యురేనియంతో గిరిజనుల ప్రాణ సంకటం

రెండు తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులుగా భావిస్తోన్న నల్లమల అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల ప్రతిపాదనలను నిరసిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయట్లేదు. యురేనియం తవ్వకాలపై ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ పరిధిలో రహస్యంగా సర్వే నిర్వహిస్తోందనే సమాచారం గుప్పుమంది. దావానలంలా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న అణు ఇంధన సంస్థ ఉద్యోగులు కొందరు నల్లమల అడవుల్లో రహస్యంగా సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయినట్లు సమాచారం. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ పరిధిలోని మన్ననూర్‌ సమీపంలో అటవీ శాఖకు చెందిన క్యాంప్‌ ఆఫీస్‌ లో మకాం వేశారని, గుట్టు చప్పుడు కాకుండా సర్వే నిర్వహిస్తున్నారనే కలకలం పుట్టిస్తున్నాయి.
యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమా దం ఏర్పడు తుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగు తున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సర్వే ప్రారంభించాలని కేంద్రం అనుమ తులు ఇవ్వ డంతో ప్రజా సంఘాలు, ప్రజలు, స్వచ్ఛందంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరిగి నప్పుడు వెలువడే ‘డస్ట్‌’80 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది.డస్ట్‌ పడిన ప్రాంతమంతా విషపూరి తమవుతుంది. నల్లమలలోని చెంచుల ఉనికికి అత్యంత ప్రమా దం ఏర్పడుతుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే చెంచులను ఆ ప్రాంతం నుంచి తరలించాలి. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును తొలగించాలి. సాగర్‌ నీళ్ళు వ్యవ సాయానికి గానీ, తాగడానికి గానీ ఉపయోగపడవు. ఇంత ప్రమాద కరమైన యురేనియం తవ్వకాలను కార్పొరేట్ల లాభా ల కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్నది.
యురేనియంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి తేలి కవుతుందని చెప్తూ తవ్వకాలకు కేంద్రం అను మతు లిచ్చింది. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని పుకుషీ మాలో యురేనియం విద్యుత్‌ కేంద్రాలు పేలి పోవ డంతో వేలమంది మరణించడమేకాక,నేటికి ఆరేడి యో ధార్మిక శక్తి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు చెప్తున్నారు. ఆ భయంతో భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో యురేని యం తవ్వకాలను ఆపాలని ఆందోళనలు సాగుతు న్నా యి.1896లోహెన్రీ బెకరల్‌ రెడియో ధార్మిక శక్తి 92వ మూలకాన్ని కనుగొన్నాడు.చదరపు అడుగు యురేనియం500 కేజీలబరువు ఉంటుంది. న్యూక్లి యర్‌ ఎనర్జీ ద్వారా అణుబాంబులు తయారు చేసిన ఆమెరి కా జపాన్‌లోని హిరోషిమా, నాగసా కిలపై వేసింది.ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియో ధార్మిక శక్తి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. యురేనియం తో విద్యుత్‌ శక్తి ఉత్పత్తి చేయవచ్చు. 10లక్షల కిలోల బొగ్గుతో ఉత్ప త్తి అయ్యే విద్యుత్‌ అరకిలో యురేనియంతో తయారు చేయవచ్చు. బొగ్గు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయంతో కూడు కున్న పని అని యురేనియంతో ఉత్పత్తిని ప్రారంభించారు. మొదట ఈనిక్షేపాలు మేఘాలయ,ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ లోని దట్టమైన అడవుల కింద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత దేశంలో 7 కేంద్రాల్లో 22రియాక్టర్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.1950లో యురేనియం గనులను ఏర్పాటు చేశారు.1967లో జాదూ గూడలో గని ప్రారంభించారు.యురేనియంద్వారా విద్యుత్‌ఉత్పత్తి జరిగే ప్రక్రియలో యురేనియం శుద్ధి అవుతుంది.శుద్ధి అయిన యురేనియంను పైపుల ద్వారా బోరు బావిలోకి పంపిస్తారు.వాస్తవానికి ఈ శుద్ధి అయిన యురేనియంతో అణుబాంబులు తయారు చేయవచ్చు.ఇక్కడ అణుబాంబులు తయా రుచేసే లక్ష్యం లేనందున శుద్ధి అయిన యురేని యాన్ని బావుల్లోకి పంపిస్తున్నారు.తటస్థీకరణ చర్యకు సున్నపురాయిని కూడా దానితోపాటు పంపాలి. యురే నియం భూమికి చాలా లోతులో ఉంటుంది. 1960లో వెయ్యి అడుగులలోతు వరకు బోర్లు వేసి తీశారు. అయినా తగినంత ఉత్పత్తి రాక పోవడంతో1990లో ఎన్‌ఎస్‌జీ దేశాల నుంచి (కజకస్తాన్‌,కెనడా,రష్యా) దిగుమతు లు చేసుకు న్నారు.ఈ దిగుమతులకు అమెరికా, ఐక్య రాజ్య సమితి అడ్డుపడ్డాయి. ఎన్‌జీఓ సంఘాలు యురేనియంవల్ల ప్రమాదాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చా యి. పిల్లలు పుట్టకపోవడం,ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం,క్యాన్సర్‌,చర్మ వ్యాధులు తదితర ప్రమా దాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ వారు కూడా పరిశీలించారు. ఆలోపాలు యురేనియంవల్ల కాదని తప్పుడు సమాచారం ఇచ్చారు. రేడియేషన్‌ వస్తుంది కానీ దాన్ని బయటకు సోకకుండా జాగ్రత్త తీసు కుంటున్నామని తెలిపారు. 1998లో ప్రధాని వాజపేయి జాదూగూడ కాక వేరే ఎక్కడైన యురేనియం లభ్యత ఉందా అని పరిశీలించారు. ఈస్థితిలో ప్లూటోనియాన్ని కనుగొ న్నారు. ప్లూటోనియంతో తయారు చేసిన అణు బాంబును పోక్రాన్‌లో పరీక్షించారు.చివరకు 2002లో చంద్రబాబు అనుమతితో జరిపిన అన్వే షణలో కడప జిల్లా తుమ్మలపల్లి,గుంటూరు జిల్లా కోపూరులోని 2,300 ఎకరాల్లో నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు.1.40లక్షల టన్నులు తుమ్మల పల్లి లో,2500 టన్నులు కోపూరులోనూ బయటకు తీశారు.2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. యుసీ ఐఎల్‌ దృష్టి ఇప్పు డు నల్లమలపై పడిరది. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణానది కలుషితం అవుతుందని ప్రచారం సాగుతున్నది.ప్రస్తుతం దేశంలో మరో 7అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి యురేనియం కావాలి. అందుకు దిగుమతులపై ఆధారపడాలి.లేదా స్వదేశంలో ఉత్పత్తి చేయాలి. విద్యుత్‌ ఉత్ప త్తి కేంద్రం తయార వ్వడానికి ఐదారు సంవత్సరాలు పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు కూ డా ప్రస్తుతం లభించే ధరకన్న ఎక్కువగానే ఉంటుంది. తక్కువ యురేని యంతో ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి జరిగి నప్పటికీ యురేనియం తవ్వకానికి అయ్యే పెట్టుబడి ఎక్కువ గానే ఉంటుంది. రేడియో ధార్మిక శక్తి బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త జరిగినా రేడియో యాక్టివిటి కిరణాలు అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే భారత దేశంలో 3దశాబ్దాల క్రితం భోపాల్‌లో ‘మిక్‌’ గ్యాస్‌ లీక్‌వల్ల 2వేలమంది ప్రాణాలు కోల్పోయా రు. నేటికి అక్కడ వాతావరణం బాగు పడలేదు. కానీ కేంద్రం అవేవీ పట్టించు కోవడం లేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో రక్షణ లేకుండా యురేనియంతవ్వకాలు,విని యోగం చేయడం తీవ్ర ప్రమాదకరం.
ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి.
దాదాపు 60ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవు ల్లోని కుడిచింత బయలు గ్రామంలో,ఆర్డీఎఫ్‌ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని వచ్చేపోయే బండ్లను చూస్తు న్నారు. ఎదురుగా ఉన్న కంకర రోడ్డు మీద దుమ్ము రేపుకొంటూ పెద్ద పెద్ద కార్లు మల్లెలతీర్థం వైపు వెళుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ దారిలో కొంత కాలం తరువాత ఆ ఊరు, ఆ మల్లెలతీర్థం, తమ అడవి, తమ వ్యవసాయం,పర్యటకుల సందడి..ఇవన్నీ ఉంటాయో ఉండవో అన్న బెంగ ఆయనలో ఉంది. కారణం-తమ అడవిలో యురే నియం తవ్వుతారన్న వార్తలేనని స్థానికులు వాపోయారు.
మేమెక్కడికీ పోం.
(యురేనియంను) తవ్వనీయం. తవ్వనీ యం. తవ్వనిస్తే మేం భంగపడిపోతాం. యురే నియం తవ్వితే ఊళ్లు నాశనమైపోతాయి. అందుకే తవ్వద్దు. తవ్వితే దాని విష పదార్థం కొట్టి భంగం అయిపోతాం’’ అని స్థానికుడు ఐతయ్య అన్నారు. ‘‘మేం మొదట్లో వాళ్లు తవ్వుకుని పోతారులే అనుకున్నాం. కానీ అది తవ్వితే విషం గాల్లో వచ్చి మనకు పారుతుంది అని చెప్పారు. మనుషులు బతకరు అన్నారు. అట్లైతే అసలే వద్దు. మనం చావనీకి అదెందుకు తవ్వాలి?’’ అని ప్రశ్నించా రాయన.కుడిచింత బయలు గ్రామం కానీ, మల్లెల తీర్థం కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన యురేనియం సర్వే బోర్లు వేసే ప్రాంతంలో లేవు. అయినా వారి లో అంత బెంగ ఉండటానికి కారణం, పక్క ఊరు తవ్వినప్పుడు తమ ఊరినీ- తమ అడవినీ వదలి పెట్టరేమోననే ఆలోచన.పక్క ఊరిలో తవ్విన యురే నియం వల్ల తామూ ప్రమాదంలో పడతామేమోననే భయమూ ఉంది. యురేనియం సర్వే పరిధిలో లేని గ్రామంలోని పరిస్థితి ఇది. సర్వే చేసే ప్రాంతా ల్లోనైతే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ‘‘మీకు పునరావాసం కల్పించి,యురేనియంతవ్వితే సమ్మ తమేనా’’ అనే ప్రశ్నకు స్థానికులు ఆసక్తికర సమా ధానం ఇచ్చారు.‘‘పునరావాసానికి కూడా ఒప్పు కోం. మొత్తం మండలం అంతా మాట్లాడి చెప్పాలి. ఒప్పుకుంటే రూపాయల కట్ట ఇస్తారు. హైదరాబాద్‌ వెళ్తా. ఆ డబ్బులు మూడ్రోజులుంటాయి. తెల్లారి అవి ఎట్లా పోతాయో, మా బతుకులు ఎట్లా పోతా యో తెలీదు. అందుకే ఇదే భూమి,ఇదే ఆస్తి ఉం డాలి మాకు’’అంటూ ఐతయ్య అనే అసామి తెలి పారు. ‘‘యురేనియం తవ్వితే కృష్ణా నది కలుషి తమై, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆ నదిపై ఆధార పడ్డ ప్రాంతమంతా ఇబ్బంది పడుతుంది. పునరా వాసాలు ఎక్కడా సరిగా జరగలేదు.70వేల మం దిని ఎక్కడకు తీసుకువెళ్తారు? ఆదిమజాతి చెంచు లను అడవికి దూరం చేస్తే చనిపోతారు. పెద్దపు లులను ఎక్కడ పెంచుతారు? వన్యమృగాలను ఏం చేస్తారు? పర్యావరణాన్ని ఎక్కడ నుంచి తెస్తారు? ఇక్కడ యురేనియం తీస్తారు.అయిపోతుంది. మరొక చోట తీస్తారు. అయిపోతుంది. ఇలా దేశమంతా కాలుష్యం చేయడం ఎందుకు? దాని బదులు గాలి, సూర్యుడి నుంచి వచ్చే కరెంటు వాడుకోవచ్చు కదా’’ అంటూ యురేనియం మైనింగ్‌ వ్యతి రేక ఆందోళన లకు కె.నాజరయ్య నాయకత్వం వహిస్తున్న ప్రశ్నిం చారు.-(సారంపల్లి మల్లారెడ్డి)