నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం 

పార్లమెంట్‌ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని జాతికి నేడు అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీని మీద అనేక వర్గాలు ఆందోళన చేయటం, ఈ వేడుకకు విపక్షాలు వెళ్లగూడదని నిర్ణయించటమూ తెలిసిందే. భిన్న భాషలు, భావజాలం, సంస్కృతి, సంప్రదాయాలతో విలసిల్లుతున్న ఈ సువిశాల భరతభూమిలో.. వీటన్నిటినీ ఒకే తాటి మీదకు తెచ్చి ఐక్యత రాగాన్ని ఆలపించే వేదికగా భాసిల్లుతున్నది మన పార్లమెంటు. అటువంటి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం అన్ని పక్షాలూ కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన వేడుక. కానీ, అది వివాదాస్పదమవటం దురదృష్టకరం!
నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహత్తర కార్యక్ర మంలో రాజ్యసభ ప్రమేయం లేకపోవటం ఆశ్చ ర్యం.ఈ నూతన పార్లమెంటు భవనంలో రాజ్య సభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయం ఉంటాయిగదా!మరి రాజ్యసభను ఎందుకు భాగ స్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. రాజ్యాం గంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట.అందువల్లనే, ఉభయ సభలు ఓ బిల్లును ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే అది చట్టంగా రూపుదిద్దుకుంటుంది.ఆబిల్లు పార్ల మెంటు ఆమోదం పొందింది అని అప్పుడు అను కోవాలి. అయితే, చాలామందికి పెద్దగా తెలియని విషయమేమిటంటే పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానికి ప్రత్యేక స్థానం అంటూ ఏమీ లేదు. అందరు పార్లమెంటు సభ్యులలాగే ప్రధాని గూడా ఒక సభ్యుడు (సభ్యుడు కాకుండాగూడా ఓఆరు నెలలు మంత్రిగానో, ప్రధానిగానో కొనసాగే వెసులు బాటు మన రాజ్యాంగం కల్పించింది. అది వేరే విషయం). అందరు మంత్రుల్లాగే ప్రధానికి ఒక గది ఉంటుంది. సభ్యుడైతే తాను సభ్యుడైన సభకి నాయకుడు (శ్రీవaసవతీ శీట ్‌ష్ట్రవ ష్ట్రశీబంవ)గా వ్యవహ రిస్తారు. అంతకు మించి ప్రధానికి పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకత ఏమీ లేదు. పార్లమెంటు ప్రాంగణం అంతా లోక్‌సభ స్పీకరు ఆధ్వర్యంలో ఉంటుంది. స్పీకరుని పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని కలవాలంటే, ప్రధానే స్పీకరు గదికి వెళ్తారు గానీ స్పీకరు ప్రధాని గదికి రారు. అది స్పీకరుకి పార్లమెంటులో అత్యున్నత గౌరవం యిచ్చే ఒక మంచి పార్లమెంటరీ సంప్రదాయం. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే, పార్లమెంటరీ వ్యవస్థలోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ప్రధానికి ప్రత్యేక స్థానం ఏదీ లేదని. నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహ త్తర కార్యక్రమంలో రాజ్యసభ ప్రమేయం లేకపో వటం ఆశ్చర్యం. ఈ నూతన పార్లమెంటు భవనం లో రాజ్యసభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాల యం ఉంటాయిగదా! మరి రాజ్యసభను ఎందుకు భాగస్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. పార్లమెంటు అంటే లోక్‌సభ ఒక్కటే కాదు గదా! పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రెండు సభలూ. అటువంటప్పుడు నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదగా జరగటం ఏమిటన్న ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్నది. పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని విస్మరించి ప్రధాని చేతుల మీదగా ఈ వేడుక జరగటం రాజకీయాలతో సంబంధం లేని చాలామంది దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతు న్నారు.పైగా,ఈ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన గూడా ప్రధాని చేతుల మీదగానే జరిగింది. ఇదే ఒక విడ్డూరమైతే నూతన భవనం ప్రారంభో త్సవంకూడా ఆయన చేతుల మీదే జరగటం మరో విడ్డూరం.
రాష్ట్రపతిని విస్మరించి రాజదండ ప్రతిష్ట
దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలవాల్సిన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్స వాన్ని ఏకపక్ష వ్యవహారంగా మార్చడం ప్రధాని నరేంద్రమోడీకే చెల్లింది. ఇరవైకి పైగా ప్రతిపక్షాలు హాజరు కాబోమని ప్రకటిస్తే కనీసం సంప్రదిం పులకు కూడా ప్రయత్నించని అప్రజాస్వామిక పోకడలు దేశం ఎప్పుడూ చూసివుండదు. ఈ మధ్యనే లోక్‌సభ మాజీ కార్యదర్శి పిడిటి ఆచారి ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు ఆయనో మాట చెప్పారు. నెహ్రూ హయాంలోనూ తర్వాత చాలా కాలం కూడా పార్లమెంటులో ఉద్రిక్తత వస్తే ప్రతిపక్ష నాయకులను పిలిచి చర్చించి ఏదో ఒక పరిష్కారం చేసేవారట. ఎందుకంటే సభ జరిగేలా చూడటం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని బాధ్యత.కర్తవ్యం కూడా. మోడీ హయాంలో పార్లమెంటును ఒక తంతులాగా మార్చి పెత్తనం చేయడమే గాని ఎన్నడూ రాజ్యాంగం, సంప్రదాయం రీత్యా వ్యవహరించింది లేదు. కీలకమైన కాశ్మీర్‌ అంశం లాటిదాన్ని కూడా హఠాత్తుగా తెచ్చి మమ అనిపించడం తప్ప ముందుగా చర్చించే సాహసం ప్రజాస్వామ్య స్పృహ లేవు. నోట్ల రద్దు, ఎన్‌ఆర్‌సి వంటివాటిపై చర్చలకే అవకాశమివ్వని నిరంకు శత్వం ఈ సర్కారుది. అదే ఇప్పుడూ ప్రత్యక్షమవు తున్నది. అసలు న్యూ విస్తా పేరుతో నూతన భవన సముదాయాన్ని కట్టాలన్న నిర్ణయమే ఏకపక్షమైంది. దేశమంతా కరోనా మహమ్మారితో కలవరపడుతు న్నప్పుడు తీసుకున్నది. చారిత్రకంగా కొనసాగుతున్న గొప్ప నిర్మాణాల స్థానంలో తన ముద్ర కోసమే అవసరం లేకున్నా లూట్యాన్స్‌ ఢల్లీిని మోడీస్‌ ఢల్లీిగా మార్చడమే ఏకైక లక్ష్యంగా ఈతతంగం తల పెట్టారు. కోర్టులలో కేసులూ నడిచాయి. సాంకేతిక కారణాలతో అనుమతి సంపాదించి పూర్తి చేశారు. నూతన భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిష్టాపన కూడా ఇలాగే హఠాత్తుగా ఒంటరిగా కానిచ్చేశారు. ఆ సింహాలు గతంలో వలె గంభీర ప్రసన్నంగా గాక క్రోధంగా వుండటం మరో చర్చకు దారితీసింది. దానిపై విమర్శల తర్వాత పూర్తిస్థాయి ప్రారంభోత్సవానికైనా పునరా లోచించుకొని అందరినీ కలుపుకుపోయే బదులు దీనికీ తనే ఏకైక కర్త కర్మ క్రియగా కానిచ్చేయడం మోడీకే చెల్లింది!
రాష్ట్రపతి రాజ్యాంగ పాత్ర
పార్లమెంటు అంటే అన్నిపార్టీల సభ్యు లూ వుండే వేదిక. రాజ్యసభ అయితే రాజ్యాంగ పరంగా రాష్ట్రాల సభ.కాని మోడీ సర్కారు దీనిని కేవలం ప్రభుత్వ వ్యవహారంగా మార్చేసింది. కాని ఇప్పుదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శ వచ్చింది ప్రతిపక్షాల గురించి కాదు. రాష్ట్రపతి గురించి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ఏర్పాటుకు, ప్రారం భానికి, ప్రోరోగ్‌ (నిరవధికవాయిదా) కు ఎన్ని కలకూ కర్త రాష్ట్రపతి.రాజ్యాంగంలో 3,111,274 అధికరణాలు రాష్ట్రపతి అధికారా లను స్పష్టంగా పేర్కొంటున్నాయి. 79వ అధికర ణం ప్రకారం రాష్ట్రపతి, సభ్యులు కలిస్తేనే పార్లమెం టు.పార్లమెం టు ఏర్పాటు,గడువు ముగిసిన తర్వాత లేదా ప్రభు త్వం కోరితే పడిపోతే మళ్లీ కొత్త సభ ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు అనుమతి నివ్వడం రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. ఎన్నికైన సభ్యుల జాబితాను తనకే అందజేస్తారు.78వ అధికరణం మేరకు పార్ల మెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తేనే శాసనాలవుతాయి.కనక రాష్ట్రపతికీ పార్లమెం టుకూ మధ్య సంబంధం విడదీయరానిది. అలాటి రాష్ట్రపతి లేకుండా, కనీసం ఆహ్వానించకుండా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలను కోవడం ఎలాటి ప్రజాస్వామ్య సంప్రదాయం? ఎలాటి రాజ్యాంగ గౌరవం? పైగా ప్రస్తుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్మును తొలి ఆదివాసి మహిళ ఎన్నికగా గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ ప్రభు త్వం ఎందుకు ఆమెను గౌరవించడం లేదు? ఈ మాట అనగానే అయితే ప్రతిపక్షాలు ఎందుకు ఆమెపై అభ్యర్థిని పెట్టాయని కొందరు ఎదురు దాడి చేయడం మరీ విడ్డూరం.
ఆ స్థానంలో ఎవరుంటే వారు రాజ్యాం గ రీత్యా ఆగౌరవానికి అర్హులు తప్ప ఎన్నికల్లో పోటీ పెట్టడం ఇక్కడ సమస్య కానేకాదు. ఇంకా కొంతమంది ఉదాహరణకు తెలంగాణ పాండిచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌గా వున్న తమిళిసై సౌందరరాజన్‌ వంటివారు సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్మమంత్రి కెసిఆర్‌ తనను ఆహ్వానించలేదని పోటీ వాదన తెస్తున్నారు.సచివాలయానికి గవర్నర్‌కు మధ్య అలాటి పాత్ర వున్నట్టు రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా?తలాతోక లేని వాదన తప్ప! ఢల్లీి లెఫ్టి నెంట్‌ గవర్నర్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ల నిర్వా కాలను సుప్రీం కోర్టు తప్పు పట్టిన తర్వాత కూడా బిజెపి నియమిత వ్యక్తుల తీరు మారలేదనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
ఎక్కడిదీ రాజదండం?
మిగిలిన అనేక మతతత్వ పోకడలు నిర్ణయాలు పక్కన పెట్టి ఈ ప్రారంభోత్సవంలోనూ మోడీ ప్రభుత్వం మతరాజకీయాలనే ప్రదర్శిస్తు న్నది. హిందూత్వ సిద్ధాంత కర్త గాడ్సే గురువు సావర్కర్‌ జయంతినాడు ఈప్రారంభోత్సవం పెట్ట డం వ్యూహాత్మక సంకేతమే. రాజదండం (సెం గోల్‌) ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. గతంలో ఎన్నడూ పెద్దగా చెప్పుకోని ఈ రాజడండం కథను తవ్వి తీయడం ద్వారా బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తున్నది.1947ఆగష్టు 15న బ్రిటిష్‌ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడిజరిగేప్పుడు తమిళనాడులోని తిరువాదుతరై అధీనం అనే మఠం నుంచి ఈరాజదండం కాను కగా సమర్పించబడిరది. దాన్ని ఆఆశ్రమ ప్రతి నిధులు ప్రధాని నెహ్రూకు అందిస్తున్న చిత్రాలు కూడా ఆనాడు వచ్చాయి. అయితే అదేదో స్వా తంత్ర సాధనకు అధికార మార్పిడికి సంకేతం గా ఇచ్చినట్టు పేర్కొనే ఆధారాలే లేవు.అలా చూసిన చెప్పిన సందర్భాలూ లేవు. హోంమంత్రి అమిత్‌ షా అకస్మాత్తుగా దీన్ని ప్రస్తావించినపుడు నాయ కులూ పాత్రికేయులూ కూడా ఆశ్చర్యపోయారు. అధికార మార్పిడికి ఏదైనా లాంఛనప్రాయమైన సంకేతం వుంటుందా అని మౌంట్‌ బాటన్‌అడిగితే నెహ్రూ మొదటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీని సంప్ర దించినట్టు ఆయన తమ స్వరాష్ట్రమైన మద్రాసు నుంచి దాన్ని తెప్పించినట్టు అమిత్‌షా కథచెబు తున్నారు. ఈ రాజదండాన్ని మొదట మౌంట్‌ బాటన్‌కు ఇచ్చి తర్వాత నెహ్రూకు అందజేశారని కథ చెబుతున్నారు. దాన్ని పార్లమెంటు భవనంపై శాశ్వతంగా ప్రతిష్టించుతామని కూడా కేంద్రం ప్రకటించింది. బ్రిటిష్‌ చక్రవర్తితో సహా దేశదేశాల రాజులు పట్టాభిషేకాల సమయంలో ఈ తరహా దండం ఒకటి రాజగురువు నుంచి తీసుకునే పద్ధతి వుంది. కాని అది ప్రజాస్వామంలో ప్రజల ఆమో దం తప్ప అలాటి ఆచారాలేమీ వుండవు. పైగా లౌకిక విధానం తీసుకున్న భారతదేశంలో అసలే అవకాశం లేదు.భిన్న మతాలతో కూడిన ఈ దేశం లో ఒక మతానికి సంబంధించిన చిహ్నమే ఎలా ప్రభుత్వ చిహ్నమవుతుంది? అంటే ఇది కూడా బిజెపి మార్కు మత రాజకీయాలలోనూ తమిళ నాడును సంతోషపెట్టే వ్యూహంలోనూ భాగమను కోవాలి. కర్ణాటక దెబ్బ తర్వాత దక్షిణాదిలో పూర్తి గా ఖాళీ అయిన బిజెపి ఆ కోణంలోనూ ఈ పని చేస్తుండవచ్చు. దీనికి ఆధారాలేమంటే ఆనాడు వెలులవడిన ప్రత్యేక సంచికలలో వుందంటున్నారు. తీరా చూస్తే వాటిలోనూ ఆ మఠం ప్రతినిధులు చెప్పిందే వుంది. కనక ఇది కల్పితమనేది సుస్పష్టం. రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చిన ప్రాతినిధ్య స్వభావాన్ని, దానిలో భాగంగానూ రాజ్యాధినేత గానూ రాష్ట్రపతి స్థానాన్ని మోడీ సర్కారు అగౌరవం పాలు చేసింది.రాజ్యాంగంలో ఏప్రస్తాన లేని ఒక రాజదండాన్ని ఆస్థానంలో ప్రతిష్టించడం దాని రాజరిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.మోడీ ఏకపక్ష నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- (గుమ్మడిదల రంగారావు/తెలకపల్లి రవి) (వ్యాసకర్తలు : లోక్‌సభ సచివాలయం పరిశోధన మరియు సమాచార విభాగంలో మాజీడైరెక్టరు,మరియు సీనియర్‌ పాత్రీకేయులు)