మహా భూతం …ప్లాస్టిక్‌

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండి పోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసి పోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి. వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తిం చేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.-గునపర్తి సైమన్‌


వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడు తున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌, రక్తం భద్రపరచే సంచులు, ఇంజక్షన్‌ సీసాలు, సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యా వరణం,ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు,రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం, సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది.కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది.ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతు న్నాయి.2030నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050నాటికి నాలుగిం తలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి.2029నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3టన్నుల ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్ర భావం చూపుతుంది.ప్లాస్టిక్‌ అనేది‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌ బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజా యిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూటాల్టిన్‌, జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌,సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు),బిస్పినాల్‌ లాంటి రసాయనా లు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి.ఈ రసాయనాలన్నీ సముద్ర జీవ రాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓకారణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం.గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు.కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయ కుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం. మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటు న్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతు న్నాయి.వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి.దీంతో రోడ్లు జలమ య మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతు న్నాయి.ఓమోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసంఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతు న్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యం త్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, బేకరీ లలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయ డానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది.ఇలా క్యాన్సర్‌,ఉదర కోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.

అవగాహనతో క్యాన్సర్‌ను అధిగమిద్దాం

క్యాన్సర్‌ ఒకప్పుడు మహమ్మారి. అదేంటో కూడా తెలియని స్థితి. నేడు క్యాన్సర్‌ జయించే స్థితిలోకి వచ్చాం. ఇది ఒకరకంగా వైద్యరంగంలో పెద్ద విజయంగా పేర్కొన వచ్చు. అయితే ఈవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదక రంగా ఉన్నదనేది అంతే వాస్తవం. అదే సందర్భంలో నేడు ఎక్కువమందిలో కనిపిస్తుండటం ఆందోళనకరం. మన దేశంలో క్యాన్సర్‌ ప్రమాదకరస్థాయిలో ఉందనేది గణాం కాలు చెప్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్‌ నియంత్రణలో అధు నాతన పద్ధతులు ఎన్నో వచ్చాయి. ఇంకా చాలా పరిశో ధనలు జరుగుతున్నాయి. రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీతో కూడా నివారించే పద్ధతుల్లో అందుబాటులోకి రావడం ఆశాజనకం.ఇంకా వైద్యరంగంలో మరింత పురోగతి సాధించటానికి కృషి కొనసాగుతూనే ఉంది.
క్యాన్సర్‌ నానాటికీ వృద్ధి చెందుతుండటంతో మరణ మృదంగంలా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన రెండు దశాబ్ధాలలో క్యాన్సర్‌ మరణాలు పెరుగుతున్నాయి.2026 నాటికి మనదేశంలో ఏటా 20లక్షలమంది క్యాన్సర్‌తో మర ణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90.5మిలియన్ల మంది కి క్యాన్సర్‌ వచ్చింది. 2019లో 23.6 మిలి యన్లకు ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే10మిలియన్ల మరణాలు సంభ వించాయి. ఇది గతదశాబ్ధంలో వరుసగా 26శాతం పెరుగుద లను సూచిస్తోంది. మొత్తంమీద చాపకింద నీరులా యావత్‌ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మాన వుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మరో ఆందోళ నాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్‌ భారినపడటం. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు కోటి మంది వరకు క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. 2024 లో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. అంటే ప్రతిరోజూ సుమారు 26వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతు న్నారనేది ఒక అంచనా.మనదేశంలో తాజాగా కొత్తగా 20 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదువుతు న్నాయని అంచనా.నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం 2022లో 14 లక్షల మంది బారినపడ్డారు. అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2025 కల్లా మనకి ఈ క్యాన్సర్‌ అనేది సగటున 12శాతం పెరిగే అవకా శంకనబడుతోందని గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఎందుకొస్తుందంటే..
మనిషి శరీరం మొత్తం కణజాణంతో నిండి వుంటుంది. అయితే శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవటమే క్యాన్సర్‌. మామూలుగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ,చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఇలాంటి ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చని పోకుండా అలాగే ఉండిపోతాయి.కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్‌ఎలవల్ల తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే పిల్లలకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే.అలాగే క్యాన్స ర్‌ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆహా రపు అలవాట్లు, రేడియేషన్‌,పొగతాగటం,ఊబ కాయం తదితర కారణాలతో కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి.ఫలితంగా శరీరానికి అవసర మైన కణాలు కంటే ఎక్కువవృద్ధి చెందుతాయి. అవన్నీ ట్యూమర్‌ (కణితి)గా ఏర్పడతాయి.దాన్నే క్యాన్సర్‌ అంటారు. పురుషుల్లో ముఖ్యంగా ఊపిరి తిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్‌ (లుకేమియా)అనే కారకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. క్యాన్సర్‌ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుం ది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణా లు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్‌ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
క్యాన్సర్‌ రహిత కణితితో ప్రమాదం లేదు..
కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి.క్యాన్సర్‌ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది.తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే క్యాన్సర్‌ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాప్తి చెందు తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్‌ కణితులు ఏర్పడతాయి.అలసట,శ్వాస తీసు కోవటంలో సమస్యలు,చర్మంలోగడ్డలు ఏర్పడటం, శరీరంబరువులోమార్పులు,చర్మంరంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేధించటం వంటి సమస్య లను క్యాన్సర్‌ లక్షణాలుగా గుర్తించొచ్చు. అయితే శరీరం లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కన్పిస్తుంటాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, స్కిన్‌ క్యాన్సర్‌,లంగ్‌ క్యాన్సర్‌,ప్రొస్టేట్‌క్యాన్సర్‌,కొలోన్‌ లేదా రెక్టం క్యాన్స ర్‌,బ్లడ్‌క్యాన్సర్‌,కిడ్నీ క్యాన్సర్‌ వంటి క్యాన్సర్లు వస్తుం టాయి. నిపుణులైన డాక్టర్లను సంప్రదించటం ద్వారా వారిచ్చే వైద్యసేవలతో క్యాన్సర్లను నియంత్రించొచ్చు.
అధునాతన వైద్యంతో నియంత్రణ
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్‌ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతం రోబోటిక్‌ పద్ధతిలో కూడా క్యాన్సర్‌ కారకాలను గుర్తించి,నియంత్రణ చేస్తున్నారు. ప్రపం చ ఆరోగ్యసంస్థ(డబ్ల్యుహెచ్‌ఒ)పిలుపునిచ్చిన విధంగా 2024లో‘క్యాన్సర్‌నియంత్రణలోఆటంకాలను అధిగ మిద్దాం’(క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌) థీమ్‌ మేరకు ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్స ర్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌,తల,మెడక్యాన్సర్‌,గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం),కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్‌ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూ నోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్‌ సంరక్షణలో సర్వైవల్‌ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
మెరుగైన జీవనశైలితో మార్పులు
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్ర త్తలు తీసుకోవాల్సిందే.అనారోగ్యంభారినపడ కుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు.. తినకూడదు.. తాగకూడదు.మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటారు.అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం.మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్‌ చేసి న ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నూడిల్స్‌) లాంటివి తినేస్తుంటాం.బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతుం టారు.అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బం దులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.-డాక్టర్‌ సాయికృష్ణ కొల్లూరు

జీవుల మనుగడ జీవ వైవిధ్యం

ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం,ఒకటే గృహం.మనుషులంతా ఒకటే అనేది ఉట్టి మాట. పొడుగు,పొట్టి,లావు,సన్నం,నలుపు,తెలుపు,ఇంకా వీటి మధ్యస్థ రకాలు,భేదాలు.ఇంకా మనుషు లంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి?ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి.ఈభూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈ తరహా భేదాల న్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్‌ వంటిది.ప్రకృతిలో ప్రతి జీవి ఒకప్రత్యేక పాత్రనుపోషిస్తూ పర్యావరణవ్యవస్థల స్థిరత్వం,స్థితిస్థాపకతకు దోహ దం చేస్తుంది.ఒకపురుగో,అసలిప్పటివరకు సామాన్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమైపోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతిజాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంక ర్షణ చెందుతుంది.పర్యావరణ వ్యవస్థను ఒకభారీ నెట్‌వర్క్‌గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవిఒకదారం ద్వారా ఇతరులతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక దారం తెగిపోయినప్పుడు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతులు ప్రభావితమౌతాయి.అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యం గా ఉంటుందో,అది అంతబాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉం టుంది.జీవుల సహజ ఆవాసాల నాశనం,కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయాలతో పర్యావరణం నిలకడగా ఉండదు.అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభా వితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు :ప్రతిరోజూ,జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు,మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరి యు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్‌ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించ డానికిఉపయోగపడుతుంది.ఉదాహరణకు, మానవు లు ఉత్పత్తిచేసే కార్బన్‌ డయాక్సైడ్‌లో దాదాపు సగ భాగాన్ని పీల్చుకోవడంద్వారా వాతావరణాన్ని నియం త్రించడంలో సముద్రాలు,అడవులు కీలక పాత్ర పోషి స్తాయి.చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీరపర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటిశుద్దీకరణతోపాటు,ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి,తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవ శాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూలుస్తు న్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే,జీవ వైవి ధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్య భరి తమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.ఎన్నో శాస్త్రీయ నివేది కలు ఈవిషయాన్ని నివేదించాయి. ఉష్ణోగ్రతలు 1.5 పెరిగితే, దాదాపు 6% కీటకాలు,8% మొక్కలు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో (ఆవాసాల మార్పు)మార్పులకులోనవుతాయి.ఉష్ణోగ్రతల పెరుగు దల 2%మేర అయితే,ఈ శాతాలు రెట్టింపు అవుతా యి.ఈకారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూ హ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభా గంలో దాదాపు 7%పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్‌ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘటనలు) ఎక్కు వగా నమోదు చేయబడుతున్నాయి, ఫలితంగా జాతు ల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపు తుంది.ఉష్ణోగ్రత1.5జలేదా2%జపెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరి యా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమికోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారి కంగా 17కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆకోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరించడం జరిగిం ది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే!భూమిచరిత్రలో జీవవైవిధ్యం అంతరించి పోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే.గతంలో కనీసం అయిదు సార్లు సహజ కార ణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు (జుఞ్‌ఱఅష్‌ఱశీఅం)జరిగాయి.వీటిలో చివరిది 65 మిలి యన్‌ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలు ప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమి టంటే,ప్రపంచీకరణనుండి,జీవవైవిధ్య నష్టం ప్రమా దకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటు న్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు, ప్రతిజాతి మన పర్యావరణవ్యవస్థ అనే వస్త్రపు సమ తుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారి పోతున్నాయి.మన కళ్లముందే ప్రకృతికను మరుగవు తోంది.భూగ్రహంపై జీవవైవిధ్యం ముప్పులో ఉండ టానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధార పడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం,వేటాడటం,ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగావక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగు తూనే ఉంది.గత కొన్నిసంవత్సరాలలో,జనాభా పెరుగు దల,దాంతోబాటే విపరీతంగా,అనిశ్చితంగా పెరిగి న,ఉత్పత్తి, వినియోగ విధానాలు జీవవనరు లకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ ఓ.విల్సన్‌ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు,అలాగే పర్యావర ణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవసంపదగా నిర్వచించవచ్చు. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవి ధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణం గా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్య పై అవగా హన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపు తుంది.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం,32,87,263చదరపు కిలోమీటర్ల వైశా ల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారత దేశంలో89,451జంతుజాతులున్నాయి.ఇది ప్రపంచజంతుజాలంలో7.31%. అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి.ఇది ప్రపంచమొత్తంలో 10. 78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న పదిహేడు అతి పెద్ద జీవవైవిధ్య దేశాలలో భారత దేశం ఒకటి. భూవిస్తీర్ణంలో 2.4 శాతమే ఉన్నప్ప టికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8 శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. – (డా.కాకర్లమూడి విజయ్‌)

భారత్‌ గణతంత్ర దినోత్సవం`2025 ప్రత్యేకతలు

‘‘ భారత సైనిక శక్తిని,ఆయుధ పాటవాన్ని,సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.అత్యాధునిక క్షిఫణులు,యుద్ద విమానాల ప్రదర్శన,జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢల్లీిలోని కర్తవ్య పథ్‌లో జనవరి 26న జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంత్రమంత్రులు,త్రివిధ దళాధిపతులు,ప్రముఖలు పాల్గొన్నారు.రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.’’
త్రివర్ణ స్పూర్తి`సమున్నత కీర్తి
భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా,అపారమైన సైనిక పాటవానికి అద్దం పట్టేలా,పురోభివృద్ధి ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేలా శకటాలు,కవాతులకు కర్తవ్యపథ్‌ వేదికగా నిలిచింది.76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఢల్లీిలోని కర్తవ్యపథ్‌ నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వారిద్దరూ కలిసి గుర్రపుబగ్గీలో ప్రధాన వేదికవద్దకు వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈసారి ఒక ప్రత్యేకత.అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ‘స్వర్ణిమ్‌భారత్‌: విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ పేరుతో ప్రత్యేక శకటాలకు రూపకల్పన చేశారు.బ్రహ్మోస్‌,ఆకాశ్‌ క్షిపణులు,పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యే-ఆకర్షణగా నిలిచాయి.కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన 31శకటాలను ప్రదర్శించారు.
మార్మోగిన ‘నారీశక్తి’
కవాతులో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌ పరేడు ప్రారంభించారు. సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నారీశక్తిని చాటేలా అధికారిణులు- లెఫ్టినెంట్‌ కర్నల్‌ రవీందత్‌ రంధావా, లెఫ్టినెంట్‌ కమాండర్‌ మ అగర్వాల్‌, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రుచి సాహా, కెప్టెన్‌ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డీఆర్డీవో బృందానికి మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సహాయ కమాండెంట్‌ ఐశ్వర్య జాయ్‌ నేతృత్వంలోని 148 మంది సభ్యుల సీఆర్పీఎఫ్‌ మహిళా బృందం, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఆదిత్య నేతృత్వంలోని ఆర్పీఎఫ్‌ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. 15 మంది మహిళా పైల బృందం గగనతల విన్యాసాలతో తమ ప్రతిభను చూపింది.
ప్రపంచ రికార్డులు..
కదులుతున్న మోటారుసైకిల్‌ మీద 12 అడుగుల ఎత్తైన నిచ్చెనపై నిలబడి రాష్ట్రపతికి శాల్యూట్‌ చేయడం ద్వారా మహిళాధికారిణి కెప్టెన్‌ డిరపుల్సింగ్‌ భాటి ప్రపంచరికార్డు సృష్టించారు. డేర్రెవిల్స్‌ ప్రదర్శించిన మరో విన్యాసం కూడా ప్రపంచరికార్డు సృష్టించనుంది. 33మంది కలిసి మానవ పిరమిడ్‌ ఆకారంలో చేసిన ఇంకో విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. సుఖోయ్‌ విమానాల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కొయ్యబొమ్మల నుంచి మహా కుంభమేళా వరకు వివిధ అంశాలకు ప్రతీకగా శకటాలు నిలిచాయి. 5వేల మంది జానపద కళాకారులు, గిరిజనులు కలిసి 45 రకాల నృత్యరీతుల్ని ప్రదర్శించారు. ఇండోనేసియా సైనిక దళానికి చెందిన 152 మంది బృందం కవాతులో పాల్గొంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో
రాష్ట్రప్రగతికి పది సూత్రాల ప్రణాళికతోముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిం చిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిం దన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరి పాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిరదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్‌ 2047 రోడ్‌మ్యాప్‌ రూపొందిం చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగ మించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్ల నుంచి 2047నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పది సూత్రాలు
`-పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం.
-అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.
-మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.
-యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన
-నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి,అరటి,మిర్చి,కాఫీ,సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెటోతో నుసంధానం.
-మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానా శ్రయాలు,మల్టీమోడల్‌ రవాణా కేంద్రాల అభివృద్ధి.
-క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్‌ రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం.
-గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండిరచే పంటలకు విలువ జోడిరపు సౌకర్యాల కల్పన.
అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు : అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం,ఓటుహక్కు కల్పించిందని అయ్యన్న పాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈసందర్భంగా పిలుపు నిచ్చారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్‌: శాసనమండలిలో ఛైర్మన్‌ మోషేన్‌రాజు త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్‌ రాజు తెలిపారు. పాఠ్యాం శాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజ యానంద్‌ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్‌ కె.విజయానంద్‌ మిఠాయిలు పంచారు..
హైకోర్టులో..: హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వగణతంత్ర వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ఠాకూర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్యస్ఫూర్తిని పెంపొందించుకు ని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అంద రికీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ శకటం..
ఢల్లీిలోని కర్తవ్య పథ్‌ 76వ రిపబ్లిక్‌ డే పరేడ్‌ సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రదర్శించ బడిరది. ఆంధ్రప్రదేశ్‌ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈకళాఖండాలు ఎన్నోఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లాగా ఉన్నాయి. ఎలాంటి రసాయ నాలు ఉపయోగించకుండా అడవి లో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.ఈ శకటం ఆంధ్ర ప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓకలికితురాయి వంటివి. మా మూలు కర్రతో తయారు చేసే ఈబొమ్మలు.. దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనా త్మకతను సగర్వం గా చాటి చెబుతు న్నాయి.ఘన చరిత్ర కలిగిన ఈబొమ్మలు గణ తంత్ర దినోత్స వంనాడు శకటం రూపంలో దర్శన మిచ్చి ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లాలోగణతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖపట్టణం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్రసమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు,రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వా మ్యం కాగా..జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగాడీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంపై మైదానాన్ని సంద ర్శించారు. అనంతరం పరేడ్‌ కమాండర్‌ ఎన్‌.వి. రమణ సారథ్యంలో మార్చ్‌ ఫాస్ట్‌ మొదలు కాగా పోలీస్‌ సిబ్బంది,ఎన్‌.సి.సి. క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్‌, వేదికపై ఆశీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్‌ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులు

సముద్రం,నది ఇతర నీటి వనరులు కలిగిన తీర పాంతాల్లో తక్కువ లోతు ఉండి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. పెద్దనదులు లేదా సరస్సుల వెంబడి మంచినీటి చిత్తడి నేలలు ఏర్పడతాయి.. అతిపెద్ద సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సును చిత్తడి నేలలు కలిగిన భూమిగా గుర్తించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే భావితరాలకు చిత్తడి నేలలు ఉండవు. ఇప్పటికే పలురకాల పక్షులు,జంతువులు, జీవ జాతులు అంతరించిపోతున్నాయి. కొన్నిరకాల జంతువులు, పక్షులు చూడా లంటే జూపార్కు లోనో, ఛానల్స్‌లోనే చూడవలసి వస్తుందని, ఇదే పరిస్ధితి కొన సాగితే భవిష్యత్తులో చిత్తడినేలలు కనుమరు గవు తాయని పర్యావరణ నిపు ణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి మను గడకు చిత్తడి నేలలు ఎంతో దోహద పడతాయి. సృష్టిలో సహజసిద్ధంగా ఏర్పడిన వనరులను కాపాడుకుంటే భావితరాల ప్రజలకు వాటి ఆవశ్య కత, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించ గలుగు తాం. సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశుల్లో 40 శాతం చిత్తడి నేలల్లోనే ఉంటాయి. పక్షులకు ఈ నెలల్లో ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. వీటి ప్రాముఖ్యతను గుర్తించి వివిధ దేశాలు ‘ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నాయి.
భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించి పోతున్నాయి. జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి64శాతంమేర అంత రించి పోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ,అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరా న్లోని రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరి ఆతరవాత నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈఏడాది లక్ష్యం.
ఎన్నో ప్రయోజనాలు..
సముద్ర,నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు,తంపర,బీల భూములు,పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని,అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాయు దుష్ప్రభావాలను గణనీయంగా నియం త్రిస్తాయి.అరుదైన మత్స్య,వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతోపాటు దేశ,విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు,కాలుష్య తీవ్రత ను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి.చిత్తడి నేలలు సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.ఈ నేలల్లో లభించే చేపల్లో పోష కాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధ నలు తేల్చాయి.చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్న చిత్తడి నేలలు-పర్యటక ఆదా యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్‌ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు.వీటిలో అత్యధికంగా 175 వరకు యూకేలోనే ఉన్నాయి.142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది.భారత్‌ 1982లో రామ్సార్‌ ఒప్పందంలో చేరి చిత్తడి నేల గుర్తింపును మొదలుపెట్టింది.1982-2013 మధ్య కాలంలో 26ప్రదేశాలను,2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు,పులికాట్‌ సరస్సులు ఇలా గుర్తింపు పొంది నవే.రామ్సార్‌ ఒప్పంద ప్రమాణాలకు అను గుణంగా ఉన్నప్పటికీ,దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్రతాత్సారం జరుగు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ, నేచురల్‌ హిస్టరీ (సాకాన్‌) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశా లకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించా లని సూచించింది.వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీ వాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవి గా సాకాన్‌ పేర్కొంది.సోంపేట,నౌపడ, వాకల పూడి బద్వేలు,కంభం,విశాఖపట్నం జిల్లాలోని కొండక్లర్ల్‌ ఆవ,తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని,వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.కొల్లేరు,కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ,వాటి సంరక్ష ణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తిం పు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు,విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని,అక్కడి నేలలను పునరు ద్ధరించ డంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతు న్నాయి.సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్పుర్లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవరూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది.జాతీయ హరిత ట్రైబ్యునల్‌,కాగ్‌ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి.జాతీయ అటవీ కమిషన్‌ 2006 లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017 లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శ కాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలు న్నాయి.
బహుముఖ చర్యలు కీలకం…
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభు త్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచా రాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యా వరణ,అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు,భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి.చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్‌ ధరోహర్‌’ పథకాన్ని రామ్సార్‌ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు.మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయు క్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమూహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే-చిత్తడి నేలల విధ్వంసం నిరాటం కంగా సాగు తూనే ఉంటుంది!
కొరవడిన సంకల్పం
చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీటి పరి రక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్హాగెన్‌ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దుర దృష్టకరం.జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రా మిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు పంటల సాగు కోసం రసాయన ఎరువులు,పురుగు మందులను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
జల,వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవి ష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతున్నారు.సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు.ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరి స్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు.సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్‌ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈచిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపం చంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలస వస్తున్నాయి. చిత్తడినేలలపై 1971సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్‌ దేశంలో రామ్‌సర్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపం చంలోని 164దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి.వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
అరుదైన మొక్కలు,పక్షులు,జంతువులు,చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో,కాలుష్య కారకా లను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమిం చుకుని రసాయన ఎరువులు వాడడంవల్ల నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈచిత్తడి నేలలు కేటాయించ డంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
భూమికి ఊపిరితిత్తులు!
6 వేలకు పైగా చిత్తడి నేలలు నమోదయ్యాయి
చిత్తడి నేలల సంరక్షణ కోసం వ్యవసాయం మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ నేషనల్‌ పార్క్స్‌చే నిర్వహించబడుతున్న కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తూ, మంత్రి యు మాక్లీ చిత్తడి నేలల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇవి జీవశాస్త్రపరంగా అత్యంత ఉత్పాదక పర్యా వరణ వ్యవస్థలు. రెయిన్‌ఫారెస్ట్‌, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం మరియు జీవ వైవి ధ్యాన్ని సంరక్షించడం రెండిరటిలోనూ దృష్టిని ఆకర్షిస్తూ,ఈ ప్రాంతాలు అనేక విధులను కలిగి ఉన్నాయని యుమాక్లే పేర్కొన్నారు.ఈ ప్రాంతాలు భూగర్భ జలాలను పోషించడం,భూగర్భ జలాలను సమతుల్యం చేయడం, వరద నీటిని నిల్వ చేయ డం, వరదలను నియంత్రించడం,తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా ఈప్రాంతం నీటి పాలనను క్రమబద్ధీకరి స్తుంది.2002లో చేసిన శాసన పునర్విమర్శతో చిత్తడి నేలలను నింపడం మరియు ఎండబెట్టడం నిషేధించబడిరదని మంత్రి యుమాక్లే గుర్తు చేస్తూ, ‘‘అదే సంవత్సరంలో చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ అమలులోకి వచ్చింది. చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ,చిత్తడి నేలల రక్షణ,ఉపయో గం,సూత్రాలు,రక్షణ మండలాల నిర్ధారణ,అమలు సూత్రాలు,రామ్‌సార్‌ సైట్‌ల ప్రకటన ప్రక్రియ, జాతీయ చిత్తడి నేల కమిషన్‌ విధులు,పని విధానా లతో ఒక ముఖ్యమైన అడుగు తీసుకోబడిరది. నిర్ణయించబడ్డాయి.‘‘నియంత్రణ ద్వారా స్థాపించ బడిన నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ కమిషన్‌,చిత్తడి నేలలపై మరియు ప్రకృతి పరిరక్షణ పేరుతో సంబంధిత సంస్థలను కలిగి ఉన్న మన దేశంలో మొదటి కమిషన్‌’’సమాచారం ఇచ్చాడు. టర్కీ లోని రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ద్వారా రక్షించబడిన 14 ప్రాంతాలు కాకుండా,మొత్తం 59మిలియన్‌ 47 వేల1హెక్టార్ల విస్తీర్ణంలో161చిత్తడి నేలలు ఉన్నా యని, వీటిలో 205 జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు మరియు వాటిలో 120 స్థానిక ప్రాముఖ్యత కలిగినవి అని యుమాక్లే పేర్కొంది. గత 5 సంవత్సరాలలో,జనరల్‌ డైరెక్ట రేట్‌ నిర్వ హించిన అధ్యయనాలతో జాతీయ చిత్తడి నేలల జాబితా పూర్తి దశకు చేరుకుందని నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేర్కోంది.ఈ వ్యవస్థలో జాబితా మాత్రమే కాకుండా,చిత్తడి నేలల హోదాలో ఇవ్వబడిన చిత్తడి నేల కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి.అదనంగా, మన ప్రజలు ఇ-గవర్నమెంట్‌ ద్వారా చిత్తడి నేలల కోసం సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 1999 నుండి రామ్‌సర్‌ కన్వెన్షన్‌‘తడి నేలల హేతుబద్ధ వినియోగం’ సూత్రం పరిధిలో మా మంత్రిత్వ శాఖ చిత్తడి నేల నిర్వహణ ప్రణాళి కలను సిద్ధం చేసింది.చిత్తడి నేల నిర్వహణ ప్రణా ళిక ఆప్రాంతం సాధారణ రక్షణ వినియోగ సూత్రాలను నిర్ణయిస్తుంది. అదనంగా, ప్రణాళి కలు చిత్తడి నేలల సమస్యలను పరిష్కరించడానికి భాగస్వామ్య విధానం మరియు అన్ని ఆసక్తి సమూ హాలకు వివిధ బాధ్యతలను అందించే కార్యకలా పాలను కలిగి ఉంటాయి.1999 నుండి జనరల్‌ డైరెక్టరేట్‌ చే వెట్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌లు తయారు చేయబడ్డాయి. -గునపర్తి సైమన్‌

పీసా కమిటీ ఎన్నికల్లో అంతరంగమేమిటీ?

రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన రక్షణ చట్టాల్లో పెసాచట్టం1996(షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడి గింపు చట్టం)ఒక్కటి.ఈచట్టం ఐదువ షెడ్యూల్డ్‌ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమా చల్‌ప్రదేశ్‌,జార్ఖండ్‌,మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తెలంగాణవంటిపదిరాష్ట్రాలకుపెసా చట్టం1996 వర్తిస్తోంది.ఆదివాసీప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలనుకల్పించారు.షెడ్యూల్‌ గిరిజనులకు స్వపరిపాలన అందించడం,షెడ్యూల్‌ తెగలసంస్కృతి, సంప్రదాయాలు,వివాద పరిష్కార పద్దతుల రక్షణ,గ్రామసభకు అధికారం తీసుకునే నిర్ణయం ఉంది.ఈచట్టం ప్రాముఖ్యతపై19992010వరకు దశాబ్దకాలంపాటు విశ్రాంతిఐఏఎస్‌ అధికారి బీడీశర్మ,ఉస్మానియా సెంట్రల్‌ యూనివర్శిటీ విశ్రాంతి ఫ్రొఫెసర్‌ జేపీరావు వంటి సామాజిక ఉద్యమనేతలు మావూళ్లో మారాజ్యం అనే నినాదంతో ఆదివాసీల స్వపరిపాలనకోసం పోరాడి గిరిజన తండాలు,గూడేలు తిరిగి ఆతరం ఆదివాసీ ప్రజలకు పెసా చట్టంపై అవగాహన కల్పించారు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అనంతగిరి మండలం నిమ్మలపాడు లోనూ సమత ఆధ్వర్యంలో మావూళ్లో మారాజ్యం స్థూపం కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈచట్టం ప్రాధాన్యతను గ్రహించి రాష్ట్ర పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖ,ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ గ్రామసభ ప్రాముఖ్యతపై ప్రజలకు కాస్త అవగాహన కల్పించారు.గతేడాది ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజున13,326 గ్రామపంచాయితీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామసభ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.దీంట్లో ఏపీలో ఐదో షెడ్యూల్‌ ఏరియా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.ఆ తర్వాత రెండు గతేడాది డిసెంబర్‌లో పెసా చట్టం1996 అమలుపై రాష్ట్రప్రభుత్వం గిరిజన గ్రామాల్లో కమిటీ ఎన్నికలు నిర్వహించింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్నీ ఐటీడీఏ పరిథిలోఉన్న గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం పెసా కమిటీ ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేశారు.
అయిత,ే ఈపెసాచట్టం వచ్చిదాదాపుగా 29ఏళ్లు అవుతుంది.నాటి నుంచి నేటి వరకు ఏప్రభుత్వం పట్టిం చుకోలేదు.కూటమి ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాలపై పెసా కమిటీలు ప్రభుత్వ నియమ నిబంధనలతో ఎంపిక పూర్తి చేసింది.ఎంపికైన కమిటీ సభ్యుల్లో చాలా మంది యువతకే ప్రాధాన్యత ఇచ్చారు.ఇటీవల నేను అనంతగిరి మండలం నిమ్మలపాడు,రాళ్లవలస,కరకవలస గిరిజనగ్రామాలను సందర్శించాను.ఆప్రాంత పెసా కమిటీ సభ్యులనుస్థానికులు పరిచయం చేశారు.ఎన్నికైన కమిటీసభ్యులందరూ కుర్రగ్యాంగే.వారికిఈచట్టంపై ఏమాత్రం అవగాహన లేని పరిస్థితులను గమనించాను.రాజ్యాంగబద్దమైన చట్టాల కోసం అవగాహన లేని అమాయకులను ఎంపిక చేయడంపట్ల ప్రభుత్వ అంతరంగం ఏమిటీ గిరిజన మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఈప్రక్రియలో బహుళ జాతి పెట్టుబడిదారుల స్వార్ధం కన్పిస్తోందని భావిస్తున్నారు.ఇక్కడవున్న వనరుల దోపిడికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంట్లో భాగంగానే ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక ప్రాంతీయ పెట్టు బడులదారుల సమ్మెట్‌లో రాజ్యాంగబద్దమైన పదవిలోఉన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుచేసిన వ్యాఖ్యాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రసంచలనం రేపాయి.దీంట్లోభాగంగానే అయ్యన్న వ్యాఖ్యాలపై భగ్గుమన్న మన్యం ఈనెల 11,12 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను ప్రకటించడం గమనార్హం.
ఈనేపథ్యంలో ప్రభుత్వకుటిల నిర్ణయాలు,ఆలోచనలపై నేటి గిరిజనతరం ఆలోచించాలి.ముల్లును ముల్లు తోనే తీయాలనే చందంగా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన పెసా కమిటీ సభ్యులతోనే గ్రామసభల ద్వారా ఇక్కడ ఉన్న అపారమైన నిక్షేపాలు దోపిడికి రంగం సిద్దమవుతుందనేది కమిటీ సభ్యులు ఆలోచించాలి. దీనిపై గిరిజన సంఘనాయకులు,ఉద్యోగులు,ప్రజలు యావత్తు అప్రమత్తంగా వ్యవహరించాలి.ఇప్పటికే చింతపల్లి,పార్వతీపురం ఏరియాలో అదాని ప్రాజెక్టు కోసం సన్నహాలు సాగుతున్నాయి.ఇటీవల జరిగిన ఏపీ కాబినేట్‌ సమావేశంలో అల్లూరి జిల్లాలో అదాని ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం ప్రకటించడం తెలిసిందే.ఇప్పటికైనా పెసా కమిటీలు ఎన్నికల్లో పాలకుల కుతంత్రాల ఎన్నికైన అమాయక గిరిజన యువత గ్రహించాలి.గ్రామసభల తీర్మాణాల్లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా భవిష్యత్తు తరాల కోసం,ప్రజల పక్షాన నిలబడి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.లేని పక్షంలో గిరిజన ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది.! – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

వలస కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు.సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడాకూలీపనులు వుండటం లేదు.కారణం ముఖ్యం గా వ్యవసాయంలో యంత్రాలు రావడం.పంటల సాగులో మార్పులు రావడం (ఉదా:డ్రమ్‌ సీడిరగ్‌ చల్లటం లాంటి పనులు).ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం.బయట రాష్ట్రాల నుండి (బెం గాల్‌,బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసా యేతర పనులకు వెళుతున్నారు.ప్రధానంగా ఇటుక బట్టీ పను లు,భవననిర్మాణపనులు,హోటళ్ళలో క్లీనింగ్‌ పనుల కు,అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహి ళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు.నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి.ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి. వలస కూలీల పరిస్ధితి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌,బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్టచేత పట్టుకొని మహిళలను,పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తు లు,డీలర్లు చూపిన పశువుల కొట్టాలు,పాడుబడిన ఇళ్లు,బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు.వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు.ఒకఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ. 4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలంరూ.3200,రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద(గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి,కూరగాయలు,ఆటో ట్రాన్స్‌ పోర్టు) మధ్యవర్తులు,డీలర్లు కాజేస్తున్నారు.ఒక్క నెల్లూరు జిల్లా లోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది.స్ధానిక కూలీలు 2లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతాకూడా రైతాం గం బెంగాల్‌ కూలీలచేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి – (పుల్లయ్య మంగళ/ఆకారపు మల్లేశం)

గొంతెండుతున్న …మన్యం

వేల కోట్లు అందుబాటులో ఉంటున్నా వేలాది మంది సిబ్బంది ఉన్నా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం డోలీ కష్టాలు వెంటా డుతుండగా,మరోవైపు స్వచ్ఛమైన తాగునీటికి కూడా గిరిజనులు నోచుకోలేకపోతున్నారు.నీటికోసం కేం ద్రం నుంచి,రాష్ట్రంనుంచి భారీగానిధులు కేటా యిం పులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రారతాల్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలోనే ఏటా నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ల ద్వారా పనులకు నిధులు కేటాయిస్తున్నారు.విద్య, వైద్యం,ఆరోగ్యం,రోడ్లు,తాగునీరు,వ్యవసాయం వరటి అనేక రంగాలకు ఈ నిధులను కేటాయిస్తు న్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా పలు రంగా లకు నిధులు వస్తున్నాయి.ఇందులోనే తాగునీటి అవసరాలకు కూడా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈనిధులను మాత్రం సక్రమంగా ఖర్చు చేయ లేకపోతుండడంతో అనేక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికే ఊట నీటికి, చెరువుల్లో నీటికి,వాగుల్లో ప్రవహించే నీటికే పరిమితమవుతు న్నారు.దీనివల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తాజాగాఈ ఏడాది రాష్ట్రం లోని 9,934 గిరిజన ప్రారతాల్లో తాగునీటి కోసం 1,290కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమొత్తం పనులను జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేయా లనిప్రతిపాదిరచారు.ఈ నిధులతో మొత్తం 12, 838 పనులను గుర్తిరచి పనులు ప్రారంభించారు. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన ఫలి తాలు రావడం లేదు.ఇప్పటివరకు 5,718 పను లను మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2,582 పనులు పలుస్థాయిలోఉండగా, 4,5 38 పనులను ఇంకాప్రారంభించడమే జరగలేదు. ఇక మొత్తం నిధుల్లో కేవలం 218కోట్ల రూపాయ లను మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నీటివనరుల గుర్తింపులో అలసత్వం
గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ముందుగా నీటి వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అలసత్వం, జాప్యం చోటుచేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్న వనరుల నుంచి నీటిని స్వచ్ఛంగా మార్చడం కూడా సక్రమంగా సాగడం లేదను భావన వ్యక్తమవుతోంది. పనులపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని గతంలోనే నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలు కావడం లేదని తెలుస్తోరది.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో..
మన్యంలోని అధిక సంఖ్యలో గిరిజన గ్రామాల్లోని జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎండాకాలం రాకుండానే నీటి సమస్య పెరుగుతుంది.కానీ గిరిజ నుల దాహం కేకలు పాలకులకు వినిపించని పరిస్థితి నెలకొంది.దీంతో గిరి పల్లెల్లోని జనానికి నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపా యం ఉందనేది అధికారుల వాదన. కాగా ఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమిత మవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితు ల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడిరది.దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడంలేదు.ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదారు ణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టిం చుకున్న దాఖలాలు లేవు.దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతు న్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారప డాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలా లకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తు న్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊట గడ్డల నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీ లో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లాలో
ఇంటింటికీ కుళాయిలు వేసి..తాగునీటి కష్టాలు తీరు స్తామని ప్రభుత్వాలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితి భిన్నంగా ఉంది.పది రోజులుగా పార్వతీపురం మం డలంలోని 65గ్రామాలకు తాగునీరురాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్మశానాల్లో ఉన్నబోర్లు,ఊరి చివరనున్న పాడైన బావుల నీటితో గొంతు తడుపుకొంటున్నారు. మక్కువ మండ లండి.శిర్లాంలోని సువర్ణముఖి నది నుంచి పార్వతీపు రం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.ఇక్కడ ఇన్‌ఫిల్టర్‌ బావుల్లో మోటార్లు పదిరోజులు క్రితం పాడువడంతో 65 గ్రామాలకు సరఫరా ఆగిపోయింది.నర్శిపురం, బొండ పిల్లి ఎమ్మార్‌నగరం,డోకిశీల,ములగ తదితర గ్రామాల ప్రజలు ఒకటి,రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లు,బావులకు వెళ్లాల్సిన పరిస్థితి.-జి.ఎన్‌.వి.సతీష్‌

జమిలి ముచ్చట తీరేదెన్నడు..

జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమం టున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.లోక్‌సభ నుంచి పంచాయతీల వరకూ ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ జమలి ఎన్నికలపై దశాబ్దాలు గా జరుగుతున్న చర్చ మరోసారి ఉపందుకుంటోంది. కేంద్రం కోరుకుంటున్న వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ సాకారమయ్యేనా?అందుకు విపక్షాలు సహకార మందిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జమలి ఎన్నికలపై ప్రత్యేక కథనం..
లోక్‌సభ ఎన్నికలే అయినా..రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలు జరిగినా..పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా..ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది కేంద్ర ప్రభుత్వ వెర్షన్‌. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని ఈమాట ఇప్పటిది కాదు. ఆయన అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 2019 బీజేపీ మానిఫెస్టోలో కూడా పెట్టారు. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది.లా కమి షన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడు తోందని ప్రభుత్వం అంటోంది. అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే..ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెం టరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలు న్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి.కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని మోదీ భావిస్తే..అమలు పెద్దకష్టం కాదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.
సై అంటున్న తెలుగు రాష్ట్రాలు.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..ప్రధాన పార్టీలు జమిలి ఎన్నికలకు సై అంటున్నాయి.జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గతంలోనే తమపార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇక ఎలక్షన్స్‌ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేం దుకు రెడీగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.2019లో జరిగి న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే..అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. అప్పుడే జమిలీ ఎన్నికల అవశ్యకత గురించి ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ మినహా దాదాపుగా అన్నిపార్టీలు అంగీ కారం తెలిపాయి.వామపక్షాలు మాత్రం జమిలీ ఎన్నిక లను వ్యతిరేకిస్తున్నాయి. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా గతంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది.పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించే స్తామని చెప్పింది. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే..కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే రాజ్యాంగ సవరణ అంత కష్టమేమీ కాదు.
జమిలి కొత్తేంకాదు..కాగా, దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేంకాదు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి.జమిలీ ఎన్నికలు జరగాలి అంటే..ప్రధాని మోదీ,హోం మం త్రి అమిత్‌ షా అనుకోవాలి.ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. అందుకే జమలీ ఎన్నికలు జరుగుతా యని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. జమిలి ఎన్ని కలు అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్ల మెంట్‌ ఎన్నికలు జరగాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి,ఆ తరువాత పార్లమెంట్‌ ఎన్నికలు జరగడం గందరగోళం అవుతుంది. సంవ త్సరం మొత్తం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరగడం వల్ల వ్యయం ఎక్కువ అవుతోంది, శ్రమ ఎక్కువైపో తుంది అన్న వాదన ఉంది.
5ఎన్నికలతో తేలిపోయింది.. అయితే 2023లో జమిలీ ఎన్నికలు నిర్వ హించాలి అనుకున్నప్పుడు యూపీతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపేందుకు ఈసీ చర్యలు తీసుకునేది కాదు.ఒకవేళ 2023 జమిలి ఎన్నికలు అంటే ఎన్నికైన ఆఅయిదు రాష్ట్రాల ప్రభుత్వా లను ఏడాదిలో రద్దు చేస్తారా..?అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.ఒక వేళ జమిలి ఎన్నికలు పెట్టాలని భావిస్తే యూపీ,పంజాబ్‌,గోవా,మేగాలయ,ఉత్తరాఖండ్‌ ఎన్ని కల బదులు ఏడాది పాటు రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేది.లేదా ఏడాదో రెండేళ్లో అసెంబ్లీని పొడిగిం చాల్సి ఉండెది.
వెయిట్‌ చేయక తప్పదా? 2025లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పుడు 2024లో ఏపిలో ఎన్నికలు నిర్వహిం చకూడదు.ఇదే ప్రభుత్వాన్ని ఏడాది పాటు కొనసాగిం చాలి.ఒక వేళ 2029లో జమిలీ ఎన్నికలకు పోవా లంటే ఇప్పుడు జరుగనున్న అయి రాష్ట్రాల పదవీ కాలం అయిదేళ్లు 2027కు పూర్తి అవుతున్నందున ఈ రాష్ట్రాల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిం చాల్సి ఉంటుంది. ఇలా జమిలీ ఎన్నికలు నిర్వహిం చాలి అంటే పలు రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించాలి. మరి కొన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని పెంచాల్సి ఉం టుంది.దీనికి ఆయా రాష్ట్రాల తీర్మానాలు తప్ప నిసరి. దేశ వ్యాప్తంగా29రాష్ట్రాలు ఉంటే కనీసం20 రాష్ట్రాల నుండి మేము జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి.ఆతరువాత పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి, లా కమిషన్‌ కు పంపించాలి. అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసర మైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలి.రాష్ట్రాలకు సంబంధం లేకపోతే కేం ద్రం తలుచుకుంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా పెట్టే యవచ్చు..కానీ దీనికి రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. ఇవన్నీ పరిశీలిస్తే జమిలి ఎన్నికలు జరగాలంటే మరికొంత కాలం వెయిట్‌ చేయక తప్పదనే అభిప్రా యం వినిపిస్తుంది.
‘జమిలి’ నిరంకుశం!
అన్నివైపుల నుండి వ్యతిరేకత వస్తున్నా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి (రాజ్యాంగ సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపంపైన, సమాఖ్యవాదంపైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే! రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాన్ని కేంద్ర పదవీ కాలంలోకి మార్చడం రాజ్యాంగానికి ద్రోహం చేయడ మేనని విమర్శించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే లోక్‌సభ ఎన్నికలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.ఈ విష యమై ఓటింగ్‌ కోరగా269 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లును సమర్పించడానికి మద్దతు ఇవ్వగా 198మంది సభ్యులు వ్యతిరేకిం చారు.బిల్లు అంతిమంగా నెగ్గడానికి మూడిరట రెండొంతుల మెజారిటీ అవసరం.కానీ ఆపరిస్థితి లేకపోయినా మోడీ ప్రభుత్వం బిల్లును బుల్డోజ్‌ చేయ డం నిరంకుశ పోకడలకు నిదర్శనం. ఏమైనప్పటికీ ప్రజెంటేషన్‌ దశలోనే తీవ్రవ్యతిరేకత రావడంతో బిల్లులను సం యుక్త పార్లమెంటరీ కమిటీకి పంపక తప్పలేదు.
సమగ్ర అధ్యయనం, విస్తృత చర్చల తర్వాతే బిల్లు తీసుకొచ్చామని,మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పా టు చేసిందని మంత్రి మేఫ్న్‌వాల్‌ లోక్‌సభకు సుతి మెత్తగా వివరించారు. కానీ,‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే భావన రాజ్యాంగంలోని ఫెడరలిజంతో సహా దాని మౌలిక స్వరూపానికి విరుద్ధం.‘బిల్లులోని నిబం ధనలు శాసన వ్యవస్థ అధికార పరిధిని ఉల్లంఘిం చేవిగా ఉన్నాయి.లోక్‌సభ పదవీకాలం ప్రకారం శాసనసభల పదవీకాలం నిర్ణయించబడదు. చట్టసభ లు విడివిడిగా ఉంటాయి. ఈ బిల్లుతో అధిక కేంద్రీక రణ అమలులోకి వస్తుంది.సభల కాలవ్యవధి, ఎన్నిక లు ఎప్పుడు నిర్వహించాలనే అధికారాలను ఎన్నికల కమిషన్‌కే వదిలేస్తున్నారు. అలా అయితే ఒక వ్యక్తి కోరిక నెరవేర్చడం కోసమేఈ బిల్లులను పెట్టినట్లు ఉంటుంది’ అన్న ప్రతిపక్ష ఎంపీలి విమర్శ అక్షర సత్యం. ఈ బిల్లుతో దేశ గణతంత్ర రాజ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌,మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబం ధించినవని, కానీ ఈ బిల్లుతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పెత్తనం కిందికి వెళ్లిపోతాయన్న సిపిఎం ఎంపి అమ్రా రామ్‌ ఆందోళన ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియు లందరిదీను. దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన భాష,తమదైన అధికార వికేంద్రీకరణ కలిగి ఉన్నాయి. వాటిపై రాష్ట్రాలకు గలహక్కును కేంద్రం ఎలా లాక్కొం టుంది? కానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీలు మూడూ ఈబిల్లును సమర్థించడం ఆత్మహత్యా సదృ శం. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుం దన్న మాట సర్వాబద్ధం.మోడీ సర్కారుకు ఊపిరి పోస్తూ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న జెడియు నుంచి ఎవరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడకపోవడం గమ నార్హం. ప్రస్తుతానికి పక్కన పెట్టినా పంచాయతీలు, స్థానిక సంస్థల ప్రాథమిక సూత్రమైన వికేంద్రీకరణ స్ఫూర్తికే పూర్తి విరుద్ధమైనది. కీలకమైన ‘స్థానికత’ మాయమవుతుంది కదా! గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అవగాహనకే ఇది విఘాతం. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో, పార్లమెంట్‌, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం. స్థానిక సంస్థలకు, వాటికి నిధులు, విధులు, అధికా రాల కల్పనకూ సాగిన ఉద్యమాలు, చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పాతర వేసే ఈజమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశం లో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొం టుంది. అది ఏక పార్టీ పాలనకూ ఆ తరువాత ఏక వ్యక్తి నియంతృత్వానికి దారి తీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్‌ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలి.
జమిలి పాట..రాజ్యాంగానికి పోటు..
పార్లమెంటు ఉభయ సభలూ ప్రస్తుతం అతి కీలకమైన రెండు అంశాలపై చర్చ తలపెట్టాయి. ఇందులో ఒకటి నడుస్తుండగా మరొకటి నిర్ణయం కావలసి వుంది.నిజానికి ఈ మూడూ పరస్పర సంబంధం లేనివేమీ కాదు. బిల్లు తీసుకు వస్తామం టున్న మార్పులు చేర్పులు గానీ రాజ్యాంగ మూల స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనవి.వాటిని జనంతో మింగిం చేందుకే ఏవో వేడుకలు, ఉత్సవాలు, చర్చలు అంటూ మాయ నాటకం నడిపిస్తున్నారు. అదానీకి సంబం ధించిన ఆరోపణలతో సహా పలు కీలకాంశాలు దాట వేసేందుకు కూడా ఈప్రహసనం తీసుకొచ్చారని చెప్పాలి.ప్రభుత్వం తరపున లోక్‌సభలో చర్చలో పాల్గొ న్న సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యాం గంలో నిబంధనలను గురించిగాక ఏకగ్రీంగా ప్రక టించిన రాజ్యాంగ ప్రతిని ప్రశ్నించడంతో మొద లు పెట్టారు. రాముడు సీత విగ్రహాలతో ఏవో మత చిహ్నాలు వుంటే వాటిని లేకుండా చేశారని ఆరెస్సెస్‌ చిరకాల ఆరోప ణలు సభలో వల్లెవేశారు. రాజ్యాంగ నిర్మాతలు కోవిదు లైన వారిని గౌరవించకపోగా దాంట్లో భారతీయత ఏ మాత్రం లేదని తిట్టిపోసిన ఆరెస్సెస్‌ భావ ప్రవక్తలైన వినాయక దామోదర సావర్కర్‌, జనసంఫ్న్‌ వ్యవస్థా పకుడైన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వంటి వారి పేర్లు జపించారు.మత రాజకీయాలను ఆ నాడే తిరస్క రించిన భగత్‌సింగ్‌ను తమ ఖాతాలో వేసుకుని మాట్లా డారు. ఇందిరా గాంధీ కుటుంబాన్ని విమర్శిం చే పేరిట నాటి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని స్వాతంత్ర పోరాట విలువలను తిరస్కరించే బిజెపి, ఆరెస్సెస్‌ బాణీయే ఈ చర్చలో అడుగడుగునా గోచరిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్‌,ఎస్‌పి, సిపిఎం తదితర పార్టీలు ప్రజా స్వామ్యం, లౌకిక విలువలు, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు హాని కలుగు తున్న తీరును ప్రస్తావిస్తే వారికి మహా కంటగింపుగా వుంటున్నది. అడుగడుగునా అడ్డు తగులుతూ చర్చను రచ్చగా మారుస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున వయనాడ్‌ నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం కూడా ఈ అంశంపైనే కావడం విశేషం.
జమిలి జుమ్లా
ఇప్పటికే కేంద్ర క్యాబినెట్‌ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెల్పింది గనక సోమవారం నాడు న్యాయ శాఖా మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ దాన్ని సభలో ప్రవేశ పెడతారని ప్రకటించారు. ఈ లోగా వీలైన ప్రతి చోటా బిజెపి, ఎన్‌డిఎ నాయకులు దానికి మద్దతు ప్రకటిస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొ స్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జమిలిని బలపరుస్తున్నదని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు బిల్లు ఆమోదించినా 2029లోనే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఆయన కొత్త సవరణ ప్రకటించారు. మరోవంక దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోని వైసిపి మాత్రం రాజ్యాంగ కోణం కన్నా తమకు తొందరగా మళ్లీ ఎన్నికలు వస్తాయన్న ఆనందంతో పొంగిపో తున్నది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ జమిలికి సిద్ధంగా వుండాలంటుంటే వారి మీడియా, ఆ పార్టీ ప్రతినిధులు కూడా జమిలి జపమే చేస్తున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ కూడా సూటిగా స్పందిం చకుండా మరింత స్పష్టత రావాలని చెబుతున్నది. కానీ వాస్తవానికి రేవంత్‌ సర్కారు గడువుకు ముందే తొలగిపోతుందనే ఆనందం వారిలో తొంగి చూస్తు న్నది. ప్రాంతీయ పార్టీలుగా ఈమూడూ సమాఖ్య విధానానికి రాజ్యాంగస్ఫూర్తికీ పూర్తి విరుద్ధమైన ఈ మార్పును గట్టిగా వ్యతిరేకించాల్సింది పోయి తాత్కాలిక దృష్టితో మాట్లాడటం దురదృష్టకరం. చంద్ర బాబు నాయుడు బిల్లు ఆమోదించినా ఎన్నికలు రాబో వని నమ్మకంగాచెబుతున్నారంటే మోడీ తీరు, ఆరెస్సెస్‌,బిజెపి రాజకీయాలు ఆయనకు తెలియ వనా? ఎన్‌డిఎలో చేరే నాటికే వారి విధానాలు ఇలానే వుంటాయని చంద్రబాబు వంటి వారికి బాగా తెలుసు. ఏమైనా అధికారం కోసం మోడీతో రాజీపడి ఆయన హుకుంలను ఆమోదించక తప్పదని తల వంచు తున్నారు.బిజెడి,అకాలీదళ్‌,ఎఐడిఎంకె,లోక్‌ జనశక్తి వంటివి బలపర్చాయని నివేదిక చెబుతున్నది. బిఆర్‌ ఎస్‌,ముస్లింలీగ్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌,వైసిపి,టిడిపి వం టివి అధికారికంగా సమాధానమివ్వలేదట.డీఎంకె, ఆప్‌,ఎస్‌పి,వంటి ప్రాంతీయపార్టీలతో పాటు కాంగ్రెస్‌, సిపిఎం,సిపిఐ,బిఎస్‌పి,ఎస్‌పి వంటివి గట్టిగా వ్యతిరేకి స్తున్నాయి.చిన్నా పెద్ద కలిపి 32 పార్టీలు బల పరు స్తుంటే 15వ్యతిరేకిస్తున్నాయని లెక్క చెబు తున్నారు. గతంలో కొంత బలపర్చిన పార్టీలు కూడా ఇప్పుడు వ్యతిరేక వైఖరి తీసుకున్నాయని దీనిపై నివేదికనిచ్చిన కమిటీ అధ్యక్షుడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడిరచారు.ఈ నివేదికను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్‌ ఆదిశలో ముందుకు పోవాలని నిర్ణయిం చింది.ఇందుకు సభలో ఎన్‌డిఎ సంఖ్యా బలం సరిపో తుందా అనేది ఒకటైతే రాజ్యాంగపరంగా ఇది చెల్లుతుందా అనేది మరొకటి.
మాజీ రాష్ట్రపతి సేవలు
దేశానికి రాష్ట్రపతి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినట్టు లెక్క. అలాంటివారికి తదుపరి కాలంలో మరో బాధ్యత అప్పగించడం గతంలో ఎరగనిది. కానీ మోడీ సర్కారు మాజీ సిజెఐలతోపాటు రాష్ట్రపతులను కూడా రంగం లోకి దింపడం చూస్తున్నాం.2023లో విడుదల చేసిన ఉన్నత స్థాయి కమిటీ నియామకం ఉత్తర్వు 11019/3/23లో కోవింద్‌కు జమిలి ఎన్నికల నిర్ణయం అమలును చర్చించమన్నారే గాని సిఫార్సు కోసం ఆ కమిటీని వేయలేదు.పైన చెప్పుకున్న రాజ్యాంగ నిబంధనలకు ఇది పూర్తి వ్యతిరేకమైన నిర్ణయం. రాజ్యాంగం 75(3)అధికరణం లోక్‌సభ పదవీ కాలాన్ని,164(1)శాసనసభల పదవీ కాలాన్ని విడివి డిగా పేర్కొంటున్నది. సభ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించి వుండరాదంటున్నది. 83(2) లోక్‌సభ విషయంలోనూ,172(1) శాసన సభల విషయంలోనూ ఇతరేతరంగా రద్దు కాకపోతే మాత్రమే అయిదేళ్ల పదవీ కాలం అంటున్నాయి తప్ప కాల పరిమితి లేదు.వీటిలో దేనికి దానికి స్వంత అస్తిత్వం ఏర్పాటు ముగింపు రద్దు అవకాశాలున్నాయి. 83వ అధికరణం లోక్‌సభ కాలపరిమితినీ, 85 రద్దు అవకాశాన్ని చెబితే 172వ అధికరణం శాసనసభ గడువునూ 174 రద్దునూ చెబుతున్నాయి. రాష్ట్రాలకు అదనంగా 356 కింద రాష్ట్రపతి రద్దు చేసే మరో అధికరణం వుంది. ఆ తర్వాత ఆరు మాసాల లోపు మరో సభసమావేశం కావాలని వుంది. దీని అర్థమే టంటే రాజ్యాంగ నిర్మాతలు కృత్రిమంగా సభలను పొడిగించాలని గానీ, ప్రజల ఆమోదం (ఎన్నికలు) లేకుండా పాలన నడిపించాలని గానీ ఎంతమాత్రం కోరుకోలేదు.పైగా 1967 వరకూ లోక్‌సభ శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరిగాయంటే దానికి కార ణం కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం వుండటమే. తర్వాత కాలంలోనూ ప్రతిపక్ష ప్రభుత్వాలను కేంద్రం నిరం కుశంగా రద్దు చేయడం వల్లనే రెంటికీ మధ్య అంత రం వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు కూట ములు అయిదేళ్లు తప్పక కొనసాగుతాయనే గ్యారంటీ వుందా? కానీ ఆ పేరిట కృత్రిమంగా పొడిగించడం అంటే ప్రజల ఆమోదం లేని పాలన రుద్దడమే.
అంతా ఒకే పెత్తనమా?
ఒకే దఫా ఎన్నికల ఖర్చు ఎన్నికల్లో గెలవని పాలన సాగి ప్రజాధనం గల్లంతవుతుంది. దీనివల్ల రూ.5,000కోట్లు ఆదా అవుతాయని జిడిపి పెరుగు తుందని తాడూ బొంగరం లేని కథలు చెబుతు న్నారేగానీ బాధ్యత లేని పాలన వల్ల ఎన్ని వేల కోట్లు దారి తప్పుతాయో వేరే చెప్పాలా? ఒక చిన్న ఇంట్లో అందరి పెళ్లిళ్లు అందరి చదువులు ఒకేసారి జరగవు గానీ ఇంత పెద్ద దేశంలో అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలనడం ఏంతర్కం? ఏం ఇంగితం? కేంద్రం లో ప్రభుత్వాలు నాలుగు సార్లు కూలిపోయాయి. మరో రెండు సార్లు ముందే ప్రధాని ఎన్నికలకు వెళ్లారు. మరి ఇలాంటి సమయాల్లో అన్ని రాష్ట్రాలలో అనవస రంగా సభల రద్దు ఖర్చు తగ్గిస్తుందా పెంచుతుందా? ఈదేశాన్ని రాష్ట్రాల కలయిక అని రాజ్యాంగం చెబుతుందే గానీ కేంద్రీకృత ఏకరూప అని చెప్పడం లేదే? ప్రపంచ బ్యాంకు లేదా అంతర్జాతీయ పెట్టుబడి చెప్పే ప్రపంచీకరణ విధానాలు ఒకే విధంగా అమలు చేసే ఏకీకృత మార్కెట్‌గా రుద్దడం కోసమే దీనిపై ఇంత హడావుడి. అదే విధంగా ఏకరూప మెజార్టీ మతతత్వ నిరంకుశత్వంతో రాష్ట్రాలను మండలాల స్థానిక సంస్థల స్థాయికి దించే సంఘపరివార్‌ కుట్ర కూడా.అందుకే మలి దశలో స్థానిక సంస్థల ఎన్నిక లను కూడా ఈ పరంపరలో కలపడమంటే అర్థం అదే.ఒకే పన్ను,ఒకే రేషన్‌,ఒకే చట్టం,ఒకే విద్య, ఒకే మతం,ఒకే బిజెపి,ఒకే మోడీ అన్నదాని పరాకాష్ట. వీరు ఇది అధ్యక్ష తరహా పాలనను రుద్దే ప్రయాణం లాంటిదే. అలా రాజ్యాంగం రెండుసార్లు మార్చుకున్న శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా మళ్లీ వెనక్కు రావలసి వచ్చింది.ప్రపంచంలో భారత దేశం లా ఇన్ని భాషలు, విభిన్నతలు గల దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టదగినన్ని కూడా లేవు. అటు మార్కెట్‌ ఇటు మతతత్వం అవసరాల కోసం ఆరాటపడటమే గానీ చిన్నవీ పెద్దవీ కలిపితే 28 రాష్ట్రాలు గల ఈ దేశంలో ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. స్థిరత్వం జపం వాస్తవంలో మరింత అస్థిరతకూ మరింత ఆర్థిక భారానికి దారితీస్తుంది.15 రాజ్యాంగ సవరణలు చేయాలి. రాష్ట్రాలలోనూ ఆమోదించాలి. ఇందుకు లోక్‌సభలో 362కావలసి వుంటే 299 ఎంపీల మద్ద తు మాత్రమే వుంది.ఎటూ చేరని వారు 19.ఇక రాజ్యసభలో 164 మంది మద్దతు కావాలంటే 125 బలం మాత్రమే వుంది.24 మందిది అటూ ఇటు కాని మధ్యే మార్గం,ఈ పొందికలో తుది ఫలితం ఏంటనేది ఒకటైతే రాష్ట్రాలలో చాలా చోట్ల ఎన్‌డిఎ అధికారంలో లేదు. కనుక పార్లమెంటులో బిల్లు ఆమో దం పొందడం కూడా గగనమే గనక పార్టీలను తిప్పు కునే పథకాలు కుట్రలూ కూడా జరుగుతాయి. ఏమైనా రాష్ట్రాల హక్కులనూ ప్రజల ఎన్నుకునే హక్కును కూడా కాపాడుకోవడం ఇక్కడ కీలక సవాలు. తమ తాత్కాలిక అవసరాల కోసం వైసిపి, బిఆర్‌ఎస్‌ వంటివి ఆహ్వానించడం,టిడిపి భాగస్వామిగా మారడం అవాంఛనీయం.
జగడపు ధన్‌ఖర్‌
ఇక రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఈపరిణామాల కొనసాగింపే. ఎందు కంటే రాజ్యసభ మౌలికంగా రాష్ట్రాల సభ (రాజ్యం అంటే రాష్ట్రం).కానీ జగదీప్‌ ధన్‌ఖర్‌ వచ్చాక రాజును మించిన రాజభక్తుడిలా మోడీని మించి ఆరెస్సెస్‌ను కీర్తించడం,ప్రతిపక్షాల పీకనొక్కడం నిత్యకృత్య మైంది. దీన్ని నిరసించిన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతి ఒక్కరితో ఆయన వాదనలు పెట్టుకుని అవమానిస్తున్నారు. కనుకనే అనివార్యంగా ఆయనపై అవిశ్వాసం నోటీసునిచ్చాయి.దానిపైన కూడా తగాదా పెట్టుకోవడం ధన్‌ఖర్‌కే చెల్లింది. అయితే ఆతీర్మా నాన్ని అనుమతిస్తారా లేక ఏవో సాకులతో నిరాకరి స్తారా అనే సందేహాలున్నాయి.లౌకిక ప్రతిపక్షాలు మోడీ సర్కారు కుట్రలకూ ఒత్తిళ్లకు తల వంచకుండా ఐక్యంగా నిలబడితే ఈకుట్రలను ఛేదించడం సాధ్య మవుతుంది.ఏమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత రాజకీయంగా తీవ్రమవుతున్న ఘర్షణనే పార్లమెంటు ప్రతిబింబిస్తున్నదని చెప్పాలి.
(వ్యాసకర్త : ఇండిపెండిరట్‌ జర్నలిస్టు`న్యూఢల్లీి)-(ప్రకాశ్‌ యాదవ్‌జీ)

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే జయంతి

ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. ఈమె వివాహానంతరం ఇంట్లోనే విద్యాభ్యాసం ప్రారంభించారు.1847లో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందారు.1848లో భర్త జ్యోతిరావు ఫూలేతో కలసి పూణేలో అణచివేతకు గురవుతున్న బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇది మొదట తొమ్మిది మంది బాలికలతో ప్రారంభ మైంది.తర్వాత పూణె,సతారా,అహ్మదానగర్‌లలో మరికొన్ని పాఠశాలలు స్థాపించారు.ఈమె పాఠ శాలకు వెళ్లేటప్పుడు సనాతన చాందసవాదుల కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను మార్గ మధ్యలో ఆపి అసభ్యకరమైన పదజాలంతో దూషించి,రాళ్లతో దాడి చేసి,పేడ నీళ్ళు చల్లి అవమానించేవారు.అయినా సరే వెనుకడుగు వేయలేదు. తన సంచిలో అదనంగా మరో చీర పెట్టుకెళ్లి పాఠశాల దగ్గర మార్చుకు నేవారు.వారు మొక్కవోని దీక్షతో ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు.బాల్య వివాహాలను వ్యతిరేకించారు.చిన్న వయసులో వివాహం చేయటం వలన ప్రసవించే శక్తి లేక అనేకమంది బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని,చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతు వులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందనే వాదన దృఢంగా వినిపించారు.వితంతువులను హీనంగా చూస్తూ, గుండు గీయించి తెల్ల చీర కట్టించి, వారిని అశుభ సంకేతంగా చిత్రించేవారు.ఆ దురా చారాన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వి వాహాల్ని ప్రోత్సహించడమే గాక,దగ్గరుండి చేయించారు.వితంతు గర్భిణీల కోసం 1853లో ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు దగ్గరుండి చూసేవారు. వితంతు మహిళలకు గుండు గీసే పద్ధతి పోయేందుకు కృషి చేశారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు.కులాంతర వివా హాలను ప్రోత్సహించారు.1852లో మహిళా హక్కులను మహిళలకు తెలియజేసేందుకు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ‘మహిళా సేవా మండల్‌’ ఏర్పాటు చేశారు. కార్మికులు,గ్రామీణ పేదలు కోసం జ్యోతిరావు ఫూలే 52 ఆహార కేంద్రాలను తెరిచారు. వీటన్నిం టిని ఆమె చూసుకునేవారు.వారిరువురూ ఏర్పా టు చేసిన బోర్డింగ్‌ పాఠశాలలను దగ్గరుండి చూసుకునే వారు.1863లో సంఘ బహిష్కృతులైన తల్లీపిల్లల కోసం శరణాలయం స్థాపించారు. ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సేవ చేసే వారు.జ్యోతిరావు ఫూలే స్థాపిం చిన సత్య శోధక్‌ సమాజ్‌ని ఆయన మరణా నంతరం ఈమె నడిపారు.ఈ రకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా నిలబడిన ధీర వనిత సావిత్రి బాయి ఫూలే. స్త్రీల అభివృద్ధి కోసం తెగువతో నిలబడిన వీర వనిత.ప్లేగు వ్యాధిగ్రస్తు లకు సేవ చేస్తూ తను కూడా ఆవ్యాధి బారినపడి 1897 మార్చి10న తుదిశ్వాశ విడిచారు సావిత్రి బాయి ఫూలే.భారత దేశ సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రలో రాజరామమోహన్‌రాయ్‌ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్‌,కందుకూరి వీరే శలింగం పంతులు వంటి వాళ్ళ పేర్లతోతో పాటు జ్యోతిరావ్‌ ఫూలే వినబ డటానికి,కనబడటానికి చాలా కాలమే పట్టింది.దానికి కారణం ఆయన కులం ఒక్కటే కాదు.కుల వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఆయన చేపట్టిన సంస్కరణోద్యమ స్వభావం మౌలి కంగా భిన్నమైనది కావటం మరొక ముఖ్య కారణం. ఇక మహా పురు షుల భార్యలుగా స్త్రీలు ఎప్పుడూ చరిత్ర నీడలలో మిగిలిపోయే వాళ్ళే. జ్యోతిరావ్‌ ఫూలే భార్య సావిత్రి బాయి గురించి చాలాకాలం తెలియక పోవటానికి అది అదనపు కారణం.స్త్రీల దళిత బహుజనుల అస్తిత్వ ఉద్య మాలు ఊపందుకొన్న 1980ల నుండి సమాజపు చివరి అంచులకు నెట్టివేయబడిన వర్గాల ఆలో చనా విధానాలతో,ఆచరణ కార్యకలాపాలతో దేశీయ సామాజిక రాజకీయార్థిక చరిత్రను, సంస్కృతిని సమగ్రం చేయటం,సరిచేయటం అన్న లక్ష్యాలతో సాగుతున్న కృషిలో భాగంగానే గానే జ్యోతిరావ్‌ ఫూలే గురించి,ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే గురించి మనకు తెలిసి వచ్చింది.సావిత్రిబాయి ఫూలే ది జ్యోతి రావ్‌ ఫూలే భార్యగా అతని సంస్కరణోద్యమ కార్యకలాపాలకు సహాయకారి పాత్ర మాత్రమే కాదు. అన్నింటిలో ఆమె సహ భాగస్వామి.భారత దేశంలో మహిళాఉద్యమ చరిత్రకు తాత్విక భూమికను ఏర్పరచిన క్రియాశీల శక్తి.ఆలోచన,ఆచరణ మనిషి మౌలిక లక్షణాలు అని ఆమె నమ్మింది.ఆమె ఆలోచనలు కవిత్వ రూపంలో ఆవిష్కృతమయ్యాయి.ఆచరణ ఆమె జీవితం.సావిత్రిబాయి జీవితం,కవిత్వం రెండూవర్తమానాన్నిఅర్ధం చేసుకొనటానికి, భవిష్యత్తును నిర్మించుకొనటానికి ఉత్ప్రేరకాలు. 1870లలో ఏస్త్రీవిద్యకోసం అయితే..ఆంధ్ర దేశంలో వీరేశలింగం పంతులు ఒక మహో ద్యమాన్ని నడిపాడో,కాలక్రమంలో బాలికా పాఠశాలలో బోధకులుగా స్త్రీలు ఉండాలని గుర్తించాడో,ఆ మేరకు వితంతు మహిళలు విద్యావంతులై,ఉద్యోగాలలోకి రావాలని ఆశిం చాడో దానికి మూడు దశాబ్దాలకు ముందే అంతకంటే ఉన్నత రూపంలో జ్యోతిరావ్‌ ఫూలే ఇంట ప్రారంభమైన ‘నిశ్శబ్ద విప్లవం’సావిత్రీ బాయి అనే శక్తిగా ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర సంస్కరణోద్యమంలో ఆమెది కీలక పాత్ర. కుల లింగ వివక్షలకు వ్యతిరేకంగా పని చేసే పురుషులనే సహించని సంప్రదాయ సమాజం కుటుంబ పరిధిని దాటి సమాజాన్ని మరమ్మత్తు చేయటానికి బయటకు వచ్చే స్త్రీలను అసలే సహించలేదు.అనేక రంగాలలో స్త్రీల కృషిని నిరోధించటానికి,నియంత్రించటానికి వ్యతిరేక ప్రచారాలకు,భౌతిక దాడులకు,అత్యాచారాలకు పాల్పడుతున్న పితృస్వామిక అధికార వికృతి మనకు తెలిసిన వర్తమానమే.కొదురుపాక రాజవ్వ నుండి,భన్వారీ బాయి,సోనె సోరీ వరకు ఎందరో అందుకు ఉదాహరణలు. అలాంటప్పుడు నూటా యాభై సంవత్సరాల క్రితం ఆడపిల్లలకు చదువు చెప్పటానికి,అందులోనూ శూద్ర,అతి శూద్ర బాలి కలకు చదువు చెప్పటానికి బయటకు వచ్చిన సావిత్రీ బాయిని రాళ్లు రువ్వి,కుళ్ళిన కూర గాయలు,పేడ విసిరి వేధించారంటే ఆశ్ఛర్య పడవలసినది ఏమీ లేదు.వాటిని తన పనికి అభినందనగా విసరబడే పూలగా భావిస్తూ, వాళ్ళ చర్యలవల్ల పాడై పోయిన చీరను మార్చుకొన టానికి మరొక చీర కూడా వెంట తీసుకువెడుతూ ఆమె కనబరచిన,నిబద్ధత,సంసిద్ధత గొప్ప విలువలు.సంప్రదాయ సమాజ నియమాలను తిరగరా యాలని జ్యోతిరావ్‌ ఫూలే ప్రారంభించిన ఉద్యమం తండ్రికే భరించరానిదై ఇంట్లో స్థానంలేదని బెదిరిస్తే సావిత్రి బాయి ఫూలే భర్త మార్గమే తన మార్గమని అతని తో కలిసి అడుగు బయట పెట్టింది.అప్పటికి ఆమె వయసు పద్దెని మిది.అప్పటి నుండి1897లో 66ఏళ్ల వయసులో మరణించేవరకు సావిత్రీ బాయిది సమాజ జీవితమే.ఆడ పిల్లలకు,మహర్‌,మాంగ్‌ వంటి అతిశూద్ర పిల్లలకు మాత్రమే కాదు,వయోజను లకు పాఠశాలలు ఏర్పరచటం నుండి,వ్యవసాయ కార్మికులకు (1855)రాత్రిబడి నడపటం వరకు మహారాష్ట్రలో ఆధునిక విద్యావ్యాప్తికి ఆమె చేసిన కృషి గణనీయమైంది.బాలికల చదువుకు బడులు పెడితే సరిపోదని,ఆడపిల్లలను బడికి పంపటానికి ఇంటి నుండి బడికి ఉండే దూరం ఒకఅవరోధం అని గుర్తించి,దానిని అధిగమించటానికి ఇంట్లోనే ఒక వసతి ఏర్పాటు చేసి స్వయంగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకొన్న వ్యక్తి సావిత్రి బాయి.దయ ,ప్రేమగల తల్లిగా ఆమె ఆ పిల్లల హృదయాలలో చోటు సంపాదించుకొన్నది.అంటరానివారిగా బహిష్కృతులు అయినవారి కోసం తన ఇంటి ఆవరణలో బావి తవ్వించినా(1868) కరువు పీడి తులకు ఉచిత భోజన శాలలు ఏర్పరచి (1877) ఆకలి తీర్చినా,ప్రాణాలనే బలిపెట్టి ప్లేగు వ్యాధి గ్రస్తుల స్వస్థతకు పాటు పడినా అన్నీ ఆ దయ, ప్రేమగల తల్లి లక్షణం వల్లనే. సావిత్రి బాయి ఫూలే శూద్ర అతిశూద్ర బాల బాలికల విద్యకు ఎంత పాటుపడిరదో,అంతగా నూ స్త్రీల సమస్యల పై పనిచేసింది. సర్వ మానవ హక్కులు అనుభవిస్తూ స్త్రీలు ఆత్మ గౌరవంతో జీవించటాన్ని గురించి కలకంటూ 1852లో మహిళా సేవా మండల్‌ స్థాపించింది. ఆనాడు సమాజంలో ఉన్న అతితీవ్ర సమస్య వితంతు స్త్రీల దుర్భర జీవితం. అదీ బ్రాహ్మణులలోనే ఎక్కువ. సావిత్రీ బాయి చేపట్టిన సంస్కరణోద్యమంలో తొలుత సంబోధించ బడిరది అదే. వింత తువులకు తల గొరిగించటం అమానుష ఆచారంగా ఆమె భావించింది.బాధిత స్త్రీలను దానికి వ్యతిరేకంగా సమీకరించటం తక్షణం జరిగే పని కాదు అని ఆమెకు తెలుసు. కానీ తమ శరీరం మీద స్త్రీల హక్కులను ఖబ్జా చేసిన సంప్రదాయం పట్ల అవసరమైన అసహనం ఆమెను నిలువ నీయలేదు. మంగలి వారిని ఏకం చేసి ‘వితంతు స్త్రీల తలలు గొరగము’అనే నినా దంతో సమ్మె కట్టించి తన నిరసనను ఆరకంగా ప్రకటించింది. ‘తలలు బోడులైన తలపులు బోడులౌనా’అని వేమన అన్నట్లుగా వితంతు స్త్రీల తల వెంట్రుకలు తీసేసినంత మాత్రాన వాళ్లలో వయో సహజ వాంఛలను అరికట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు.అది వాళ్ళను చాటుమాటు లైంగిక సంబంధాలకు ప్రేరేపిస్తుంది.యవ్వనానికి వచ్చి పుట్టింటనో అత్తింటనో ఆశ్రయం పొందిన వితంతువులు ఇంట్లోని పురుషులో ,తరచు ఇంటికి వచ్చిపోయే బంధుమిత్ర పురుషులో పెట్టె ప్రలోభాలకు లోనై గర్భవతులు కూడా అవుతుం టారు.బిడ్డలను కనాలని ఉన్నా పరువు ప్రతిష్ఠ లకు లోబడి,లోక నిందకు వెరచి గర్భస్రావాలకు పాల్పడతారు. నాటు మందులతో అధిక రక్త స్రావంతో మంచాన పడి యాతన అనుభవి స్తుంటారు.గర్భస్రావ ప్రయత్నాలు ఫలించకపోతే నవమాసాలు మోసి కన్న బిడ్డలను అక్రమ సంతానంగా అవమానించే సామాజిక పరిస్థి తులలో పెంచి పోషించుకొనే స్థోమత లేక వదిలించుకొనటమో వధించటమో వాళ్లకు అనివార్యమవుతుంది.శిశుహత్య నేరం నిరూపితమై శిక్షించబడే స్త్రీలు కూడా ఉంటారు. 1881లో సూరత్‌లో ఉరిశిక్ష విధించబడిన విజయలక్ష్మి అనే బ్రాహ్మణ స్త్రీ అలాంటి స్త్రీలలో ఒకరు.ఆకోర్టు తీర్పును తప్పు పడుతూ స్త్రీకి ఒకరకంగా,పురుషు డికి ఒకరకంగా అమలవుతున్న నీతిని,న్యాయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ 1882లో తారాబాయి షిండే ‘స్త్రీ పురుష తులన’ అనే వ్యాసం రాసింది.అది ఆనాడు గొప్ప సంచ లనం కలిగించిన విప్ల వాత్మక చారిత్రక పత్రం.అయితే అప్పటికి 19 ఏళ్లకు పూర్వమే ఈ సమస్య తీవ్రతను గుర్తించి సావిత్రిబాయి కార్యరంగంలోకి దిగటం గమనించదగినది.కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు బిడ్డను కని లోకానికి భయపడి చంపి బావిలో వేసిన నేరానికి జీవిత ఖైదు శిక్ష విధించబడగా అందుకు కలవర పడిన జ్యోతిరావ్‌ ఫూలే దంపతులు అలాంటి ఒంటరి స్త్రీలకు ఆశ్రయం కల్పించి పురుళ్ళు పోసి నైతిక మద్దతు ఇయ్యటానికి 1863లోనే ‘బాలహత్యా ప్రబంధక్‌ గృప్‌ా’ ఏర్పాటు చేయటం విశేషం.‘అండమానులో జీవితఖైదు తప్పించుకొనటానికి మార్గం’ అంటూ ఆసంస్థను గురించి ప్రచారం చేసిన తీరులో స్త్రీల పట్ల వాళ్ళ ఆర్తి కనబ డుతుంది.ఈ ప్రసవాల యంలో వదిలి వేయ బడిన శిశువుల కోసమా అన్నట్లుగా ఆసంవత్సరమే అనాధ శరణాలయం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు.జ్యోతిబా ఫూలే సాహచర్యం లోనూ,ఆయన మరణానం తరం కూడా అలుపెరుగని,ఆడంబరం లేని కార్య నిర్వహణా దక్షురాలుగా సావిత్రి బాయి సార్ధక జీవితం గడిపింది.నిజమైన అర్ధంలో ఆమె ‘జాతిమాత’ఆత్మగౌరవ చేతన సావిత్రిబాయి జీవిత చోదక శక్తి.కుల అస్తిత్వ చేతన స్త్రీ అస్తిత్వ చేతన రెండూ ఆమెలో సంపూర్ణ వికాసనం పొందాయి. శూద్రుల పరావలంబనం ఆమెకు ఖేద హేతువు. ‘శూద్రులు ,అతి శూద్రులు అజ్ఞానంచేత వెనుక బడ్డారు’ పుట్టుకకు కారణం తల రాత అనుకొన టం ఫలాన్ని ఆశించ కుండ చాకిరీచేస్తే స్వర్గంలో పుణ్యం లభిస్తుందన్న బోధనలను నమ్మటం ఆ అజ్ఞానానికి కారణం అని ఆమెకు తెలుసు. అజ్ఞానంలో మగ్గి పోతున్న వాళ్ళ పట్ల ఆర్తి ‘శూద్రుల పరావలంబనం’ కవితలో కనిపిస్తుంది. ‘శూద్రులంటే’ అన్న కవిత శూద్రుల ఆత్మభిమాన ప్రకటన. – డాక్టర్‌.ప్రియాంక గంగరాపు

1 2 3 4 5 75