటీ జిల్లాలో ఉందని,ఎన్నికలకు సంబంధించిన ఎటు వంటి ఫిర్యాదులనైనా చేయవచ్చని పేర్కొన్నారు.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన

దేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయ డంలో మౌలిక సదుపాయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రాథమిక పెట్టుబడులలో కూడా ఇవే కీలకం. శ్రామిక, మూలధన రూపంలో ఉన్న విస్తారమైన వనరుల కార ణంగా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.భారతదేశ ఆర్థిక వ్యవ స్థలో ఎంఈఐఎల్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. పారిశ్రా మిక, వ్యాపార మౌలిక సదుపాయాలలో స్థిరమైన వృద్ధిని అందిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది ఎంఈఐఎల్‌. మౌలిక సదుపాయాల్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధిని అందిస్తూ..ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక నీటి పథకాల ద్వారా సాగు, తాగు నీటిని అందిస్తోంది.భారీ విద్యుత్‌, రోడ్‌ టన్నెల్‌ ప్రాజెక్టులు చేపట్టి..వాటిని నాణ్యతా ప్రమాణా లతో పూర్తి చేస్తూ..దేశ వృద్ధిని పెంపొందిస్తోంది. దేశం లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ ఎంఈఐఎల్‌ తన సత్తా చాటుకుంటోంది.మౌలిక సదు పాయాలు, పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రసంగించారు..సారాంశం ఇదీ..!!
‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల అభి వృద్ధి ఒక చోదకశక్తి’ : ‘ప్రతిఒక్కరూ నూతన బాధ్య తలు,నూతన అవకాశాల విషయంలో గొప్ప నిర్ణ యాలు తీసుకోవడానికి ఇది తగిన సమయం’’ ‘భారతదేశంలో శతాబ్దాలుగా జాతీయ రహదారు లకు గల ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది’ ‘పేదరికం ఒక శాపం అనే ఆలోచనను తుడిచిపెట్ట డంలో మనం విజయం సాధించాం.‘ఇప్పుడు మనం మన వేగం పెంచాలి. మరింత దూసు కళ్ళాలి.పి.ఎం.గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలికసదుపాయాలు, దాని బహుళన మూనా లాజిస్టిక్స్‌ రూపురేఖల్ని మార్చనుంది. ‘పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌ దేశ ఆర్థిక, మౌలికసదు పాయాల ప్లానింగ్‌ను అభివృద్ధితో అనుసంధానం చేస్తుంది.నాణ్యత,మల్టీమోడల్‌ మౌలికసదుపాయా లతో,మనలాజిస్టిక్‌ల ఖర్చురాగల రోజులలో మరిం త తగ్గనుంది. మౌలికసదుపాయాల బలంతో,దేశ సామాజిక మౌలిక సదుపాయాలుబలంగా ఉండ నున్నాయి.మీరు కేవలం దేశ అభివృద్ధికే కాదు, భారతదేశ పురోగతివేగం పెంచేందుకు దోహద పడుతుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మౌలికసదుపాయాలు,పెట్టుబడులు: పిఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తో లాజిస్టిక్‌ సామర్ధ్యాలను మెరుగుపరచడం’ అనే అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను నిర్వహించారు.బడ్జెట్‌ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్‌. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్ర మాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా వెబి నార్‌లో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇవాల్టి వెబినార్‌లో వందలాది మంది పాల్గొంటుండడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.సుమారు 700 మంది సిఇఒలు, మేనేజింగ్‌ డ్కెరక్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు.దీనిని బట్టి ఈ వెబినార్‌ ప్రాధాన్యత తెలుస్తోంది.వివిధ రంగా లకు చెందిన నిపుణులు, స్టేక్‌హోల్డర్లు ఈ వెబి నార్‌ను విజయవంతం చేశారని అన్నారు.మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌ నూతన శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.బడ్జెట్‌కు సర్వత్రా ప్రశంసలు లభించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బడ్జెట్‌ లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు నిపుణుల నుంచి ప్రధాన మీడియా సంస్థలనుంచి ప్రశంసలు లభించాయన్నారు. భారతదేశపు కాపెక్స్‌ 2013`14 సంవత్సరంతో పోలిస్తే 5 రెట్లు పెరగిందన్నారు. ప్రభుత్వం జాతీయ మౌలికసదుపాయాల పైప్‌ల్కెన్‌ కింద 110 లక్షల కోట్లరూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు పోతున్నదని చెప్పారు.నూతన అవకాశాలకు, నూతన బాధ్యతలకు, గొప్ప నిర్ణయాలు తీసుకోవ డానికి ఇదిఎంతో అనువైన కాలమని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచు కున్నప్పుడు,ఏ దేశ సుస్థిరాభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల చరిత్రకు సంబంధించిచన పరిజ్ఞానం కలవారికి ఈవిష యం బాగాతెలుసునని ఆయన అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరాపథ్‌ నిర్మించగా, అశోకుడు దానిని మరంత ముందుకు తీసుకువెళ్లారని, షేర్‌ షా సూరి దానిని అప్గ్రేడ్‌ చేశారని అన్నారు. దానిని బ్రిటిషర్లు జి.టి.రోడ్‌గామార్చారని చెప్పారు.జాతీయ రహదా రుల ప్రాధాన్యతను శతాబ్దాల క్రితమే భారత దేశంలో గుర్తించారని ప్రధానమంత్రి చెప్పారు. జలమార్గాలు,రివర్‌ ఫ్రంట్‌ల గురించి ప్రస్తా విస్తూ ప్రధానమంత్రి,బెనారస్‌ ఘాట్‌ ల గురించి ప్రస్తావిం చారు.ఈఘాట్లు జలమార్గాలద్వారా నేరుగా కల కత్తాతో అనుసంధానమై ఉండేవని చెప్పారు. తమిళనాడులోని 2000 సంవత్సరాల క్రితం నాటి కలనై డ్యామ్‌ ఇప్పటికీ నీటిని అందిస్తోందని ప్రధాన మంత్రి తెలియజేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.పేదరికం ఒకశాపమన్న భావనను తొల గించి,ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతు న్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.మౌలిక సదు పాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడినట్టు ప్రధానమంత్రి వివరిం చారు.2014 నాటికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చినపుడు,జాతీయ రహదారుల నిర్మాణం సగ టున రెట్టింపు అయిందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే 2014కు ముందు సంవత్సరానికి 600 రూట్‌ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగిం దని, అది ప్రస్తుతం సంవత్సరానికి 4000 కిలో మీటర్లకు చేరుకున్నదన తెలిపారు. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య, సముద్ర పోర్టుల సామ ర్ధ్యం రెట్టింపు అయినట్టు ప్రధానమంత్రి తెలి పారు.‘‘మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా’’అని అంటూ ప్రధాన మంత్రి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం రూపుదిద్దుకునే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.ఇందుకు అనుగుణమైన మార్గాన్ని భారత దేశం అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఇప్పుడు మనం వేగాన్ని మెరుగుపరచుకుని టాప్‌ గేర్లో ముందుకు పోవాలని అన్నారు. పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ అనేది,ఎంతో కీలకమైనది అని అంటూ ప్రధానమంత్రి, సమీకృత ఆర్ధిక,మౌలికక సదుపాయాల ప్రణాళికకు ఇది ముఖ్యమైనదని అన్నారు. గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, మల్టీ మోడల్‌ లాజిస్టి క్‌ ల ముఖచిత్రాన్ని మార్చివేయనున్నదని చెప్పారు. పి.ఎం.గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.లాజిస్టక్‌ ల సమర్ధతపై ప్రభావం చూపుతున్న అంశాలను ,లోపాలను గమనించడం జరిగిందని ప్రధాన మం త్రి తెలిపారు.అందువల్ల ఈఏడాది బడ్జెట్‌లో 100 కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి నట్టు తెలిపారు. ఇందుకు 75,000 కోట్ల రూపా యలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన,మల్టీ మోడల్‌ మౌలిక సదు పాయాలతో,మన లాజిస్టిక్‌ ఖర్చులు రాగల రోజు లలో మరింత తగ్గనున్నాయి. ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అనిఆయన అన్నారు.లాజిస్టిక్‌ రంగం తోపాటు సులభతర జీవనం,సులభతర వ్యాపారం విషయలోనూ పరిస్థితి మరింత మెరుగుపడనున్న దని చెప్పారు.మౌలికసదుపాయాల రంగంలో పెట్టు బడులు పెట్టాల్సిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు.రాష్ట్రాల పాత్ర గురించి వివరిస్తూ ప్రధానమంత్రి,50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌ వ్యయం 30శాతానికి పెంచినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి వివిధ మెటీరియల్స్‌ అవసరం ఉన్నం దున,ఆయా రంగాల అవసరాలకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలని ప్రధాన మంత్రి సూచించారు.భవిష్యత్‌ సుస్పష్టంగా ఉన్నందున మనం సమీకృత విధానాన్ని అనుసరిం చాలని ప్రధానమంత్రి సూచించారు. ఇందులో పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కీలక పాత్ర పోషి స్తుందని ఆయన అన్నారు.ఈరంగంతో సర్కులర్‌ ఎకానమీని సమీకృతం చేయాల్సిన అవసరం ఉం దని ఆయన అన్నారు.కచ్‌ ప్రాంతంలో భూకం పం వచ్చినప్పడు తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.సహాయ కార్యక్రమాల అనం తరం కచ్‌ ప్రాంతంలో పూర్తిగా నూతన అభివృద్ధి విధానాన్ని అనుసరించినట్టు ఆయన తెలిపారు. మౌలక సదుపాయాల అభివృద్ధి తో కూడిన అభివృ ద్ధిని ఈ ప్రాంతంలో చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రాజకీయంగా అవసరార్థం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కచ్‌ ప్రాంతాన్ని ఒక గొప్ప ఆర్ధిక కార్యకలాపాలక్షేత్రంగా మార్చినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.దేశ సామాజిక మౌలిక సదుపా యాలను బలోపేతం చేయాలంటే,భారతదేశపు భౌతిక మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు.బలమైన సామా జిక మౌలిక సదుపాయాలు,మరింత ప్రతిభ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయ డానికి ముందుకు రావడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు యాజమా న్యం,ఆర్ధిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యుయర్‌ షిప్‌, ఈ లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపకరిస్తుందని చెప్పారు.నైపుణ్యాల కు సంబంధించిన సమాచారం అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని సూచించారు.ఇది వివిధ రంగాలలోని చిన్న,పెద్ద సంస్థలకు ఉపయోగపడుతుందని చెప్పా రు.ఇది దేశమానవ వనరుల శక్తి సద్విని యోగానికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈదిశగా ప్రభు త్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు సత్వరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.ఈ వెబి నార్‌ లోని ప్రతి స్టేక్‌ హోల్డర్‌ ఇచ్చే సూచనలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అంటూ ప్రధాన మంత్రి,వీరు దేశ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, భారత దేశ ప్రగతి వేగం పరుగులు పెట్టడానికి దోహదపడుతున్నారని అన్నారు.మౌలిక సదుపా యాల అభివృద్ధి రైలు, రోడ్డు, పోర్టులు, విమానాశ్ర యాలకు మాత్రమే పరిమితం కాదని,ఈ ఏడాది బడ్జెట్‌ లో భాగంగా భారీ ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.గ్రామాలలో రైతుల పంట ను నిల్వచేసే సదుపాయాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. నగరాలు, గ్రామాలలో వెల్‌ నెస్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.ఈ వెబినార్లో వివిధ స్టేక్‌ హోల్డర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు.వారి అనుభవాలు అన్నీ ఈ ఏడాది బడ్జెట్‌ వేగంగా,చురుకుగా అమలు చేయడానికి పనికి వస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక పదాన్ని మీరు గనక తొలగించినట్లయితే అది అర్థ రహితం అవుతుంది.ఆ పదమే ‘డిజిటల్‌’బీ న్యూ ఇండియా ఆవిష్కారంలో దానికి ప్రతీకగా మారిన పదం ఇదే.ఈడిజిటల్‌ ఇండియా ఉద్యమం ఫలితం గా టెలికాం డేటా అన్నది భారతదేశం లోని మారు మూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటు లోకి వచ్చింది. గత నాలుగున్నర సంవత్సరాల లో టెలికమ్‌ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో మునుపటి తో పోల్చితే మా ప్రభుత్వం ఆరు రెట్లు అధికం గా పెట్టుబడులను ప్రవహింపజేసి, దానిని మరింత బలోపేతం చేసింది.-జి.ఎన్‌.వి.సతీష్‌

విద్యలో వండర్‌ ఎడెక్స్‌

పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్‌ ప్లాట్ఫామ్‌ ‘‘ఎడెక్స్‌’’ల మధ్య ఒప్పందం జరగనుంది.టీచింగ్‌, లెర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్‌, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.
‘‘ఎడెక్స్‌ ఒప్పందం’’ ముఖ్యాంశాలు
హార్వర్డ్‌,ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ,కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ..తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
‘‘ఎడెక్స్‌ ఒప్పందం’’తో ప్రయోజనాలు
విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్‌,ఎంఐటీ,కొలంబియా,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సి టీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులు బాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్‌ మన కరిక్యులమ్లో భాగమవుతాయి.తద్వారా మన పిల్లలు గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా ఎదుగు తారు. ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు..పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసిం చేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెనద్వారా పూర్తి ఫీజు రీయింబ ర్స్మెంట్‌.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్‌ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్‌/టైమ్స్‌ ర్యాంకింగ్స్‌ 21 ఫ్యాకల్టీలలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం.జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యు లమ్‌తో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు. విద్యా ర్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.కరిక్యులమ్‌లో భాగంగా సర్టిఫైడ్‌ ఆన్లైన్‌ వర్టికల్స్‌.తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్టడం ద్వారా విద్యా ర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7లక్షల మంది విద్యార్థు లు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్స్‌, 5.2లక్షల మంది 2నెలల షార్ట్‌టర్మ్‌ ఇంటర్న్‌ షిప్‌ మరియు 2లక్షల మంది 6నెలల లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌ షిప్స్‌ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్‌ టర్మ్‌ ఇంట ర్న్‌ షిప్స్‌ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Iఅసబర్‌తీవ శీతీఱవఅ్‌వస జశీబతీంవం చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్స రంలో 37,000 ఉన్నప్లేస్‌ మెంట్స్‌ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది.నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌,సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ లతో ఒప్పందం.50బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ప్రోగ్రామ్‌ లతోపాటు 159 సింగిల్‌ మేజర్‌ కోర్సులు.డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్‌ నుంచి మెషిన్‌ లెర్నింగ్‌,డేటా సైన్స్‌,రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌ మెంట్‌,కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ అనాలసిస్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్‌,లాజిస్టిక్స్‌, రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌,స్టాక్‌ ఎక్చేంజ్‌,సైబర్‌ ఫోరెన్సిక్స్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అనాలసిస్‌, వెల్త్‌ మేనేజ్మెంట్‌, ఇన్వెస్ట్మెంట్‌ బ్యాంకింగ్‌ వంటి మైనర్‌ కోర్సులు ఆన్లైన్‌ వర్టికల్స్‌ ద్వారా అందుబాటులోకి. డిజిటల్‌ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్‌ క్యాస్టులు. రాష్ట్రంలోని 18యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభు త్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం. మన విద్యార్థులను గ్లోబల్‌ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్‌ బీస్‌- జర్మనీ, మెల్బోర్న్‌ ఆస్ట్రేలియా, కెంపెన్‌-జర్మనీ, బ్లెకింగ్‌-స్వీడన్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- బ్యాంకాక్‌ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్‌ విజన్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్‌ల ఏర్పాటు. ఒక్కో జోన్‌ కు రూ.10 కోట్ల పెట్టుబడి..ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి దీశీaతీస టశీతీ జశీఎఎబఅఱ్‌వ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ్‌ష్ట్రతీశీబస్త్రష్ట్ర జుసబషa్‌ఱశీఅ (దీజణజు )ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే చీAAజ గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో చీAAజ గుర్తిం పు పొందిన 437విద్యా సంస్థలు.
ఎడెక్స్‌తో ఒప్పందం..
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది ప్రముఖ విద్యా పోర్టల్‌ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఫిబ్రవరి 15న సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ విద్యా శాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవో యూకి సీఎంజగన్‌ అధ్యక్షత వహించి మాట్లా డారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపో తుందని అన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత విధానం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అని అన్నారు.నాణ్యమైన విద్య ను అందించడంలో మనం వెనకబడితే.. మిగతా వళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని జగన్‌ అన్నారు. మన పిల్లలు మంచి మంచి జీతాలతో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని అది జరగా లంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యం అవుతుం దని సీఎం జగన్‌ అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు..ఫలాలు ఇవ్వా లంటే బహు శా నాలుగైదేళ్లు పట్టొచ్చని, కానీ, మనం వేసిన ప్రతి అడుగుకూడా ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకూ కూడా సమూలంగా మార్చు కుంటూ వస్తున్నామని చెప్పారు. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోందని, అందుకనే ప్రతి అడుగులోనూ చిత్తశుద్ది, అంకిత భావం చూపి స్తున్నామని సీఎంజగన్‌ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ల లో ఇంగ్లీష్‌ మీడియాంను ప్రవేశ పెట్టామని, గ్లోబల్‌ సిటిజన్‌ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలని అన్నారు. అందుకే ఇంగ్లిష్‌ మీడియం నుంచి నాడు`నేడు, అమ్మఒడి,గోరుమద్దతో మన ప్రయాణం ప్రారంభ మైందని,అక్కడితో మనం ఆగిపోలేదని జగన్‌ పేర్కొన్నారు.వచ్చే పదేళ్లలో టెన్త్‌ విద్యార్థి ఐబీ విద్యాబోధనఅందించే దిశగా అడుగులు వేస్తు న్నామని,ఐవీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్‌ చేస్తున్నామని జగన్‌ అన్నారు. బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం చేశామని, ఈ ప్రయాణం, ఇక్కడితో ఆగిపోకూడదని, అత్యు తన్నత విద్యలో కూడా ఇలాంటి అడుగులు వేయా ల్సిన అవసరాన్ని భావించి దానిపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుం టున్న ఒప్పందం మరో అడుగు అని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. దాదాపు 2వేలకుపైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు.క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫి కెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుందని, మన పిల్లలకు ఇవ్వగ లిగిన ఆస్తి విద్య మాత్రమేనని జగన్‌ అన్నారు. నాణ్యమైన విద్యవారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపె నీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. టాప్‌-50 ర్యాం కింగ్స్‌లో ఉన్న 320కాలేజీల్లో సీటు వస్తే.. రూ. 1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం జగన్‌ చెప్పారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

సాహస వనితలు సమ్మక్క సారాక్క

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సార క్కల జాతర జరుగుతుంది. దీనికి చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో జనం వస్తుంటారు.సమ్మక్క సారక్కలు గిరిజనులు కానట్టు ‘దేవతలు’-అని చెప్పడం ఒక మోసం! సమ్మక్క సారక్కలు, పగిడిద్దరాజు,జంపన్నలు ఆది వాసీ గిరిజనులు.వీరు తమ హక్కుల కోసం పోరాడుతూ అమరులైన వారు. కేవలం గిరిజన వీరులు మాత్రమే!
వీరి చారిత్రక నేపథ్యం ఇలా ఉంది. సాధారణ శకం 12వశతాబ్దం ఓరుగల్లును కాకతీ యులు నిరంకుశంగా పాలిస్తున్న రోజులు. ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం తాపత్రయపడిన ప్రతాపరుద్రుడు గిరిజనుల నాయకుడైన పగిడిద్ద రాజును ఆహ్వానించి, గిరిజనులతో తన పాలన లోకి రావాలని కోరాడు.అతను అందుకు సమ్మ తించకపోవడంతో అనేక విధా లుగా ప్రయత్నిం చాడు.ఏప్రయత్నమూ ఫలించకపోవడంతో విపరీ తంగా ఒత్తిడి పెంచాడు. పగిడిద్దరాజు నాయక త్వంలో ఉన్న గిరిజనులెవరూ లెక్కచేయలేదు -అసహనంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు’’తన ఆజ్ఞను అతిక్రమించిన వారికి మరణ దండన తప్పదని’’ బెదిరించాడు. స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసీ గిరిజనులు మరొకరి అదుపు ఆజ్ఞలతో ఉండడానికి ఇష్టపడలేదు. కాకతీయ రాజు ప్రతా పరుద్రుని మాట తిరస్కరించారు. ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించి, నానా బీభత్సం సృష్టించాడు.వారి జీవితాల్ని అతలాకుతలం చేశాడు.ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వా పరాలు ఇలాఉన్నాయి-గిరిజనుల రాజైన మేడ రాజు,పెంపుడు కూతురు సమ్మక్కను తన మేన ల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపి స్తాడు. ఆ దంపతులకు సారలమ్మ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం.మేడారం పాల కుడైన పగిడిద్దరాజు కాకతీయులకు సామంతుడు. రాజ్యకాంక్షతో ప్రతాపరుద్రుడు,మేడరాజు పాలిం చే పొలబాసపై దండెత్తుతాడు.ఆదాడి తట్టు కోలేక మేడరాజు తనకూతురు దగ్గరికి మేడారం పారి పోయి అక్కడ ఆజ్ఞాతవాసం గడుపుతుంటాడు. ఆ సమయంలో వచ్చిన కరువు కాటకాల వల్ల పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం చెల్లించలేక పోతాడు.కప్పం చెల్లించకపోవడం ఒక కారణ మైతే, తన మామగారైన మేడరాజుకు ఆశ్రయం కల్పించడం మరో కారణం. తనకు లొంగిపోనని చెప్పిన పగిడిద్దరాజును ఇక యుద్ధంతోనే లొంగ దీసుకోవాలనుకుని, తన మంత్రి యుగంధరుడితో కలిసి, ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు. తన కొడుకు జంపన్నను తీసుకుని, బలగాలను సమాయత్తంచేసి,కాకతీయ సైన్యాలను ఎదుర్కొంటాడుపగిడిద్దరాజు.వీరోచితంగా పోరా డుతూ పగిడిద్దరాజు,గోవిందరాజులు ప్రాణాలు వదిలేస్తారు. దాంతో, సమస్య తీరిందని ప్రతాపరు ద్రుడు సంబరపడ్డాడు. కానీ,ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. గిరిజన మహిళలు సంఘటి తమై మళ్లీ విజయ దుందుభి మోగించారు. ఈ సారి సమ్మక్క, తన కూతురు సారక్కతో కలిసి సారథ్యం వహించింది. అతి పెద్దదైన, సుశిక్షితు లైన కాకతీయ సైనికులతో గిరిజన మహిళలు గెలవలేకపోయారు. సమ్మక్క,సారక్క,నాగమ్మ అనేక మంది గిరిజనులు వీరమరణం పొందారు. ఓటమిని భరించలేక జంపన్న దగ్గరగా ఉన్న సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుం టాడు. ఆనాటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా పిలవబడుతోంది. కాక తీయుల దృష్టిలో ఇది ఒక సంఘటన మాత్రమే. గిరిజన ప్రాంతాలు స్వాధీనం చేసుకోగలిగినందుకు విజయోత్సవాలు జరుపు కున్నారు. కానీ, గిరిజనుల దృష్టిలో ఇది ఒక మహోజ్వల చారిత్రక ఘట్టం! బలవం తుడైన కాకతీయరాజును ఎదుర్కొని తమ గిరిజన అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి వీరోచితంగా పోరా డిన సాహసోపేతమైన ఘనకార్యం!! అసువులు బాసిన గిరిజన అమర వీరుల్ని స్మరించుకోవడా నికి ఏర్పడ్డ గొప్ప అవకాశం. దాన్ని వారు శతా బ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. అదే కార్యక్ర మంలో సమ్మక్క సారక్క జాతరగా స్థిరపడిరది. కాకతీయులతో పోరాడి వీరమరణం పొందిన పగిడిద్దరాజు,సమ్మక్క,సారక్క, జంపన్నలను రెం డేళ్లకు ఒకసారి గుర్తు చేసుకుంటారు. అదే మేడా రం జాతర.ఆసందర్భానికి చుట్టు పక్కల ప్రాంతా ల నుండి గిరిజనులు,ఆదివాసులు,కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకుంటారు. పల్లెల నుండి మాత్రమే కాకుండా, పట్టణాలు, నగరాల నుండి కూడా జనం అధిక సంఖ్యలో అక్కడికి చేరుతుం డడంతో 1967లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ఆజాతరను తన పరిధిలోకి తీసుకుంది. ప్రభుత్వ ఎండోమెంట్‌శాఖ,వచ్చిపోయే వారికి రవాణాసౌకర్యం కల్పించింది.ఇంత వరకు బాగా నే ఉంది.కానీ,తరువాత జరుగుతూ వచ్చిన ప్రచారం మూఢనమ్మకాల వ్యాప్తికి దారితీసింది. ప్రభుత్వ జోక్యంతో స్థాయి పెంచుకున్న ఈ జాతర, ఇతర రాష్ట్రాలనుండి కూడా జనాన్ని ఆకర్షి స్తోంది.వ్యాపారాలు వృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగింది.కానీ,వాస్తవంగా అనేక అకృ త్యాలకు అది నిలయమవుతూ వచ్చింది. పరిసర ప్రాంతాలన్నీమలమూత్రాలతో కలుషితమ య్యాయి. అధిక సంఖ్యలో వచ్చిపోయే వాహనా లతో అక్కడ కార్బన్‌ మొనాక్వైడ్‌ స్థాయి పెరిగి, శుభ్రమైన గాలి దొరక్కుండా పోయింది. గిరిజన సంస్కృతిని గిరిజన సంస్కృతిగా ఉండనీయక, నగరవాసులు దాన్నొక షాపింగ్‌ మాల్‌లాగా మా ర్చారు. అంతకుముందు చుట్టుపక్కల ఉన్న గ్రామా లన్నీ తాగునీటి కోసం జంపన్న వాగుపై ఆధార పడేవి.జాతర వల్ల వాగు నీరు మురికై పోవడం వల్ల,అనేక గ్రామాలు తాగునీటికై ఇబ్బంది పడు తున్నాయి.కలరా,అతిసార వంటి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. తమ జీవన స్థితిగతుల గూర్చి ఆలోచించండని గిరిజనులు ఎన్నోసార్లు ప్రభు త్వానికి నివేదికలిచ్చారు. జన జీవితాన్ని అస్తవ్య స్తం చేసే జాతరలు అవసరమా? అంటే, ప్రభు త్వానికి వాటివల్ల వచ్చే ఆదాయం అవసరం! రెండేళ్ళకోసారి వారం పది రోజులు జరిగే సమ్మ క్క సారక్క జాతర అక్కడి ప్రజా జీవితాన్ని నాశ నం చేస్తోంది. ఆదివాసీలను, వారి విశ్వాసాల్ని ప్రభుత్వ ఎండోమెంట్‌శాఖ,చాకచాక్యంగా దోపిడీ చేస్తున్నట్టుగా ఉంది.మరీ ముఖ్యంగా వీరనారీ మణుల్ని’’దేవతలుగా’’ప్రచారం చేయడంతో ప్రజ ల్ని అంధవిశ్వాసాల్లో ముంచి ఎదగకుండా చేస్తోంది. అది చాలా ప్రమాదం! దేశ వ్యాప్తంగా వైదిక మతం ఆదివాసీ,గిరిజన, జానపద సంస్కృ తులను ధ్వంసం చేస్తోందనడానికి ఇదొక మంచి ఉదాహరణ! దీనికి మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయినప్రభుత్వాధినేతలే కారణం-సమ్మక్క సారక్కలు వీరవనితలన్నది జనం మరిచి పోయా రు.వారిని కోరికలు తీర్చే దేవతలయినట్టు భావి స్తున్నారు. వారి సంస్కృతికి శ్రద్ధాంజలి ఘటిస్తు న్నట్టు కాకుండా,ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. ఇలాంటిదే మరొక విషయం చూద్దాం! తమిళనాడులోని ఇరళర్లే- తెలుగులో ఇరగాలోళ్లుఅయ్యింది. వీరిది అడవిని ఆధారం చేసుకునిబతికే ఒకప్రాచీన తెగ.నెల్లూరు ప్రాంతం లో వీరినే యానాదులు అంటున్నారు. వేటాడటం, పాములు పట్టడం వీరివృత్తి.నెల్లూరు ఒక గ్రామం గా ఉన్నప్పుడు అక్కడ అధిక సంఖ్యాకులైన ఇరగా లోళ్లు నెల్లూరు చెరువుకి ఉత్తరం గట్టున నెల కొల్పుకున్న గ్రామ దేవత-ఇరగాలమ్మ. కాలక్ర మంలో వైదిక మతస్తుల ప్రభావంతో ఆ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మగా రూపాంతరం చెందింది. గోపురం ధ్వజస్తంభం వెలసి, ధూప దీపనైవేద్యాలతో హిందూ దేవాలయమై పో యింది. నెల్లూరు జిల్లా సుళ్ళూరిపేటలోని చెంగా లమ్మ గుడికథ కూడా దాదాపు ఇలాంటిదే. యానాదులను కొన్ని ప్రాంతాల్లో చెంచోర్లు అని కూడా పిలిచేవారు. వారు నెలకొల్పుకున్న దేవత పేరు చెంచోరు లేదా చెంచోరమ్మ అని వ్యవహరిం చేవారు.ఆపేరే కాలక్రమంలో చెంగాళమ్మ అయ్యింది.ప్రస్తుతం అమ్మపేరు ‘తెన్‌ కాళి అమ్మ’గా మారిపోయింది. అక్కడ ఇరుకళల పర మేశ్వరి అమ్మకు అమరిన హంగులన్నీ-ఇక్కడ తెన్‌కాళి అమ్మకు కూడా అమిరాయి. శ్రీశైలం గుడి చెంచు లదే అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. అయినా,ఇప్పుడు ఈగుడులేవీ చెంచులవి, యానాదులవి కావు.వైదిక మత ప్రభావంతో అవన్నీ ఆదివాసీ చేయి దాటిపోయాయి. అంతే కాదు ఒకప్పటి వాటి మూల సంస్కృతిని పోగొట్టు కున్నాయి.ఇకపోతే,గోదావరి జిల్లాల్లోని నూకా లమ్మ ‘నూకాంబిక’ అయ్యింది. తెలంగాణ గ్రామా ల్లోని ఎల్లమ్మ ఎల్లమాంబా దేవి అయ్యింది. ఆది వాసీల జానపదుల గుళ్లన్నీ హిందూ దేవాల యాలుగా మన కళ్ల ముందే రూపాంతరం చెందు తూ వచ్చాయి. పోలేరమ్మ జాతర, పంబాలోళ్ల వేడుకలన్నీ మార్పునకు గురయ్యాయి. ఒక వైపు హైందవం,మరో వైపు క్రైస్తవం గిరిజనులు, దళి తుల మూలల్ని ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు బౌద్ధ, జైన ఆలయాల్ని ధ్వంసం చేసి హిందూ దేవాలయాలుగా మార్చు కున్నట్టు-తర్వాత కాలంలో గిరిజన, ఆదివాసీ, దళిత,శూద్రజాతులు నెలకొల్పుకున్న దేవుళ్లను, గుళ్లను హైందవం తీవ్రంగా దెబ్బతీసింది. ఆల యాల గోడలపై స్త్రీ పురుషుల నగశిల్పాల్ని చెక్కు కుని ఆలయాల్ని కామ కలాపాలకు వాడుకున్నది వైదికమతం. దేవదాసీ వ్యవస్థను ప్రోత్సహించి, బలవంతపు వ్యభిచారం నడిపించిన ఘనత సనాతన వాదులదే కదా? ఇప్పుడు ఆ మూలాల్ని, ఆ మూల సంస్కృతిని నిలుపుకోవడం మన వల్ల కాకపోవచ్చు. కానీ, సనాతనవాదుల అడ్డగోలు వాదనలు ఎదుర్కోవాలంటే, కనీసం మన మూలాల గూర్చి కొంతలో కొంతైనా తెలుసు కోవాలి కదా? గతం తెలుసుకున్న వారే భవిష్య త్తుకు దారులు వేయగలరు.
-వ్యాసకర్త : కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త -మెల్బోర్న్‌ నుంచి-(డా.దేవరాజు మహారాజు)

పేదల చెంతకు శ్రీమంతుల చదువు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి యంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠ శాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నే షనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు.ఐబీ సిలబస్‌ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయి లో పోటీపడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024-25 విద్యా సంవత్స రంలో ఐబీ బోధ నపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపు ణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్ల తోపాటు మండల,జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది,ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌బోర్డు సిబ్బం దికి‘ఐబీ’పై అవగా హన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు.దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీగ్లోబల్‌ టీచర్‌ నెట్‌ వర్క్‌లో భాగమ వుతారు. 2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమ వుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిల బస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి,2037కి 12వ తరగతిలో అమ లు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫి కెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.
2019 నుంచే గ్లోబల్‌ సిటిజన్స్‌ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దు తోంది.జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్ర మాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాట లు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించింది.
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్‌ టెక్టస్‌ బుక్స్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్‌ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్‌ కంటెంట్‌, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్‌ పంపిణీ చేసింది.
హై స్కూల్‌ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలు, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పా­టు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను
అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.
ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు
ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయ కత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతో పాటు ప్రాక్టికల్స్‌, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్‌) కు ప్రాధాన్యతనిస్తారు.
సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లో నూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్‌ డిసిప్టీనరీ కాన్సెప్ట్‌ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది.ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యా ర్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతు న్నారు. ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు.
కొత్తగా మారేదేంటి ? ప్రయోజనమెంత?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియం విద్య, అనలిటిక్స్‌ కోసం బైజూస్‌ కంటెంట్‌ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్‌ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాపరిశోధనా మండలి ఎస్‌.సి. ఈ.ఆర్‌.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతు న్నాయి.రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్‌ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేం దుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడు కోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ ను ప్రవేశపెడ తారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరి స్తారు. ఇలా ఐబీ సిలబస్‌ లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.ఐబీ సిలబస్‌ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతే కాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్స హిస్తారు. సిలబస్‌ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఐబీ సిలబస్‌లో భాగంగా క్లాస్‌ రూమ్‌ బోధనతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్‌), ఎక్స్ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌, ప్రాక్టికల్స్‌ కు సమ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టి కోణంలో అధ్యయనం కోసం ఇంటర్‌ డిసిప్లేనరీ కాన్సెప్ట్‌ అమలు చేస్తారు.ఐబీ సిలబస్‌లో విద్యా భ్యాసం చేసిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపం చంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అలాగే అంతర్జాతీయ స్ధాయిలో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ’’మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యా ర్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వంలో ‘జగనన్న విదేశీ విద్య’పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు.పేద విద్యార్థుల చదువులకు ప్రభు త్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతుండటం చాలా ఆనం దంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు రూ.8 లక్షల వార్షికా దాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నా’’మని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాల యం వేదికగా సీఎం జగన్‌ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41. 60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్‌ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సా హకం, మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడిర చారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.
అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా..
తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శాచురేషన్‌ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్‌ రేటింగ్‌, టైమ్స్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లోటాప్‌ 50 కాలేజీ ల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్‌ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చితోడుగా నిలబడే కార్యక్రమం ఇదని తెలిపారు.
మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక
ఈ ఏడాది దాదాపుగా 51మందికి కొత్తగా అడ్మి షన్లు వచ్చాయని,రూ.9.50కోట్లు వారికి ఇస్తున్నామని, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు నేడు ఇస్తున్నామని తెలిపారు. ‘‘దాదా పుగా రూ. 107కోట్లు 408 మంది విద్యార్థు లకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నాం.ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్‌స్ఫైర్‌ అయి టాప్‌ యూనివ ర్సిటీల్లో సీట్లు తెచ్చుకునేలా, మీరు గొప్పగా ఎదిగే దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రీబ్యూషన్‌ ఇచ్చి రాష్ట్రాన్ని గుర్తు పెట్టు కోవాలి. మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక’’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
మీ అందరికీ ఆల్‌ దీ బెస్ట్‌
‘‘వార్షిక ఆదాయం రూ.8లక్షలు ఉన్న కుటుం బాలకు ఈ పథకం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా ఆల్‌ దీ బెస్ట్‌ విసెస్‌ తెలియ జేస్తూ మీరందరూ అత్యధికం గా బాగుపడాలని కోరుకుం టున్నాను. రాబో యే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వారి కుటుంబాలను ఈ స్థాయి నుంచి మరో స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితి రావాలని, దేవుడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను’’ అని సీం అన్నారు -జిఎన్‌వి సతీష్‌

జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం

జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేటితో ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపాయ్‌ సోరెన్‌ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సిపి. రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ నేత అలంగీర్‌ ఆలం, ఆర్‌జెడి ఎమ్మెల్యే సత్యానంద్‌ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్‌ ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడి బుధవారం రాత్రి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటలకుపైగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. చివరకు గురువారం అర్థరాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆమోదించారు.హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా పనిచేసిన చంపాయ్‌ సోరెన్‌ శుక్రవారం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే పదిరోజుల అనంతరం నిర్వహించే బలపరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి వుంది. చంపాయ్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ముక్తి మోర్చా-కాంగ్రెస్‌-రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు చంపాయ్‌తో పాటు నేడు ప్రమాణం చేశారు. 43మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపారని, ఈసంఖ్య 46-48కి చేరుకోవచ్చని చంపాయ్‌ పేర్కొన్నారు.తమ కూటమి బలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలపరీక్ష కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సంకీర్ణ కూటమి సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించేందుకు సిద్ధమైంది.
సోరెన్‌కు ఐదురోజుల కస్టడీ
ఈడి అరెస్టును సవాలు చేస్తూ హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.’’మేం జోక్యం చేసుకోలేం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా,రాంచీలోని పిఎంఎల్‌ఎ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.
చంపాయ్‌ సోరెన్‌ ఎవరు?
చంపాయ్‌ సోరెన్‌ సరైకెలా-ఖర్సవాన్‌ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్‌ సోరెన్‌ పెద్ద కుమారుడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 90వ దశకం చివర్లో శిబు సోరెన్‌ తో కలిసి జార?ండ్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సోరెన్‌ అనతికాలంలోనే ‘జార్ఖండ్‌ టైగర్‌ ‘గా ఖ్యాతి గడిరచారు. సరైకెలా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా స్వతంత్ర ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.అర్జున్‌ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా కూడా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2010 సెప్టెంబర్‌ 11 నుంచి 2013 జనవరి 18 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపతి పాలన తరువాత,హేమంత్‌ సోరెన్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, చంపాయ్‌ సోరెన్‌ ఆహార మరియు పౌర సరఫరాలు మరియు రవాణా మంత్రి అయ్యారు.
జార్ఖండ్‌్‌ టైగర్‌గా పేరు..
చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంపై 1974లో జంషెడ్‌పూర్లోని రామకృష్ణ మిషన్‌ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. బీహార్‌ నుంచి ప్రత్యేక జార?ండ్‌ రాష్ట్రం కోసం డిమాండ్‌ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార?ండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పిలుస్తూ వస్తున్నారు.
తొలిసారిగా 2005లో అసెంబ్లీకి..
చంపై తొలిసారిగా 2005లో జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్‌ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, లేబర్‌ హౌసింగ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూలై 2013 నుంచి డిసెంబర్‌ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భూకుంభకోణంలో ఇరుక్కోవడంతో..
హేమంత్‌ సోరెన్‌ భూ కుంభకోణంలో ఇరు క్కున్నారు. ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. పలుసార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఇంతకు ముందు ఒకసారి విచారించింది. మళ్లీ బుధవారం సైతం ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టు చేసే అవకాశం ఉండడంతో జార్ఖండ్‌ సీఎం పదవికి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్‌్‌ ముక్తి మోర్చా కాంగ్రెస్‌ కూటమి శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. తొలుత కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారని చెప్పినా.. చివరకు చంపై సోరెన్‌కు అవకాశం దక్కింది.హేమంత్‌ సోరెన్‌కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో చంపై సోరెన్‌ ఒకరు. శిబు సోరెన్‌తో పాటు హేమంత్‌ సోరెన్‌తో చాలాకాలంగా పని చేస్తూ వస్తున్నారు.జార్ఖండ్‌లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వ అస్థితరత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్‌ ముక్తీ మోర్చాసీనియర్‌ నేత చంపాయ్‌ సోరెన్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ సీపీ రాధా కృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు. హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రి సీఎం పదవి నుంచి వైదొలగడం, అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన తర్వాత సోరెన్‌ నిన్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నేతగా ఎంపికయ్యారు.81 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమికే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమ బలం 47గా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే లందరూ తనతో పాటు రాజ్‌భవన్‌కు వచ్చా రని, అయితే లోపలికి అనుమ తించలే దన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్య మంత్రిగా చంపాయ్‌ సోరెన్‌ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుత ప్రభు త్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇదీ కేసు..
జార్ఖండ్‌లో భూకుంభకోణం ఆరోపణలపై హేమంత్‌ సోరెన్‌పై ఈడీ దర్యాప్తు జరుగు తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దర్యాప్తు సంస్థతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోరెన్‌ ఈడీ అధికారులపై కేసు పెట్టారు. -(బిర్సనాయక్‌ ముండా)

1 2 3 4 5 11