చింతిస్తున్న చింతపండు రైతులు

ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు నో చెబుతున్నారు.
ప్రతి వంట గదిలో తప్పక ఉండా ల్సిన ఐటెమ్స్‌లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏవంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండుతప్పని సరి.. దేనికైనా రుచిరావాలి అంటే చింతపండు పులుపు తగలా ల్సిందే?కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?చింతపడు సాగు పూర్తిగాతగ్గిపోవడమే దానికి కారణమా..? మన్యంలో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు.దీంతో నిరాశతప్పడం లేదు. చింత పువ్వు దశలోనే ఈదురుగాలులు,వర్షాలు అధికం గా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడిరది. చాలాచోట్ల ఇదే పరిస్థితి..దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా,చింతదిగుబడి కూడా అం తంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్ప లేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సాలూరు,కొమరాడ,పాచిపెంట ప్రాం తాల్లో5 వేల క్వింటాళ్లు,సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. సాధారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారానే వస్తుంది. అయితే గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొను గోలుకు మొగ్గు చూపలేదు. 2022లో కిలో చింత పండు మద్దతు ధర 36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను 32. 50కు తగ్గించారు. ఆ ధరకు కూడా గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో 40 నుంచి 5కు పంటను అమ్ముకున్నారు.అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప,గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింత పండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈసారి కూడా బయట మార్కెట్‌ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయిం చేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పూర్వ వైభవాన్ని కోల్పోతున్న గిరి బజార్లు
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వ ర్యంలో నెల కొల్పిన గిరిబజార్లు(సూపర్‌ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి.ఏజెన్సీలోని గిరిజనులు సేక రించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకుద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం,తేనె ఇతరత్రా వాటిని విక్ర యిండంతో పాటు సాధారణ సూపర్‌ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మ కాలు సాగిస్తుంటారు.కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయిం ట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కఉత్పత్తి కూడా లేదు.ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అను సంధానంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రా చలం,ఏటూరునాగారం,ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు కార్య కలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్‌ సోప్‌ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్‌ మార్కెట్లలో కానరావడం లేదు. ప్రధానంగా జిసిసి అటవీ ఉత్ప త్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు,నీమూసబ్బులు,టర్మరిక్‌ సబ్బులు,తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పుడు సూపర్‌ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి. షికాకాయి,కుంకుడుకాయిపౌడర్‌, షాంపులు,చీపర్లు,పెసర్లు,కందులు,చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్‌ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయి స్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేం దుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలు వురు వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరా భారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్‌ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్న ప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరపైనే ‘చింత’
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) రaలక్‌ ఇచ్చింది. జిల్లాలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధాన మైన చింతపండుకు రివర్స్‌ గిట్టుబాటు ధర కల్పిం చింది. ఈ ఏడాది సీజన్‌లో కిలో చింతపండును 32.40రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.గత ఏడాదితో పోల్చుకుంటే నాలు గు రూపాయలు తగ్గించింది. ధర తగ్గింపుతో ఆగకుండా కొనుగోలుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబం ధనల ప్రకారమైతే ఏగిరిజనుడూ జిసిసికి చింత పండు విక్రయించే అవకాశం లేదు. చింతపండు పొడిగా వుండాలని,తేమ శాతం అసలు వుండ రాదని,చింత బొట్టలను చేతులతో కొట్టాలని, కర్రలు వినియోగించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే చింతపండు విక్రయించే గిరిజన రైతులకు నగదు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ప్రతి గిరిజన రైతూ బ్యాంకు ఖాతా,ఆధార్‌ కార్డు జరాక్స్‌ కాపీలు అందజేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలపై జిసిసి సిబ్బంది ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. సాలూరు మండలం లోని పట్టు చెన్నూరు, పగులచెన్నూరు, నేరళ్లవల సలో జిసిసి సిబ్బంది స్థానిక గిరిజన ప్రజాప్రతి నిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో జిసిసి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైంది చింతపండే. దీన్ని జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సేకరించి విక్రయించుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో వారి కుటుంబ అవసరా లను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జిసిసి చింతపండుకు కనీస మద్దతు ధర తగ్గించడం గిరిజ నులకు ఆశనిపాతంలా పరిణమించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జిసిసి వారిని దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండేళ్ల ధర కన్నా తక్కువ
గడిచిన రెండేళ్లలో జిసిసి నిర్ణయించిన చింతపండు ధర కన్నా ఈ ఏడాది తక్కువగా నిర్ణ యించింది. సాధారణంగా ఏటేటా అటవీ ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2021-22లో కిలో చింతపండు రూ.32గా మొదట నిర్ణయించింది. అయితే ప్రయి వేటు వ్యాపారుల కన్నా ఈధర తక్కువ కావడంతో అప్పటి జిసిసి ఎమ్డీ మరో మూడు రూపాయలు పెంచి రూ.35గా నిర్ణయిం చారు. 2020-21సం వత్సరానికి కిలో చింత పండు ధర రూ.36గా జిసిసి ప్రకటించింది. ఈ ఏడాదిలో జిల్లాలో 780మెట్రిక్‌ టన్నుల చింత పండును కొనుగోలు చేసింది. గత ఏడాది కొను గోలు చేసిన చింతపండు పూర్తిగా అమ్మకం కాకపోవడం వల్లే ఈ ఏడాది చింతపండు ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలు స్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన చింత పండు లాభదాయకమైన ధరకు అమ్ముకో వాల్సిన బాధ్యత జిసిసి సంస్థ ఉన్నతాధికారులదే. పాత చింతపండు కోల్డ్‌ స్టోరేజ్‌లో మూలుగుతున్న దనే సాకు చూపి ఈ ఏడాది ధర తగ్గించడంపై గిరిజ నులు ఆందోళన చెందుతున్నారు.అసలే కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గిరిజన రైతులకు చింతపండు ధర పెంపు ద్వారా మేలు చేయాల్సిన ప్రభుత్వంరివర్స్‌ గేర్‌ లో వెళ్ళడం వివాదాస్పద మవుతోంది.
ప్రయివేటు వ్యాపారులదే హవా
ఈ ఏడాదిలో చింతపండు కొనుగో లుకు సంబంధించి ప్రయివేటు వ్యాపారుల హవా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర తగ్గించడం,కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం,ఆన్‌ లైన్‌ చెల్లింపులు చేస్తా మన డం వంటి నిర్ణయాలు గిరిజనులను పూర్తిగా జిసిసికి దూరం చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తు న్నాయి. చింతపండు కొనుగోలు సీజన్‌కు ముందే ప్రయివేటు వ్యాపారులు గిరిజన రైతులకు అడ్వాన్స్‌ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. జిసిసి మెరుగైన ధర కల్పించినా కొంతమంది గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకే చింతపండు విక్రయిస్తారు. తాజా నిబంధనల ప్రకారమైతే గిరిజనులంతా ప్రయివేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చింతపండు కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను తగ్గించిందనే అనుమానాలు వ్యక్త మవుతు న్నాయి. దీనివల్ల జిల్లాలోని గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, జియ్య మ్మవలస, పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట,మక్కువ, మెం టాడ,ఎస్‌.కోట మండ లాలకు చెందిన వేలాది మంది గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాం తంలోని గిరిజనులకు చింత పండు సేకరణతో వచ్చిన ఆదాయమే ఏడాది పొడవునా వారి కుటుం బ పోషణకు వినియోగిస్తారు.
కాఫీ ధర పెంపు, చింతపండు ధర తగ్గింపు
అరకు ప్రాంతంలో పండిరచే కాఫీ, స్ట్రా బెర్రీ పండ్లుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాఫీ,స్ట్రా బెర్రీ పండ్లుకు గిరాకీ ఉండడంతో ధరలను పెం చింది. చింతపండుకు డిమాండ్‌ ఉన్నప్పటికీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విక్రయిం చడంలో జిసిసి అధికారులు విఫలమయ్యారు. వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చింతపండు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం రోజంటే ఎందుకంత భయం..
గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్ప త్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు..అక్కడ పండిర చే పంటలకు ఆర్గానిక్‌ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌ వస్తుంది. అయి తే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందు కంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపో తుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటు ఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగు తాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్‌ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ 40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్‌ ప్యూరిఫైయర్‌ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్‌కి వచ్చేసరికి డబల్‌ అయి పోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండిరచిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్‌ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు.అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

విద్య హక్కు వీడని చిక్కు

-ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ` ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చు. లాటరీ విధానంలో సీట్లను కేటాయి స్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. సెకండ్‌ రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు ఏప్రిల్‌ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితు లకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా?విద్యా హక్కు చట్టం ప్రకారం6నుండి14సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశా లలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటా యించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్‌ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపి టేషన్‌ ఫీజులు ఫీజులు వసూలు చేయడంపిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవు తుంది. డ్రాపౌట్‌ స్టూడెంట్‌లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి,3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమి కోన్నత పాఠశాల ఉండాలి.ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి,ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు..ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళి కను తయారు చేయాలి,ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వ హించ కూడదు,విద్యావిధానం ఆధునిక ధోర ణులులో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందిం చేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవా లని ఈ చట్టం పేర్కొంటోంది. ప్రభుత్వ టీచర్‌ ప్రైవేట్‌ ట్యూషన్లు ప్రైవేట్‌ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్‌ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిం చాల్సిన అటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొద లైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలల హక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవు తుందని ఉపాధ్యాయుడు భావి స్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజే సలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనా భ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక (కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసిం చాలి,విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండ న లేని పాఠశాల వాతా వరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతిగది ఉండాలి.పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యా యుడు నిరంతరం మూల్యాం కన ద్వారా అంచ నా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీససౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడంవల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ ను తగ్గిం చాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ తగ్గించడంతో పాఠశా లల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితం గా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది.విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథ మిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. విద్యా హక్కు చట్టం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తుంది కానీ వ్యంగ్యంగా దీన్ని సాధ్యం చేయగల ప్రైవేట్‌ విద్యా ప్రదాతలను పరిమితం చేస్తుంది. చట్టం ప్రారంభానికి ముందు స్థాపించబడిన పాఠశాలలు మూడు సంవత్సరాలలోపు ఆర్‌టీఐ షెడ్యూల్‌లో పేర్కొ న్న నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని లేదా లేకుంటే మూసి వేయ బడతాయని సెక్షన్‌ 19 పేర్కొంది. చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన పాఠశా లలు ఆర్టీఈ షెడ్యూల్‌లోని నిబంధనలను మాత్రమే పాటించాల్సి ఉండగా,గుర్తింపు లేని పాఠశాలలు అదనంగా రాష్ట్ర నిబంధనలను కూడా పాటించాలి.చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు ప్రణాళిక లేని కాలనీల్లోనే ఉండి ప్రాథమిక స్థాయి వరకు బోధిస్తున్నారు. గుర్తిం పు పొందిన పాఠశాలలను కొనుగోలు చేయలేని మరియు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ పాఠశాలలు చౌకైన ప్రత్యామ్నాయం. ఢల్లీిలో గుర్తింపు పొందని పాఠశాలల సాంప్రదాయిక అంచనా ప్రకారం ఒక్కొక్కటి 200 మంది పిల్లలతో దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రస్తుత ఢల్లీి రాష్ట్ర నిబంధనల ప్రకారం, పాఠశాలలకు 800 చదరపు గజాల స్థలం ఉం డాలి మరియు ఆరవ వేతన సంఘం తర్వాత ప్రవేశ స్థాయిలో రూ.23,000 ప్రభుత్వ జీతంతో సమానంగా ఉపాధ్యాయుల జీతం చెల్లించాలి.అదనంగా,విద్యా హక్కు చట్టం ప్రతి పాఠశాలకు ఆట స్థలం ఉండాలని నిర్దేశి స్తుంది. ఈ స్థలం మరియు ఉపాధ్యాయుల జీతం అవసరాలు గుర్తించబడని పాఠశాలలకు చేరుకోవడం కష్టం.ఈ ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐదు గుర్తింపు పొందిన పాఠశా లలు,తొమ్మిది గుర్తింపు లేని పాఠశా లలను షహదారాలో సందర్శించారు. గుర్తింపు పొందిన ఐదు పాఠశాలల్లో ఏదీ ప్రస్తుత భూమి ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు నిర్ణీత ఉపాధ్యాయుల వేతనాన్ని చెల్లించలేక పోయింది. ఒక గుర్తింపు పొందిన పాఠశాల నిర్వాహకుడు తన పాఠశాల 200 చదరపు గజాల స్థల ప్రమాణానికి అనుగుణంగా ఉన్నం దున గుర్తింపు పొందాడు, అయితే ఆ సమయం లో రూ.80,000లంచం చెల్లించాల్సి వచ్చిం ది. అతను ఒక పిల్లవాడికి నెలకు రూ. 250 రుసుము వసూలు చేస్తున్నప్పుడు, అది రూ. 500గా లెక్కించబడుతుంది, తద్వారా అతను ఉపాధ్యాయుని జీతం వాస్తవానికి చెల్లించే దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.గుర్తింపు లేని పాఠశాలలు ఏవీ భూ ప్రమాణాలకు అను గుణంగా లేవు. కనీసం ప్రణాళిక లేని కాలనీల్లోనైనా భూ నిబంధనలను సడలించా ల్సిన అవసరం ఉంది. పాఠశాలలో తగినంత సంఖ్యలో వెంటిలేషన్‌ మరియు కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే గుర్తింపు ఇవ్వడం ఒక ఎంపిక. అనేక గుర్తింపు లేని పాఠశాలల్లో తరగతికి 15-20 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పిల్లలకి అవసరమైన స్థలం ప్రకారం గది పరిమాణాన్ని లెక్కించడం మరింత సమంజసంగా ఉంటుంది. అలాగే, ఉపాధ్యా యుల జీతాలు పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉండాలని ప్రభుత్వం కోరుకోనప్పటికీ, అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠ శాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయితీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠ శాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్య వేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించ కుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశా లలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు.
వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం
ఆర్టికల్‌ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికం గా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్‌ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వే షన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012 లో ప్రతిమా ఎడ్యుకేషనల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండి యా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలు వరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 15(5) లను ఆమోది స్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ లలో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వే షన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్‌ 13(1) ప్రకారం ఏర్ప డిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్ల మెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి100% అక్షరా స్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాం గం నిర్దేశించి నట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికల కు నాణ్యమైన విద్యను అందించవలసిన అవ సరం ఉంది.-జిఎన్‌వి సతీష్‌

ప్రాంతీయ అసమానతలు` పరిణామాలు

ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించు కొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అభి వృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిఉన్నాయి.భారతదేశ అభి వృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాం తీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభి వృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
కారణాలు..
సహజసిద్ధ అంశాలు
చారిత్రక అంశాలు
సహజ వనరులు
ప్రభుత్వ విధానం
కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
పాలనా వ్యవస్థ
హరిత విప్లవం
అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6)పట్టణీకరణ,7) విద్యు చ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర,గుజరాత్‌ల్లో 34. 60%,పశ్చిమబెంగాల్‌24.65%అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత,63.95%పారిశ్రామి కోత్ప త్తి కలిగిఉండటం తీవ్రమైన అసమానత లను తెలియజేస్తుంది. సహజ వనరుల లభ్యత,నీటి పారుదల సౌకర్యాలు పంజాబ్‌,హర్యానామొదలైనరాష్ట్రాల్లో నీటి పారుదల సౌకర్యాలు,సహజ వనరులు ఎక్కువ గా అందు బాటులో ఉండటం వలన వ్యవసా యం అభివృద్ధి చెందింది.ఆంధ్రప్రదేశ్‌,ఉత్తరప్ర దేశ్‌ల్లో కొన్ని ప్రాం తాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీ కరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటు న్నది.జాతీయస్థాయిపట్టణ జనాభా31.2% కాగాతమిళనాడు(48.4%),మహరాష్ట్ర(45. 2%),గుజరాత్‌(42.6%),కర్ణాటక (38. 6%), పంజాబ్‌ (37.5%)మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.బీహార్‌ (11.3%), అసోం(14.1%)ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్‌ (22.3%) వంటి రాష్ట్రాల్లో పట్టణజనాభా తక్కువ గా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాం తీయ అసమానతలను తెలియ జేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం121.2కిలో వాట్లుకాగా ఢల్లీి 508.8,పంజాబ్‌257.3,తమిళనాడు 208.5కిలో వాట్లు ఉండగా బీహార్‌లో20.5,ఉత్తరప్రదేశ్‌ 83.4,మధ్యపదేశ్‌73.4కిలోవాట్లు మాత్రమేఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011మార్చి నాటికి రూ. 33,174వుండగాఢల్లీి రూ.2,85,400, మహ రాష్ట్ర రూ.82,380 కలిగి ఉండగా బీహార్‌ రూ. 9,667,అసోంరూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు -ప్రణాళికలు
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టు బడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించ డమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం,నీటివసతి,నైపుణ్యంగల శ్రామి కుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందు బాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ,రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవస రాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాం తాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీ యాభివృద్ధి కొరకు 9 వఅధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీ ణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా మొద లైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగిం చడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళిక లోని కార్యక్రమాలని కొనసాగించినారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించ డానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇం దులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు,ఉప ప్రణాళి కలను అమలుచేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు. ఏడో పంచ వర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు.1)వ్యవసాయ ఉత్పా దకత,మానవ వనరుల సామర్థ్యం పెంపు2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయ డం.ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Iఅసఱషa్‌ఱఙవ ూశ్రీaఅఅఱఅస్త్ర) మారడం మూలాన ప్రాం తీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గిన ప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమా లను అమలు చేశారు. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమా నతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయిం చారు.పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుక బడిన ప్రాంతాల కొరకు ఏర్పాటు చేశారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొం దించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాం తాల్లో,వ్యవసాయం,దాని అనుబంధ పరిశ్ర మలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్ర మాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలు – అసమానతలు!
ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకుఉప యోగించుకొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందు పర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014ఫిబ్రవరి 20వ తేదీ రాజ్య సభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ఇస్తామన్నారు.కాగామధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపించివున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభు త్వం రూ.24,350 కోట్లతో ప్రతిపాదన లు కేంద్రా నికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ.50 కోట్లుచొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3)మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి.ఈచట్ట బద్దహక్కులు హుష్‌ కాకి అయ్యాయి.ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది. నాణేనికి ఇది ఒకవైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించు కొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయా లి.కాని ఆదిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుం డా ప్రత్యేకిం చి ఒకసెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హ యాంలోఉత్తరాంధ్ర సుజల స్రవంతిరూపుద్దు కున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో0.85లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రు లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించ లేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేం దుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసం ధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధా రపై నెరెడి బ్యారేజీ నిర్మాణంగుర్తు వుందా? వ్యవ సాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా?ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా?పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి23.99 టియం సిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీప మైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది.ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములు న్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు,నీళ్లు అని ప్రజలు తుదకు తాగు నీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం లో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు తుంగభద్ర నుండి39.9టియంసిలు నీరు కేటాయిం చినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు.2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగ నూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచా వత్‌ ట్రిబ్యునల్‌గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసులబ్యారేజీ నుండి(21ం10) టియం సిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరు తుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దతగల నీళ్లువర్షపు నీరునిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజ మాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలం గాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖరాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్య మంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్యగల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోం ది. కాగా గత ప్రభుత్వం ఏంచేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలం లో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాం తాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడ కుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు. -వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు- (వి.శంకరయ్య)

ఎస్టీలను అధికారికంగా గుర్తించిన ఆర్టికల్‌ ఏదీ?

దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుం ది.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా…షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం.సమాజం విసిరే సవాళ్లను అధిగమించడానికిగాను ప్రభుత్వం అవలంబించే విధానాన్ని సామాజిక విధానం అంటారు. ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి. అందువల్ల ప్రభుత్వాలు అణగారిన వర్గాల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నాయి. చారిత్రకంగా పరిశీలిస్తే యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక, ఫ్రెంచ్‌ విప్లవం,అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు బలమైన శక్తిగా అవతరించాయి. ప్రభుత్వాలు ఆర్థిక లక్ష్యాలతోపాటు సామాజిక న్యాయం,సమానత్వం, సాధికారత వంటి సామాజిక లక్ష్యాలను రూపొందించుకొని అమలుచేస్తున్నాయి. 1834లో ఇంగ్లండ్‌లో రూపొందించిన పూర్‌ లా సంక్షేమ యంత్రాంగానికి ఆధారంగా నిలిచింది. ఐరోపాలో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా భారత్‌తో సహా అన్ని దేశాలకు విస్తరించింది. 1950వ దశాబ్దంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాల్లో ఏర్పడిన తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి కావడం విశేషం. దేశంలో సంక్షేమ యంత్రాంగానికి మూలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుషెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం భారతీయ సామాజిక చరిత్రలో సామాజిక దోపిడీకి గురైన షెడ్యూల్డ్‌ కులాలను స్వాతంత్య్రానంతరం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం జనాభాను కలిగి ఉన్న షెడ్యూల్డ్‌ కులాలను 1108 రకాల పేర్లతో పిలుస్తున్నారు. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాన్ని మూడు మార్గాల ద్వారా కొనసాగిస్తున్నది.

  1. రాజ్యాంగ రక్షణలు
  2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  3. ఆర్థిక సహాయం అందించడం
    రాజ్యాంగ రక్షణలు
    ఆర్టికల్‌-14: చట్టం ముందు అందరూ సమానులే. సమన్యాయ పాలన అంటే షెడ్యూల్డ్‌ కులాలపరంగా సమాజం, ప్రభు త్వం సామాజిక సమానత్వం, భాగస్వామ్యం కల్పించాలి. ఆర్టికల్‌-15(4): ప్రభుత్వ అవకాశాలపరంగా ముఖ్యంగా సామాజిక, విద్య, ఆర్థికాంశాల పరంగా షెడ్యూల్డ్‌ కులాలకు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు. ఆర్టికల్‌-16 (4): ఉద్యోగాలు, ఇతర సర్వీసులలో షెడ్యూల్డ్‌ కులాలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
    ఆర్టికల్‌-17: అంటరానితనం నిషేధం
    ఆర్టికల్‌-23: వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, జోగిని, దేవదాసీ మనుషుల అక్రమ రవాణా నిషేధం
    ఆర్టికల్‌-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
    ఆర్టికల్‌-46: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీనవర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆర్టికల్‌-330: లోక్‌సభలో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-332: శాసనసభల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-338: ఎస్సీ,ఎస్టీల రాజ్యాంగ రక్షణల అమలుతీరును, వారి సంక్షేమాన్ని సమీక్షించేందుకుగాను ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు్ఆర్టికల్‌-341: 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు
    షెడ్యూల్డ్‌ కులాలకు విద్య,ఉపాధిపరంగా రిజర్వేషన్లను కల్పించటం,వారి విద్యా భివృద్ధికి ఉపకారవేతనాలు,హాస్టల్‌ వసతులు,పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆరో పంచవర్ష ప్రణాళికలో స్పెషల్‌ కంటెంట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు. చిన్న,సన్నకారు దళిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆదాయ మార్గాలను పెంచుతారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకొనే ఉద్దేశంతో 1989లో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించిన పరిపాలన,యంత్రాంగం సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది.
    స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమా లు 1952 నుంచి 1985 వరకు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగాయి.
    1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    1998లో దాని పేరును సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.
    గిరిజన సంక్షేమం
    దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికప రమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 8.6 శాతం.
    -దేశంలో అధికారికంగా 744 తెగలను గుర్తించారు. వీటిలో భిల్లులు,గోండ్‌, సంతాల్‌ తెగలకు చెందినవారు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఎస్టీల సంక్షేమానికి మూడు మార్గాలను అవలం బిస్తున్నారు.
  4. రాజ్యాంగ రక్షణలు
  5. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  6. ఆర్థిక సహాయం అందించడం
    । ఎస్సీల సంక్షేమానికి సంబంధించిరాజ్యాంగ రక్షణలోని 17,341 ఆర్టికల్స్‌ తప్ప మిగ తావి ఎస్టీలకూ రక్షణగాఉంటాయి.
    । ఆర్టికల్‌-19(5): గిరిజనుల ఆస్తుల రక్షణ
    । ఆర్టికల్‌-164: జార్ఖండ్‌, ఒడిశా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
    । ఆర్టికల్‌-244: ప్రత్యేక ప్రాంతాల పరి పాలన కోసం5,6 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు.
    । ఆరో షెడ్యూల్‌ ప్రకారం అసోం, మేఘాలయ,మిజోరం,త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరో షెడ్యూల్‌లోని రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
    । ఐదో షెడ్యూల్‌ పరిపాలనను గవర్నర్‌ నియంత్రణలో ఉంచుతుంది.
    । ఆర్టికల్‌-342: షెడ్యూల్డ్‌ తెగలను అధికారికంగా గుర్తించారు.
    । 1999లో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    । ఐదో ప్రణాళికలో గిరిజన ఉప ప్రణాళికను రూపొందించారు.
    । గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల పరిపాలన,అభివృద్ధికి నాలుగు మార్గాలను ఎంచుకున్నారు.
    । నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో గిరిజన జనాభా 50శాతం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 194.
    । 10 వేలు లేదా అంతకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టులనుఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 259.
    । 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో గిరిజన జనాభా 50శాతంపైబడి ఉన్న ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య-82
    । గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగలను గుర్తించి వాటిని అభివృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రాచీన గిరిజన సముదాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 75.
    । గిరిజనులకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉన్నందువల్ల వాటిస్థానంలో స్థానిక ప్రభు త్వాలను ఏర్పాటుచేసే ఉద్దే శంతో 1996లో పెసా (ూaఅషష్ట్రa వa్‌ష్ట్రఱ జుఞ్‌వఅంఱశీఅ ూషష్ట్రవసబశ్రీవస Aష్‌)ను రూపొందించారు.
    । గిరిజనుల అటవీ ఉత్పత్తులకు సరైన ధర, మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 1987లో గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటుచేశారు.
    । ఎస్టీలకు ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి ద్వారా వారి ఆదాయమార్గాలను పెంచే లక్ష్యంతో 2001లో జాతీయ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    వెనుకబడిన తరగతుల సంక్షేమం
    । భారతీయ సామాజిక నిర్మాణంలో అగ్ర వర్ణాలకు, అస్పృశ్యులకు మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు.
    । ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా ప్రాచీన కాలం నుంచి సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు.
    । భారత రాజ్యాంగ రూపకల్పన దశలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీరికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధనలను రూపొందించారు.
    । రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన చర్యలను
    । సమీక్షించేందుకుగాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.
    । దీని ప్రకారం జాతీయస్థాయిలో రెండు కమిషన్లను ఏర్పాటుచేశారు.
    । 1.1953లో కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌
    । 2.1978లో బీపీ మండల్‌ కమిషన్‌
    । కాలేల్కర్‌ కమిషన్‌: ఇది 1953 జనవరిలో ఏర్పాటయ్యింది.
    । కమిషన్‌ ప్రధాన విధి ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాలకు చెందిన ప్రజల విద్యాపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రమాణాలను నిర్ణయించడం.
    । వీటి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాను గుర్తించడం
    । ఈ కమిషన్‌ సామాజిక అంతస్తు, కుల క్రమశ్రేణి ఆధారంగా 2700 కులాలతో కూడిన జాబితాను తయారుచేసి 1955లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
    । ఈ కమిషన్‌ మహిళలను కూడా బీసీలుగా గుర్తించింది.
    । ఈ కమిషన్‌ తన నివేదికను 1956లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆమోదం పొందలేదు. -జిఎన్‌వి సతీష్‌

రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్‌ కులాల (ఎస్‌.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్‌.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరు స్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటు తనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీ యంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మా తల దృష్టిలో ఉన్న ‘‘పురోగమన’’ అంశాన్ని గమ నంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్‌ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బం దిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కార ణంవల్లే మన దేశంలో అమెరికాలోఉన్న సాను కూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్‌ పద్ధతి అనుసరించారు.ఇది మొదట్లో అవకాశాలు కల్పిం చడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండా లనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు.కొత్త రిజర్వేషన్ల విధా నంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచు కుంటారా? కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రై వేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపో తుంది.అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభు త్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి. అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండ వచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్‌.సి.,ఎస్‌.టి.ల విష యంలో జరిగినట్టు అంతర్గతతేడాలకు దారి తీస్తుం ది.దీనివల్ల కులచైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిల బడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుం డా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుం దనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయ టపడి కులప్రాతిపదిక మీదఉన్న సామాజిక నైతిక తను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు.ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాం టప్పుడు సామాజిక న్యాయం,దళితులు అన్న మాట లను ఒకసారి ఒకఅర్థంలో మరోసారి మరో అర్థం లో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు.ఈపదాన్ని దళి తులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బల హీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటి ష్ఠంచేస్తాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వరాజ్యాంగ సవ రణచట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీ యాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొల బద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయ బద్ధతను తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తనఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు ను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వా నించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయా లలో ఇవ్వాలని సిపిఐ(ఎం)చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శా తం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమ ర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెం టులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతి పదికగా ఇ.డబ్య్లు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణిం చాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావి తం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజ మైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలావిస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. రెండ వది,రిజర్వేషన్ల పరిధిలోకిరాని తరగతులలో అత్య ధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టు బడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవు తున్నారు.పాలకవర్గాలు,వారి మీడియా ఈ అపోహ లను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్‌ వ్యతిరేక భావనలురోజురోజుకీ తీవ్రమవుతు న్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్య తరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వే షన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేష న్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్‌ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనక బడిన తరగతులలో రిజర్వేషన్‌ విధానానికి సాను కూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజ ర్వేషన్‌ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వే షన్లకే ప్రమాదం వస్తుంది. మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధా న్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్‌ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సంద ర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించా లంటే ప్రస్తుత రిజర్వేషన్‌ పరిధిలోకి రాని తరగతు లకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యత ను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది. విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్య తను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవ సరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. కొంత మంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపది కగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలో సామాజిక విద్యా విషయక వెనకబాటు తనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తా వన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజ ర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రా యపడిరది.ఇ.డబ్ల్యు.ఎస్‌తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు గదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్‌ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు. రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థికఅంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్‌ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి,అవసరాలను బట్టి అమల య్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది.విద్యా ఉద్యో గాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్‌ యాక్షన్‌ అమలవుతున్నది. ఐర్లండ్‌ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
మన దేశంలో రిజర్వేషన్‌ విధానం పరి ణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు న్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్‌ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు.బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో(ట్రావన్‌కోర్‌,బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు.1921లో మద్రాస్‌ ప్రెసి డెన్సీలో జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది.ఈరిజర్వేషన్లు ప్రధానంగా జమీం దార్లు,భూస్వాములు బలంగాఉన్న శూద్రకులాలకు ఉద్దేశించబడ్డాయి.అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూ ల్డ్‌ కులాలకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్విరామ ఆందోళన,కృషి ఫలితంగా మొదటి సారి గా1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చా యి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూ ల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్‌ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.అప్పుడు కూడా వెనక బడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలి వేయబడిరది.వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వే షన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సిజాబితాలో చేర్చబడి రిజర్వే షన్లు అనుభవిస్తున్నాయి. ఇంకాఅనేక కులాలు అటు వంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్రవర్ణాల కన్నా దిగువస్థాయిగా పరిగణించబడే శూద్ర కులా లన్నీ ఒకే మోస్తరుగా వెనకబడిలేవు.వాటిల్లో కొన్ని గ్రామీ ణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృ ద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్‌ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడిరది.
సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటు తనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామా జిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరాని తనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం.దళితులు ఎదుర్కొం టున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్రకులాలకు, ముఖ్యం గా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడు తుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితిచూస్తున్నాం.అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు,హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్‌ అంబేద్కర్‌ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు. దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధార పడిన వర్టికల్‌ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశా లను పరిగణనలోకి తీసుకున్న సమాంతర రిజర్వే షన్లు కూడా అమలవుతున్నాయి.మహిళలు, విక లాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు-స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లుకూడా అమలవుతున్నాయి. రిజర్వే షన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించ వచ్చు. అందుకే ఈ సమస్యపట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
ఇ.డబ్యూ.ఎస్‌.రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముం దుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. ‘ఆర్థిక కొలబద్ద’సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే,10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ 50శాతం పరి మితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రా యాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టి పారేసింది.ఈవ్యాఖ్యానం1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివా దాస్పదం జేసింది.సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు50శాతం సీలింగును తొలగించాలని, అప్పు డే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగ తులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27శాతంగా నిర్ణయించడానికి 50శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయ డానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931సెన్సస్‌ వివరాలను వినియోగించుకుంటున్నారు.ఈ సమా చార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతు న్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈవిషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ధర్మాసనం10శాతం ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ ఇప్పటివరకు రిజర్వేషన్‌ అనుభవించని తరగతులకు (నాన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్‌సి,ఎస్‌టి,బిసిలోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న50శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడంద్వారా లోపాన్ని సరి దిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్‌సి,ఎస్‌టి,బిసి పేదలు గతంలోఉన్న సౌకర్యాన్నికోల్పోతారు. అంతే కాక ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు10శాతం ఉండాలని ఏకొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వే షన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతి పాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతి లో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతిం టుంది.ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్క రించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్‌ దారువాలా రిజర్వేషన్ల విధా నాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎ స్‌ఎస్‌ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అం శాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణి ప్రబలు తుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి,పాలనా వ్యవస్థ పెరిగింది. దీని మూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభి వృద్ధి కావడానికి తోడ్పడిరది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దా లలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్‌ సౌకర్యం కూడా నిరుపయోగం అవు తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీ కరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగా లలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు,కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు,వాటిని విస్తరించి పటిష్టం గా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్‌ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్‌ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదు పాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,(ప్రజాశక్తి సౌజన్యంతో..)

విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట శాపంగామారుతున్నాయి. వరస ప్రమా దాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు… ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగి పోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజ మాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపోతోంది. యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగి నప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమా దంలో నలుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ ఏడాదిలోనే పది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు పదిమంది వరకు మృత్యువాత పడగా అనేక మంది గాయాలకు గురై దివ్యాంగులగా మారారు.-– గునపర్తి సైమన్‌
విశాఖ జిల్లాలో ఫార్మాకంపెనీల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.కార్మికుల భద్ర త,రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పి దాలు,డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీ లు నిర్వ హించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫ ల్యం…వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటు న్నాయి. అనకా పల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం,మరొ కరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే…మృతుల కుటుం బాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లిం చడం,గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులు పుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు,పాలకులకు పరిపాటిగా మారిపోయింది.ఈఏడాదిలోనే ఈఫార్మా సిటీ లో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలి మిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా…సొం తంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసు కోవచ్చు. పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాలపట్ల ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారో,పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవా యువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగు తుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయో ఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగు రు,సాయినార్‌ ఫార్మాలో గత ఏడాది మరో ఘటన లో ముగ్గురు బలయ్యారు. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో49మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు.ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు,వ్యర్థజలాలపట్ల ఆందోళన చెందు తున్నారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు సైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేప ట్టాల్సి ఉంది.ఎప్పటికప్పుడు నివేదికలను రూపొం దించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే… ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయ నాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగా హన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలే శాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనా లను శుద్ధిచేయడం,పర్యావరణ పరిరక్షణకు, వాతా వరణంలో విషవాయువుల మోతాదును తగ్గించ డానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారు లను నిర్మించడం…లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదల వుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రం లోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతు ల్యమవుతున్నాయని,అర్ధరాత్రి సమయంలో విష వాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణ లొస్తున్నాయి. ఇప్పటికైనా…ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం…పరిసరప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిం చేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్‌ డెవలపర్‌ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షిం చాలి. కార్మికుల ప్రాణాలకు,ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
భద్రతా లోపాలు..కార్మికులే సమిధలు
పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మి కుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా,అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపో తోంది.యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుం టున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌19నజరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది.గతంలో పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా,హెటిరో ఫార్మా పరిశ్ర మలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు.నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్నజరిగిన ప్రమాదంలో ఓ కార్మి కుడు మృతి చెందారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎం ఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవిం చింది.భారీగాశబ్ధం రావడంతో కార్మికు లు భయంతో పరుగుతు తీశారు.రియాక్టర్‌ పేలడం తోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతు న్నారు.రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరి శ్రమలో సిబ్బంది చెబుతున్నారు.రియాక్టర్‌ పేలుడు తో విడుదలైన వాయువులు..కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్నచోట కార్మికు లకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మి కులకు రెస్పిరేటరీ మాస్కు లు హెటిరో యాజ మాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తు న్నాయి. పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016,2020లో,2022ఫిబ్రవరి23న ఒక్కొ క్కరు చొప్పున ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్ర మలో అన్ని ప్రమా దాలు జరుగుతున్నా…కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమా దాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై16 న అప్పటి కలెక్టర్‌ వినరు చంద్‌ నాలుగు బృందా లను నియమించారు.ఆ మేరకు కార్మికులకు కార్మి కుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలుతీరుపై నాలుగు నివేది కను ఇచ్చింది. అయితే పరిశ్ర మల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయ త్నాలు చేయక పోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమ గ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం,వారి కుటుంబంలో ఒకరిఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనిపట్టు బడుతున్నాయి. క్షతగ్రా తులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడు తున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం తోనే ప్రమాదాల్లో కార్మి కులు మృత్యువాతపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు…ఆ తరువాత పట్టనట్టు వ్యవ హరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు,భద్రతా ప్రమాణాలు పాటించక పోయినా పట్టించు కోవ డం లేదని మండిపడుతు న్నారు. ఉన్నతాధికారు లు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టా లని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధి కారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడిచేసి ఊరుకుంటారా?అనేది వేచి చూడా ల్సిందే.
వెంటాడుతున్న ప్రమాదాలు
ా రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ అనే విషవాయువు లీకయి 12మంది మృతిచెందారు. వీరంతా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
ా గతేడాది నక్కపల్లిలోని హెటిరో మందుల పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్‌ తయారీ యూనిట్‌ వద్ద రియాక్టర్‌ పేలి ఒకరు చనిపోగా,నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ా అచ్యుతాపురం సెజ్‌లోని కొన్ని ఫెర్రో పరి శ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఫెర్రో కంపెనీలో కొలిమి పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ా రాంబిల్లి పరిథిలోని ఏషియన్‌ రంగుల పరిశ్ర మలో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ా గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో వరుసగా రెండుసార్లు వాయువులు లీకై వందలాది మందిమంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నిత్యం భయం!
అచ్యుతాపురం సెజ్‌లోని సుమారు 9,2 97ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు మూడువేల ఎకరాల వరకు కేటాయించారు. పరవాడ ఫార్మాతో పోల్చుకుంటే సెజ్‌లో భూమిధర తక్కువగా కేటా యించడంతో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఏర్పాటవు తున్నాయి. పరవాడా ఫార్మాకంపెనీలతో పోల్చితే సెజ్‌ల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఫార్మాసిటీ చుట్టూ తక్కువ జనాభా గ్రామాలు ఉండగా సెజ్‌ని అనుకొని రాష్ట్రంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉంది.ఈ ఒక్క గ్రామంలోనే 20వేల జనాభా నివాసం ఉంటు న్నారు. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న అగ్నప్ర మాదాలు,రసాయనవ్యర్ధాల నిర్వహణలో లోపాలు, గ్యాస్‌ లీకేజీలు సమీప గ్రామస్థులను భయపెడు తున్నాయి.అచ్యుతాపురం సెజ్‌లో పెద్దపెద్ద కొలిమి లతో కూడిన ఫెర్రో పరిశ్రమలున్నాయి. వాటికి సొంతంగా ఒక్కఅగ్నిమాపక వాహనం కూడా లేకపోవడం గమనార్హం. సెజ్‌లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఏపీఐఐసీ వాహనమే దిక్కువు తోంది. సెజ్‌లోని యూనిఫార్ట్స్‌ కంపెనీలో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఒక్క ఏడాదిలో పది ప్రమాదాలు
2022 జనవరి నుంచి ఇప్పటి వరకూ పరవాడ ఫార్మాసిటీలో 10ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా డిసెంబర్‌ 19న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఫిబ్రవరి 7న అక్టోనస్‌ ఫార్మాలో రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగింది.ఈనెల 17న ఎమ్మె న్నార్‌ ఫార్మాలో,ఏప్రిల్‌ 23న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో,మే 7న ఎస్‌ఈజెడ్‌ అలివిర ఫార్మాసంస్థలో,మే 25న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో,జూన్‌ 13న గ్లాండ్‌ ఫార్మాలో,జూలై 28నసాయిశ్రేయాష్‌ పార్మా కం పెనీలో,ఆగస్టు 22న ఆప్టిమస్‌ ఫార్మాసంస్థలో అగ్ని ప్రమాదాలతోపాటు గ్యాస్‌ లీకేజీలు జరిగా యి. సెప్టెంబరు 10న కోరి ఆర్గానిక్స్‌ రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగిగోడలు కూలిపోయాయి. ఈ ప్రమా దాల్లో ఆస్తినష్టం తప్ప ఎవరికీ ఏమీ కాక పోవడం తో కంపెనీ యాజమాన్యాలు ఊపరి పీల్చు కున్నా యి. ఇప్పటికైనా కర్మాగారాల,అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి ఫార్మాసిటీలో భద్రతా ప్రమా ణాలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసు కోవాలని కార్మిక నాయకులు,ఉద్యోగులు కోరు తున్నారు.

భారతీయ అటవీ చట్టం`1927 సవరణలు ఎవరి కోసం?

అడవిలో సంస్కరణల అలజడి..చట్టంలో కీలక మార్పులు మొదలువుతున్నాయి. భారతీయ అటవీ చట్టంలోని నిబంధనలు పాతబడిపోయిన కారణంగా ఈ చట్టాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వశాఖ 2019 ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను విడుదల చేసింది.దీనిపై గిరిజనుల హక్కుల బృందాలు,పర్యావరణ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో అటవీ అధికా రులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టి నట్ల అవుతుందని,ఆయుధాల వినియో గానికి సైతం అనుమతులున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
వలస కాలంలోనే ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. భారతీయ అటవీ చట్టం – 1927 అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణా, రవాణా, రాబడి ఈ మూడు అంశాలే శాసన పీఠికలో పేర్కొన్నారు.
గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఫారెస్టు పాలసీ డివిజన్‌ వారు ఈచట్టానికి పలు సవర ణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడు దల చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌జీఓల తోనూ,అడవితో సంబంధ మున్న వారందరినీ పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపాలని కేంద్రం కోరింది.
సవరించదలచిన ‘పీఠిక’ ఏం చెపుతోంది?
ఉపోద్ఘాతంలో పైమూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడిరచారు.అవి 1.అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్ధంగా నిర్వహించటం వాటికి పరిపుష్టి కలిగించటం, 2.పర్యావరణ సమతుల్యం (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబం ధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టు బడివుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం,3.ప్రజలు, ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజా సంక్షేమం,4.జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం,5.అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం. పర్యా వరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం ఉంటుంది. అందుకే దేశంలో అడవులను వాటి తోని జీవావరణాన్ని కాపాడే చట్టాలున్నాయి. వన్యమృఘ సంరక్షణా చట్టం1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం-1980,విపత్తుల నిర్వహణాచట్టం లాంటివి.ఈ చట్టాలను అమలుచేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు.అలా చేయకుండా వలసకాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు.ఈ చట్టాలు పుట్టకముందే అడవులలో ప్రజలు నివసిం చేవారు. అడవులను వర్గీకరించే టప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని రక్షిత (ప్రభుత్వ) అడవులుగా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమ ణదారులుగా వచ్చిన బ్రిటిష్‌ వారు ఆదివా సుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకు తున్నవారిని ఆక్రమణదారు లంటున్నారు. చూడండి సెక్షన్‌.2 (41) నిర్వచనాలు. అలాగే సెక్షన్‌ 2 (3), సెక్షన్‌2 (4)లలో నిర్వచించిన ‘’కమ్యూనిటీ’’ ‘’విలేజ్‌ ఫారెస్టు’’ ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం కులం, భాషా సంస్కృతితో సంబంధం లేనిదట! విలేజ్‌ ఫారెస్టు ప్రభుత్వానిదట! గత చట్టాలతో లేని ఒక కొత్త వర్గీకరణ ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే ‘’ఉత్పత్తి అడవులు’’ సెక్షన్‌ 2 (10),సెక్షన్‌ 34సి (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను పెంచాలంటే (నాణ్యత ఉత్పాదకత) ఉత్పత్తిదారులైన కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి. సెక్షన్‌ 80(ఎ) ప్రయివేటు అడవు లను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి? ఆదివాసుల హక్కులను హరించి, మరో చారిత్రక అన్యా యానికి తెరతీస్తోంది.అటవీ అభివృద్ధి పేరుతో నడుస్తున్న రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్ధిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి, జాయింట్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (జేఎఫ్‌ఆర్‌సీ) (వీఎస్‌ఎస్‌) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీ తికి నిలువెత్తు నిదర్శనాలు సెక్షన్‌ 28 1 (ఎ), (బి), (సి), (ఇ), (ఎఫ్‌) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమానగుర్తింపు ఇస్తారట. పీసా చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణచట్టం పీసాచట్టాన్ని కాని, అటవీ హక్కుల చట్టం 2006ని గాని గుర్తించి నట్టులేదు. అటవీ హక్కుల చట్టం ఎఫ్‌ఆర్‌ఏ గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్ర అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్‌ చేసిన చట్టం ఇది. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కు లకు సంబంధించింది.వలస చట్టాలు, స్వాతం త్య్రం తర్వాత చట్టాలు`1967 ఏ.పీ.అటవీ చట్టం సెటిల్‌మెంట్‌ అధికారులను నియమిం చాలని, వారి హక్కులను గుర్తించాలని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒకఅటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలూ జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఏపీలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులివ్వలేదు. ఈ స్థితిలో 2006లో యూపీఏ -1 వామపక్షాల మద్దతుతో గడిచిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడుహక్కు గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించటం,ఉమ్మడి హక్కులుగా రోడ్డు, మేపుభూమి,స్మశాన భూములు కేటాయిం చాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుంచి నెట్టేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్‌10 ఇప్పుడు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్‌ఆర్‌ఏ చట్టంలో లబ్దిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్‌ఆర్‌ఏ కమిటీ ద్వారా జరగాలి. కానీ ఈచట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తోంది? డిపార్టుమెంట్‌ పెత్తనాన్ని కాదా? 2013 ఎల్‌ఏఆర్‌ఆర్‌ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్‌ 11(1), (2), (3)Ê(4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్‌ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబం ధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర గైడ్‌లైన్స్‌ చాల నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
ఈ సవరణకు అర్ధం ఏమిటి?
పోడుసాగు ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేండ్లలో అంతం కావాలట. సెక్షన్‌ 10 (3) (ఎ), సెక్షన్‌ 20(1)(సి) ప్రకారం పోడుసాగు ఐదేండ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వనిరా కరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
అటవీ నేరాలు – శిక్షలు
1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు-పోలీసు అధికారికే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్‌ 52(1) ద్వారా సంక్ర మిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా వారెంట్‌ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయొచ్చు.సెక్షన్‌ 64(1)(ఎ)(బి)(సి)(2) అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజర్‌కే నేరాలు పరిశోధించే అధికారం,సెక్షన్‌ 190 సి.ఆర్‌.పి.సి ప్రొసీజర్‌ 1973 వినియోగించే అధికారం సెక్షన్‌ 64(బి),(సి) ఇస్తున్నాయి. అటవీ నేరాలను మైనర్‌-మేజర్‌ నేరాలుగా విభజించటం సెక్షన్‌64(4)ద్వారా లభిస్తుంది. అటవీభూమికి సంబంధించినవి మేజర్‌ నేరా లుగా పరిగణిస్తారు. అటవీ హక్కులచట్టం- 2006 సెక్షన్‌ 3,సబ్‌ సెక్షన్‌(1)క్లాజు (సి) ప్రకారం ఆదివాసులు, ఇతర అటవీ నివాసులు తేలికపాటి అటవీ ఉత్పత్తులు సేకరించు కోవటానికి,కలిగి ఉండటానికి,రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి హక్కు కలిగివున్నారు. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్‌ 2(3),(ఎ) ప్రకారం అడవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి ఉండటం, రవాణా, అమ్మ టం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి దాకా గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవు తాయి. విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ,కొండరెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణచట్టం సెక్షన్‌ 78(1) ప్రకారం 6నెలల జైలుశిక్ష, రూ.10వేల జుల్మానా విధి స్తారు. ఇది1927 చట్టంలో ఒకనెల జైలు, రూ.500 జరిమానాగా ఉంది. ఈ చట్టం సెక్షన్‌ 78(1)(ఎ) ప్రకారం,సెక్షన్‌ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడుకోసం చెట్లు నరకడం,అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టటం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేండ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండు కలిపి కూడా విధించ వచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక ఏడాది కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
ప్రయివేటు అడవులకు అనుమతి
ఈ సవరణ చట్టం సెక్షన్‌ 80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములనిచ్చి మేలైన అటవీ ముడిసరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించ వచ్చునట. ఇందుకు జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్‌ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతీయ అడవుల చట్టం- 2019కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్టు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకంచేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పునఃపరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించాల్సిన తక్షణ కర్తవ్యం మనమందు ఉన్నది.
అటవీ చట్టం నిర్వీర్యం
దేశీయ పాలకులు వలస పాలకుల అటవీ విధానాన్నే అమలుచేస్తున్నారు.1952లో ప్రకటించిన అటవీ విధానమే అందుకు నిదర్శనం. ఈ విధానం ద్వారా రిజర్వ్‌, రక్షిత, గ్రామ అడవులుగా అటవీ ప్రాంతాన్ని విభజించారు. దాని ఫలితంగా అడవిపై గిరిజనుల హక్కు పరిమితమైంది.1973లో ‘టైగర్‌ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పూనుకున్నది. 1980లో కేంద్రం తెచ్చిన మరో గిరిజన వ్యతిరేక చట్టం ద్వారా గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించే చర్యలు చేపట్టింది.1996లో సుప్రీం కోర్టు తీర్పు లో యాజమాన్యం,గుర్తింపు, వర్గీక రణతో సం బంధం లేకుండా ప్రభుత్వ రికార్డు ల్లో నమోదైన అన్ని ప్రాంతాలకు చట్టాన్ని వర్తింపజేయడం వల్ల గిరిజనుల హక్కు లకు తీవ్ర అన్యాయం జరిగింది. అడవిపై గిరిజనుల హక్కులను హరించే చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి.1830లో బీహార్‌, బెంగాల్‌లలో కోల్‌ తిరుగుబాటు, 1855-56 లో సంతాల్‌ తిరుగుబాటు,1802-03లో రంప తిరుగుబాటు, 1922-24లో అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరు గుబాటు, కుమ్రం భీం నాయకత్వంలో 1940 లో గోండుల తిరుగుబాటు, 1967 నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం, 1968-70లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ముఖ్యమైన గిరిజన పోరాటాలు. గిరిజన పోరాట ఫలి తంగా కొన్ని చట్టాలు తప్పలేదు. 1917లో చేసిన భూ బదలాయింపు క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు భూములు కలిగి ఉండవచ్చు. ఏజెన్సీ ప్రాంతం లో చాలాకాలంగా నివసిస్తున్నవారిని గిరిజను లుగా గుర్తించడం ద్వారా గిరిజనేతరుల భూములకు రక్షణ ఏర్పడిరది. అలాగే గిరిజ నుల భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టం అవకాశం కల్పించినట్లయింది. గిరిజన ప్రాంతాల్లో భూములు ఉం డటాన్ని నిషేధించింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా 1970 లో 1/70 చట్టం వచ్చింది.ఈచట్టం ప్రకారం గిరిజన ప్రాంతా లలో భూములు అమ్మకూడదు, కొనకూడదు. కానీ ఈ చట్టంలో అనేక మార్పులు జరుగడం వల్ల గిరిజన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగు తున్నది. అటవీ చట్టాలను పాలకులు నీరుగా ర్చారు. కోర్టులు సైతం గిరిజన హక్కులపై పరస్పర విరుద్ధ తీర్పులిచ్చాయి. ఒకే న్యాయ మూర్తి గిరిజనులకు అనుకూలంగా,వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు న్నాయి. ఇలా చట్టంలోని లొసుగుల వల్ల గిరిజనులకు చెందాల్సిన వేల ఎకరాల భూములు గిరిజనేతరుల పాలయ్యాయి. అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా వారు పోరాటం ఆపలేదు. దీంతో తామే భూములు పంచు తా మని యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల బిల్లును విడుదల చేసి 2006 పార్ల మెంట్‌ ఆమోదంతో చట్టంగా మార్చింది. ఈ బిల్లులో 1980కి పూర్వం గిరిజనుల ఆక్రమ ణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పటంతో గిరిజ నులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి బిల్లులో మార్పులు చేసి 2005కు పూర్వం వారి అధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి 2006 డిసెంబర్‌లో బిల్లును చట్టసభల్లో ఆమోదిం పజేసి చట్టంగా ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చట్టంలో అనేక సవరణలు ప్రతిపా దించింది. వివిధ రకాల రక్షిత భూము లను చట్ట పరిధి నుంచి తప్పించింది. అటవీ ప్రైవేట్‌ భూములను చట్టపరిధి నుంచి తొలగిం చింది. 1980కి పూర్వం ఇతర సంస్థలు పొందిన భూ ముల ను మినహాయించాయి. ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాలను చట్ట పరిధి నుంచి తప్పించాలి. నివాస, ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం ప్రయత్నించి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గడం కొసమెరుపు.- (డా.మిడియం బాబురావు),వ్యాసకర్త : మాజీ పార్లమెంటు సభ్యులు

జన విస్పోటనం

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరడం మానవాళి చరిత్రలో ఓ మైలురాయి. భూగోళం మీద జీవం ఉనికి ప్రారంభ మైనప్పటి నుండి ఈ స్థాయిలో పురోగతి సాధించిన మరో జీవి లేదనడం అతిశయోక్తి కాదు. జంతువుల్లో జంతువుగా మనుగడ కోసం పోరాడిన స్థితి నుండి బుద్ధిజీవిగా మారేంత వరకు మానవజాతి సాగించిన ఈ ప్రయాణం అనితర సాధ్యం! ఈ క్రమంలోనే భూగోళమంతా మనుషులు విస్తరించారు. భిన్న వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను ఎదర్కుని నిలిచారు. అయితే, ఈ విస్తరణ భూగోళమంతా ఒకే మాదిరి జరగలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరిగింది. మనుగడ పోరాటంలో భాగంగా మనిషి సాగించిన వలసలూ జనాభా సంఖ్యను ప్రభావితం చేశాయి. నాగరికత పెరిగిన తరువాత, మానవ జీవితంలో లాభ, నష్టాల లెక్కలు అడుగుపెట్టిన తరువాత పేదరికం కూడా కుటుంబాలలో సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది. సంతానం ఎక్కువుంటే సంపాదించే వారి సంఖ్య పెరుగుతుందని అనుకోవడం ఇప్పటికీ వింటూనే ఉం టాం. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. పేద దేశాల్లో జనాభా గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉంటే, ధనిక దేశాల్లో దీనికి భిన్నమైన స్థితి! 800 కోట్ల జనాభాలో ఆసియా, ఆఫ్రికా దేశాలదే సింహభాగం. దానిలోనూ మన దేశానిదే పైచేయి. గడిచిన పన్నెండేళ్లలో భారత్‌లో 17.7 కోట్ల మంది పెరగగా, చైనాలో 7.3 కోట్ల మంది పెరిగా రని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదే ఊపులో మరో ఏడాదికి జనాభాలో చైనాను అధిగమించి మన దేశం మొదటి స్థానంలో నిలవనుంది. 2050 నాటికి 170 కోట్ల జనాభాతో భారత్‌ తొలి స్థానానికి,అదే సమయంలో చైనా జనాభా 130 కోట్లకు పరిమితం కానుందని అంచనా! ప్రపంచ జనాభా 2037 నాటికి 900 కోట్లకు, 2058 నాటికి వెయ్యి కోట్లకు, 2080 నాటికి 1400 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.సైమన్‌ గునపర్తి
జనాభా ఈ స్థాయికి చేరుకోవడం మానవాళికి వరమా..శాపమా? ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంభించాలన్నది చర్చనీ యాంశంగా మారింది. జనాభా విస్ఫోటనం ఒకప్పుడు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడూ ఆ పరిస్థితి ఉందా అంటే జవాబు చెప్పడం కష్టం. భూగోళాన్ని యూనిట్‌గా తీసుకుని చూస్తే జనాభా పెరగుతోందన్నది ఒక వాస్తవం! అయితే, అన్ని దేశాలకూ ఇది ఒకేమాదిరి వర్తించదు. పొరుగు దేశమైన చైనానే దీనికి ఉదాహరణ! ఒకప్పుడు వన్‌ ఆర్‌ నన్‌ నినాదం ఇచ్చిన ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఒకరు, లేదా ఇద్దరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలను ఎక్కువగా కనేవారికి అక్కడి ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన దేశంలో యువకుల సంఖ్య అత్యధికంగాఉంది. మరో యాభై ఏళ్ళ తరువాత ఇదే స్థితి ఉం టుందన్న గ్యారంటీ లేదు. మనదేశంలో ఒకప్పుడు సంతానోత్పత్తి రేటు 5కు పైగా ఉండగా, ఇప్పుడది 2.2కు తగ్గింది. చైనాలో ఇది 1.7గా ఉంది. భారత్‌, చైనాలలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విధమైన ధోరణి కనపడుతోంది. 1963లో సగటున 5.3గా సంతానోత్పత్తి రేటు ఉండగా 1990కి 3.3కు 2020కి 2.3కు తగ్గింది. ‘ప్రపంచం మన అవసరాలకు సరిపడినంతా ఉంది. కానీ, మన అత్యాశకు సరిపడినంత కాదు’ అన్న మహాత్మాగాంధీ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. పెట్టుబడిదారీ విధానం అని వార్యంగా పెంచి పోషించే అసమానతలు పేదరికంలోనే కాదు, జనాభా విస్తరణలోనూ ప్రస్ఫుటమౌతాయి. దేశాల వలస విధానాలు వారి ప్రయోజనాల కోసమే రూపొందుతాయి. పేద దేశాల్లో పెరుగుతున్న జనాభానే పెట్టుబడిదారులు ముడిసరుకుగా మార్చు కుంటారు. సమస్త భూగోళాన్ని, ప్రకృతిని దోచుకుంటూ లాభాల పంట పండిస్తారు. హద్దుల్లేని ఈ దోపిడి మానవాళితో పాటు సమస్త జీవరాశి ఉనికినే ప్రమాదంలో పడే స్తున్నా వారి వైఖరిలో మార్పేమీ ఉండదు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా వచ్చే సోషలిస్టు సమాజంలో దోపిడి ఉండదు. అంతరాలు మాయమవుతాయి కాబట్టి బతుకు భయం ఉండదు. పిల్లలను కనాలా..వద్దా అన్నది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. అటువంటి సమాజమే జనాభా సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని చూపుతుంది.
భారత్‌ వాటానే ఎక్కువ
800 కోట్లకు ప్రపంచ జనాభా చేరిన నేపథ్యంలో ఇందుకు భారత్‌ ప్రధానంగా దోహదపడిరదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. గత 12ఏళ్లలో భారత్‌లో 17.7కోట్ల మంది పెరగగా,చైనాలో 7.3 కోట్ల మందే పెరిగారు. వచ్చే ఏడాది కల్లా అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్‌ అధిగమించేస్తుందని భావిస్తున్నారు. 2037కల్లా కొత్తగా చేరే వంద కోట్ల జనాభాలో కూడా ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే ఎక్కువ శాతం వుండగలదని, మరోవైపు యూరప్‌ వాటా ప్రతికూలంగా వుండగలదని యుఎన్‌ జనాభా నిధి పేర్కొంది. భారత్‌సహా ఎనిమిది దేశాల్లోనే జనాభా వృద్ధి అధికం. ప్రధానంగా తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జనాభా వృద్ధి ఎక్కువగా కేంద్రీకృత మవుతోందని పేర్కొంది. 2050 వరకు అంచనా వేసిన పెరుగుదలలో మెజారిటీ భాగం ప్రధానంగా ఎనిమిది దేశాలకే పరిమిత మవుతుందని పేర్కొంది. ఆ దేశాల్లో భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి వర్ధమాన దేశాలు, నైజీరియా, ఇథియోపియా వంటి సబ్‌ సహారా ఆఫ్రికా దేశాలు వున్నాయి. ఈ పరిస్థితులు ఈ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయి. పెరుగు తున్న యువత చాలా పరిమితమైన వనరు లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
సవాళ్లు తప్పవు : ఐరాస
తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జననాల రేటు పెరుగుదల వల్ల మరింత ముప్పు తలెత్తే ప్రమాదం వుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిం చింది. పర్యావరణ పరంగా మరింత నష్టం జరుగుతుందని, గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగు తుందని, అడవుల నరికివేత ఎక్కువవుతుందని హెచ్చరించింది. ఇటు ప్రజలను, అటు భూగోళాన్ని కాపాడుకునే చర్యలు మరింత పెరగాలని పిలుపునిచ్చింది.
జనాభా పెరుగుదల ఇలా…
1927లో ఈ భూ మండలం మీద జనాభా కేవలం 200కోట్లుగా వుంది,1998నాటికి ఆ సంఖ్య 600కోట్లకు చేరుకుంది. ఇప్పటికీ, ఈ పెరుగుదల చాలా మందగమనంతో వుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. 1950 నుంచి వార్షిక జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువ స్థాయిలో వుంది. ప్రపంచ జనాభా మరో వంద కోట్లు దాటడానికి ప్రస్తుతం 12 సంవత్సరాలు పట్టింది. ఆతదు పరి మైలురాయిని చేరడానికి 15ఏళ్లు పట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆతర్వాత మరో మైలురాయికి చేరేసరికి దాదాపు రెండు న్నర దశాబ్దాలు పడుతుందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు పేర్కొంటున్నాయి. 2037 నాటికి 900 కోట్లకు, 2058నాటికి వెయ్యి కోట్లకు జనాభా చేరుతుందని అంచనా వేశారు.
సంపన్న దేశాల్లో మందగమనం
జననాల్లో మందగమనమనేది ప్రధానంగా సంపన్న దేశాల్లో కనిపిస్తోంది. ఆ దేశాల్లో పిల్లలను పెంచేందుకు అయ్యే వ్యయం అధికంగా వుండడం, పైగా వివాహాలు చేసుకునే రేటు తగ్గిపోవడం ఇందుకు కారణంగా వుంది. దక్షిణ కొరియా నుంచి ఫ్రాన్స్‌ వరకు గల దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వుంది. ఇక్కడ జనాభా క్షీణిస్తోంది. వృద్ధుల స్థానంలో తగినంతమంది పిల్లలు జన్మించడం లేదు. మరింతమంది పిల్లలను కనాలంటూ కుటుంబాలకు మెరుగైన చెల్లింపులు జరపడం వంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా పెద్దగా మార్పేమీ లేదని ఐక్య రాజ్యసమితి పేర్కొంటోంది. అధిక ఆదాయ, ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాల్లో రాబోయే మూడు దశాబ్దాల్లో 65 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, 65ఏళ్ల కన్నా పైబడిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
12 ఏళ్లలో వంద కోట్లు..
ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు(8పఱశ్రీశ్రీఱశీఅ) చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం12 సంవత్సరాలు. ప్రపంచ జనాభా 2011లో 700కోట్ల మైలు రాయికి చేరుకోగా,12 ఏళ్ల తరువాత 2022లో 800 కోట్ల మార్క్‌ ను అందుకుంది.ఈ జనాభా పెరుగుదలలో భారత్‌ గణనీయ పాత్ర పోషిం చింది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న దేశాల్లే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
చైనాను దాటేయనున్న భారత్‌
2011 నుంచి 2022 మధ్య 700కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగిన జనాభా (జూశీజూబశ్రీa్‌ఱశీఅ) లో అత్యధిక శాతం భారత్‌ లో జన్మించిన వారే.ఈ విషయంలో భారత్‌ చైనాను రెండో స్థానంలోకి నెట్టేసింది. కాగా,ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా,ఆతరు వాత స్థానంలో భారత్‌ ఉన్న విషయం తెలి సిందే. అయితే, త్వరలో ఈ రెండు అగ్ర స్థానా లు తారుమారవనున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశంగా 2023 లోనే భారత్‌ అవతరించ బోతోంది. చైనా కట్టుదిట్టంగా చేపట్టిన జనభా నియంత్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం అక్కడ జనాభా వృద్ధి రేటు నెగటివ్‌ గా నమోదవు తోంది.కాగా,భారత్‌ జనాభా 2050 నాటికి 170 కోట్లు చేరుతుందని, అదే సమయంలో చైనా జనాభా 130కోట్లకు తగ్గుతుందని అంచనా.
ఐరాస నివేదికలోని కీలకాంశాలు..
జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉన్నది. 2023లో జనాభా పరంగా చైనాను భారత్‌ అధిగ మిస్తుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది.2030 నాటికి ప్రపంచ జనాభా 850కోట్లకు,2050 నాటికి 970కోట్లకు,2080 నాటికి 1000 కోట్లకు చేరుతుంది.2100 వరకు అదే స్థాయిలో కొనసాగొచ్చు. ఈ అంచనాలో సగానికిపైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లోనే (భారత్‌, పాకిస్థాన్‌, కాంగో,ఈజిప్టు, ఇథియో పియా, నైజీరియా,ఫిలిప్పీన్స్‌,టాంజానియా) నమోదవుతుంది.700కోట్ల నుంచి 800కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉన్నది. మిగి లిన 40కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పనిచేసే జనాభా(25-64 ఏళ్ల వారు) క్రమంగా పెరుగుతున్నది. స్త్రీకి జీవితకాల సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గింది.ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయా ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది. 2050 నాటికి సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలకు చేరుతుంది. 2021లో తక్కువ అభివృద్ధి చెందిన దేశాల ఆయుర్ధాయంప్రపంచ సగటు కంటే 7ఏళ్లు తక్కువ.ప్రపంచజనాభాలో బంగ్లాదేశ్‌ వాటా 2.2శాతంగా ఉంది. జనాభా పరంగా 8వ అతిపెద్ద దేశం. ప్రస్తుతం 17 కోట్లుగా ఉన్న జనాభా 2050 నాటికి 20.4 కోట్లకు చేరు తుంది.65ఏళ్లు పైబడిన జనాభా ప్రస్తుతం 10శాతంగా ఉంది. 2050 నాటికి ఇది16 శాతానికి పెరుగుతుంది. అంటే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సంఖ్య ఐదేళ్ల పిల్లలకు రెట్టింపు.

పెరుగుతున్న అసమానతలు

ఆదాయం,సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే. మన దేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‌లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలనపై పోరుతో 1947 ఆగష్టు 15న దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్ణాలకు అధికార బదిలీ జరిగింది. భారత్‌లో ప్రజాతంత్ర విప్లవం జరుగలేదు కనుకనే భూ సంస్కరణలు అమలు కాలేదు. విదేశీ ఆస్తులు జాతీయం కాలేదు సరికదా, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పెట్టుబడులకు తోడు వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు దేశంలోకి చొర బడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దేశీయ స్వతంత్ర పెట్టుబడిని ఎదుగనివ్వదు. దేశీయ పెట్టుబడిని తనకు తొత్తుగా మార్చుకుంటుంది. అందువల్లనే ఏడున్నర దశాబ్దాలు గడిచినా భూస్వామ్య మత విలువలు, విదేశీ పెట్టుబడి దోపిడీ అంతం కాలేదు. అది మరింత పెరిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం అధికారం చెలాయిస్తోంది. 1947 ఆగష్టు 15న నెహ్రూ ప్రసంగంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాలలో అసమానతలను రూపుమాపడమే దేశం ముందున్న కర్తవ్యమని ఉద్దాటించారు. మన ప్రభుత్వాలు అమలు చేసిన ప్రణాళికబద్ధ అభివృద్ధి బడా బూర్జువా,బడా భూస్వామ్య వర్గాల పురోగతికి తోడ్పడిరది తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడలేదన్నది ఏడు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది,
1990వ దశకం నుంచి సామ్రాజ్య వాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు పేరుతో సాగుతున్న విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నది. పెట్టుబడిదారీ, సామ్రాజ్య వాద ధోరణులు జొరబడి మౌలికరంగాలపై గుత్తాధి వత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలన్ని భారత్‌వైపే చూస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌ను,సహజ వనరులను కొల్లగొట్టడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతకు కొన్ని వందల రెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశ సంపదను పరోక్షంగా దోచుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ బహుళజాతిసంస్థలు,ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వంతో పలుఒప్పందాలు చేసుకుంటు న్నాయి. ప్రపంచీకరణవల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకు తప్ప సామాన్యుడికి ఒరుగుతున్న లాభం ఏమీలేదు. శ్రమ దోపిడీ,పర్యావరణ విధ్వంసం మరింతగా పెరిగిపో తున్నది. దేశం అనుసరిస్తున్న విధానాలు ఈ శక్తు లను పెంచి పోషించేవిగా ఉండడం దురదృష్ట కరం. ఏడు దశాబ్దాలపైగా దేశీయ పాలనలో దేశం ఎంతో పురోగమించిందని దోపిడీ పాలకులు తొణక్కుండా ప్రకటిస్తున్నారు.కానీనానాటికీ దిగ జారుతున్న జీవన ప్రమాణాలతో శ్రామిక ప్రజానీ కం దిక్కుతోచకున్నారు. నిజానికి కరోనా సృష్టించిన సంక్షోభం కంటే మనపాలకులు,ముఖ్యంగా ఎనిమి దేళ్లుగా మోడీప్రభుత్వం అమలు చేస్తోన్న రాజకీ యార్థిక విధానాలతో ప్రజాజీవనం కకావికలౌ తున్నది. కరోనా ఆంక్షల నడుమ ప్రజా ప్రతిఘటన ఇబ్బందిని ఎదుర్కొనకుండానే ప్రజా వ్యతిరేక విధా నాలను నల్లేరు మీద నడకలా అమలు చేస్తూ పోతు న్న నేపథ్యమిది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలైన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాల సవరణ వంటి విధానాలన్నీ సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్లకే తోడ్బ్చడ్డాయి.
చిన్న మధ్య తరహ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిల్లర వర్తకం లోకి 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిం చడం, దేశానికి స్వావలంబనకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలతో పాటు ప్రజా ఉద్యమాలపై, మేధావు లపై, జర్నలిస్టులపై, కళాకారులపై, ప్రజాసంఘా లపై దేశద్రోహ చట్టాన్ని,ఉపా చట్టాన్ని విచ్చల విడిగా ప్రయోగిస్తున్నారు.దేశంలో భావ వ్యక్తీకర తణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా, ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగ ణించి,విద్యార్థులు,సామాజికకార్యకర్తలు, జర్నలి స్టులపై క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేస్తున్నది. పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం 2008 నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తు న్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమాన తలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ సానుకూల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టు బడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆవిధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో వ్యక్తమవుతోంది. భూములు, గనులు, అడవులు, అంతరి క్షంలోని టెలికాంస్పెక్టమ్‌లు అన్నిం టినీ కార్పొరేట్లకు అర్చించేస్తున్నారు.అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తు న్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఇవాళ దేశంలో పాలకవర్గ పార్టీలన్నీ తమ కండబలం, ధనబలంతో పాటు వివిధ ప్రజాకర్షక పథకాలపై ఆధారపడుతూ ప్రజ లను పరాధీనులుగా చేస్తున్నారు. దేశంలో ప్రపంచీ కరణ విధానాల దుష్ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపున రైతుల,కార్మికుల ఇతర(శ్రమ జీవులహక్కులు హరించబడు తున్నా యి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమా దంలో పడిపోయాయి. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడు లు దేశంలోని కార్మిక,రైతాంగ ఇతర శ్రామిక వర్గా లన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు చాలా వచ్చాయి.‘‘చంపుతున్న అస మానతలు’’అన్న పేరుతో ఇటీవలే ఆక్స్‌ ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో84శాతం కుటుంబాల ఆదాయం పడి పోయింది. అయితే అదే సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలో 100 మంది కుబేరుల సంపద అదే సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. దిగువ 50 శాతం కుటుంబాల సంపద జాతీయఆదాయంలో 6శాతం మాత్రమే కలిగి ఉన్నారు.భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అదే సమయంలో నిరు ద్యోగం,పేదరికంపెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత వృద్ధికి తోద్బడుతుంది. మోడీప్ర భుత్వం కార్మికులు,రైతాంగం,గిరిజనులు, యువ కులు,మహిళలు, దళితులు, మైనారిటీలు ఎదుర్కొం టున్న ఏఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చి నా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడం అసాధ్యమని గతఏడున్నర దశాబ్దాల పైగా సాగిన పాలన అనుభవం రుజువు చేస్తోంది. అందువల్ల భారత పాలక వర్గాల ప్రజా వ్యతిరేక భూస్వామ్య, స్వదేశీ,విదేశీ పెట్టుబడి అనుకూల విధానాలకు, హిందూత్వ ఫాసిస్టు పాల నకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటిత కావాలి. దోపిడీ,పీడన,సామ్రాజ్యవాద ఆధిపత్యాలకు వ్యతి రేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు. బడా బూర్జువా,భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాలను నమ్మడం ఇకపై సాధ్యం కాదు. భారతదేశ ప్రజలందరికి స్వాతం త్య్రం నూతన పొందికతో ఆవిర్భవించాలి. ప్రజా తంత్ర ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందిం చుకోవాలి. అది ప్రజల రాజకీయ, ఆర్థిక, సామా జిక విముక్తి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఆ కార్య క్రమం, కార్మిక, కర్షక, యువత సంఘటిత ప్రతి ఘటన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. ప్రజా స్వామ్య,లౌకిక,అభ్యుదయ శ్రేణులు ప్రజా ఉద్య మానికి దన్నుగా నిలువాలి. – -` ఎ.నర్సింహారెడ్డి,(వ్యాసకర్త:సీనియర్‌ పాత్రికేయులు, హైదరాబాద్‌)

ఆదివాసీల హీరో బిర్సా ముండా

తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన విప్లవ కారుడు..బిర్సా ముండా..స్వాతంత్య్ర సమరయోధుడు.. గిరిజిన నాయకుడు అయిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..కొందరు ప్రముఖుల పేర్లు తప్ప ఈయన పేరును ఈ తరం యువత పెద్దగా విని ఉండరు.. దేశం కోసం నెత్తురు చిందించిన మహానుభావులలో ఒకరు.ఈయన గురించి తెలుసుకోవడం మన భాధ్యత. ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..!
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సా ముండా. ఆదివా సీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశం ఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్‌, జంగ్‌, జమీన్‌ కోసం విల్లంబులు అందుకుని పోరుబాట పట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్ల దొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతా ల్లో సాగిన ‘మిలినేరియన్‌’ ఉద్యమానికి నాయ కత్వం వహించాడు. బిర్సాను దొంగ చాటుగా బంధించిన తెల్ల దొరలు 1900 జూన్‌ 9న రాంచీ జైలులో హత మార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాల వారు నిర్వాసితుల య్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరు గయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కల పాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపు చ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వా మిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధా వులు, విద్యావంతులపై ఉంది…..!
భూమికోసం, భుక్తి కోసం గిరిపు త్రుల స్వేచ్ఛా, స్వతంత్రాల కోసం సమరశం ఖాన్ని పూరించి, శతాబ్దాల బ్రిటిష్‌ ఆరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించిన సాయుధ విప్లవ కొదమ సింహం,మన్యం వీరుడు అల్లూరి కంటే ఐదు దశాబ్దాల ముందే ఆయుధం పట్టిన ధీరుడు బిర్సా ముండా. బ్రిటిష్‌ దొరల అండదండలతో గిరిజన ప్రాంతాలను భూస్వాములు, జాగీర్‌ దారులు ఆక్రమించి గిరిజనుల భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్‌ ప్రభుత్వ అరాచక పాలనలో ఆదివాసులకు అడవిపై హక్కు ఉండేది కాదు.19వ శతాబ్దం చివరలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఈ క్రూర మైన దోపిడీకి, ఆధిపత్యానికి, దురాగ తాలకు వ్యతిరేకంగా గిరిపుత్రులు మారణ యుద్ధం చేశారు. ఇటు వంటి ఎన్నో అణిచి వేతలకు గురికాబడిన చోటానాగ్‌పూర్‌ ప్రాంత ప్రజలకు బిర్సా ఆరా ధ్యుడు. నిత్యం పేదరికం, బాధలతో ఉండే చోటానాగ్‌పూర్‌ ప్రాంతం, ఒకవైపు ఆకలి, మరోవైపు భూస్వాములు,బ్రిటీష్‌ పాలకుల దోపిడీ,అణిచివేతలతో కారు చీకట్లతో కప్పబడి ఉండేది.ఈ ప్రాంతంలోని ఉలిహాటు అనే గ్రామంలో నవంబర్‌ 15,1875లో సుగు ణా ముండా, కార్మిహటు అనే దంపతులకు బిర్సా జన్మించాడు. తన బాల్యం మొత్తం తీవ్ర మైన పేదరికం, ఆకలితో గడిపాడు. తన తల్లి దండ్రుల అతి పేదరికం కారణంగా బిర్సా కొన్నిరోజులు తన మేనత్త దగ్గర, మరికొన్ని రోజులు తన మేనమామ దగ్గర ఉండాల్సి వచ్చింది. తన మేనమామ దగ్గర ఉండే రోజు లలో జయపాల్‌నాగ్‌ అనే ఉపా ధ్యాయుడి సహకారంతో బిర్సా ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆతరువాత ప్రాథమికోన్నత విద్యాభ్యాసం కోసం మిషనరీ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆరోజులలో చదువుతో పాటు,మత మార్పిడి కూడా జరిగేది.తన చదువు కోసం బిర్సా అతని తండ్రి బాప్తిజం స్వీకరించారు. పాఠశాలలో బిర్సా చురుకుద నాన్ని,మేధస్సుని గుర్తించిన ఉపా ధ్యాయులు, చారుభాషా పట్టణంలోని జెర్మన్‌ లూథరన్‌ మిషనరీ స్కూల్‌కు ఉన్నత చదువుల కోసం పంపించారు. అయితే బ్రిటిష్‌ వారు భారతీ యులకు చదువు నేర్పించడానికి ప్రధాన కారణం,వారి ఆజ్ఞ ప్రకారం పని చేసే సేవకు లను తయారు చేసుకోవడానికి మాత్రమే. ఏదే మైనప్పటికీ ఆ విద్య వలన ప్రజలతో నూతన ఆలోచనల వ్యాప్తి పెరిగింది. ఆచదువు ప్రజా హక్కులను వారిపై జరుగుతున్న అన్యాయాలను, అణిచి నేతలను తెలుసుకునేలా చేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల సహకారంతో మిషనరీలు గిరిజనుల భూములను ఆక్రమించు కునే పనిని మొదలు పెట్టాయి. ఈ యుక్తులకు వ్యతిరేకంగా ముండా తెగ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బిర్సా తనఉపాధ్యాయుల ద్వారా యూనియన్‌ ప్రజలు తమ భూమి మీద అతి తక్కువ శిస్తులు చెల్లిస్తారని తెలుసుకొని, శిస్తులను బహిష్కరించాలని తన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒక రోజు మిషనరీ మతపెద్ద బిర్సా తరగతి గదిలో ముండాల పోరాటాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా,బిర్సా ఒక్క ఉదుటున లేచి నిరసన వ్యక్తం చేశాడు. తన బాల్యంలో చదువుకోవాలనే తపనతో మిషనరీ పాఠశాలో చేరిన బిర్సా,చట్టబద్దమైన ముండా తెగ ప్రజల పోరాటాన్ని మిషనరీలు ధిక్కరించడాన్ని జీర్ణిం చుకోలేక అక్కడి నుండి బయటకొచ్చాడు. 1894లో బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కు చట్టం-8(1882), భూస్వాములకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాలమూ,మన్‌భమ్‌, చోటానాగ్‌పూర్‌ ప్రాంతాలలోని గిరిజన భూము లను బలవంతంగా స్వాధీనపర్చుకొని వారిని ఇండ్ల నుండి తరిమికొట్టారు.ఈ దురా గతాలకు వ్యతిరేకంగా బిర్సా ఆరు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వానికి మెమో రాండం అందించారు. కానీ ప్రభుత్వం వారి డిమాం డ్లను పూర్తిగా తిరస్కరించింది.ఈ పరి ణామా లను గమనిస్తున్న బిర్సా కేవలం,భూస్వా ములు,జాగీర్‌దారుల మీద పోరాటం చేస్తే సరిపోదని, ఈ పోరాటం వలసవాద బ్రిటిష్‌ ప్రభుత్వం మీద కూడా చేయాలని నిర్ణయించు కున్నాడు. ఆధునిక విద్యా,శాస్త్రీయ విద్య అభ్య సించిన కారణంగా బిర్సా మూఢ నమ్మకాలను ఎప్పుడు వ్యతిరేకించేవాడు.తన జాతిలోని వివిధ సంఘాలను,మత విశ్వాసా లను ఏకం చేయాలని,తన ప్రజలకు ఆధునిక విద్య అందకపోవడం వలనే ప్రకృతి వైపరి త్యాలను, వ్యాధులను ఎదుర్కోలేక పోతున్నారని భావించాడు. మూఢ నమ్మకాలు,క్షుద్ర పూజలను,అసంఖ్యాకంగా ఉన్న దేవుళ్లని అరాధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ఉద్యమం ముండా తెగ ప్రజలలో నూతన విశ్వాసం నింపడంతోపాటు ఉద్యమ సైద్ధాంతిక శక్తిని కూడా పెంచింది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలతో చల్‌కాడ్‌ ప్రాంతం జనసంద్రం కాగా, 20ఏండ్ల ఆ యువకుడిని ప్రజలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రజా ఐక్యతను పెను ముప్పుగా భావించిన భూస్వాములు, మిషనరీలు బిర్సా మీద వ్యతిరేక ప్రచారం చేశాయి. ఈనేపథ్యంలో బిర్సాను, తన అను చరులను 24 సెప్టెంబర్‌ 1895లో అరెస్ట్‌ చేయించారు. రెండేండ్ల తర్వాత జైలు నుండి విడుదలైన బిర్సా సాయుధ బలగాన్ని నిర్మిం చాల్సిన ఆవశ్యకతను గుర్తించాడు. రాత్రి పగలు తేడా లేకుండా తీవ్రమైన కరువు, వ్యాధుల మీద ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఎంతో ఆలోచింపజేసింది. పీడిత ప్రజలు బిర్సా పోరాట పటిమను గుర్తించారు. ఆయన అనుచరులు చాలా గోప్యంగా బిర్సా సిద్ధాం తాలను జనంలోకి తీసుకెళ్లారు. జన సంచారం లేని దట్టమైన అడవుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. సంఘం పని బాధ్యతలను విభజించి తన ప్రధాన శిష్యులైన డొంక, గయాముండా, డిరకాముండా, తైత్రౌం ముండా, రిషిముండాలకు అప్పగించారు. అనవసరంగా ఎవరినీ చంపకూడదని, తన అనుచరులకు ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయుధ తిరుగుబాటు చేసి, దోపిడీకి గురికాబడే పీడిత వర్గాలను ఏకం చేసి దీర్ఘకాలిక ఉద్య మాన్ని నడపాలని పిలుపునిచ్చాడు. డిసెంబర్‌ 24,1899న రాంచీ, చారుభాషా ప్రాంతాలలో మొదలైన తిరుగుబాటు అత్యంత తక్కువ వ్యవధి లో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిం చింది. పోలీసులను, భూస్వాములను, వ్యాపారు లను తనను హింసించిన వారినందరినీ కసి తీరా కడతేర్చారు. జనవరి 7,1900నాడు రెండు కంపెనీల మిలటరీ బలగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం గిరిపుత్రుల మీద తూటాల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా గ్రామాల మీద దాడులు చేశారు. లైంగికదాడులు, హత్యలు, దోపిడీ… ఒక విధంగా చెప్పాలంటే ఊళ్లను వళ్లకాడులా మార్చేశారు. బిర్సా ముండాను పట్టుకోవడానికి ఎంతోమంది అమాయక గిరిజనులను హింసించారు. అంతిమంగా డబ్బుకు అమ్ముడుపోయిన ఒక ద్రోహి ద్వారా బిర్సాను పట్టుకోగలిగారు. 3మార్చి 1990 నాడు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు వేలాది మంది గిరిజనులు చారుభాషా జైలుకు తరలివెళ్లారు. బిర్సాను ఉరితీస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన అధికారులు, కేసు కోర్టులో ఉండ గానే ఆహారంలో విషం కలిపి చంపేశారు. బయటి ప్రపంచానికి మాత్రం కలరా వ్యాధితో చనిపోయాడని నమ్మించారు. ఆనాడు దురాగ తాలకు, దోపిడీకి, అన్యాయానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన ఆ అమ రుడి త్యాగం,గొప్పతనం,నేడు దోపిడీకీ,అణివేతలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయన మరణం కేవలం ఒక తెగ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే కాదు. బాధిత, పీడిత వర్గాల ఐక్యత కోసం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోపిడీ మాత్రం కొనసాగుతూ ఉంది. జనాభా ప్రాతిపాదికన మా రిజర్వేషన్లు మాకివ్వం డయ్యా..అని అడిగిన గిరిజనులపై లాఠీలు రaలిపించారు. మన వెలమ దొర పాలనలో దళిత, గిరిజన, బహుజనులపై జరుగుతున్న దురాగతాలు కోకోల్లలు. బిర్సా స్ఫూర్తితో అధిక సంఖ్యలో ఉన్న బాధిత, పీడిత ప్రజానీకం ఏకమై మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. –(మూడ్‌ శోభన్‌నాయక్‌)

1 2 3 4 7