మన్యం విప్లవం..మహోద్యమం..!

‘‘ బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంతఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4,1897-మే7,1924). భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.’’– గునపర్తి సైమన్‌
భారతీయ చరిత్రలో ఆయన మహో జ్వల శక్తి.మన్యం విప్లవం.. మహోద్యమ శీలి. అడవి నుంచి ఆకాశానికి ఎగిసిన విప్లవ కెరటం అల్లూరి సీతారామారాజు. సమర నాదానికి ప్రతిరూపం..విప్లవ నినాదానికి ఆయువు. బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నం. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి. కేవలం 27ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు అమాయ కులు,విద్యా విహీ నులైన కొండజాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజ పరచి,వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికికృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్‌,అల్లూరి సీతా రామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు.మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే..ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాం డ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు,తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధి తో సీతారామరాజు తండ్రి 1908లో మరణిం చాడు.అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువు తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడిరది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్‌ ఉన్నత పాఠ శాలలో చేరినా..తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొ న్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివా సం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతా రామరాజు చదువుపై చాలా ప్రభావం చూపిం చాయి. 1918 వరకు సీతారామరాజు కుటుం బం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు,అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండే వాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతి ష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చు కున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృ తం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు,దానగుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. సీతారామరాజు అంటేనే ఓ మహో జ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలం లోనే స్థానికులకు,బ్రిటిష్‌వాళ్లకు బోధపడిరది. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అను చరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామం లోకి దూకాడు. ఇలా..భారత స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓప్రత్యేక అధ్యాయం. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారా మరాజు. తొలిసారి 1916 ఏప్రిల్‌ 26వ తేదీన బెంగాల్‌ వెళ్లారు. ఆతర్వాత లక్నోలో కాంగ్రె సు మహాసభకు హాజరయ్యాడు.కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలి సారి యాత్రలో బరోడా,ఉజ్జయిని,అమృత్‌సర్‌, హరిద్వార్‌,బదరీనాథ్‌,బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు.బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు.తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు.గృహవైద్య గ్రంథము,మంత్రపుష్పమాల,అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్‌,నాసిక్‌,పూనా, బొం బాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటిం చాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహిం చాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులు న్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ల దురాగతాలు, దోపిడీ లు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం,అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్ప డేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసు కొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో,గిరిజనులు సలహాలు,వివాద పరిష్కా రాలకు సీతారామరాజును ఆశ్రయించే వారు. క్రమంగా దాదాపు 40గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరా టానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర,కంకిపాటి ఎండు పడాలు సీతారామ రాజుకు ముఖ్య అనుచరులైపోయారు. అంతేకాదు..దాదాపు 150మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్‌ చేశాడు.1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపి వేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11తుపాకులు,5 కత్తు లు,1390 తుపాకీ గుళ్ళు,14బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి,రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసు లను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందు గుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు,హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియ మించింది. సెప్టెంబర్‌ 24వ తేదీన సీతా రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడి చేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.1922 అక్టోబర్‌ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక,అక్టోబర్‌ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడిరచినా ఆయుధాలు దాచి పెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు..తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిరచి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావా లంటే యుద్ధం చేయమని కూడా సీతారామ రాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్‌ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్‌ 23న సాండర్స్‌ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్‌ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థి తులు అనుకూలంగా లేవని సాండర్స్‌ వెనుదిరి గాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్‌ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు. అదే ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్‌ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్‌ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు.ఆరోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని,విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్న వరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్‌ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయ త్నాలు సాగించింది. సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ ఫర్డ్‌..విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే..ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు..తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ,స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో,1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్‌ గుడాల్‌ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయ నను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్‌ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితా భస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా..కేవలం 27 ఏళ్ళ వయసు లోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరా టం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజ నోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యం లో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు. చోటానాగ్‌పూర్‌, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరుగు బాటు చేసింది. దీనినే ఉల్‌గులాన్‌ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది.బీర్సా జీవితం,ఉద్యమం అద్భు తమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్య మాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామ రాజు ఉద్యమం ఆగస్ట్‌ 22,1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7,1924 వరకు ఉదృతంగా సాగింది.ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాము గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించ డానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.విశాఖ మన్య విప్లవం తెలుగువారి చరిత్రలో, ఆమాట కొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామ రాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్‌, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్న పూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారంతా గుర్తించి నివాళులర్పించారు.నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్‌ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతు లను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్‌ ప్రెసిడెన్సీని గడగడలాడిరచింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.

మెస్రంల ఇలువేల్పు నాగోబా

‘‘ఆదివాసీల సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలిచే కెస్లాపూర్‌ నాగోబా జాతరకు తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.జాతరకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న మెస్రం వంశస్థులు నాగోబాకు మొక్కులు చెల్లించు కున్నారు. 1946లో కెస్లాపూర్‌ జాతరను సందర్శించిన మానవ పరిణామ శాస్తవ్రేత్త హెమన్‌డార్ప్‌ సూచనతో అప్పటి నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను ప్రారంభించింది. గిరిజనుల చెంతకు అధికారులు,ప్రజా ప్రతినిధులే వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని అప్పటి ప్రభుత్వం సూచించింది.యధావిధిగా 72 ఏళ్ళ నుంచీ ఏటా గిరిదర్బార్‌ జరుగుతూ ఉంటుంది’’
తెలంగాణాలోని ప్రసిద్ధ ఆదివాసీ యుల క్షేత్రాలలో కేస్లాపూర్‌ ఒకటి.చరిత్ర రిత్యా, పౌరాణిక రిత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఇది ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉన్న మెస్రం వంశానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇచ్చట ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం.ఆదివాసీలు పుష్యమాసాన్ని పరమ పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పుష్య మాసంలోఇచ్చట ప్రతి సంవత్సరం అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈజాతర అమావాస్య రోజున ప్రారంభమవు తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరగా చెప్ప వచ్చు. లక్షల మంది జనసం దోహం మద్య అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీల కుంభ మేళాకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అదివాసీ భక్తులు,మెస్రం వంశీయులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
రూ.ఐదు కోట్లతో ఆలయం కట్టించారు
మెస్రం వంశస్తులు నాగోబాను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. నాగోబాను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని వీరి నమ్మకము. భారత దేశానికి స్వాతంత్య్రం రాకంటే పూర్వం నిజాం ప్రభుత్వకాలంలో తొలి సారిగా కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద 1942లో ఒక గుడిసెను నిర్మించి నాగోబా పూజలు చేయడం ప్రారంభిచారు.1956లో తొలి సారిగా నాగోబా దేవుడికి చిన్నగా గుడి కట్టారు.1995 లో సిమెంట్‌ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించారు. కాలానికి అనుగు ణంగా ఆలయాన్ని భక్తుల తాకిడి,పెరిగే కొద్ది ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రభుత్వ సహాకా రంతో 2000 లో ఆలయనిర్మాణం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌ గడ్‌,ఒడిషా మొదలగు రాష్ట్రల నుండి మెస్రం వంశస్తులతో పాటు ఆదివాసీలు,భక్తులు భారీ సంఖ్యలో నాగోభాను దర్శించు కోవడం జరుగు తుంది. మెస్రం వంశీ యుల కుటుంబాల సంఖ్య పెరగడం,వీరు ప్రతిసంవత్సరం సభలు సమా వేశాలు నిర్వహించి దేవాలయానికి సంబంధిం చిన ఆలయ నిర్మాణం గురించి 2011లో సంకల్పం పన్నారు.ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను ఆలయ పీఠాధిపతి గ్రామ పటేల్‌ మెస్రం వేంకట్‌ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా సరికొత్త ఆలోచనతో ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయా నికి వచ్చారు. ఇందుకోసంప్రతి మెస్రం ఇంటి నుండి ప్రతి సంవత్సరం ఐదు వేలు చోప్పున, ప్రభుత్వ ఉద్యోగులనుండి పది నుండి పదిహేను వేలు, సర్పంచులు జడ్పీటీసిలు, యంపీ టీసిలు, మండల అధ్యక్షులు ఇలా ప్రజా ప్రతినిధుల నుండి ఏడు వేలు చోప్పున ఇలా ఐదు సంవత్సరాలు చందాలు వసూలు చేసి నిధులు సమకూర్చారు. దాదాపు రూ.5 కోట్ల డబ్బులు జమచేసి 2017లో నాగోబా, సతీదేవత ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
ప్రణాళికాబధ్ధంగా పనులు ప్రారంభం
దేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కలలు కన్నారు సాకారం చేశారు.ఆధునిక సౌకర్యాలు,ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. నగరాల నుండి గ్రానైట్‌ రాళ్ళు తీసుకోవచ్చారు.నాగోబా ఆలయల నిర్మాణానికి, ఇంజినీర్లతో, తయారీ దారులతో సమావేశమై వారి సలహాలు సూచనలను పాటించారు. ఆలయానికి రాయిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించారు. ఆలయం చుట్టూ ప్రాకారం నాలుగు దిక్కులా గుడి రాజగోపురాల నిర్మాణం చేశారు. మండపం లోని ప్రతి రాతిస్థంభాలపై గోండ్వానా రాజ ముద్రను చెక్కిం చారు.ఆదివాసీల,ఆచార వ్వవహారాలను అబ్బుర పరిచే రితీలో అద్భుతమైన శైలిలో రాతి స్థంభాలను చెక్కించారు.నాగోబా విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతంలో లభించే ప్రత్యేకమైన శిలతో తయారు చేయించారు. ఆలయ గర్భగుడి ప్రధాన ముఖద్వారానికి ఇరువైపులా రెండు పాములు కలిసి ఏడు తలలు ఉండేలా చెక్కారు.
ఇలా ఆధునాతున హాంగులతో ఆలయాన్ని నిర్మించారు.ఆలయప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్ది ఆలయం గోడలపై‘‘జై లింగో జై జంగో,’’జై గోండ్వానా’’ జై సేవా’’జై పెర్సాపేన్‌’’ చిహ్నాంతో అందంగా చెక్కిదిద్దారు, ప్రాంగణంలో ధ్వజస్థంభం,కోనేరు ఏర్పాటు చేశారు.గర్భగుడి ముఖ ద్వారానికి ఆంగ్ల అక్షరాలతో గోండిభాషలో దీనఖ్‌Gూుజు ునAవీఖచీ జుణపIR ూAణI్‌ఖRA హూునఖచీ దీన్‌ూఖR వీAజనహూ ఆని రాయించారు.తమ సంస్క్రతి సంప్రాదాయాలు చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మాణం గావించారు. టేకు కట్టెలతో నాగోబా ప్రచార రథం చాలా అందంగా అద్భతంగా తయారు చేసి ప్రచారం ప్రారంభించారు.భక్తుల సౌకర్యం కోరకు మరుగుదొడ్లు,స్నానపు గదులు నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది.
నూతన ఆలయ ప్రారంభోత్సవం,విగ్రహ పునః ప్రతిష్ఠాపన
ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన నాగోబా ఆలయం ప్రారంభోత్సవ వేడుకకు ముస్తాబైంది.సర్వాంగ సుందరంగా తయారైన ఆలయంలో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 2022 డిసెంబర్‌ నెల 12 నుండి 18 వరకు మొత్తం ఏడు రోజులు పాటు వేడుకలు తమ ఆచారా సాంప్రదాయం ప్రకారం ఆదివాసీ వేద పండితులు అయిన కొడప వినాయిక్‌ రావు మహారాజ్‌,పురుషోత్తం మహారాజ్‌ సమక్షంలో మంత్రోచ్చారణలతో నవగ్రహ పూజలు చేసి గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కలశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపూరావు,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌,కలెక్టర్‌ సిక్తా పట్నాయిక్‌ ఐఎఎస్‌,ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి వరుణ్‌ రెడ్డి ఐఎఎస్‌,ఆసిఫాబాద్‌ శాసన సభ్యులు ఆత్రం సక్కు,చైర్మన్‌ కోవాలక్ష్మీ,మాజీ మంత్రి గోడం నగేష్‌,ఐటీడీఏ చైర్మన్‌ కనక కల్కేరావుతోపాటు మెస్రం వంశీయులు, జిల్లా ప్రజాప్రతినిదులు,ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధానకార్యదక్షులు,ఆదివాసీలు పాల్గొన్నారు. ఎందరెందరో దేశ విదేశ చరిత్రాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది.ఏడు రోజులు కూడా భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి విజయ వంతంగా పూర్తి చేశారు.
జాతర ప్రారంభం
ఈ జాతర పుష్యమాసంలో ప్రారంభమై నెలవంక కనిపించే రెండో రోజున మెస్రం వంశానికి చెందినవారు కేస్లాపూర్‌ గ్రామంలో సమావేశం నిర్వహించి నాగోబా దేవుని మొక్కి ఆ తర్వాత సిరికొండ మండలంలోని ఎన్నో తరతరాల నుంచి అంటే తాత ముత్తాతల కాలం నుండి కుండలు తయారు చేసి ఇచ్చే కుమ్మరి వద్దనుండి కుండలు తయారు చేసుకొని రావడం వీరి ఆచారం.వారు కూడా నియమ నిష్ఠలతో ఒకే ఆకారం గల మట్టి కుండలు తయారు చెయ్యడం విశేషం.ఆ తర్వాత మెస్రం వంశస్తులు పూజ కలశంతో పవిత్రమైన గోదావరి జలాలను నియమ నిష్ఠలు పాటిస్తూ క్రమశిక్షణతో కాలినడకన జన్నారం మండలం లోని కలమడుగు సమీపంలోని అస్తీన మడుగు లో పూజ చేసి పూజ నీరు తీసుకొని ప్రయాణం సాగిస్తారు.
ప్రత్యేక నైవేద్యం
కేస్లాపూర్‌ గ్రామానికి చేరి మహా వటవృక్షము వద్ద భాజాబజంత్రీలతో వారి పూర్వీకులకు ఖర్మకాండలు నిర్వహించి నాగోబాదేవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు.మెస్రం వంశ ఆడపడుచులు,మహిళలు,అల్లుళ్ళు అందరు ఆలయాన్ని శుబ్రపరిచి పూజ నిర్వహించి పెళ్లిఅయిన వధువును పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు.దినినే భేటింగ్‌ అంటారు.
వంద కిలోమీటర్లు కాలినడక
మెస్రం తెగకు చెందిన కోడళ్ళు ఎడ్లబండి వెనుకాల కాలినడకన బయలుదేరుతూ వెదు రుతో తయారుచేసిన కొత్త గుల్లలో పూజా సామాగ్రి తీసుకుని బండి వెనుకాల కాలినడకన కేస్లాపూర్‌ చేరుకుంటారు.వీరు ముఖం నిండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరించి నాగోబా పూజలో పాల్గొంటారు. కలశంలో తీసుకువచ్చిన శుద్ధమైన గంగాజలంతో నాగోబా దేవుని, మరియు ఆలయాన్ని శుభ్రపరిచి సంగీత వాయిద్యా పరీకరాలైన డోలు, తుడుం,పిప్రే, కాలికోమ్‌,మొదలగు భాజాబజంత్రీలు వాయిస్తూ దేవుని ప్రత్యేక పూజలు చేసి నవధాన్యాలు, పాలు, బెల్లం మరియు కొత్త తెల్లటి వస్త్రాన్ని పుట్టపైన ఉంచి గ్రామ పటేల్‌,కటోడా, దేవారి, మరియు కోత్వాల్‌ మొదలైన వారు పూజ నిర్వహిస్తారు.అదే రోజు సాక్షాత్తూ నాగోబా దేవుడు ప్రత్యేక్షమవుతాడు అని ఆదివాసుల నమ్మకం.ఈ కార్యక్రమంలో మెస్రం వంశస్తుల తో పాటు,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్గఢ్‌,కర్నాటక, జార్ఖం డ్‌,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మొద లగు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, గిరిజనే తరులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం,నాగోబా విగ్రహానికి సంబందించిన కథ,పూర్వం మెస్రం వంశానికి చెందిన నాగాయి మోతి అనే ఒక రాణికి కలలో ఒక పాము వచ్చినీ కడపున జన్మిస్తానని చేప్పి అదృశ్యం అయ్యాడట.ఆమె గర్భం దాల్చి కొన్ని నేలల తర్వాత ఆమె కడపున నిజంగా పాము (నాగోబా దేవుడు) జన్మించడంతో ఆపాముకు తన తమ్ముడి కూతురు గౌరిదేవితో వివాహం జరిపించి ఆ తర్వాత అందరు కలిసి తీర్థ యాత్రకు గోదావరి వెళ్ళగా ఆ పాము మనిషి రూపంలో మారిందట. ఆశ్చర్య పోయిన గౌరి దేవి అచటి నుండి కేస్లాపూర్‌ చేరుకుందట. అంతలోనే మళ్ళి ఆ మనిషి పాము రూపంలో గౌరి దేవిని వెతుక్కుంటూ కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న పుట్టలో వెళ్ళిపోగా ఆ గ్రామ స్థులు ఆపుట్టకు పూజలు చేయడం మొదలు పెట్టారట, అలా మెస్రం వంశస్తులే అప్పటి నుండి ఆలయానికి ధర్మకర్తలుగా వుంటూ ఆలయాన్ని అభివృధ్ధి పరిచి పూజలు నిర్వహి స్తున్నారు.
కేస్లాపూర్‌లో దర్బార్‌
1941 సంవత్సరం నిజాం నవాబు కాలం నుండి ఆదివాసుల సమస్యలు-వాటి పరి ష్కారాల మీద కేస్లాపూర్‌ లో దర్బార్‌ నిర్వహిస్తు వస్తున్నారు, కాని గత 2019 సంవత్సరం నుండి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో గిరిజన దర్బార్‌కు కళ తప్పింది. నిజాంనవాబు 1941లో ఆదివాసుల స్థితిగ తులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇంగ్లాండ్‌ కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. ఆదివాసుల చారిత్రక విశేషాలను అధ్యయనం చెయ్యా లనుకున్న పరిశోధకులు,చరిత్ర నిపుణులు, ఉన్నతస్థాయి అధికారులు, విదేశీయులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి నాగోబా దేవుని పూజా నిర్వహిస్తారు.శతాబ్దం నాటి పౌరాణిక ప్రమాణాలను బట్టి కేస్లాపూర్‌ నాగోబా దేవుని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది.కేస్లాపూర్‌ నాగేంద్రుడి పూజ అనంతరం మెస్రం తెగవారు ఉట్నూర్‌ మండలంలోని శ్యాంపూర్‌ కు చేరుకొని నందిశ్వరుని(బోడుందేవుడు) పూజ నిర్వహించి, తిరిగి కేస్లాపూర్‌ చెరుకోని అక్కడి నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు.ఈ ఆదివాసుల జాతరతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నార్నూర్‌ మండలోని ఖాందేవుని జాతర,బేల మండలం సదల్‌పూర్‌లోని భైరం దేవుని జాతర,తిర్యాని మండలంలోని దంతన్‌ పల్లి భీమ్యక్‌ జాతర, మందమర్రి మండలంలోని బొక్కలగూడ కోవామొకాషీ జాతర,సిర్పూర్‌ (యు) మండలంలోని మహాదేవుని జాతర , కెరామెరి జాతర మొదలగు జాతరలకు నిలం మన ఉమ్మడి ఆదిలాబాదు.
ఎలా చేరుకోవచ్చు
ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ జిల్లా నుండి గుడిహత్నూర్‌ మీదుగా బస్సులో లేదా ప్రయివేటు వాహానాలలో ముత్నూర్‌ చేరుకోవాలి. మంచిర్యాల,ఆసిఫాబాద్‌ జిల్లా వాసులు బస్సులో గాని ప్రయివేటు వెహీకిల్‌ లోగాని ఇంద్రవెల్లి మీదుగా ముత్నూర్‌ చేరుకోవాలి ముత్నూర్‌ నుండి కేస్లాపూర్‌ నాగోబా దేవాలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్‌)`9491467715.-రాథోడ్‌ శ్రావణ్‌

5వ షెడ్యూల్‌లో నాన్‌ షెడ్యూల్డ్‌ ఆదివాసీలకు దిక్కేది?

వజ్రోత్సవ భారతావనిలో సమస్త ప్రజా నీకం అభివృద్ధి పేరుతో ముందుకు సాగు తుంటే రాజ్యాంగ రక్షణలు ఉండి అమలుకు నోచుకోని ఆదివాసీలు మరోపక్క అటవీ ఫలసాయంపై నిర్బం ధాన్ని ఎదుర్కొంటూ దుర్భర జీవితాన్ని గడుపుతు న్నారు. స్వాతంత్య్ర ఫలాలకు సుదూరంలో 5వ షెడ్యూల్డు హోదా పొందని ఆదివాసీ గూడేలు ఉమ్మడి రాష్ట్రంలో 805 దాకా ఉన్నాయి. అసలు వీరి జీవనానికి భరోసా ఏది? వీరికి కనీస హక్కు లేమిటి?వీరిపై పాలకులు వైఖరేమిటి ? ప్రజాస్వా మిక పాలనలో వీరికి ఏపాటి న్యాయం జరుగు తోంది? అనేవి సమాధానం లేని ప్రశ్నలు.- గుమ్మడి లక్ష్మీ నారాయణ
వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్న గిరిపుత్రుల దుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉం డటమే దీనికి కారణం.రాజ్యాంగంలో ప్రత్యేక హక్కు లున్నా,ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజ నులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పో తున్నారు.మరి,కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ?ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారా లు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామా లను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్ష ణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ గా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజనగ్రామాలను అయిదో షెడ్యూ ల్‌లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అం టారు.
2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 59,18,073 మంది గిరిజనులు ఉన్నారు.రాష్ట్ర జనాభాలో 6.6శాతం.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే తెగలు 30.మైదాన ప్రాం తాలలో నివసించే తెగలు 5కలిపి మొత్తంగా 35 ఉన్నాయి. గిరిజనులలో 70శాతం మంది షెడ్యూ ల్డ్‌ ఏరియా ప్రాంతంలో నివసిస్తుండగా,మరో 30 శాతంమైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. రాష్ట్రం లోని షెడ్యూల్డు ప్రాంతం31,485చ.కి.మీ. రాష్ట్రా లల్లోని ఉమ్మడి జిల్లాలపరిధిలో ఆదిలాబాద్‌, విజ యనగరం,వరంగల్‌,ఖమ్మం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,విశాఖపట్నం,శ్రీకాకుళం, మహ బూబ్‌ నగర్‌ (9)జిల్లాల్లోని 107మండలాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతము విస్తరించి యున్నది. వీటిలో 46మండలాల్లో పూర్తిగాను,61మండలాల్లో పాక్షి కంగాను ఆదివాసీలు నివసిస్తున్నారు. ఇందులో 5,948 గ్రామాలు రాష్ట్రపతి గెజిట్‌ లో గుర్తించబ డినవి. ఇంకా నాన్‌-షెడ్యూల్డు గ్రామాలుగా మిగిలి నవి 805. వీటికి షెడ్యూల్డ్‌ గుర్తింపు లేదు.1950 రాజ్యాంగ గెజిట్లో షెడ్యూల్డు గ్రామాలను గుర్తించే ప్రభుత్వ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతా లలోకి వెళ్ళేమార్గం లేక గుర్తించలేదు. అది ఒక కారణమైతే, సాంకేతికలోపంగా భావించిన ప్రభు త్వం1980 దశకంలో అప్పటి ప్రభుత్వం గిరిజన జిల్లాల్లో సర్వేచేయించింది. ఆసర్వే ప్రకారం మిగిలిన గ్రామాలు
జిల్లాలు నాన్‌-షెడ్యూల్డు గ్రామాలు
ఆదిలాబాద్‌ 164
విజయనగం 170
వరంగల్‌ 87
ఖమ్మం 18
తూ.గోదావరి 44
ప.గోదావరి 10
విశాఖపట్నం 55
మహబూబ్‌ నగర్‌ 18
శ్రీకాకుళం 240
మొత్తం 805
ఈ 805 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఫైలు పంపిం చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇలా 72 ఏళ్ల నిరీక్షణలో..రాష్ట్రంలో 78.24శాతం గ్రామాలకు నేటికి కరెంటు సౌకర్యం లేదు.68.8 శాతం గిరిజన విద్యార్థులు ప్రాధమిక విద్యలోను, ఉన్నత విద్యలోను వెనుకబడి ఉన్నారు. షెడ్యూల్డు ఏరియా విద్యార్థుల అక్షరాస్యత శాతం పురుషులది 17% మహిళలది 8.68% గా వున్నది. నేటికి 90శాతం గిరిజనులు కనీస వసతి సౌకర్యాలు లేక జీవిస్తున్నారు. 49 శాతం గిరిజనులు పౌష్టికాహార లోపంతో జీవిస్తు న్నారు.65% గిరిజనులు దారిద్య్రపు రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఆదివాసీ మహిళలలో ప్రతి 1000 మందికి 80మంది ప్రసవ సమయంలో బిడ్డతో సహాతల్లి కూడా మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రం లో ప్రసవ సమయంలో చనిపోయో మహిళల సగటు 3.65%గా వుంది. శిశు మరణాల రేటు రాష్ట్రంలో53శాతంగా వుండగా,ఒక్క ఆదిలా బాద్‌ ఏజెన్సీలోనే 63శాతంగా వుంది. రాష్ట్రంలో 90 శాతం మంది ఆదివాసీ గిరిజనులు రక్తహీన తతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో 9జిల్లాల్లో ఆదివాసీల అభివృద్ధికై సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి. డి.ఏ) లు పనిచేస్తున్నా నేటికీ నాన్‌-షెడ్యూల్డు గూడే లకు ఐ.టి.డి.ఏ.ల నుండి ఆర్థిక ఫలాలు అందక సతమత మౌతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో దేశం లోని ఆదివాసీల సామాజిక పరిస్థితిని మెరుగు పరుచుటకు ప్రత్యేక పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో గిరిజనులు కోసం నిర్దేశించిన 5వషెడ్యూల్‌లో ప్రత్యేక విధివిధా నాలు, షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన విధానం రాజ్యాం గంలో షెడ్యూల్డు క్రింద పేర్కొనబడిన రాజ్యాంగ అధికరణం 244 వివరిస్తుంది. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి విషయాలపై సలహా లు ఇచ్చేం దుకు గిరిజన శాసన సభ్యులతో కూడిన సలహా మండలి ఏర్పాటు జరుగుతుంది.పార్లమెంటు లేదా శాసనసభ్యులు చేసే చట్టాలు ఏజెన్సీ ప్రాంతాలలో అమలు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు అధి కారం ఉంటుంది.గవర్నర్‌ ఆమో దించిన నిబంధ నలు రాష్ట్రపతి ఆమోదంపై అమ లులోకి వస్తాయి. గవర్నరును సంప్రదించిన తరు వాత ఏప్రాంతా న్నైనా షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించక పోవడం వలన సుమారుగా రెండు లక్షలమంది ఆదివాసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ,సంక్షేమ అభివృద్ధి ఫలాలను పొందలేక పోతున్నారు.1939 సంవత్సరాల ముందు షెడ్యూ ల్డు ప్రాంత ఆదివాసీ గిరిజనులు ఎలాంటి పరిస్థితు లలో ఉండే వారో స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లకు కూడా నాన్‌-షెడ్యూల్డు ఆదివాసీలు అదే స్థితిలో వున్నారు.నాన్‌ షెడ్యూల్డు ఆదివాసీ గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదేమో?వారికి రాజ్యాం గం ఇంకా అమలు కావలసి వుంది. షెడ్యూల్డు ఏరియాలలో గత31సం.లుగా 805 గ్రామాలలో రెండులక్షల మంది ఆదివాసీలు తమ హక్కుల గురించి పాలకుల దృష్టికి తెచ్చినా ఫలించడం లేదు. 2005లో ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ సూచనలు (74)ఆమోదిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.నెం.1049సహితం నాన్‌-షెడ్యూల్డు గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతంలో కలపాలనే చూపుతున్నాయి. ఇన్నాళ్ళుగా 5వ షెడ్యుల్డు సాధన కమిటి మరియు వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు,సంస్థలు ఒత్తిడి తేగా కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మేల్కొంది. 2001 జనాభా వివరాలు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఫైలును తిరిగి రాష్ట్రగిరిజన సంక్షేమశాఖకు తిరిగి పం పింది. ఈలోగా ఎన్నోసార్లు మంత్రి మండలి సమా వేశాలు జరిగాయి. కానీ మన ప్రతిపాదన మాత్రం కేబినెట్‌ మంత్రిమండలి ఆమోదానికి పెట్టడం లేదు. ఎందుకంటే 5వషెడ్యుల్డులోని నాన్‌ -షెడ్యూ ల్డు గూడెంలలో అపారమైన ఖనిజ సంపద బొగ్గు నిక్షేపాలు, అల్యూమినియం బాక్సైట్‌, సున్నపురాయి గ్రానైట్స్‌, ఇసుక మొదలగు ఖనిజ సంపదతో నిండి వున్నాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదివాసీ గూడేలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించినట్లయితే 5వషెడ్యూల్డు ఏరియాలోని ఆది వాసులకు సర్వహక్కులు ఉంటాయి గనుక అక్కడి ఖనిజ సంపదను వెలికి తీయాలంటే ఫెసా చట్టం ప్రకారం ఆదివాసీలతో గ్రామసభ నిర్వహించి ఆ సభల తీర్మానం పొందిన తరువాతనే ఖనిజాలను వెలికి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రాజ్యం నాన్‌-షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించడంలేదని అనుకోవచ్చు. ఆదివా సీల సంక్షేమం కోసం పాటుపడవలసిన ఈ రాజ్యం ఆదివాసీల మనుగడను పూర్తిగా అంతం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అంటే ఆదివాసీ ప్రజా నీకం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంకాదా? వారి పట్ల ఈ రాజ్యాంగానికి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ? 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రధానంగా భూమి సమస్య షెడ్యూల్డు ఏరియాలో అమలయ్యే 1/70 వంటి చట్టాలు ఉన్నప్పటికి ఈ ప్రాంతాలలో 7.50 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఉన్నది.
షెడ్యూల్డు హోదాలేని ప్రాంతాలలో ఆదివాసీ భూముల పరిస్థితి అగమ్యగోచరం. ఈ చట్టం అమలులో లేనందున ఆదివాసీలు నష్టపో తున్నారు. కొన్ని వేల ఎకరాల భూములు భూస్వా ముల చేతులలోకి వెళ్ళినవి. భూవివాదాలు సివిల్‌ కోర్టు పరిధిలోకి వస్తున్నందున భూస్వాములు, ధనికులు, గిరిజనేతరులు అమాయక ఆదివాసీలను కోర్టుల చుట్టూ తిప్పుతూ ఆర్ధికంగా దివాళా తీయి స్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీసుల గురించి చెప్పన వసరం లేదు.నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని భూమి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు విఫలమయ్యారని ఉమ్మడిరాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ అభిప్రాయపడుతున్నారు.గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియాల అంశా లను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. ‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా,అటవీ హక్కుల చట్టాల కింద గ్రామసభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభు త్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది.ఈ విష యా లను గుర్తించి,మీరు తగినచర్యలను తక్షణమే తీసు కుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

  1. నిరుపేదలకు చెందవలసిన‘డి’పట్టాలు, ధనికులు భూస్వాములు పొందుతున్నారు.
  2. బంజరు భూములను ధనికులే ఆక్రమించు కుంటున్నారు.
  3. గిరిజనుల నుండి గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్న క్రమం తనాఖా-స్వాధీనం ‘‘డి’’ పట్టా భూములు
  4. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్నా పట్టాలు రాని భూములు.
  5. గిరిజనులకు పట్టాలు మంజూరైనా భూములు అప్పగించని కేసులు.
  6. గిరిజనుల పేరున ఇతరులు అనుభవిస్తున్న (సీలింగ్‌ బంజరు) భూములు.
  7. ఒక గిరిజనుడు సాగు చేస్తుండగా వేరొకరికి పట్టాలు మంజూరైన కేసులు.
  8. గిరిజనేతరుల భూములను సాగు చేస్తున్నా వర్తించని సాగు కౌలు హక్కులు.
  9. జిరాయితి భూమి సాగు చేస్తున్న రెవెన్యూ రికార్డులకు ఎక్కని గిరిజనులు.
  10. గిరిజనేతరులు తప్పుడు ఇంజక్షన్‌ డిక్రీలు తెచ్చి భూముల నుండి గిరిజనులను దౌర్జన్యంగా వెళ్లగొట్టేసే కేసులు.
  11. సర్వే స్టేట్మెంట్‌ వివాదాలు
    ఇలా చాలాభూవివాదాలు,నాన్‌-షె డ్యూల్డు గ్రామాలలో ఉన్నాయి. వీటిని పరిష్కరిం చుకోవాలంటే కోర్టు, రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై అవగాహన ఉండాలి. ఇవేవి ఆదివాసీలకు తెలియ నందున గిరిజనేతరుల ఆధిపత్యం కొనసాగు తున్నది. భారత రాజ్యాంగంలో 5వషెడ్యూల్డు (1) పేరా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ స్థానిక ఆదివాసీలచే భర్తీ చేయాలనిజి.ఓ.నెం.275 ను 1986లో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవరిస్తూ 2000లో జనవరి 10న జి.ఓ.నెం.03 ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగా లన్నీ స్థానికఆదివాసీలకే రిజర్వు చేయబడుతు న్నాయి. కానీ నాన్‌-షెడ్యూల్డు ఏరియా ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో అన్యాయం జరుగు తోంది. విద్య,ఉద్యోగ అవకాశాలు లేక ఆదివా సీలు నిరాశ్ర యులవుతున్నారు.కాగాఈ జీవో 3 గిరిజనేత రుల కారణంగా 2020ఏప్రిల్‌ 20నుంచి సుప్రీం కోర్టులో స్టే విధించ బడిరది.
    అధికరణలు330,332,334 ప్రకారం పార్లమెంటు నుండి క్రింది స్థాయి వార్డు సభ్యుల వరకు షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసీలకే చెందు తాయి. కానీ, నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని వీరు పరుల పాలనలో మగ్గుతున్నారు. వీరు ప్రత్యేకమైన సంస్కృతి,ఆచార,సంప్రదాయాలు, జీవన విధానం కలిగినను స్థానికేతరుల పాలనలో దోపిడికి గురౌ తున్నారు. కేవలం అటవీ ఫలసాయం, పరస్పర వస్తు మార్పిడితో సహజీవనం సాగించే ఆదివా సీలు నేటికి నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోఉండడం, సవరించిన చట్టాల వల్ల అటవీ అధికారుల దౌర్జ న్యాలు పెరుగుతున్నాయి. అటవితల్లి గుండెల్లో జీవించే ఆదివాసులకు బతుకు భారం అవుతుంది. వారు షెడ్యూల్డు ఏరియా హక్కులకు నోచుకొనేది ఎప్పుడు?కనీసం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా సంఘాలు, మానవ హక్కుల, పౌరహక్కుల సంఘా లు, ప్రధాన ప్రతిపక్ష, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు దీనినిగూర్చి మాట్లాడే పరిస్థితి లేదు. షెడ్యూల్డు హోదాకోసం నాన్‌-షెడ్యూల్డు ఏరియా గ్రామాల ఆదివాసీలు సంఘటితమై మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధంకాకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకమే!-
    వ్యాసకర్త : ఆదివాసీ రచయితల వేదిక,సెల్‌ : 9491318409

ఈ పాపం ఎవరిదీ..?

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానొకటి ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమా దాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.!ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియ రాలేదు. అయితే సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడంవల్లే ఈపెను విషా దం సంభవించినట్లు రైల్వేశాఖ ప్రాధమిక దర్యాప్తు లో తేలింది.ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణించగా మరో 1000 మంది వరకు గాపడ్డారు. రైలు ప్రమాదాలకు సంబంధించి దేశ చరిత్రలోనే భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించిన ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తున్నాయి.
ఒక్క ప్రమాదం..అనేకప్రశ్నలు.. మరె న్నో అనుమానాలు..ఒడిశాలో ఘోర రైళ్ల ప్రమా దం యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూ డు రైళ్లు ప్రమాదానికి గురికావడం, భారీగా ప్రాణ నష్టం సంభవించడం దేశ ప్రజలకు షాక్‌కి గురి చేసింది.అంతా నిమిషాల్లోనే ఘోరం జరిగి పో యింది.ఏం జరిగిందో తెలుసుకునేలోపే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది?కవచ్‌ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా? రైల్వే శాఖ ఏమంటోంది..కవచ్‌ వ్యవస్థ ఉండి ఉంటే ఒడిశా రైలు ప్రమాదం జరిగేది కాదని ప్రతిపక్షాలు అంటుంటే,కవచ్‌ సిస్టమ్‌ ఉన్నా ఈ ప్రమాదాన్ని ఆపేది కాదని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. అసలు ఒడిశారైలు ప్రమాదానికి కారణాలు ఏంటి? ఒక్క ప్రమాదంలో మూడు రైళ్లు ఇన్వాల్స్‌ అయి ఉండటం ఏంటి?అన్న ప్రశ్నకు సమాధానం దొర కడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్న ఇండియన్‌ రైల్వేస్‌ కూడా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం లేదు. సిగ్నలింగ్‌ ఫెయిల్యూల్‌ అని ఒకసారి,ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ లో మార్పువల్ల ప్రమాదం జరిగిందని మరోసారి చెబుతున్నారు.సిగ్నలింగ్‌ ఫెయిల్యూర్‌ అని ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. ఇలా అనేక రకాల ఊహాగానాలు, ఎన్నో అంతు చిక్కని అనుమానాలకు కేరాఫ్‌ గా మారింది ఒడిశా రైలు ప్రమాదం.ఒడిశా ఘోరరైలు ప్రమాదం విష యంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్‌ వ్యవస్థ తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. రైలు ప్రమాదాలు జరక్కుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. బాలాసోర్‌ ప్రాంతంలో కవచ్‌ సిస్టమ్‌ లేదని, ఒకవేళ కవచ్‌ ఉంటే ప్రమాదమే జరిగి ఉండేది కాదంటున్నారు. వందలమంది ప్రాణాలుకోల్పోయే పరిస్థితి ఉండేది కాదంటున్నారు ప్రతిపక్షాల నేతలు. అయితే, ఒడిశా రైలు ప్రమాదానికి,కవచ్‌ వ్యవస్థకు సంబంధమే లేదని కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌. కవచ్‌ ఉన్నా ఒడిశారైలు ప్రమాదం జరిగేది ఆయన తేల్చి చెప్పారు. సిగ్నలింగ్‌ సిస్టమ్‌ ఫెయిల్యూర్‌ తో పాటు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు.ఈ రెండిరటికి కవచ్‌ వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
అసలు కవచ్‌ ఏంటి? కవచ్‌ సిస్టమ్‌ రైల్వే ప్రమాదా లను ఎలా అరికడుతుంది?
ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఈ కవచ్‌ సిస్టమ్‌ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్నప్పుడు అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ కవచ్‌ టెక్నాలజీని 2022లో తీసుకొచ్చింది. కవచ్‌ టెక్నాలజీ ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం రూ.400కోట్లుఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని తీసుకొ చ్చింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది.అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపి స్తుంది. అందువల్ల రైళ్లు ఢీకొనవు.రెడ్‌ సిగ్నల్‌ పడినా లోకోపైలెట్‌ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళితే ఎదురుగా ఇంకో రైలు వచ్చినప్పుడు ఆటో మేటిక్‌గా రెండు రైళ్ల స్పీడ్‌ని తగ్గించి ప్రమాదం జరక్కుండా చూస్తుంది ఈకవచ్‌ సిస్టమ్‌.ట్రాక్‌ బాగో లేకపోయినా,టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ ఉన్నా ఆటో మేటిక్‌గా బ్రేకులేస్తుంది ఈకవచ్‌ సిస్టమ్‌.వంతెనలు,మలుపుల దగ్గర రైలు స్పీడ్‌ని తగ్గిస్తుంది.
కవచ్‌..ఓహై టెక్నాలజీ.అందులో డౌట్‌ లేదు. రైలు ప్రమాదాలను అరికడుతుందని చెప్పడంలో సందే హమే లేదు.అయితే,ఒడిశా రైలు ప్రమాదం మాత్రం ఈ కవచ్‌ సిస్టమ్‌ పరిధిలో జరగలేదని చెబుతోంది రైల్వేశాఖ. కవచ్‌ సిస్టమ్‌..ఒకే ట్రాక్‌ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని వివరి స్తున్నారు. కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు.. సిగ్నలింగ్‌ వ్యవస్థ ఫెయిల్యూర్‌ కారణంగా లూప్‌ లైన్‌ లోకి వెళ్లిందని..అప్పటికే లూప్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి ఉంది.120కిలోమీటర్ల స్పీడ్‌తో ఉన్న కోరమాం డల్‌ ఎక్స్‌ప్రెస్‌..గూడ్స్‌ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు బోగీలు గాల్లోకి ఎగిరి అవతలి పట్టాలపై వస్తున్న బెంగళూ రు ఎక్స్‌ప్రెస్‌ బోగీలపై పడ్డాయి. దాంతో బెంగ ళూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలులోని మూడు బోగీలో బోల్తా పడ్డాయి. ఆ ట్రైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం..కవచ్‌ సిస్టమ్‌ ఉన్నా జరిగేదని,కవచ్‌ సిస్టమ్‌ ఒకే ట్రాక్‌ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.
వ్యవస్థాగత లోపమే
దేశంలో రైలు ప్రమాదాలు జరిగిన ప్పుడల్లా అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామనిప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటారు. ఒడిశా ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ కూడాఅదే ప్రకటన చేశారు. కానీ,‘పట్టాలు తప్పిన రైల్వే’ పేరుతో కాగ్‌ ప్రచురించిన నివేదికలో దేశంలోని 90శాతం ప్రమాదాలకు వ్యవస్థాగత వైఫల్యాలే కారణమని కుండబద్దలు కొట్టింది. రైల్వేల్లో కీలకమైన భద్రత విభాగంలో ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రభుత్వం నిలిపేసిందని,ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నదని కాగ్‌ తెలి పింది. ఉద్యోగుల సంఖ్య తగినంత లేకపోవటంతో భద్రత విషయంలో రైల్వేశాఖ నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నదని విమర్శించింది.- (సైమన్‌/దవరసింగి రాంబాబు)

స్వీయ అనుభూతి గురి

నేటితరం గిరిజనసాహిత్యంకు ప్రామాణికతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా…’’వర్తమాన గిరిజన సమాజానికి కావలసింది సానుభూతి సాహిత్యం కాదు సహను భూతి సాహిత్యం’’ అని ఘంటాపధం గా చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న నేటి కాలపు బంగారు భవిత కలిగిన రచయిత నేటి తరం యువతరానికి ఆదర్శనీయుడు ‘‘మల్లిపురం జగదీశ్‌’’ మలి కథా సంపుటి ‘‘గురి’’,2013 నుంచి 2018సం: మధ్యకాలంలో రాయబడ్డ ఈ 13 కథల్లో.. ఉత్తరాంధ్ర ప్రాంతపు గిరిజన సమాజం ప్రపంచీకరణ పడగ నీడన ఎలా విలవిలలాడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షర బద్ధం చేశారు.
అయితే ఈ వ్యధలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు యావత్తుదేశానిదికూడ…!! రచయిత తను స్వయంగా సవిచూసిన విషయాలను అక్షరబద్ధం చేసే బాధ్యతలో భాగంగా తనదైన కథా శైలిలో అభివ్యక్తీకరించారు, దీనిలో ప్రతి కథ తన గిరిజన సామాజిక కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తుంది.
మానవ సంబంధాలు అన్ని ‘‘మనీ సంబంధాలు’’గా రూపాంతరం చెందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో.. అడవి బిడ్డల మునుగుట ప్రశ్నార్థకం అయిపోతున్న కాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తూ జాగృతం చేసే లక్ష్యంతో వ్రాయబడ్డ కథలుగా కనిపిస్తాయి ఇవన్నీ.
అన్ని మార్గాల ద్వారా దాడికి గురి అవుతున్న అడవి బిడ్డల దయనీయ స్థితిని అద్దం పడుతున్న ఈ ‘‘గురి’’ కథాగుచ్చంలోని పతాక శీర్షిక అయిన కథ విషయానికొస్తే తరతరాలుగా ఆదివాసి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలు దరిమిలా అడవి బిడ్డల్లో వస్తున్న తిరుగుబాటు తత్వం గురించి అక్షరీకరించిన కథ ‘‘గురి’’ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసి బిడ్డల జీవితాలపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాగిస్తున్న అణచివేత ధోరణి తీరు ఆధునిక పాఠక లోకానికి ఆశ్చర్యం కలిగించక మానదు, ఆధునిక కాలంతో పాటు అడవి బిడ్డల బ్రతుకు చిత్రాల్లో ఆధునిక జీవన సరళి అగుపిస్తున్న అణచివేత కూడా అదే స్థాయిలో ఆధునిక పంథాల్లో సాగటం పట్ల రచయితతో పాటు పాఠకులు ఆగ్రహించి నివారణోపాయాలు గురించి ఆలోచించాల్సిన తరుణమిది.గురి కథలు మంగులు అతని కొడుకు సత్యం ఏవిధంగా పెత్తందారులైన భూస్వాముల అరాచకాలకు బలి అయ్యారో మల్లిపురం జగదీశ్‌ తనదైన కథన శైలిలో కళ్లకు కట్టారు. మంగులు,సత్యం తండ్రి కొడుకులు ఇద్దరి కథనాల్లోనూ సంఘవిద్రోహక శక్తులుగా భావించబడుతున్న నక్సలైట్ల పాత్రను కథా రచయిత భావ గర్భితంగా సూచించారు, వారివల్ల అడవి బిడ్డలకు మేలా? కీడా?? అనే విషయాన్ని కాలానికి వదిలివేసిన, తల్లి తండ్రి అన్యాయాలకు బలై అనాధ అయిన సత్యం బ్రతుకుతెరువు కోసం పట్టణం తరలి పోయిన అతని పోరాట దృక్పథంలో మార్పు రాలేదు సరి కదా అది వారసత్వంగా తన కూతురు గీతకు ఆపాదించిన వైనం పోరాటస్ఫూర్తి, అందులోని సజీవత్వం ఆవిష్కరించబడతాయి. మహానటి సమాజంలో అక్రమాలను ఎదిరించిన తండ్రి మంగులు మంత్రగాడి నేరంతో సమా జానికి దూరం చేయబడితే నీటి కాలానికి చెందిన అతడి కొడుకు సత్యం తండ్రిలో ధనవంతులు అన్యాయాన్ని ఎదిరించి ఇన్ఫార్మర్‌ గా నేరం మోపబడతాడు అక్కడ సత్యం తప్పించుకుని నగరం బాట పడితే ఇక్కడ అతని కూతురు గీత తండ్రికి జరిగిన అన్యాయానికి ఎదురునిలిచి గురి పెట్టడం ద్వారా రచయిత గిరిజన సమాజానికి స్ఫూర్తిని ధైర్యాన్ని అందిస్తూ కథను ఉత్తమ కథా లక్షణాలతో ముగిస్తారు. బిడ్డల కష్టాల గురించి కథా రచయిత పరిశీ లించిన తీరు కోణాలు ఔరా అనిపిస్తాయి.’’ నిత్య నిర్వాసితులు’’ కథలో ప్రభుత్వ అధికారులు వారికి గల నియమాలను బూచిగా చూపిస్తూ అమాయకులైన ఆదివాసి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో వివరిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టులవంటి బహుళార్థక కట్టడాలకు మొదట బలయ్యేది అడవి బిడ్డలే !! పాలకులు ప్రాజెక్టుల ద్వారా పంట భూములు విస్తీర్ణం పెంచుకొని నీటి సౌకర్యం పెంచుతు న్నామని ఏక కోణం ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఎప్పటినుంచో ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డల జీవి తాలు నిత్యనిర్వాసితం అయిపోతున్నాయనే మానవత్వపు ఆలోచనలు మన అధికారులకు కానీ పాలకులకు కానీరాకపోవడంపై రచయిత తీవ్ర విముఖత వ్యక్తం చేశారు ఈ కథలో. పెల్లివలస అనే గిరిజన గ్రామం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వలసరాగ దురదృష్టవశాత్తు ఆ గ్రామం అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది దానికి కేవలం తత్కాలిక తిండిగిం జలు పంపిణీ సాయంతో సరిపెట్టారు అధికా రులు,అది రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కాలేదు కనుక పక్కా గృహాలు మంజూరు చేయలేమన్న అధికారుల అలసత్వం ఈ కథలో చూపించారు రచయిత. నిర్వాసిత గ్రామంలో ప్రకటించ డంలో అధికారులు చేసిన అలసత్వంవల్ల అమాయకులైన ఆదివాసీలు ఎలా నష్టపోయారో ఉదాహరిస్తూ ఇలాంటి చేయని నేరాలకు ఎలా శిక్షలు అనుభవిస్తున్నారో రచయిత ఇందులో వివరించిన వైనం హృద్యంగా సాగుతుంది, ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అన్నట్టు ఇవి కతలు కావు ఆదివాసి వెతలు, అడవుల్లో జరుగుతున్న అభివృద్ధి ఆధునీకరణల వల్ల అడవి బిడ్డలకు దక్కే ఫలా లు గోరంత అయితే పెట్టుబడిదారులకు కొం డంత ఆదాయం దక్కుతుంది అనే వాస్తవ విష యాలు చెప్పడంలో రచయిత మల్లిపురం గారు విజయం సాధించారు. యుగయుగాలుగా అభి వృద్ధి యజ్ఞంలో మొదట బలయ్యే’’బలిపశువు’’ ఆదివాసినినే అన్న రచయిత భావనలో నిండు నిజాం దాగి ఉంది. అలాగే ఆదివాసీ లకు ఆరోగ్య రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు నగరా లను ఎంత అభివృద్ధి చేస్తే ఏమిటి అని ‘‘డోలి’’ కథలో రచయిత ప్రశ్నిస్తారు, అడవి బిడ్డల్లో వస్తువ్యామోహం పెంచి అధిక లాభాలతో వారిని అప్పుల పాలు చేస్తున్న నాగరిక వ్యాపా రుల తీరును ఎండగట్టిన తార్రోడ్డు కథ, భూ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీలు చివరికి భూమిని పోగొట్టు కున్న వైనాన్ని ధైన్యం గా చూపించిన కథ ‘‘తాండ్ర చుట్ట’’. సభ్య సమాజానికి తెలియని అడవి బిడ్డల ఆగచాట్లు ఎన్నో ఈ ‘‘గురి’’ కథా సంపుటిలో కనిపిస్తాయి, ఈ కథల్లో ఇంత ఘాడతకు కారణం రచయిత ఓగిరి పుత్రుడు కావడమే, అతడు గిరిజనుల ను చూసి రాసిన కథలుకావు, వారితో మమేకమై వ్రాసిన కథలు నిజమైన గిరిజన కథలకు నిల యమైన మన మల్లి పురం జగదీశ్‌ కథలు ప్రతి ఒక్కరికి అవసరం, గిరిజన జీవితాల పరిశో ధకులు ప్రత్యేకించి చదవదగ్గది –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

పొగ మహామ్మారిని తరిమెద్దాం..!

సిగరెట్‌ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సా హంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో పదేళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘ పొగతా గడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. పొగతాగడం ద్వారా ఎన్నో హాని కరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్వి రామంగా కాలు స్తూనే ఉంటే మన జీవితం వెలుగు తున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపో వడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనో ధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరిక తో దానిని జయించాలి. హానికరమైన వ్యస నాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్‌ కరకాలు అని గుర్తించాలని… గత 20 ఏళ్లగా పొగాకు నియంత్రణపై ప్రచార ఉద్యమం చేపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఓ డిప్యూటీ తాహశీల్దార్‌ ‘‘ మాచన రఘునందన్‌’’ మే 31న పోగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘థింసా’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇదీ!
మేడ్చల్‌ జిల్లా కేశవరంకు చెందిన ‘‘మాచన’’.. రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ..మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే…పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ రఘునందన్‌ని ‘‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’’గా గుర్తించింది. అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా రఘునందన్‌ విజయగాధను వావ్‌..వెల్డన్‌. అని కొనియాడిరది. ఈమధ్యే రఘునందన్‌ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే…ఆయన ఆశయాలు..వాటికై ‘‘మాచన’’ పోరాటం గురించి తెలుసుకున్న పలు వురు రఘునందన్‌ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు ‘‘మాచన’’. రఘునందనంటే ఓనిబద్ధత గల ఉద్యోగి…తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే…తమ హక్కులకై పాత పింఛన్‌ విధానంపై పోరాడే ప్రచార కార్యదర్శి…పొగాకును కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి.. వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం..మొత్తంగా మన రాష్ట్రం వాడు..మనవాడు…నిత్యం అందరిలో ఒకడు.
పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటం
సిగరెట్‌ తాగకు..పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యే తర రంగానికి చెందిన వ్యక్తికి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓనమ్మ లేనినిజం. మాచన రఘునందన్‌ది పౌర సరఫరాలశాఖలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్‌.తన జీవితంతో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథంలో ప్రయాణిస్తూ..మేం సిగరెట్‌,బీడీ,తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. రఘునందన్‌ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటిస్తారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠంలో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోషగా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్‌ క్యాన్సర్‌ డే, నో స్మోకింగ్‌ డే, వరల్డ్‌ నో టబాకో డేలు ఓ అవగా హన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరం లో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ మాచన రఘునందన్‌ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్‌ కిల్స్‌,క్విట్‌ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్‌పై తిరుగుతూ పొగాకు కాన్సర్‌ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా..ఎటువంటి అవా ర్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్‌.
సామాజిక ఉద్యమశీలి
వాస్తవానికి నా వృత్తి డిప్యూటీ తహశీల్దార్‌ హోదా ఉన్న వ్యక్తికి…ప్రవృత్తిగా సమాజం కోసం ఏదో సాధించాలన్న తపన..ఆ తపనకు తగ్గ కమిట్మెంట్‌ ఉండట మంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటి వారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘు నందన్‌ మాచన. పౌరసరఫరాలశాఖలో ఓ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు,తనిఖీలు నిర్వహించే క్రమంలో… ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్‌ గురించి చెప్పుకోవడ మెందుకు..? తన సర్వీస్‌లో మాచన రఘు నందన్‌కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు..కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘు నందన్‌ డెడికేషన్‌ జర్మనీ దేశాన్నీ టచ్‌ చేసింది. ఇప్పుడు రఘునందన్‌ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామా జిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలురాసే వాళ్లేకనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్‌ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌..తన కార్యక్రమా లకు రఘునందన్‌ ను ఆహ్వానిస్తోంది. అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్‌ ఛండీ గడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జా తీయ సదస్సులోనూ ‘‘మాచన’’నే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్‌ బై చెప్పే అవగా హన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్‌ సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్‌ జిల్లా దాటి..రాష్ట్ర వ్యాప్తమై.. దేశం గుర్తించి…అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది. ఇలా రఘునందన్‌ అటు వృత్తిలోను ఇటూ ప్రవృత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించు కుంటున్నవారు.
ప్రతిభకు పట్టాభిషేకం
రఘునందన్‌ విద్యదశలో ఉన్న సమయంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలపై తనదైన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ జర్నిలిస్టుగా,సామాజిక కార్యకర్తగా తెలంగాణా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. ఈనేపధ్యంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ (2009)లో కేంద్ర ప్రజా సంబంధాల సమాచార బోర్డు కాష్టింగ్‌,మంత్రిత్వశాఖ ఏపీ తరుపున ఉత్తమ సామాజిక/పాత్రికేయడుగా ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15మంది టీమ్‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘా లయ,త్రిపుర,మిజోరాం,వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాలపై పరిశోధన చేశారు.ఆ బృం దంలో రఘునందన్‌ ప్రత్యేక గుర్తింపు పొం దాడం విశేషం. స్థానికంగా రఘునందన్‌ చేస్తున్న సామాజిక కృషిని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఉన్నతాధికారులు సైతం తన ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ ప్రశంసలు కురిపిస్తూన్నారు. రఘునందన్‌ చేస్తున్న ఈ జర్నీ మరింత ముందు కెళ్లాలని…మరెందరో అధికారులకు,సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓప్రేరణ కావాలనీ ఆశిద్దాం.! – గునపర్తి సైమన్‌

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం 

పార్లమెంట్‌ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని జాతికి నేడు అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీని మీద అనేక వర్గాలు ఆందోళన చేయటం, ఈ వేడుకకు విపక్షాలు వెళ్లగూడదని నిర్ణయించటమూ తెలిసిందే. భిన్న భాషలు, భావజాలం, సంస్కృతి, సంప్రదాయాలతో విలసిల్లుతున్న ఈ సువిశాల భరతభూమిలో.. వీటన్నిటినీ ఒకే తాటి మీదకు తెచ్చి ఐక్యత రాగాన్ని ఆలపించే వేదికగా భాసిల్లుతున్నది మన పార్లమెంటు. అటువంటి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం అన్ని పక్షాలూ కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన వేడుక. కానీ, అది వివాదాస్పదమవటం దురదృష్టకరం!
నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహత్తర కార్యక్ర మంలో రాజ్యసభ ప్రమేయం లేకపోవటం ఆశ్చ ర్యం.ఈ నూతన పార్లమెంటు భవనంలో రాజ్య సభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయం ఉంటాయిగదా!మరి రాజ్యసభను ఎందుకు భాగ స్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. రాజ్యాం గంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట.అందువల్లనే, ఉభయ సభలు ఓ బిల్లును ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే అది చట్టంగా రూపుదిద్దుకుంటుంది.ఆబిల్లు పార్ల మెంటు ఆమోదం పొందింది అని అప్పుడు అను కోవాలి. అయితే, చాలామందికి పెద్దగా తెలియని విషయమేమిటంటే పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానికి ప్రత్యేక స్థానం అంటూ ఏమీ లేదు. అందరు పార్లమెంటు సభ్యులలాగే ప్రధాని గూడా ఒక సభ్యుడు (సభ్యుడు కాకుండాగూడా ఓఆరు నెలలు మంత్రిగానో, ప్రధానిగానో కొనసాగే వెసులు బాటు మన రాజ్యాంగం కల్పించింది. అది వేరే విషయం). అందరు మంత్రుల్లాగే ప్రధానికి ఒక గది ఉంటుంది. సభ్యుడైతే తాను సభ్యుడైన సభకి నాయకుడు (శ్రీవaసవతీ శీట ్‌ష్ట్రవ ష్ట్రశీబంవ)గా వ్యవహ రిస్తారు. అంతకు మించి ప్రధానికి పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకత ఏమీ లేదు. పార్లమెంటు ప్రాంగణం అంతా లోక్‌సభ స్పీకరు ఆధ్వర్యంలో ఉంటుంది. స్పీకరుని పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని కలవాలంటే, ప్రధానే స్పీకరు గదికి వెళ్తారు గానీ స్పీకరు ప్రధాని గదికి రారు. అది స్పీకరుకి పార్లమెంటులో అత్యున్నత గౌరవం యిచ్చే ఒక మంచి పార్లమెంటరీ సంప్రదాయం. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే, పార్లమెంటరీ వ్యవస్థలోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ప్రధానికి ప్రత్యేక స్థానం ఏదీ లేదని. నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహ త్తర కార్యక్రమంలో రాజ్యసభ ప్రమేయం లేకపో వటం ఆశ్చర్యం. ఈ నూతన పార్లమెంటు భవనం లో రాజ్యసభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాల యం ఉంటాయిగదా! మరి రాజ్యసభను ఎందుకు భాగస్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. పార్లమెంటు అంటే లోక్‌సభ ఒక్కటే కాదు గదా! పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రెండు సభలూ. అటువంటప్పుడు నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదగా జరగటం ఏమిటన్న ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్నది. పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని విస్మరించి ప్రధాని చేతుల మీదగా ఈ వేడుక జరగటం రాజకీయాలతో సంబంధం లేని చాలామంది దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతు న్నారు.పైగా,ఈ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన గూడా ప్రధాని చేతుల మీదగానే జరిగింది. ఇదే ఒక విడ్డూరమైతే నూతన భవనం ప్రారంభో త్సవంకూడా ఆయన చేతుల మీదే జరగటం మరో విడ్డూరం.
రాష్ట్రపతిని విస్మరించి రాజదండ ప్రతిష్ట
దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలవాల్సిన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్స వాన్ని ఏకపక్ష వ్యవహారంగా మార్చడం ప్రధాని నరేంద్రమోడీకే చెల్లింది. ఇరవైకి పైగా ప్రతిపక్షాలు హాజరు కాబోమని ప్రకటిస్తే కనీసం సంప్రదిం పులకు కూడా ప్రయత్నించని అప్రజాస్వామిక పోకడలు దేశం ఎప్పుడూ చూసివుండదు. ఈ మధ్యనే లోక్‌సభ మాజీ కార్యదర్శి పిడిటి ఆచారి ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు ఆయనో మాట చెప్పారు. నెహ్రూ హయాంలోనూ తర్వాత చాలా కాలం కూడా పార్లమెంటులో ఉద్రిక్తత వస్తే ప్రతిపక్ష నాయకులను పిలిచి చర్చించి ఏదో ఒక పరిష్కారం చేసేవారట. ఎందుకంటే సభ జరిగేలా చూడటం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని బాధ్యత.కర్తవ్యం కూడా. మోడీ హయాంలో పార్లమెంటును ఒక తంతులాగా మార్చి పెత్తనం చేయడమే గాని ఎన్నడూ రాజ్యాంగం, సంప్రదాయం రీత్యా వ్యవహరించింది లేదు. కీలకమైన కాశ్మీర్‌ అంశం లాటిదాన్ని కూడా హఠాత్తుగా తెచ్చి మమ అనిపించడం తప్ప ముందుగా చర్చించే సాహసం ప్రజాస్వామ్య స్పృహ లేవు. నోట్ల రద్దు, ఎన్‌ఆర్‌సి వంటివాటిపై చర్చలకే అవకాశమివ్వని నిరంకు శత్వం ఈ సర్కారుది. అదే ఇప్పుడూ ప్రత్యక్షమవు తున్నది. అసలు న్యూ విస్తా పేరుతో నూతన భవన సముదాయాన్ని కట్టాలన్న నిర్ణయమే ఏకపక్షమైంది. దేశమంతా కరోనా మహమ్మారితో కలవరపడుతు న్నప్పుడు తీసుకున్నది. చారిత్రకంగా కొనసాగుతున్న గొప్ప నిర్మాణాల స్థానంలో తన ముద్ర కోసమే అవసరం లేకున్నా లూట్యాన్స్‌ ఢల్లీిని మోడీస్‌ ఢల్లీిగా మార్చడమే ఏకైక లక్ష్యంగా ఈతతంగం తల పెట్టారు. కోర్టులలో కేసులూ నడిచాయి. సాంకేతిక కారణాలతో అనుమతి సంపాదించి పూర్తి చేశారు. నూతన భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిష్టాపన కూడా ఇలాగే హఠాత్తుగా ఒంటరిగా కానిచ్చేశారు. ఆ సింహాలు గతంలో వలె గంభీర ప్రసన్నంగా గాక క్రోధంగా వుండటం మరో చర్చకు దారితీసింది. దానిపై విమర్శల తర్వాత పూర్తిస్థాయి ప్రారంభోత్సవానికైనా పునరా లోచించుకొని అందరినీ కలుపుకుపోయే బదులు దీనికీ తనే ఏకైక కర్త కర్మ క్రియగా కానిచ్చేయడం మోడీకే చెల్లింది!
రాష్ట్రపతి రాజ్యాంగ పాత్ర
పార్లమెంటు అంటే అన్నిపార్టీల సభ్యు లూ వుండే వేదిక. రాజ్యసభ అయితే రాజ్యాంగ పరంగా రాష్ట్రాల సభ.కాని మోడీ సర్కారు దీనిని కేవలం ప్రభుత్వ వ్యవహారంగా మార్చేసింది. కాని ఇప్పుదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శ వచ్చింది ప్రతిపక్షాల గురించి కాదు. రాష్ట్రపతి గురించి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ఏర్పాటుకు, ప్రారం భానికి, ప్రోరోగ్‌ (నిరవధికవాయిదా) కు ఎన్ని కలకూ కర్త రాష్ట్రపతి.రాజ్యాంగంలో 3,111,274 అధికరణాలు రాష్ట్రపతి అధికారా లను స్పష్టంగా పేర్కొంటున్నాయి. 79వ అధికర ణం ప్రకారం రాష్ట్రపతి, సభ్యులు కలిస్తేనే పార్లమెం టు.పార్లమెం టు ఏర్పాటు,గడువు ముగిసిన తర్వాత లేదా ప్రభు త్వం కోరితే పడిపోతే మళ్లీ కొత్త సభ ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు అనుమతి నివ్వడం రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. ఎన్నికైన సభ్యుల జాబితాను తనకే అందజేస్తారు.78వ అధికరణం మేరకు పార్ల మెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తేనే శాసనాలవుతాయి.కనక రాష్ట్రపతికీ పార్లమెం టుకూ మధ్య సంబంధం విడదీయరానిది. అలాటి రాష్ట్రపతి లేకుండా, కనీసం ఆహ్వానించకుండా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలను కోవడం ఎలాటి ప్రజాస్వామ్య సంప్రదాయం? ఎలాటి రాజ్యాంగ గౌరవం? పైగా ప్రస్తుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్మును తొలి ఆదివాసి మహిళ ఎన్నికగా గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ ప్రభు త్వం ఎందుకు ఆమెను గౌరవించడం లేదు? ఈ మాట అనగానే అయితే ప్రతిపక్షాలు ఎందుకు ఆమెపై అభ్యర్థిని పెట్టాయని కొందరు ఎదురు దాడి చేయడం మరీ విడ్డూరం.
ఆ స్థానంలో ఎవరుంటే వారు రాజ్యాం గ రీత్యా ఆగౌరవానికి అర్హులు తప్ప ఎన్నికల్లో పోటీ పెట్టడం ఇక్కడ సమస్య కానేకాదు. ఇంకా కొంతమంది ఉదాహరణకు తెలంగాణ పాండిచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌గా వున్న తమిళిసై సౌందరరాజన్‌ వంటివారు సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్మమంత్రి కెసిఆర్‌ తనను ఆహ్వానించలేదని పోటీ వాదన తెస్తున్నారు.సచివాలయానికి గవర్నర్‌కు మధ్య అలాటి పాత్ర వున్నట్టు రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా?తలాతోక లేని వాదన తప్ప! ఢల్లీి లెఫ్టి నెంట్‌ గవర్నర్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ల నిర్వా కాలను సుప్రీం కోర్టు తప్పు పట్టిన తర్వాత కూడా బిజెపి నియమిత వ్యక్తుల తీరు మారలేదనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
ఎక్కడిదీ రాజదండం?
మిగిలిన అనేక మతతత్వ పోకడలు నిర్ణయాలు పక్కన పెట్టి ఈ ప్రారంభోత్సవంలోనూ మోడీ ప్రభుత్వం మతరాజకీయాలనే ప్రదర్శిస్తు న్నది. హిందూత్వ సిద్ధాంత కర్త గాడ్సే గురువు సావర్కర్‌ జయంతినాడు ఈప్రారంభోత్సవం పెట్ట డం వ్యూహాత్మక సంకేతమే. రాజదండం (సెం గోల్‌) ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. గతంలో ఎన్నడూ పెద్దగా చెప్పుకోని ఈ రాజడండం కథను తవ్వి తీయడం ద్వారా బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తున్నది.1947ఆగష్టు 15న బ్రిటిష్‌ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడిజరిగేప్పుడు తమిళనాడులోని తిరువాదుతరై అధీనం అనే మఠం నుంచి ఈరాజదండం కాను కగా సమర్పించబడిరది. దాన్ని ఆఆశ్రమ ప్రతి నిధులు ప్రధాని నెహ్రూకు అందిస్తున్న చిత్రాలు కూడా ఆనాడు వచ్చాయి. అయితే అదేదో స్వా తంత్ర సాధనకు అధికార మార్పిడికి సంకేతం గా ఇచ్చినట్టు పేర్కొనే ఆధారాలే లేవు.అలా చూసిన చెప్పిన సందర్భాలూ లేవు. హోంమంత్రి అమిత్‌ షా అకస్మాత్తుగా దీన్ని ప్రస్తావించినపుడు నాయ కులూ పాత్రికేయులూ కూడా ఆశ్చర్యపోయారు. అధికార మార్పిడికి ఏదైనా లాంఛనప్రాయమైన సంకేతం వుంటుందా అని మౌంట్‌ బాటన్‌అడిగితే నెహ్రూ మొదటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీని సంప్ర దించినట్టు ఆయన తమ స్వరాష్ట్రమైన మద్రాసు నుంచి దాన్ని తెప్పించినట్టు అమిత్‌షా కథచెబు తున్నారు. ఈ రాజదండాన్ని మొదట మౌంట్‌ బాటన్‌కు ఇచ్చి తర్వాత నెహ్రూకు అందజేశారని కథ చెబుతున్నారు. దాన్ని పార్లమెంటు భవనంపై శాశ్వతంగా ప్రతిష్టించుతామని కూడా కేంద్రం ప్రకటించింది. బ్రిటిష్‌ చక్రవర్తితో సహా దేశదేశాల రాజులు పట్టాభిషేకాల సమయంలో ఈ తరహా దండం ఒకటి రాజగురువు నుంచి తీసుకునే పద్ధతి వుంది. కాని అది ప్రజాస్వామంలో ప్రజల ఆమో దం తప్ప అలాటి ఆచారాలేమీ వుండవు. పైగా లౌకిక విధానం తీసుకున్న భారతదేశంలో అసలే అవకాశం లేదు.భిన్న మతాలతో కూడిన ఈ దేశం లో ఒక మతానికి సంబంధించిన చిహ్నమే ఎలా ప్రభుత్వ చిహ్నమవుతుంది? అంటే ఇది కూడా బిజెపి మార్కు మత రాజకీయాలలోనూ తమిళ నాడును సంతోషపెట్టే వ్యూహంలోనూ భాగమను కోవాలి. కర్ణాటక దెబ్బ తర్వాత దక్షిణాదిలో పూర్తి గా ఖాళీ అయిన బిజెపి ఆ కోణంలోనూ ఈ పని చేస్తుండవచ్చు. దీనికి ఆధారాలేమంటే ఆనాడు వెలులవడిన ప్రత్యేక సంచికలలో వుందంటున్నారు. తీరా చూస్తే వాటిలోనూ ఆ మఠం ప్రతినిధులు చెప్పిందే వుంది. కనక ఇది కల్పితమనేది సుస్పష్టం. రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చిన ప్రాతినిధ్య స్వభావాన్ని, దానిలో భాగంగానూ రాజ్యాధినేత గానూ రాష్ట్రపతి స్థానాన్ని మోడీ సర్కారు అగౌరవం పాలు చేసింది.రాజ్యాంగంలో ఏప్రస్తాన లేని ఒక రాజదండాన్ని ఆస్థానంలో ప్రతిష్టించడం దాని రాజరిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.మోడీ ఏకపక్ష నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- (గుమ్మడిదల రంగారావు/తెలకపల్లి రవి) (వ్యాసకర్తలు : లోక్‌సభ సచివాలయం పరిశోధన మరియు సమాచార విభాగంలో మాజీడైరెక్టరు,మరియు సీనియర్‌ పాత్రీకేయులు)

మత స్వేచ్ఛకు ప్రమాదం

బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపుతున్నది… రాజ్యాం గాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో ‘హిందూ మత విశ్వా సాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందు వల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షా లతో ఏ హక్కులు లేని పరాయివారిగా బతకాలి.’ ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలా డుతున్న పాలకులకు పరమత సహనం, మత స్వేచ్ఛ అనేవి ఏ మాత్రం గిట్టవు.
మన రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారాయని, ఇందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతపరమైన వివక్షాపూరిత విధానాలే కారణమని అంతర్జాతీయ మత స్వేచ్ఛ పరిస్థితులపై అమెరికన్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడిరచింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పు,మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వ కూల్చివేత-ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు, లైంగిక వేధింపులపై రెజ్లర్లు ఢల్లీిలో చేస్తున్న ఆందోళన, ఇప్పుడు మత స్వేచ్ఛపై అంతర్జాతీయ నివేదిక కేంద్రంలోని బిజెపి నేతలకు ఉక్కపోతను మరింత పెంచింది. నరేంద్ర మోడీ ఇంటా బయటా ఎదురులేని మొనగాడని, విశ్వగురువు అని, అంతర్జాతీయ శాంతిదూత అని…ఏవేవో భుజకీర్తులు తగిలించి, ఆహా ఓహో అని కీర్తించిన గోడీ మీడియా ఈ వరుస ఘటనలతో కుడితిలో పడిన ఎలుక లాగా గిజగిజలా డుతున్నది.
మత స్వేచ్ఛ నివేదికలో ఏముంది ?
అమెరికన్‌ విదేశాంగ శాఖ ఆధీనంలోని స్వతంత్ర సంస్థ ‘యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌’ (యుఎస్‌స ిఐఆర్‌ఎఫ్‌) ప్రపంచంలోని వివిధ దేశాల్లో మత స్వేచ్ఛ పరిస్థితులపై ప్రతి సంవత్సరం నివేది కలు రూపొందించి అక్కడి ప్రభుత్వానికి అందచేస్తుంది. భారతదేశంలో మత అసహనం, ప్రార్థనా స్థలాలు, మైనారిటీ ప్రజల ఆస్థులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, తప్పుడు కేసులు, నిర్బంధాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది. 2022లో దేశంలో జరిగిన సంఘటనలు, ప్రభుత్వ లెక్కల ఆధారంగా ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించి మత స్వేచ్ఛ అమలు విషయంలో ప్రత్యేక ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో కూడా ఈ సంస్థ దేశంలోని మత ఉద్రిక్తతలను ప్రస్తావించింది. మత స్వేచ్ఛ విషయంలో కొనసాగుతున్న అనేక దుష్పరి ణామాలను ఈ సంవత్సరం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించడంతో పాటు, వాటి మూలాలను విశ్లేషించింది. భారత రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 25-28 ప్రకారం ప్రతి పౌరుడికి తనకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి, ఏ మతాన్ని ఆరాధించకుండా వుండడానికి స్వేచ్ఛ వుంది. అయితే 2014లో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఈ లౌకిక సూత్రాలకు, మైనారిటీల మత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడిరదని పేర్కొంది. ఇంకా ఈ నివేదికలో ‘హిజాబ్‌,గోవధ లాంటి అంశాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (బిజెపి పాలిత రాష్ట్రాలు) రూపొందిస్తున్న చట్టాలు, న్యాయ స్థానాల తీర్పులు దేశంలోని ముస్లింలు, క్రైస్తవు లు,దళితులు,ఆదివాసీల మత స్వేచ్ఛను హరించివేసే విధంగా వుంటున్నాయి. విమర్శ నాత్మక గొంతులను కేంద్ర ప్రభుత్వం అణచి పెడుతున్నది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలను,వారికి అండగా నిలుస్తున్న వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకొని వారిపై నిఘా,వేధింపులు,ఇళ్ల కూల్చివేత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద సంవత్సరాల తరబడి నిర్బంధించడం లాంటివి పెరిగాయ’ని తెలిపింది. స్వచ్ఛంద సంస్థల కార్యక లాపాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధానాలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేస్తున్నదని పేర్కొంది. మత స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్న అనేకమంది జర్నలిస్టులు, లాయ ర్లు, మానవ హక్కుల కార్యకర్తలు నిర్బం ధాలకు, వేధింపులకు గురవుతున్నారనే పచ్చి నిజాన్ని బయటపెట్టింది. 2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జరిగిన కార్య క్రమాల్లో పాల్గొన్నారనే సాకుతో అనేక వేల మందిపై పెట్టిన వందలాది కేసులు ఇప్పటికీ పెండిరగ్‌లో వున్నాయని, 2022 వరకు 700 కేసులు నమోదు కాగా, వాటిలో కేవలం 92 కేసులు మాత్రమే విచారణ దశకు వచ్చాయని తెలిపింది. అయితే ఈ కేసులు నమోదు అయినా అనేకమంది ఎలాంటి విచారణ లేకుండా సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 12 రాష్ట్ర ప్రభుత్వాలు (ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, హర్యానా,ఉత్తరా ఖండ్‌, మధ్యప్రదేశ్‌,ఒడిషా, హిమాచల్‌ ప్రదేశ్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌) మత మార్పిడిని చట్టవిరుద్ధ నేరంగా పరిగణించే చట్టాలను రూపొందించాయని ఈ నివేదిక తెలిపింది. చట్టపరమైన మత మార్పిడికి గతంలో వున్న నిబంధనలను పూర్తిగా మార్చివేసి మత స్వేచ్ఛను అణచివేసే విధంగా ఈ రాష్ట్రాల్లో నిబంధనలను రూపొందించారు. ఈ అంశాలన్ని ట్లోనూ ఉత్తరప్రదేశ్‌ దూకుడుగా వుంది. మతాన్ని మార్చుకున్న వారికి, ఆ కార్య క్రమాన్ని నిర్వహించిన వారికి భారీగా అపరాధ రుసుములు వేయడం,జైళ్లలో నిర్బంధించడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం పెరిగిందని పేర్కొంది.చట్టబద్ధ మతాంతర వివాహాలను నిరోధిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాయి. ముస్లిం యువత చేసుకునే ప్రేమ వివాహాలపై‘లవ్‌ జిహాద్‌’ పేరుతో ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి పాలకులు, వారి అనుయాయులు మత విద్వేషాన్ని పెద్ద ఎత్తున రగిలిస్తున్నారు. మతాంతర వివాహాలను పుజారి లేదా పోలీసులు అంగీకరించడానికి లేదా అంగీకరించకుండా వుండడానికి హక్కులు కల్పిస్తూ ఏప్రిల్‌లో హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది.కర్ణాటకలో రగిల్చిన హిజాబ్‌ సమస్య,గుజరాత్‌లో బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల,ఉత్తరప్రదేశ్‌ లో దళిత మహిళలపై కొనసాగుతున్న హత్యాచారాలు, దాడుల గురించి ఈ నివేదిక పేర్కొంది. పెరుగుతున్న మత హింస ఘటనల ఆధారంగా భారత దేశంలో మత స్వేచ్ఛ ప్రమాదంలో వుందని, అందువల్ల ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వ స్పందన
విభిన్న మతాలకు నిలయమై, లౌకిక విధాన పునాదిపై భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరిస్తున్న దేశ ప్రతిష్టను కేంద్ర బిజెపి పాలకులు,వారి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విధంగా దిగజార్చాయి. కానీ ‘ఈ నివేదక పక్షపాతం మరియు నిందాపూర్వకమైనదని’ మన విదే శాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తీవ్రమైన అవగాహనా లోపంతో ఈ నివేదిక తయారుచేయబడిరదని కేంద్రం ఎదురు దాడికి సిద్ధమైంది. మరి ట్రంప్‌ అధ్యక్షుడుగా వున్న కాలంలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌ కార్యక్రమాల మోత మోగించారు కదా! అంతెం దుకు! ప్రధాని మోడీ 2021 సెప్టెంబర్‌ నెలలో అమెరికా పర్యటన సందర్భంగా నాయకుల పరస్పర పొగడ్తలు, వచ్చే నెల 22న మరోసారి ప్రధాని అమెరికా పర్యటనకు చేస్తున్న హంగా మా చూస్తూనే వున్నాం. అంతర్జాతీయ మీడియా ప్రచార హోరులో ఊయలలూ గినప్పుడు పక్షపాతం గుర్తకు రాలేదే? ఇలాంటి నివేదికలు ప్రకటించే అమెరికా సంస్థలన్నీ గొప్పవని, అవి ఇచ్చే నివేదకలన్నీ చాలా పవిత్ర మైనవని అనుకోలేము. కాని తమను కీర్తించి నప్పుడు ఒకరకంగా, నిందించినప్పుడు మరో రకంగా స్పందించే పాలకుల తీరు ప్రజావిశ్వా సాన్ని పొందదు.దేశంలో మత స్వేచ్ఛ ఎందుకు ప్రమాదంలో పడిరది ?బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒకటి మత రాజ్యాన్ని నిర్మించడం.అందుకోసం మత విద్వేషాన్ని నిత్యం రగల్చడం. ఇతర మతస్థుల ఆచార, సాంప్రదాయాలన్నిట్లోకి జొరబడి వాటిపై దాడి చేయడం. రెండు కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను,సామాజిక రిజర్వేషన్లను బలహీనపర్చడం,రాజ్యాంగ హక్కులను కాలరాయడం,రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం.గౌతమ్‌ అదానీ ఆర్థిక అరాచకాల గురించి హిండెన్‌బర్గ్‌ నివేదిక, మత స్వేచ్ఛ గురించి యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ నివేదిక, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ప్రకటిస్తున్న ర్యాంకింగ్‌ లెక్కలు ఈ విధానాల ప్రతిరూపమే.అంతేగాక, తమ మతతత్వ విధానాలను అమలు పరచడానికి మత చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉదా: గో సంరక్షణ పేరుతో 2014 నుండి దేశవ్యాపితంగా 147దాడులు జరిగాయి. ఇందులో 58 మంది హత్యగావించ బడ్డారు. కర్ణాటక ఎన్నికలకు ముందు గో రక్షణ దళాలు ఇద్దరు మైనారిటీ మతస్థులను చంపడం, ఒకరిని హింసించడం చూశాము. కేంద్ర ప్రభు త్వం 2017మేలో కేంద్రం గోవధ నిషేధాన్ని ప్రకటించింది. అన్య మత పూజా ప్రదేశాల మీద దాడులు చేయడం పెరిగింది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా దేశంలో అనేక చోట్ల మసీదులపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగానే యు.పిలో మైనా రిటీ సంస్థ నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రాచీన గ్రంథాలయాన్ని తగుల బెట్టారు. మత మార్పిళ్ల సాకుతో ముఖ్యంగా క్రిస్టియన్లపై దాడులు పెరి గాయి. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పరమత సహనమే హిందూ మతానికి జీవం అని ఒకవైపున అనుభవం చెబుతుంటే, మరో వైపున హిందూ ధర్మ సంరక్షకులు, గో సేవా దురంధరుల వేషాలు వేసుకున్న కొద్దిమందికి పరమత ద్వేషం జీవగర్ర అయింది. వీరికి కేంద్రంలోని ప్రభుత్వం అండగా నిలిచింది. బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపు తున్నది…రాజ్యాంగాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో ‘హిందూ మత విశ్వాసాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందువల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షాలతో ఏ హక్కులు లేని పరాయి వారిగా బతకాలి.’ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలాడుతున్న పాలకులకు పరమత సహనం,మత స్వేచ్ఛ అనేవి ఏమాత్రం గిట్టవు. వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు -(వి.రాంభూపాల్‌)

ఉపాధి హామీకి రక్షణ చట్టం` ఆవశ్యం

ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణ యించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూను కున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చే వారు. ఒకా నొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈసంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది.దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బ లెక్కే లా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈపని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు,దళారులకు కట్ట బెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు.
కూటి కోసం..కూలి కోసం..పనులు చేసుకుని బతు కుదామని బయల్దేరిన శ్రమజీవులు మార్గ మధ్యంలోనే ప్రమాదాల బారినపడి బలవుతు న్నారు. ఇటీవల మనరాష్ట్రంలో జరిగిన భారీ ప్రమాదాలన్నింటిలోనూ ప్రాణాలు కోల్పోయింది బడుగుజీవులే కావడం విషాదం.ఈ వారంలో మన రాష్ట్రంలో మూడు భారీ ప్రమాదాలు జరగ్గా, వాటిలో మరణించిన వారిలో 17 మంది మహిళలే కావడం విషాదం. వీటిలో రెండు ప్రమాదాల్లో మరణించిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని మహిళలు. అందువల్లే సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఒక ఘటనలో 23 మంది, మరో ఘటనలో 14 మంది ప్రయాణించారు.తెలంగాణ నార్కట్‌పల్లి-మన రాష్ట్రంలోని అద్దంకిని కలిపే ఆ రహదారిలో అంతవరకూ నాలుగు రోడ్ల లైనులో వేగంగా వచ్చిన వాహనాలు సింగిల్‌లైనులోనూ అదే స్పీడులో రావ డంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో నాలుగులైన్లరోడ్డు పూర్తయినా..వివాదాలు పరి ష్కారం కాకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు హాట్‌ స్పాట్‌గా మారింది. గత మూడేళ్లలో 12 ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరిగాయంటేనే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. మిరపకాయల పని కోసం తెలంగాణ నుంచి బయల్దేరిన 23మందిలో ఆరు గురు మరణించడం, ఏడుగురు తీవ్రంగా గాయ పడటంతో ఆగిరిజన కుటుంబాల జీవనం చిన్నా భిన్నమైంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసి తిరిగివస్తున్న యానాం ప్రాంతానికి చెందిన ఏడు గురు మహిళలు కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమా దంలో మరణించగా, మరో ఏడుగురు తీవ్ర గాయా ల పాలయ్యారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సును క్లీనర్‌ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారులు రక్తసిక్తం కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలవల్ల మరణిస్తున్న వారి సంఖ్య 13 లక్షల కు పైమాటే. మరో రెండుకోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకూ తీవ్ర గాయాల పాలవు తున్నారు.ఈ గాయాలవల్ల వికలాంగులై జీవచ్ఛ వాల్లా బతుకు తున్న వారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం, క్షతగాత్రుల సంఖ్యలో మూడోస్థానంలో ఉండ టం…మన దేశంలో రహదారుల భద్రత దుస్థితిని చాటిచెబుతోంది. 2020 లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే 69.80 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడిరచారు. 2020లో దేశంలో 3,74,397 మంది మరణిస్తే, 2021లో 3,97,530 మంది బలయ్యారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ 40,510 మరణాలతో..10.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌ 36,521 మరణాలతో.. 9.2 శాతం ప్రమాదాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా నాలుగు శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం 16,044 మంది బలయ్యారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రి త్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రమాదాలకు ఐదు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో పరధ్యానంగా నడపటం, అత్యధిక వేగంతో నడప టం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించకపోవడం, రహదారులు ఛిద్రమై ప్రమాదకరంగా ఉండటం.నూతన సాంకేతిక నైపు ణ్యంతో అతివేగంగా దూసుకెళ్లే వాహనాలు మార్కెట్‌లోకి వస్తుండగా, అందుకు అనుగుణంగా రహదారులు మెరుగుపడటం లేదు. దీంతో, వాహ న వేగం ఎందరి ప్రాణాలనో బలిగొంటోంది.
మరోవైపు… రోజురోజుకూ ఉపాధి మార్గాలు కుంచించుకుపోవడం,ఉపాధి హామీకి సైతం సవాలక్ష కొర్రీలు ఉండటం…తదితర కారణాలవల్ల దూర ప్రాంతానికైనా వెళ్లి పనులు చేసేవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెరుగు తోంది.రోజూ పనులు దొరక్కపోవడంతో కుటుం బం గడవడం కష్టమవుతోంది. దీంతో, భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు మహిళలు సైతం పనులకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధిక ఛార్జీలు భరించలేక ఆటోల్లో కిక్కిరిసి ప్రయా ణిస్తూ జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పఢావో..’ అని నినాదమిచ్చిన మోడీ ప్రభుత్వం గానీ, అక్కచెల్లమ్మలు అంటూ నిత్యం జపం చేసే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉపాధి,ఉద్యోగ కల్పనకు శ్రద్ధపెట్టింది లేదు. దీంతో, రొయ్యల శుద్ది లాంటి కష్టమైన పనులు చేస్తూ… ఎటువంటి భద్రత లేని ప్రయాణం చేస్తూ బలవు తున్న వ్యవసాయ కార్మికులు, మహిళలు రాష్ట్రంలో పెరుగుతున్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు నష్టప రిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుం డా ప్రమాదాల నివారణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మృతుల కుటుంబా లను, క్షతగాత్రులను ఆదుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.- (వి.వెంకటేశ్వర్లు)

ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2 3 4 5 6 48