వైవిధ్యాన్ని ప్రొత్సహిద్దాం..

‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచి వేయా లని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలనిచూస్తే నేను చిన్న మతం వైపు నిలబడ తాను. ఆమై నారిటీ మతంలో కులాలు ఉం డి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆఅణచివేతకు గురయ్యే కులం వైపు నిలబ డతాను.ఆణిచి వేతకు గురైన కులంలో ఒక యజ మాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏస్థితిలో ఉన్నా అది నా శత్రువు!’అంటాడు పెరియార్‌ ఇ.వి. రామస్వామి. భారత దేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవా హంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టు కొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతులసంగమం మనదేశం. అనేక సాంప్ర దాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్నిదాటి, భూస్వాములఅరాచ కాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధా నంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసు కొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యా న్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లు తున్న వేళ..న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కు ల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
థీమ్‌..
ఈఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్‌ ’’వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,హక్కులను పరిర క్షిం చడం!’’ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాట లేదు.కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యం లో ఈథీమ్‌ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి..మనిషి రక్తాన్ని మరిగినప్పుడు-ఈ దుష్ట సంస్కృతిని,నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ..‘మేమూ మనుషులమే..ఈ గడ్డలో మేమూ భాగమే..మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు,కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్‌ చేస్తూ..అణచివేస్తుంటే.. ఆఅణచివేతను,ఆనిరంకుశత్వాన్ని ఎదిరించే పోరా టాలే మానవ హక్కులయ్యాయి.ఏదేశంలోనైనా హక్కు ల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విష యమే.‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే..వారిమానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటా డు నెల్సన్‌ మండేలా.జాతీయత,మతం,వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజ మంతటికీ లభించే సమానత్వం,గౌరవం,స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా,అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడిరది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడిరది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా1992,డిసెంబర్‌ 18వతేదీని పరిగ ణిం చింది.మతము,జాతి,భాషా,లింగం,సంస్కృతి పరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తిం చాల్సిందిగా ప్రకటించింది.మనదేశంలో కూడా డిసెం బర్‌ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌ఎంసి -1992) నియమించింది.2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్‌ (ప్రమోటింగ్‌ డైవర్సిటీ అండ్‌ ప్రొటెక్టింగ్‌రైట్స్‌)వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కు లను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్‌ మనదేశంలోని ముస్లింలను (14.2) క్రైస్తవులను (2.3),సిక్కులను (1.7),బౌద్ధులను(0.7),పారశీలను(0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం,సమన్యాయం అందించడం రాజ్యాంగ బద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు’’ఒక దేశంగొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడు తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’.ఈరోజు మతం పేరు తో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగు తుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవ హత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది.హిజాబ్‌, హలాల్‌, అజాన్‌, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డో జర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయ మైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005,మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్‌ రాజేందర్‌ సచ్చార్‌ నాయకత్వాన ఒకకమిటీ వేయడం జరిగింది. ఈదేశంలో ముస్లిం మైనార్టీలు,విద్యా,ఉపాధి, ఆర్థిక పరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధా నంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధా న్యత నిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా,ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్‌ షిప్‌,విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభు త్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటం కాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విష యంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్ల లను బడి మాన్పించి,పనుల్లోకి పంపడం జరుగు తోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహా లకు దారితీస్తుంది.- (యం.డి.షకీలా బేగం)

మన జాతి రత్నం లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

భారతదేశానికి రెండో ప్రధానమంత్రి,భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి,భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు లాల్‌బహదూర్‌ శాస్త్రిగారి జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను ఈకథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్టోబరు రెండవ తేదీ భారత ద్వితీయ ప్రధాని శ్రీలాల్‌ బహుదూర్‌ శాస్త్రిగారి జన్మదినం.1904వ సంవత్సరం అక్టోబరు2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జన్మించిన లాల్‌బహదూర్‌‘జైజవాన్‌జై కిసాన్‌’ నినాదంతో దేశాన్ని మేల్కొలిపి చ్కెతన్యం రగిలించిన ధన్యజీవి. ఆకలి తీర్చే రైతుకు, దేశాన్ని కాపాడే సైనికుడికి మనం చేసే అభినందనలే వారిలో విజయమార్గంలో నడిపిస్తాయి అని అప్పటి మూడుకోట్ల జనాభాకి పిలుపు నిచ్చారు.భారతదేశాన్ని ప్రపంచదేశాల గుర్తింపు కార్యక్రమంలో భారత భవిష్యత్తును రూపొందిం చటంలో కీలక పాత్ర పోషించిన మేధావి. కాయస్థ వంశంలో శారదాప్రసాదుకు మరియు రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించిన ఈ బాలుడు, బాల్యమునందే తండ్రిని పోగొట్టుకున్నాడు.బీద కుటుంబముభర్త మరణించటంతో రామ్‌దులారీ దేవి తన ఇద్దరు కుమార్తెలను, కుమారుడు బహదూర్‌ని తీసికొని తండ్రి వద్దకు చేరినది.బహదూర్‌ని అందరూ ‘‘నానీ’’ అని ముద్ధుగా పిలుచుకొనేవారు.అది తాతగారు పెట్టిని ముద్దు పేరు.
బాల్యంలో ఆటల మైదానంలో ఆడుకుంటూ తోటి స్నేహితులతో కలసి ఒకరి జామచెట్టును, యజమాని అనుమతి లేకుండా కాయలు కోసుకొనే సమయంలో,ఆయజమాని చూసి కోపంగా అరచిన అరుపుకి అందరూ తప్పుకున్నారు గాని,నానీ మాత్రం తప్పించుకోలేదు.పైగా ఆయజమానితో ‘తండ్రిలేని వాడిని,నన్ను ఎక్కువగా దండిరచకు’అని బ్రతిమాలితేదానికి ఆయజమాని ‘నీకు తండ్రి లేడు కనుకనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన మాటను సందేశంగా భావించి,భవిష్యత్తును క్రమబద్ధంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.దాని ప్రభావము ఆయనకు బాగా తోడ్పడిరది.లాల్‌బహదూర్‌ ప్రాధమిక విద్య గంగానదికి ఆవలి ఒడ్డున గల మొగల్‌సరాయి, వారణాసిలలోని పాఠశాలలో జరిగింది. లాల్‌బహదూర్‌ నిత్యం పాఠశాలకు గంగానదిపై పడవలో ప్రయాణించి వెళ్ళి చదువుసాగించాడు. ఆ సమయంలో ఒకసారి పైకం చెల్లించే పరిస్థితి లేక బట్టలు,పుస్తకాలు సంచిలో చుట్టుకుని,వాటిని నడు ముకి కట్టుకుని నదిపై ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకుని పాఠశాలకు వెళ్ళటం జరిగింది. పడవకి డబ్బులు ఇస్తామని చాలామంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి,ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నాడు. సమ యస్ఫూర్తితో కార్యాలను సాధించుకునేవాడేగాని, పేదరికానికి మాత్రం చింతించలేదు,వెనుకంజ వేయ లేదు.లాల్‌బహదూర్‌ 13వసంవత్సరంలోనే గాంధీ గారి ప్రసంగాలకి, సిద్ధాంతాలకి ప్రభావితుడ్కె నాడు. విధ్యార్థి దశలోనే భారతసేవా సమితి అనే సంస్థలో సభ్యునిగా ఉండేవారు.బాలగంగాధర్‌ తిలక్‌గారి ఉపన్యాసాలకు ప్రీతిపాత్రుడ్కె దేశభక్తిని అమితంగా పెంచుకున్నాడు.1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణాద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, మైనరగుటచే వెంటనే విడుదలకాబడ్డారు. ఆకారణం చేత విధ్యాభ్యాసానికి హాని కలుగలేదు. కాని విశ్వవిధ్యాలయం నుండి‘‘శాస్త్రి’’ పట్టాను పొంది న కారణంగా లాల్‌బహదూర్‌ శాస్త్రి అయ్యారు. 192728 సం.లో లలితాదేవితో వివాహమైనది. వరకట్నంగా మామగారు కొయ్య చరఖాని బహు మతిగా ఇచ్చారు.అప్పుడప్పుడే స్వాతంత్య్ర పోరాటం ఉధృతమవుతున్న సమయంలో శాస్త్రికి,నెహ్రూగారితో సన్నిహిత సంబంధం ఏర్పడిరది.అది వారి మధ్య గొప్ప మైత్రికి దారితీసింది.1930లో లాల్‌బహదూర్‌ లొలిసారిగ జిల్లాకాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎంపిక కాబ డ్డారు.పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిన కార ణంగా 2సంవత్సరాలకాలం కారాగార శిక్ష వేసారు బ్రిటిష్‌వారు.ఆయన ఆశిక్షను అనుభవించారు.
ఒకసారి అలహాబాదు నగరమధ్యలో జాతీయ పతాకం ఎగురవేయుటకు కాంగ్రేస్‌ సభ్యులందరూ భయాందోళనలో వుండగా, శాస్త్రిగారు స్త్రీ దుస్తులలో బురఖా వేసుకుని పైకిపాకి జెండాను ఎగురవేసి నారట. అతని ధ్కెర్యసాహసాలకు భారతీయులందరూ ప్రసంసించినా, అందుకుగాను మరల జైలు శిక్ష అను భవించవలసి వచ్చింది.1936లో ఆంగ్ల ప్రభుత్వానికి పోటీగా కేంద్ర,రాష్ట్ర శాసనసభలకు జాతీయ కాం గ్రెసు పోటీ చేసింది.శాస్త్రిగారు అలహాబాదు నియో జగవర్గం నుండి ఎన్నికైనారు.వారు ఎప్పుడూ సమ యాన్ని వృధా చేయలేదు.జ్కెలులో ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘మేడం క్యూరీ’ జీవితగాధను హిందీలోనికి అనువదించారు. కాలాన్ని వ్యర్ధం చేయక పఠనానికో, గ్రంధరచనకో ఖర్చుచేసేవారు.విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భార్యను కూడా పాల్గొనమని ప్రోత్సహించారు. శాస్త్రిగారి జీవితం మిక్కిలిఆదర్శప్రాయమైనది. భారతీ యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిన అమర జీవి.ప్రధానిగా కొంతకాలమే వున్నప్పటికీ, ముందు వారికంటే కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. పదవు లకోసం ప్రాకులాడలేదు.పదవులే వారిని వెదుక్కుంటూ వచ్చాయి.ఉక్కుమనిషి,ఆజాత శత్రువు, నిగర్వి,ధ్కెర్య శాలి, స్థిరచిత్తుడు వంటి పదాలకి సరైన నిర్వచనం శాస్త్రిగారు.భారత స్వాతంత్య్రానంతరం అలహాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో గెలిచి ‘అలహాబాద్‌ ఇంప్రూవ్‌ మెంటుట్రస్టుకు’ట్రస్టీగా నియమించ బడినారు. రెండు బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ‘‘టాగూర్‌ నగర్‌’ అనే పేరుతో అర ఎకరం భూమిని ప్లాటుగా విభజించి శాస్త్రిగారు లేని సమయంలో మిగిలినవారు వేలానికి పెట్టారు.ట్రస్టు సభ్యులందరూ తలొక ప్లాటును స్వంతం చేసుకోవాలనుకున్నారు.
రెండు రోజులకి తిరిగి వచ్చిన శాస్త్రిగారికి ఈ విషయం తెలిసి,వారందరినీ పిలిచి,మనం ప్రజా ప్రతినిధులము,ప్రజల ముందు నిజాయితీగా నిల వాల్సిన వారం,అందరూ వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామా చేద్దాం.కావలసివారు వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి అందరిచేత వాపసు చేయించారు.శాస్త్రిగారు ప్రధానమంత్రిగా పనిచేసినా పదిరూపాయలు కూడా దాచుకోలేదు. స్వంత ఇల్లు కూడా లేని నిజాయితీకి మారు రూపం.రాజకీయంగా కీలక పదవులు చేపట్టిన సందర్భాలలో కూడా దేశానికి మేలు చేసే శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. రైల్వేమంత్రిగా 195156 వరకూ,హోంమంత్రిగా ఏప్రిల్‌ 61 నుండి ఆగస్టు 63వరకూ,ప్రధానమంత్రిగా జూన్‌ 64నుండి జనవరి 66వరకూ (మరణించే వరకూ) పనిచేసారు.ఈసమయలో ప్రధాన మంత్రి గాచేస్తూ అదనంగా కొంత కాలం హోం మంత్రి త్వశాఖను కూడా నిర్వహించారు. ఆ సమ యంలో ఎదురైన ఆహారధాన్యకొరత, పొరుగు దేశాల వత్తిడికి ధీట్కెన సమాధానం చెప్పి రెండు సమస్యలకు పరి ష్కారం చూపారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమ యంలో కూడా వారి సంతానం సిటీబస్సులలోనే ప్రయాణించే వారు.ప్రధానిగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమ కూర్చలేదు.వారిలోని జాతీయ భావానికి శాస్త్రిగారి సంస్కారానికి ఆకుటుం బ సభ్యుల సహకారానికి నమోవాకాలు అర్పించ వలసినదే.వారి పెద్దకుమారుడు హరికృష్ణకు అశోక్‌లేలాడ్‌ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో, అకస్మాత్తుగా సీనియర్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పిం చారు.శాస్త్రిగారికి ఈవిషయం తెలిసి, ఆసంస్థవారు నీకు అర్హతలు చూడ కుండా పదోన్నతి కల్పించడం లోని ఉద్ధేశ్యం వారు ప్రధానిగా నానుండి ఏదో ఆశిం చవచ్చును.కనుక నేను ప్రధానిగా ఉన్న సమయంలో ఆసంస్థలో నీవు ఉద్యోగం చేయవద్దని ఖండిరచిన మహనీయులు శాస్త్రి గారు. రైల్వేమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రమాద సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. అనేక విశేష సలహాలు, నిర్ణయా లపై కేంద్రమంత్రి వర్గంలో విశిష్టస్థానంలో ఉన్న శాస్త్రిగారి నిర్ణయంతో జరిగేవి.ఏపదవీ లేన ప్పుడు కూడా ఇదే పంధాలో కొనసాగుతూ దేశానికి సేవ చేశారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానుతో యుద్ధం సంభవిం చింది.వారి దురాక్ర మణను గుండె నిబ్బరంతో అణచివేసిన వీరుడు. శాంతి స్థాపనకై రష్యా నాయకుల ఆహ్వానంతో తాష్కెంటుకు వెళ్ళి సంధి పత్రంపైన సంతకం చేసి, గుండె పోటుతో 1966 జనవరి 11వారు మరణిం చారు.ఆయన విశ్రాంతి స్థానం‘విజయ్‌ ఘాట్‌’గా గుర్తింపబడినది.ఆయన మరణానంతరం ‘భారతరత్న’ బిరుదును ప్రకటించారు. శాస్త్రిగారు వాయిదాల పద్దతిలో తీసుకున్న కారు వాయిదా నాలుగు వేల రూపాయలను వారి సతీమణి,శాస్త్రి గారి మరణా నంతరం చెల్లించి వారి నిబద్ధతకు, నిరా డంబర జీవితానికి భర్తకి సహకరిం చిన ఆదర్శమహిళ లలితా శాస్త్రిగారు.‘జ్కె జవాన్‌జ్కె కిసాన్‌’నినాదాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. మహనీయుల పుట్టుకకు ఒకపరమార్థం వుంటుంది. భారతదేశాన్ని ఉద్దరించ టానికి జన్మించిన నిస్వార్థ మహనీయులలో శాస్త్రిగారి కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.వారికి నమోవా కములు.జై భారత్‌.(వ్యాసకర్త : సాహితీరత్న,ప్రముఖ రచయిత్రి
విశాఖపట్టణం`9849692414
) డాక్టర్‌ దేవులపల్లి పద్మజ

ఆంధ్ర అభివృద్ధికి అండగా`ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సంద ర్భంగా,నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖ పట్నంలో రూ.2.08 లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ..ఆంధ్ర ప్రజల ప్రేమ,అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్‌ కొట్టారని పేర్కొన్నారు.60 ఏళ్ల తర్వాత దేశంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొ న్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడిరచారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్‌ రాకతో వ్యవసా యంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్‌ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే..అందులో ఒకటి విశాఖకు కేటాయిం చాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమం దికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రా ల్లోనే ఇలాంటి బల్క్‌ డ్రగ్‌ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్‌ కీలకం కానుంది. రైల్వే జోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌ వల్ల వ్యవసాయ,పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’అని ప్రధాని మోదీ అన్నారు.
మేమంతా కష్టపడి పని చేస్తున్నాం`పవన్‌
‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి,అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయిం చడానికి అడుగులు వేస్తున్నాం.దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి.ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. జనవరి 8న విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టు లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తూ ‘‘సదుద్దేశం..సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది.
అభివృద్ధిలో అందరికీ సమాన వాటామోదీ సంకల్పం
అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు.జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ 24గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా..నమ్మకం..ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి.70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆగ్రామాలకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన పథకం కింద ఈరోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుం డడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌,ఉత్తరాంధ్ర,రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృ ద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజుఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శక త్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.
రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్‌ అని చెప్పుకొనేలాచంద్ర బాబునాయుడు నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు,సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం.దేశ ప్రగతిలో భాగస్వా ములవుతాం. ప్రధాన మంత్రికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు.మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ.రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి గారు, సమర్ధవంతులైన చంద్రబాబు గారు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను’’ అన్నారు.ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము..
రాష్ట్రానికి ఆక్సిజన్‌ అందిస్తున్న ప్రధాని మోడీజీ!
గత ప్రభుత్వ అసమర్థత వలన వెంటిలేటర్‌ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్‌ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌ తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 12157 కోట్ల కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి మన విజనరీ లీడర్‌ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం,దీపం పథకం ద్వారా ఉచి తంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నారు,త్వరలోనే మెగా డీఎస్సి, త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వ బోతున్నారు…దటీజ్‌ సిబిఎన్‌. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం.
వికసిత్‌ భారత్‌ స్పూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్‌ సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం తరపున గౌరవ ప్రధాని నరేంద్రమోడీజీకి స్వాగతం.ప్రతి భారతీయుడి గుండెల్లో నరేంద్ర మోదీ. డీజీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. నరేంద్రమోడీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు, మామూలుగా పిఎం అంటే ప్రైమ్‌ మినిస్టర్‌,నరేంద్ర మోడీజీ పీపుల్స్‌ మ్యాన్‌.నరేంద్ర మోదీ జీ విజన్‌ గ్లోబల్‌. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా,దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోడీజీ.వికసిత్‌ భారత్‌ 2047విజన్‌ డాక్యు మెంట్‌ రిలీజ్‌ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోడీజీ పనిచేస్తున్నారు.2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5స్థానానికి వచ్చింది.వికసిత్‌ భారత్‌ -2047లక్ష్యంతో టాప్‌ 1లేదా 2ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి తో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేసారు.వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, పోర్ట్స్‌, ఎయిర్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం.
ప్రజల నీరాజనాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోలో విశాఖవాసులు అడుగ డుగునా బ్రహ్మరథం పట్టారు.ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి సాయం త్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు.ఈక్రమంలో ప్రధాని, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్‌ కళ్యాణ్‌ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. రోడ్‌ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ..అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

విశాఖ తీరంలో నేవీ డే విన్యాసాలు

విశాఖలో నేవీ విన్యాసాలతో,సాగ తీరం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. నేవీ విన్యాసాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నేవీ చేస్తున్నటువంటివి అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. విశాఖ సాగర్‌ తీరంలో నేవీ విన్యాసాలు చూడటం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.నేవీ యుద్ధ విమానాలు దగ్గర నుండి చూడటం ఇదే మొదటిసారి అంటూ చెబుతున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో చాలా బాగుందని అంటున్నారు. నేవీ దేశం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నేవీ విన్యాసాలు చూడటం ద్వారా తెలిసిందని మరికొందరు అంటున్నారు. మన దేశం కోసం ఎంతో కష్టపడి నేవీ పని చేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు.భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్‌ స్థావరానికి పునాది పడిరదని,అధికారికంగా తూర్పునౌకాదళం 1983లో ఏర్పాటైంద న్నారు.చిన్న నేవల్‌ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్‌ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్‌ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మనవడు దేవాన్ష్‌ బాబుతో కలిసి తిలకించారు.అనంతరం సీఎం ప్రసంగించారు.మదిని మైమరపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలను చేసి చూపించింది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్‌ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్‌ అడ్మిరల్‌ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎంత క్రమశిక్షణ,కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడంసాధ్యం అవుతుంది.1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్‌ కమాండ్‌ చాలా కీలకంగా పని చేసింది. పాకిస్తాన్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీని ధ్వంసం చేసింది మనవిశాఖ తూర్పు నౌకాదళమే.ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది. కలకత్తా నుంచి చెన్నైవరకు కోస్టల్‌ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి.అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళంచేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది.దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది.హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజులపాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడు తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్రఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగా పురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది’’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో జనవరి 4ననిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.తూర్పునౌకాదళాధిపతి రాజేష్‌ పెంథార్కర్‌ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ :దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. – గునపర్తి సైమన్‌

కులగణ నేటి సామాజిక అవసరం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం.సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు.వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడిరది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931వరకు 16సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్‌ ప్రక్రియలో అంతరాయం కల్గింది.వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతం త్య్రానంతరం జనాభావివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు.దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష,అసమానతలు,ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు.ప్రభుత్వ సంక్షేమ విధానాలు,సామాజిక న్యాయం,ప్రధానంగా విద్య, ఉద్యోగాలు,అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.1931 సెన్సెస్‌ తర్వాత గడ చిన 90సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదను గుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు.ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు.ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక,అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల సాధించిన పురోగతి, తద నుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయ మే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ,బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలు గుతాయి.వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితా లను ఎలా రూపొందిస్తారు. కులాల చేర్పులు మార్పు లు ఎలా సాధ్యం. క్రీమీలేయర్‌ విషయంలో ప్రతిపాద నలు ఎలా రూపొందిస్తారు.రిజర్వేషన్‌ కోటాలను ఎలా నిర్థారిస్తారు.కులం వివక్షకు,అసమానతలకు మూల కారణమైన విద్య,ఆరోగ్యం,ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడంవల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విష యంలో విధానరూపకల్పన ఎలాసాధ్యం? అదే విధం గా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్‌ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన,నాణ్యమైన గణాంకాలు సెన్సెస్‌ ద్వారానే సాధ్యమని,ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కులగణాంకాలు నిర్వ హించకపోవడం ఎంతవరకు సహేతుకం.అది తర్కా నికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం 2011 జనా భా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబం ధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్‌ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాలపేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా,అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు.2014లో నరేం ద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకర ణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారి కంగా గుర్తించినప్పటికీ,గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగినచర్యలు చేపట్ట లేకపోయా యి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 2021సెన్సెస్‌లో కులాధార గణాం కాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆతర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది.ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విష యంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజే యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నా మని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్‌.డి.ఎ లోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయట నుండి సమర్థించే మరికొన్ని పార్టీలు,మహారాష్ట్ర, బీహార్‌,ఒడిషా,మధ్య ప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమం త్రులు,అదే విధంగా సి.పి.ఐ,సిపియం,ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌పార్టీ,డియంకె,తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణి లో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది.అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈవిషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్నిఓబిసి /బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు,కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021సెన్సెస్‌లో కులగణాంకాలు చేర్చాలని చెప్తున్నా యి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామ కాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు.1990లలో ఓబీసీ లకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తిచేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపైఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను,సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరిం చాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏవిషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మ మని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాం కాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర కుటుంబ సర్వే : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది.75ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరి స్తున్నారు.ఈసర్వే డేటాఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కాను న్నాయి. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు.ప్రధాన ప్రశ్నలు 56,ఉపప్రశ్నలు 19కలిపి మొత్తం 75ప్రశ్నలతో కుటుం బానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు.కుటుంబసభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్‌ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆకులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యులవారీగా విద్య,చదివిన మాధ్యమం,ఉద్యోగం,ఉపాధి,వ్యాపారం, వార్షికా దాయం తెలుసు కుంటున్నారు.కుటుంబానికి ఉన్న భూములు,ఇళ్లు, ఇతర స్థిర,చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య,ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్‌ ప్రయో జనాలు.
గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతిని ధులుగా,లేదా నామినేటెట్‌ పదవులు,ఎన్జీవోల్లో సభ్యత్వం వంటి అంశాలు నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా అద్దెకు ఉంటున్నారా ఇంట్లోఫ్రిజ్‌,కారు, ద్విచ క్రవాహనం,కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్‌ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు.
ఈ సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారంటే? : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గో ప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనక బడిన వర్గాలకు సంక్షేమపథకాలు,రాజకీయ,విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళి కలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించు కోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీరిజర్వేషన్లు ఎంతఉండాలోఈడేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.ఈసర్వేలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,కుల,రాజకీయ సమా చారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయి.వీటి నుంచి సమాచారంసేకరిస్తారు. ఇందులో 56ప్రధాన ప్రశ్నలు ఉండగా,మరో 19అను బంధ ప్రశ్నలు ఉంటాయి.మొత్తం రెండు పార్టులు అంటేపార్టు-1,పార్టు-2గాఉండి ఎనిమిదిపేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధా రణ,విద్య,ఉద్యోగ,ఉపాధి, భూములు, రిజర్వేషన్‌ ప్రయో జనాలు, వలసలు, రాజకీయ సమా చారం అడగను న్నారు.అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం17ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా,మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌? కు చెప్పాల్సి ఉంటుంది.సాగు విస్తీర్ణం వివరాలు అన గా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
రిజర్వేషన్‌ ఫలాలు పొందేవారు : విద్యా,ఉద్యోగ పరంగా రిజర్వేషన్‌ విధానంతో ప్రయోజనం పొంది నా,గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు,ఆ వివరాలు నమోదు చేసుకోవాలి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఈడబ్ల్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.
రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం,పూర్వం ఏపదవిలో ఉన్నారనేది తెలుసుకుం టారు. పదవీ కాలం,నామినేటెడ్‌ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్‌ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్‌ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పు డు సులువుగా వివరాలు అందించవచ్చు. ఒక కుటుం బంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు. సర్వే సంద ర్భంగా ప్రతి కుటుం బం ఈ విషయాలను గుర్తుంచు కోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు,పత్రాలు వంటివి తీసు కోరు.అలాగే కుటుం బీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయి స్తే సరిపోతుంది.వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యం గా ఉంచుతారు.
విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏమాధ్యమంలో చది వారని తెలియజేయాలి.ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
ఉద్యోగ, ఉపాధి వివరాలు : ఈ విషయానికి వచ్చిన ప్పుడు ప్రస్తుతం చేసే పని,ఉద్యోగం,వృత్తి,ఉపాధి సమాచారం ఇవ్వాలి.వార్షికాదాయం,ఒకవేళ వ్యాపా రులైతే వార్షిక టర్నోవర్‌ తెలియజేయాలి. సాంప్రదా య కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా,కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా,లేదా తెలియజేయాలి.సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడిరచారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతిఅధికారులను ఆదేశించారు. ఇంటిం టి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహా లను అధికారులతో కలిసి పరిశీలించారు. – (ప్రొ.కె.మురళి మనోహర్‌)

అరుదైన తాబేళ్లకు ఆపద

మానవ తప్పిదాలు..సముద్ర జలాల కాలుష్యం..అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల పాలిట శాపంగా మారుతున్నాయి.ఇక్కడి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న క్రమంలో చేపల వలలకు చిక్కి,బోటు పంఖాలు తగిలి కొన్ని మృత్యువాత పడుతున్నాయి.కాలుష్యం కార ణంగా మరికొన్ని చనిపోతున్నాయి.పరిస్థితి తీవ్రత గమనింఎచిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వీటి మృతికి కారణాలు తెలసుకుని పూర్తిస్థాయిలో దరాస్యప్తు చేయాలని ఆదేశిం చారు. అధికారులు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమకులు చెబుతున్నారు.విశాఖ తీరంలోనూ తాబేళ్ల మరణాలు కలవరపెడు తున్నాయి. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం వీటి కళేబరాలను చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాబేళ్లు ఎక్కడ పుడితే అక్కడకే చేరి గుడ్లు పెట్టే సుగణం వీటికి ఉంది.ఈనేపథ్యంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లుపై ప్రత్యేక కథనం..
ఆలివ్‌ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా
అరుదైన ఆలివ్‌ రిడ్లీ(సముద్ర తాబేళ్ల)లకు అమ్మ ఒడిలా ఒడిశా రాష్ట్రం ఆత్మీయత పంచుతోంది.ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి.తీరంలో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవు తున్నాయి.ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు.అవి పిల్లలుగా మారిన తర్వాత సముద్రంలోకి వదులుతున్నారు.ఆలివ్‌ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి.ఆ రాష్ట్రంలోని గహీర్‌మఠ(కేంద్రపడ జిల్లా),రుషికుల్యా ముఖద్వారం(గంజాం జల్లా),దేవీ ముఖద్వారం(పూరీజిల్లా)తాబేళ్ల పునరుత్పిత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్‌..
వేల కి.మీ.దూరం ప్రయాణించి పునుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశాఖ తీరాలకు వస్తుంటాయి.తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరా లు,తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలివ్‌ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు.ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు.ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధికుక్కలు,నక్కలు తినేయ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత ఆలివ్‌ రిడ్లేలు సముద్రంలో ఎంత దూరం వెళ్లుతున్నాయి?మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియోట్యాగ్‌లు అమర్చు తున్నారు. పరిశోధనలకు ఆచర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్‌ రిడ్లీలు..?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్‌రిడ్లీ.ఇవి చూడటానికి ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి.అందుకే వీటికి ఈపేరు వచ్చింది.పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్‌ వర్ణంలోకి మారి పోతాయి.వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది.పశ్చిమ అట్లాంటిక్‌ తీరంలో నివసించే ఆలివ్‌ రిడ్లీలు తూర్పుపసిఫిక్‌ ఆలివ్‌రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి.యుక్తవయస్సు వచ్చినా వీటి పరిమాణం 2నుంచి 2.5అడుగులు మాత్ర మే పెరుగుతుంది.ఒక్కోక్కటి 36నుంచి 49కిలోల బరువుంటాయి.వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్‌ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి..
ఆలివ్‌ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్ట పడతాయి.పసిఫిక్‌,అంట్లాంటిక్‌,హిందూ మహాసముద్ర తీరాల్లో అవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం తీరాల్లో ఆలివ్‌ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది.శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాటిక్‌ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆలివ్‌ రిడ్లీలు సర్వభక్ష కాలు..అంటే ఇవి మొక్కలను తింటాయి.అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే,ఎండ్ర కాయలు,పీతలు,రొయ్యలు,చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి.కొన్నిసార్లు ఆలివ్‌రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో500అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు.ఇక ఈఆలివ్‌ రిడ్లీలు తమజీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయ నాలు జరుగుతున్నాయి.అయితే,చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూ హంగా ఏర్పడతాయి.ఎండలో అలాగుంపులుగా నిల్చోని పరస్పర తోసు కుంటూ కన్పిస్తాయి.ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ తాయి.ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల,వేల మైళ్లు సునాయసంగా ప్రయాని స్తాయి.అలా వచ్చినవన్నీ ఒకచోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్‌’ అని అంటారు.ఇక్కడే ఆడతాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు..వందల సంఖ్యలో గుడ్లుపెడతాయి.-గునపర్తి సైమన్‌

అపరిచితుల సుపరిచితుల దర్పణం వనవీరులు

ప్రసిద్ధమైన చరిత గల దేశం మన భారతదేశం, నిర్మాణ భౌగోళిక సాంప్రదాయ రైతుల్లో సైతం అందరికీ ఆదర్శంగా నిలిచే రతగర్భమైన మన దేశం కారణాలు ఏవైనా ఎక్కువకాలం పరాయి పాలకుల ఏలుబడిలో సన్నబడటంతో పాటు తురష్కుల దండయాత్రలో ఎన్నో విలువైన మన సాంప్రదాయ కట్టడాలు, శిల్పాలు సిధిలం చేయబడ్డాయి.
ఈ విధంగా అణచబడి పీడిరచటం ద్వారా చైతన్యం రగిలి తిరుగుబాట్లు పెరిగి స్థానికంగా జాతీయంగా అనేకమంది నాయకులు, వీరులు, పుట్టుకొచ్చి భరతమాత ఆత్మగౌరవాన్ని కాపాడారు అటువంటి వీరుల్లో మన మూలవాసులుగా చెప్పబడే ఆదివాసుల్లో అనేకమంది వీరోచితంగా ముందుకు వచ్చి పరపాలనను అంతం చేసే దిశగా అడుగులు వేసి అమరులైన వారు కొందరు,విజయం సాధించిన వారు మరికొందరు.
నేటి యువతకు చైతన్య స్ఫూర్తి పంచడమే లక్ష్యంగా నాటి మన వనవీరుల పోరాట స్ఫూర్తిని త్యాగాలను కళ్ళకు కట్టినట్టు అందించే ప్రయత్నంలో భాగంగా వనవాసి కళ్యాణాశ్రమం వెలువరించిన అత్యంత విలువైన పుస్తకం ‘‘వనవీరులు మన వీరులు’’, జోషుల మల్లీశ్వరిగారి కలం సాయంతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకంలో అందరికీ సుపరిచితులైన అల్లూరి, కొమరం భీమ్‌, పూజ్యశ్రీ గురూజీ,లతో పాటు చరితపుటల్లో మరుగున పడిపోయిన బుధు భగవత్‌, తలక్కల్‌ఓ చందు,చక్ర బిసోయి, వంటి అపరిచిత సమరయోధుల వివరాలు క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి.
బికడ భీం మొదలుకొని కొమరం భీమ్‌ వరకు గల మొత్తం 24 మంది వనవీరుల వివరాలు పరాయి పాలన పై వారు చేసిన వీరోచితమైన సాహసాలు ఇందులో మనం చదువుకోవచ్చు పరాయి పాలనపై తిరుగుబాటు చేసిన వారు కొందరైతే, తమ గిరిజన జన జాతిలో గల మూఢవిశ్వాసాల నిర్మూలన, మద్యం, మాంసం, వంటి వ్యసనాల నుంచి దూరం చేసి ఆధ్యాత్మిక భావం వైపు పయనింపజేసినవారు మరికొందరు,
ఈ రెండు వర్గాలకు చెందిన వారిలో ఒకరు ‘‘దితియాబాప్ప’’ గుజరాత్‌ రాజ్యంలోనే మారుమూల గిరిజన గ్రామం అయిన వీరవన్లో జన్మించిన ఈ గిరిజన వీరుడు తన ప్రాంతంలోని అత్యంత వెనుకబడ్డ గిరిజనులను వ్యసనాల నుంచి దూరం చేసి భక్తి భావం అలవర్చి అన్య మతాల ఊబిలో పడకుండా కాపాడిన ఆధ్యాత్మిక సంస్కర్తగా చెప్పవచ్చును. ఈ గిరిజన ఋషి చేసిన ఆధ్యాత్మిక కృషి ఆ ప్రాంతంలో నేటికి అలరారడం విశేషం 111 సంవత్సరాల పాటు జీవించిన ఈ సంస్కర్త తన యావత్‌ జీవితాన్ని భక్తి ప్రచారానికి సమాజ హితానికి అంకితం చేశారు.
నాటి చోటా నాగపూర్‌ కు చెందిన మరో వనవీరుడు ‘‘బుధుభగత్‌’’ కూడా తన కృత్యాలతో తన జనజాతి పై ఎంతగానో ప్రభావితం చేసి నాటి బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు చేసిన వీరుని గానే కాక ప్రథమ స్వాతంత్ర సమరం కన్నా ముందే స్వరాజ్య పోరాటం చేసిన వనవీరునిగా ఆయనను ఇందులో అభివర్ణించారు,ఇలా స్వరాజ్య సమరంలో పాల్గొని చరిత్ర పుటలకు చిక్కనిఎందరో సమరయోధులు మనకు ఉన్నారు.
అటువంటి అజ్ఞాత సమరయోధులు అందున వనవాసులైన యోధుల వివరాలు అరుదుగా ఉన్నాయి, ఈ పుస్తకంలో మున్నెన్నడు వినని సమరయోధుల జీవిత వివరాలు సమగ్రంగా సేకరించి వ్యాసాల రూపంలో అందించడం అభినందనీయం.
కేరళలోని వాయినాడు ప్రాంతానికి చెందిన వనవీరులు దేశ స్వరాజ్యం కోసం పోరాడిన సంతతికి చెందినవారుగా నేటికీ సగర్వంగా జీవిస్తున్న వైనం ఇందులో చెప్పారు, అంతేకాక స్వానుభవంతో కూడిన వారి గత అనుభవాలను గానం చేసుకుంటూ నేటికీ కేరళ అడవుల్లో సహజంగా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ అందులోనే ఆనందం అనుభవిస్తూ జీవిస్తున్న తీరును కూడా వ్యాస రచయిత ఇందులో సమగ్రంగా పేర్కొన్నారు, ఆధునిక కేరళ రాష్ట్ర చరిత్రలో సర్వోత్తమ పౌరుష పరాక్రమాలకు పేరుగాంచిన ‘‘కేరళ వర్మ ‘‘అక్కడి వనవాసీలను గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరులుగా తీర్చిదిద్దిన వివరాలు కూడా మనం ఇందులో చదవవచ్చు.
ఈ వ్యాసపరంపరలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న గిరిజన జాతులు నాయకులు వారి వారి పోరాట పఠిమల గురించి సవివరంగా తెలుసుకోవచ్చును.
ఇక గిరిజన నాయకులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే….అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌, రాణి దుర్గావతి, సేవాలాల్‌ మహారాజ్‌, తదితరుల వ్యాసాలు ఇందులో పొందుపరచబడ్డాయి,
గిరిజనేతరుడైన సీతారామరాజు అడవి బిడ్డలకు అండగా నిలిచి పోరాటం చేయడానికి గల కారణం, అందుకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటనలు ఇందులో మనం గమనించవచ్చు.
అదేవిధంగా కొమరం భీమ్‌ సాయుధ పోరాటంలోనికి రావడానికి గల నేపథ్యం అప్పటి భౌగోళిక అంశాలు చాలా కూలంకషంగా వ్యాసకర్త వివరించిన వైనం ఆసక్తిదాయకంగా ఉంది, విషయ అవగాహన చక్కగా సాగింది.
ఈ వ్యాస సంపుటలోని వనవీరుల వివరాలు రెండు వర్గాలుగా విభజించారు, పరాయి పాలనకు కారకులైన బ్రిటిష్‌ వారిపై ప్రత్యక్ష తిరుగుబాట్లు చేసి స్వాతంత్రోద్యమ సమరయోధులైన వనవీరులు ఒక వర్గం అయితే గిరిజన సామాజిక వర్గంలో చైతన్యం తీసుకువచ్చి సంస్కరణలకు చేయూతగా నిలిచిన గిరిజన సంఘ సంస్కర్తలు మరో వర్గంగా విభజించారు ,ఆయా రంగాలలో వారు ప్రవేశించడానికి గల కారణం అనంతరం వారి కృషి సాధించిన విజయాలు గురించి సవివరమైన సంక్షిప్త సమాచార వేదికగా నిలిచింది ఈ ‘‘వనవీరులు మన వీరులు’’వ్యాస సంపుటి,
ఈ పుస్తకానికి నేపద్యం వివరిస్తూ ప్రకాశకులు అందించిన ప్రత్యేక సమాచారంలో, మన దేశంలో జరిగిన స్వాతంత్రోద్యమానికి దారులు వేసింది మొదట వనవాసులే…అనే చారిత్రక విషయం ఆవిష్కరించడంతోపాటు అనేక భారతీయ ఇతిహాసాలకు ఆనవాళ్లుగా నిలుస్తున్న మన దేశంలోని ప్రాంతాల సమాచారం కూడా ఇందులో పొందుపరిచారు .
శత్రు రాజ్యాలతో స్వరాజ్య సమరం సాగించి అమరులైన ఆదివాసి వీరుల సమాచారంతోపాటు, వనవాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాలరాచి వారిలో విభేదాలు సృష్టించి వారిని భారతీయ సంస్కృతికి దూరం చేస్తున్న సంస్కృతి శత్రువులపై పోరాటం చేసి సఫలమైన సంస్కృతి పరిరక్షక సంస్కర్తల కృషిని కూడా ఇందులో వివరించారు, అంతేకాక భారతదేశ భూభాగంలోని విభిన్న ప్రాంతాల్లోని వివిధ తెగలకు చెందిన మూలవాసులైన వనవాసుల వివరాలు సైతం సహేతుక రీతిలో వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
పరిశోధకుల పాలిట కరదీపకగా నిలిచే ఈ పుస్తకం విలువ వెలకట్టలేనిది అనడంలో అతిశయోక్తి లేదు.
సమీక్షకుడు:- డా: అమ్మిన శ్రీనివాసరాజు,
వనవీరులు మన వీరులు
(వ్యాస సంపుటి)
రచయిత్రి : జోష్యుల మల్లీశ్వరి పేజీలు : 272, వెల : 40/- రూ, ప్రతులకు : వనవాసి కళ్యాణ పరిషత్‌ 119,బి.సిరి సంపద రెసిడెన్సి,విద్యానగర్‌, హైదరాబాద్‌-44,ఫోను : 040-27091299.

ఏపీకి పెట్టుడుల వెల్లువ

ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 63వేల 411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐ పీబీ సమావేశంలో చర్చించారు.ఇక దరఖాస్తు చేసు కున్న ప్రాజెక్టుల్లో 9కీలకప్రాజెక్టుల స్థాపనకు ముఖ్య మంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.ఈ 9ప్రాజెక్టులద్వారా రాష్ట్రానికి లక్ష 82వేల 162కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2లక్షల 63వేల411కుపైగా ఉద్యోగఅవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరిం చారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌..6 వేలఎకరాల విస్తీర్ణంలో 96వేల 862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా 2వేల 400 మంది ఉపాధి లభించబోతోంది.అలాగే విశాఖ మిలీనియం టవర్స్‌లో 80కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్‌ ముందుకొచ్చింది.దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు.దీని ద్వారా దాదాపు 2వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పెట్టు బడిదారులంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెల ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్‌..ఏపీలో భారీఎత్తున రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.రామాయపట్నం పోర్టు దగ్గర వారికి 6వేల ఎకరాల ల్యాండ్‌ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.గుజరాత్‌ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.టాటా,రిలయన్స్‌ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్‌ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకు న్నాయి.దీనిద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభి స్తాయి.నిన్న ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 2లక్షల 84వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించొచ్చు. ఎప్పటిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనే వివరాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్త య్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధికా రులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సచివాలయంలో జరి గిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్య మంత్రి ఆమోదం తెలిపారు.
బీపీసీఎల్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక..
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పా టు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.దీంతో2,400మందికి ఉపాధి కలుగ నుం దని చెప్పారు.మొత్తం 9మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌,లెర్నింగ్‌ సెంటర్‌,రిఫైనరీ,పెట్రోకెమికల్స్‌ యూనిట్స్‌,క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌,గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికా రులు ముఖ్య మంత్రికి వివరించారు. వచ్చే 20ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికిరూ.88,747కోట్ల ఆదాయం రానుందని తెలిపారు.అయితే 2029 లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
టీసీఎస్‌..
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగులవిస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.80కోట్ల పెట్టుబడి పెట్ట నుంది.దీంతో 2వేల మందికి ఉద్యోగాలు రాను న్నాయి.
ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలాఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ప్రాజెక్టు ఏర్పాటు చేయ నుంది.ఇందుకోసంఈ సంస్థ రూ.1,046కోట్ల పెట్టు బడిపెట్టనుంది.2,381మందికి ఉపాధి కలుగుతుంది.
బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ :
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని106ఎకరాల్లో రూ.1,174కోట్లతో 1,500మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీఎఫ్‌/పర్టికల్‌ బోర్డు ప్లాంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.
క్లిక్‌ అయిన క్లీన్‌ ఎనర్జీ పాలసీ :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రా నికి వస్తున్నాయి.కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పా టు చేయనున్నాయి.దీంతో కేవలం క్లీన్‌ ఎనర్జీ రంగం లోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగఉపాధి అవ కాశాలు కలుగుతున్నాయి.
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ..
ఏఎంగ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 592ఎకరాల్లో 1మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.రూ.12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 40ఎకరాల్లో 2గిగావాట్ల సామ ర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూని ట్‌ను రూ.2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది.
టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ..
400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో 1,800 ఎకరా ల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.1,380 మందికి ఉపాధి కలుగుతుంది.
క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
వైఎస్సాఆర్‌ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్‌పవర్‌, 130 మెగా వాట్ల సోలార్‌ హైబ్రీడ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,000కోట్ల పెట్టుబడులు పెడు తోంది.650 మందికి ఉద్యోగ ఉపాధి అవకా శాలు రానున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయ నుంది.ఈప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్‌ 19న జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.-జిఎన్‌వి సతీష్‌

కడలి కోత పెడుతోంది..!

‘‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ సముద్రతీరం భయపెడుతోంది. రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.అలల ఉధృతికి తీరంలో కోత పెరిగిపోతుంది. ఇసుక తెన్నెలు కరిగిపోకుండా ఏర్పాటు చేసిన రాళ్లగోడలు సైతం జారుతున్నాయి. ఆర్కేబీచ్‌లో కోత నివారణ కోసం పెంచుతున్న కొబ్బరి వనాలు కోతకు కడలిలో కలసిపోతున్నాయి.కడలి హోరును ఆవేమీ తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా కురుసురా సబ్‌మెరైన్‌ మ్యూజియం ప్రాంతంలో నానాటికీ తీర ప్రాంతం కడలిలో కలిసిపోతుంది.కొన్నాళ్లుగా శాంతించి గంగమ్మతల్లీ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. సముద్రం గత రెండు మూడు రోజుల నుంచి ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో కొన్నిచోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది.. ఆర్కేబీచ్‌లో విక్టరీ ఎట్‌ సీ ఎదురుగా ఉన్న బీచ్‌ సందర్శకులను భయపెడుతోంది.అక్కడ పర్యాటకులు, సందర్శకులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్‌ ఎరినాకు కెరటాలు తాకుతున్నాయి. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.’’ (జి.ఏ.సునీల్‌ కుమార్‌)
విశాఖలోని సాగరతీరం మళ్లీ కోతకు గురవు తోంది.తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుఫాన్లు,పెనుతుఫానుల సమయం లోనే ఇలాంటి పరిస్థితి తెలెత్తేంది.కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు,ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోం ది.గతంలో 2014,2015,2016 సంవత్స రాల్లో విశాఖసాగరతీరం కోతకు గురైంది.2015లో మరిం త అధికంగా..కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కేబీచ్‌ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండరాళ్లను దింపి దడిలా ఏర్పాటు చేసి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు.
రక్షణ కోసం వేసిన ఐరన్‌ మెస్‌ ధ్వంసం చేసేలా..
ఇన్నాళ్లు ఎక్కడో చోట అప్పుడప్పుడు తీరం కోతకు గురయ్యేది.సబ్‌ మెరైన్‌ మ్యూజియం,నోవెటల్‌ ఎదు రుగా ఉన్నబీచ్‌,సాగర్‌నగర్‌ ఋషికొండ ప్రాంతా ల్లోనూ కోతకు గురయ్యేది.ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగినప్పటికీ..తాజాగా విక్టరీ ఎట్‌ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగింది. ఆర్కే బీచ్‌ ఏరియాలో సందర్శకులు సేద జరిగినం దుకు కొన్నిచోట్ల కోకోనట్‌ ఎరీనాలు ఏర్పాటు చేశారు అధికారులు.తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపో కుండా..ఉండేందుకు ఇసుకతోపాటు పెద్ద పెద్ద రాళ్ల ను పేర్చి వాటికి ఐరన్‌ మెస్‌ ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్రరూపంతో.. ఆ ఐరన్‌ మెస్‌ను తాకి..అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా.. మెస్‌ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ఐరన్‌ మెస్‌ను ధ్వంసం చేసేలా ఉంది. దీంతో మెస్‌ లోపల కొబ్బరిచెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండ రాళ్లుసైతం బీచ్‌ కెరటాల వైపు కొట్టుకు వెళ్తున్నాయి.ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
యారాడ నుంచి భీమిలి వరకూ..
సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడంవల్ల తీరంలో ఇసుక పెద్ద మొత్తం లో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధార ణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరంకోత సమస్య ఎదుర్కొంటోంది.ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీ టర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్రతీరం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తిం చారు.ఇందులో యారాడబీచ్‌,కోస్టల్‌బ్యాటరీ, ఆర్కే బీచ్‌, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం,చిల్డ్రన్స్‌ పార్క్‌, జోడుగుళ్లపాలెం,రుషికొండ,భీమిలి తదితర ప్రాంతా లున్నాయి.ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్‌ చేయిస్తుం టుంది.ఏటా ఏఫ్రిల్‌,మే నెలల్లో డ్రెడ్జింగ్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతాళ్లో ఇసుకను పంపింగ్‌ చేస్తుంది.దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది.
తాజాగా దూకుడు..
విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి.సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు..భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా.. వాస్తవానికి,పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటు పోట్లు సహజం..కానీ,సాధారణ రోజుల్లో కూడా ఆటు పోట్లు పెరుగుతుండటం,అలలు చొచ్చుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది.దాదాపు మూడు రోజుల నుంచి ఈపరిస్థితి ఉంది.కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్నిచోట్ల కోత ప్రభావం కనిపి స్తోంది.విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓరిసార్ట్సు సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600కొబ్బరి చెట్లను నాటింది.ఆ చెట్లును బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్రతీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు,బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీ ఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు కూలుతు న్నాయి.
కోత నివారణకు విశాఖ పోర్టు సంరక్షణ చర్యలు..
విశాఖ ఆర్కే బీచ్‌ ప్రాంతంలో బీచ్‌ నిర్వహ ణ,విశాఖ పోర్టు అథారిటీ సామాజిక బాధ్యతలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అవుటర్‌ హార్బర్లో పేరుకున్న ఇసుకను సముద్రతీర ప్రాంత పరిసరాలలో నింపుతూ విశాఖలో బీచ్‌కోత నివారణకు పోర్టు సంరక్షణ చర్యలు తీసుకుంటుంది.విశాఖ నగరంలోని బీచ్లను పరిరక్షిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తుంది.బీచ్‌కోత నివారణ కోసం డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉన్న అత్యాధునిక డ్రెజ్జర్లను వినియోగించి,డిసిఐ డ్రెడ్జ్‌ 21పరికరంతో పోర్టులోపల పేరుకుపోయిన ఇసు కను తవ్వి ఆర్కే బీచ్‌ పరిసరాలలో 0.5కిలమీటర్ల పొడవైన పెపులైన్లు, రెయిన్‌ బోయింగ్‌ ద్వారా నింపు తారు.ఇలా ప్రతి ఏటా పోర్ట్‌ అధికారులు, రాష్ట్ర ప్రభు త్వం డ్రెడ్జింగ్‌ పనులు చేపడితేనే బీచ్‌ కోతకు గురవ కుండా ఉంటుంది.గత సంవత్సరం కొంతమేర పను లు చేసినప్పటికీ ఈ సంవత్సరం మరల కోతకు గురవు తుంది. ఇప్పటికైనా పోర్ట్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని బీచ్‌ కోతకు గురవకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కోత నివారణకు ప్రతిపాదనలు..
ఇటీవల సముద్రం కోతకు గురైన సంద ర్భాల్లో భారీగా సముద్రంలో ఉన్న ఇసుకను తీరంపై వేసేవారు.వైజాగ్‌ పోర్ట్‌ ప్రత్యేకంగా దీనికోసం ఆర్థిక భారాన్ని భరించి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసేది.హుదూద్‌ సమయంలో కెరటాలు ఆర్కే బీచ్‌ రోడ్డుపైకి వచ్చాయి.. ఆ సమయంలో భారీగా తీరం కోతకు గురవడంతో నివారణ చర్యలు తీసుకున్నారు.అయినప్పటికీ సము ద్రుడి ఉగ్రరూపం ముందు ఆచర్యలన్ని తాత్కాలి కంగానే మిగిలిపోయాయి.అయితే గతంలో చేసిన డ్రెడ్జింగ్‌ ద్వారా ఆర్టిఫిషియల్‌గా వేసిన ఇసుక మళ్ళీ సముద్రం తన సహజసిద్ధంగా సముద్రంలోనికి కలిపే సుకుంటుందని మరి కొంతమంది నిపుణులు అంటు న్నారు. అయితే..తీరం కొత్తశాశ్వత నివారణకు వైజాగ్‌ మెట్రో రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది.తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక పనులకు,ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తూ.. కోస్టల్‌ ఎరోసన్‌ ప్రాజెక్టుకూ ప్రతిపాదన కేంద్రానికి పంపింది. 200కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, వీఎంఆర్‌డీఏ 90:10నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళికలో సిద్ధం చేశారు.
భయపడెతున్న సాగరతీరం..
ఒకప్పుడు బీచ్‌కు వెళ్తే చాలా దూరం ఇసు కలో నడుస్తూ కెరటాల ముందు వరకూ వెళ్లే వాతా వరణం ఉండేదని,ఇప్పుడు తీరం భారీ కోతలమూ లంగా ఎక్కడ కూర్చోవాలో తెలియనంతగా ఇరుకుగా మారింది.అధికారులు,పర్యావరణవేత్తలుఈ విష యంలో తగిన పరిష్కారం చూపాలి.అందమైన విశాఖ బీచ్‌ అలాగే ఉండాలంటే విశాలమైన ఇసుక తిన్నెలు ఉండాల్సిందేనని బీచ్‌ప్రేమికులు అంటున్నారు. విశాఖ సాగరంలో 2012లోఏర్పడిన సునామీ సమ యంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు చూస్తే పరిస్థి తులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.ఈనేపథ్యంలో సముద్రం నెమ్మ దిగా ముందుకు దూసుకుని వస్తే ఎలా అన్నచర్చ పర్యాటకులు,సందర్శకుల్లో మొదలైంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
విశాఖపట్నం అనగానే సుందర సాగరతీరం అందరికీ గుర్తొస్తుంది. వైజాగ్‌ వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్‌ ని సందర్శించే వెళ్తారు. నిత్యం పర్యాటకులు, నగరవాసులతో బీజ్‌ అంతా సందడిగా కనిపిస్తుం టుంది. అయితే అలాంటి సాగరతీరం కోతకు గురవు తోంది. అలలు తాకిడికి తీరం కోతకు గురవుతోంది.. దీంతో చెట్లు, పార్కులు, రోడ్లు ధంసం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పోర్ట్‌ అధికారులు, జీవీఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సముద్ర శాస్త్ర రిట్కెర్డ్‌ ప్రొఫెసర్‌ బీఆర్‌ రెడ్డి అంటు న్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరం పక్కన ఉన్న రోడ్లు, భవనాలు మునిగిపోయే ప్రమాదం ఉదని ఆయన తెలిపారు. గతంలో సము ద్రం లోపల నుండి ఇసుక తీసుకువచ్చి డ్రెజ్జింగ్‌ పనులు చేసేవావారని..ఇలా చేస్తే తీరం కోతకు గురవ కుండా ఉంటుందని తెలిపారు. అయితే ఇటీవల డ్రెజ్జింగ్‌ పనులు చేయకపోవడం..అధిక శాతం ఇసుక అలల తాకిడికి కోతకు గురికావడంతో తీర ప్రాంతం దెబ్బతింటోందని ఆయన తెలిపారు.

గిరిజనులారా బహుపరాక్‌..!

ఇరువైతోమ్మిదేళ్లక్రితం పీసాచట్టం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది మేథావులు,గిరిజనులు పోరాడి సాధించారు.ఈచట్టంపై రాజ్యాంగం కల్పించిన హక్కులు, వనరుల పరిరక్షణ కోసం షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆయా గ్రామాల్లో జనవరి3నుంచి7వ తేదీ వరకు పెసాచట్టం కమిటీలకు ఉపాధ్యక్షుడు,కార్యదర్శి పదవు లకు ఎన్నికలు జరిగాయి.వాస్తవానికి పార్టీలకు అతీతంగా చేతులు ఎత్తే విధానంలో ఈఎన్నికలు జరిగాయి కానీ అన్నీ రాజకీయపార్టీల ముసుకులోనే జరిగిన ఈఎన్నికల్లో ఆయా ప్రతినిధులు పదవులు దక్కించుకున్నారు. ఎన్నికైన వారంతా ఐదేళ్లు పదవుల్లో ఉంటారు.
అయితే,ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజన తెగలకు చెందినవారే కాబట్టి ప్రతి ఒక్కరూ పెసాచట్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకతఎంతైనా ఉంది.వనరులు,హక్కులు దోపిడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఎందుకంటే..ఈచట్టం ప్రకారం ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్ర బిందువు చేశారు.గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు.ఒకప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు.వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వన రులు,అటవీ సంపదపై యాజమాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆవనరులను స్వీయ అవసరాల కోసం వినియో గించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు.ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ,నష్టపరిహారం పంపిణీ,గనులతవ్వకాలకు సంబంధించిన లీజులు,సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్ర మాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉపప్రణాళిక నిధులఖర్చుకుసైతం గ్రామసభల అనుమతి తీసు కోవాలి.అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి. జల,అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షిం చుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి.విద్యా,వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతఉంటుంది.
దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే.అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి,వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన,కట్టుబాట్లు, భౌగోళిక,సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడంఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి.గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ,చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు-‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.
పీసా,అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు.దీంతో రాజ్యాంగరక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి.పీసాతో సహా ఇతర గిరిజనరక్షణ చట్టాలు,సంబంధిత నిబంధ నలపై శిక్షణ,అవగాహన పెంచే బాధ్యత,అమలు తీరునుపర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది,తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి.పీసాచట్టం అమలులోకి వచ్చి 29ఏళ్లుయిన తర్వాత పెసాచట్టంపై ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పెసాచట్టం పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి.మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చిపెసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యతకొత్తగా కొలువుదీరిన పెసా కమిటీపై ఎంతైనా ఉంది!

– రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2 3 4 5 6 75