ఆదివాసీ జీవనం విధ్వంసం

సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా, అడవుల సంరక్షకులుగా వాసికెక్కిన వనవాసుల జీవనం ఆధునికులకు ఆశ్చర్యంగా ఉన్న అసలైన మానవ సంస్కృతి వారి వద్దేఉంది అన్నది వంద శాతం నిజం.అటువంటి అడవి బిడ్డల జీవన సంస్కృతుల గురించి ఇంతకాలం వారిని పరిశీలించిన దగ్గరగా జీవించిన వారే వ్రాయడం చూసాం చదివాం కానీ 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక మార్పుల్లో భాగంగా అడవి బిడ్డల్లో అక్షరాస్యత విరివిగా పెరగడంతో వీధి బడి చదువులో నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఆదివాసుల చదువులు ఎదిగాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం కామారం గిరిజన గ్రామానికి చెందిన మైపతిఅరుణ్‌ కుమార్‌ అనే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన గిరిజన జన జాతికి చెందిన జీవనం గురించి,దాని విధ్వంసం గురించి కూలం కశమైన గ్రంథం వ్రాశారు. ఒక గిరిజన యువకుడు అందున పోరాట నాయకుడు, అయిన అరుణ్‌ కుమార్‌ ఈ రచన చేయడానికి 2012లో సుమారు నెలరోజుల పాటు 5848 కిలోమీటర్ల దూరం పర్యటించి తెలుగు ప్రాంతాలే కాక పక్క రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానిక చరిత్రలతో పాటు అక్కడి భౌగోళికత, గిరిజనజీవన స్థితి గతులు, ఆధునిక ప్రపంచీకరణ ద్వారా ఆదివాసులకు జరుగుతున్న నష్టాలు, భావితరం తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి, సవివరంగా సచిత్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.502 పేజీలు గల ఈ బృహత్తర రచనను 30 అధ్యాయాలుగా విభజించారు, ఆదివాసి స్వయం పాలన ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌ రావు గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం నాటి వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం, మొదలుకొని దేవాదుల ప్రాజెక్టు, కమలాపురం కాగిత పరిశ్రమ, అశ్వాపురంభార జల కర్మాగారం, భద్రాచలం పేపర్‌ బోర్డు, మొదలుకొని.. రంప రాజ్యం రంప పితూరి శ్రీకాకుళం గిరిజన ఉద్యమం దాని కారకుడు సత్యం మాస్టారు వాకపల్లి అమాను షత్వం, బొండా,భగత,గిరిజన జీవన విధానాలు మర్రి కొమరయ్య పోరాటం ఇలా అనేక విషయాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే నల్లమల చెంచుల జీవితాలు, చెంచుల చెరవిడిన శ్రీశైల క్షేత్రం, చెంచుల జీవావరణ వ్యవస్థ, ప్రమాదంలో చెంచుల మనుగడ, గురించి కూడా ఇందులో హెచ్చరించారు రచయిత, ఇక ఆదిలాబాద్‌ గుండులు తొలి పోరాటయోధుడు రాంజీ గోండు,కేస్లాపూర్‌ నాగోబా జాతర,బాసర క్షేత్రం,గోండ్వానా రాజ్య పాలన చరిత్రతో పాటు గోండుల ఆరాధ్య దైవం హైమన్‌ డార్ప్‌,గుస్సాడి నృత్యం, తదితర జగద్వితమైన విషయాలను భిన్నకోణాల్లో క్షేత్ర పర్యటనల అనుభవసారం జోడిరచి, అనేక ప్రామాణిక విషయాలు, విశేషాలతో ఈరచన చేయబడిరది,
గిరిజన ప్రాంతాలలోని వాస్తవాలతో పాటు, చరిత్ర, గణాంకాలు, చిత్రపటాలతో ఈ బృహత్తర గ్రంథం పరిపూర్ణ ప్రామాణికత సాధించింది అనడంలో అతిశయం అనిపించదు.
రచన శైలి కూడా సరళమైన బాణీలో ఉండి పాఠకులకు అనుకూలంగా చదివించే విధంగా ఉంది.
అచ్చమైన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పూర్వకథ తోపాటు పూజా విధానాలు వారి ఆచారాల ప్రకారం ఎలా చేస్తారు వివరిస్తూ నీటి ఆధునిక సమాజం గిరిజన ఇతరులు జాతరను హస్తగతం చేసుకుని అసలు సాంప్రదాయాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నారో చెబుతూ రచయిత అరుణ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ అటవీ ప్రాం తానికి చెందిన గిరిజన పోరాట యోధుడు, చరిత్ర విస్మరించిన వీరుడు, అయిన ‘‘సోయం గంగులు’’ పోరాటతీరు అమరుడైన వైనం, గురించి ఇందులో పేర్కొనడం ద్వారా రచయిత అరుణ్‌ లోని సూక్ష్మ పరిశీలన, పరిశోధన దృష్టి అర్థమవుతుంది, ఇలా వ్యక్తులే కాకుండా ప్రాంతాలు ఆచారాలు, ఆహారాలు, పండుగలు, మొదలైన అనేక విషయాలు, విశేషాలు, గురించి భిన్నకోణంలో ఇందులో వ్యక్తీకరించబడి తద్వారా అనేక నూతన విషయాలు సంఘటనలు ఆవిష్క రించ బడ్డాయి.కేవలం గిరిజన ప్రాంతాల్లో ప్రపంచీకరణ సాయంగా జరుగుతున్న యుద్ధం, గురించి విమర్శించి వదిలేయలేదు, కానీ నిలుపుదలకు తీసుకోవలసిన చర్యలు చట్టాలు అమలుకు తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి కూడా నిర్మొహమాటంగా వివరించి జాగృతంతో కూడిన హెచ్చరికలు చేశారు రచయిత.
ఒక గ్రామాన్ని షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించడానికి ఉండాల్సిన అర్హతలు గురించి చెబుతూ ప్రధాన లక్షణాలైనా అధిక శాతం ఆదివాసీలు ఉండటం,
ఆ గ్రామ అభివృద్ధి స్థాయి,ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటందుకు గల విస్తీర్ణం,వంటి ప్రాథమిక మార్గదర్శకాలు ఇందులో చెప్పారు, అలాగే చాలా గిరిజన గ్రామాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్‌ గ్రామాలుగా ఎంపిక చేయబడక, అక్కడ గిరిజనులు అయిదవ షెడ్యూల్‌ హక్కులు ఎలా కోల్పోయి నష్టపోతున్నారో కూడా ఇందులో వివరించారు.
వాకపల్లి అడవితల్లి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం, భూపతిపాలెం ప్రాజెక్టు, కన్నెధార గ్రానైట్‌ పరిశ్రమ వల్ల అక్కడి ఆదివాసీల జీవనానికి వాటిల్లుతున్న ముప్పు,
గుర్తు చేస్తూనే శ్రీకాకుళం ప్రాంత సవర గిరిజనుల నృత్యాలు, ఆచారాలు, తో పాటు వారి ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గురించి కూడా గుర్తు చేశారు.
అలాగే ఆదిలాబాద్‌ ప్రాంతానికే వన్నెతెస్తున్న ‘‘కుంటాల జలపాతం’’ ఎలా కనుమరుగు కాబోతున్నదో కూడా చెబుతూ ఇది శకుంతల దుష్యంతుల విహార కేంద్రమని, మొదట దీనిని ‘‘శకుంతల జలపాతం’’గా పిలిచేవారని కాలక్రమంలో ‘కుంటాల’గా రూపాంతరం చెందిందనే చారిత్రిక విషయాలను కూడా ఇందులో వివరించారు.
అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాట క్షేత్రం జోడేఘాట్‌ గురించి, పోరాటం యొక్క నేపథ్యం గురించి కూడా ఆసక్తికర విషయాలు విశేషాలు ఇందులో పొందుపరిచారు.
గోండుల గుస్సాడి గురించి, నాగోబా జాతర నేపథ్యం వివరాలు ఇలా… ప్రసిద్ధ, అప్రసిద్ధ అనే తేడా లేకుండా సంపూర్ణ గిరిజన సమాచారం వెలికి తీసి అక్షరీకరణ చేయడమే లక్ష్యంగా అరుణ్‌ కుమార్‌ అక్షర కృషి కొన సాగింది అనడానికి నిండు నిదర్శనం ఈ బృహత్తర పుస్తకం.
ఆదివాసి జీవనం గురించి తెలుసుకోవాలి అనుకునే పాఠకులే కాదు, గిరిజన విజ్ఞాన పరిశోధకులు విధిగా చదివి తీరాల్సిన ఉత్తమ పొత్తం ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఎకో టూరిజం తగ్గేదెలా 

నగరవాసుల మధ్య (స్వచ్ఛసర్వేక్షణ్‌2023) పరిశుభ్రతను పెంపొందించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.స్వచ్ఛ సర్వేక్షణ్‌2023 లో టాప్‌ ర్యాంక్‌ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. దీని కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏకో వైజాగ్‌ పేరుతో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా గతనెల 5న ప్రచారాన్ని ప్రారంభించింది.గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పౌరులలో పరిశుభ్రతను పెంపొందించడానికి,నగరంలో కాలు ష్యంతో పాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరా టాన్ని కొనసాగించడానికి ‘ఈ ఎకో-వైజాగ్‌’అనే కొత్త ప్రచారాన్ని ఆర్‌కే బీచ్‌లో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌శాఖ మంత్రిఎ.సురేష్‌, జిల్లాఇన్‌ ఛార్జి మంత్రి వి.రజినితోపాటు మేయర్‌ జి.హరివెంకట కుమారి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిశుభ్రత,పచ్చదనం,నీటి సంరక్షణ,ప్లాస్టిక్‌ నిషేధం, కాలుష్యాన్ని తగ్గించ డం వంటి ఐదు అంశాలపై జీవీఎంసీ కమిష నర్‌ సాయి కాంత్‌ వర్మ దృష్టి సారించారు.ఎకో క్లీనింగ్‌లో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ, వేరు చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జివిఎంసి బహిరంగ డంపింగ్‌,పరిశుభ్రతను నిర్వహించ డంవల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగా హన కల్పిస్తుంది. డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.నీటి సంరక్షణలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ కార్యకలాపాలు,రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ మెళుకువలు భారీస్థాయిలో కొనసాగుతాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తీసుకు రావడానికి కార్పొరేషన్‌ కృషి చేస్తుంది.దీనికి సంబంధించి ఎకోమేళా కూడా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికీ జీవీఎంసీ 10ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలను సిద్ధం చేసి ఆ బృందాలకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసి అందజేశారు. ప్రతి బృందంలో ఇద్దరు అధికారులు నియమించారు.వారు తనిఖీలు, ఆలోచనలు,ఫిర్యాదుల పరిష్కారం, కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. నగర ప్రజల అలవాట్లను మార్చడం,పచ్చదనాన్ని పెంపొందించడం,నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు,సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం వంటి అంశాలపై ఈ టాస్క్‌ స్క్వాడ్‌లు చర్యలు తీసుకుంటారు.అవసరమైతే ఈఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు జరిమానాలు కూడా విధిస్తాయి. 56 కిలోమీటర్ల బీచ్‌ తీరప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలు ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నగర ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉత్సహంగా భాగస్వామ్యం అవుతున్నారు.బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అనే నినాదంతో ప్లాస్టిక్‌ కాలుష్యానికి పరిష్కారాలపై దృష్టి పెడుతూ విస్త్రత ప్రచారం చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌2023లో టాప్‌ ర్యాంకే లక్ష్యం గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023-మేరా షెహర్‌,మేరీ పెహచాన్‌ (ఎస్‌ఎస్‌-2023) ఎనిమిది ఎడిషన్‌ కోసం సిద్ధమవుతోంది.దీని కోసం దేశవ్యాప్తంగా 3,000మంది మదింపు దారులతో జూలై ఒకటి నుండి ఫీల్డ్‌ అసెస్‌ మెంట్‌ ప్రారంభించారు.ఈనెల రెండోవారంలో వైజాగ్‌కు అసెస్సర్‌లు రానున్నారు. విశాఖ పట్నంతో సహా4,500ప్లస్‌ నగరాల పనితీరును 46సూచికలపై ఒక నెలలోపు మదింపుదారులు అధ్యయనం చేస్తారు. అంచనా నివేదిక ప్రతి పారామీటర్‌లో స్కోర్‌ల రూపంలో విడుదల చేయబడుతుంది.మొత్తం మార్కులు9,500. ఇందులో పౌర సేవలకు 4,525మార్కులు, సర్టిఫికెట్లు,అవార్డులకు 2,500,ప్రజల అభిప్రాయానికి 2,475మార్కులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌2023 పౌరుల నుండి టెలిఫోనిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో 2022లో మే 24న ప్రారంభి చింది. మూల్యాంకనం నాలుగు త్రైమాసికాల్లో నిర్వహించబడుతుంది. మొదటి మూడు త్రై మాసికాలు పూర్తయ్యాయి. బృందాలు సాక్ష్యం కోసం రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు, ప్రత్యేక క్షేత్ర సందర్శనలను ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 సర్వేలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలిచింది.2021లో నగరం తొమ్మిదో స్థానం నుండి పైకి ఎగబాకింది. ఇది2017లో మూడవ పరిశుభ్రమైన నగరంగా ప్రకటించ బడిరది.ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం విశాఖపట్నం దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా (10లక్షలకు పైగా జనాభా విభాగం లో) ఎంపికైంది. నగరం 2021సంవత్సరంలో తొమ్మిదవ స్థానం నుండి 2022లో నాల్గవ స్థానానికి తన ర్యాంకింగ్‌లను మెరుగుపరిచింది. మొదటి నాలుగు స్థానాల్లో నగరానికి స్థానం దక్కడం ఇదిరెండోసారి.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో,నగరం మూడవ పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఉంది. ఇదికాకుండా,జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒక అవార్డు చెత్త రహితనగరాల్లో (జిఎఫ్‌సి)ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను పొందినందు కుగాను, మరోకటి 10నుండి 40 కేటగిరీలో ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డును పొందడం విశేషం.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో విశాఖ టాప్‌
దేశ వ్యాప్తం గా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాం తాలు,24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.లక్షకు పైబడిన నగరాల్లో విశాఖ పట్నం7500మార్కులకు 6701మార్కు లతో నాలుగో స్థానంలో,6699 మార్కులతో విజయవాడ 5స్థానంలో,6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో,4810మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు,4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛ భారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగ రాల జాబితాలో 10నుంచి 40లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా,మధ్యస్థాయి నగరాల జాబితా లో,3 నుంచి 10లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటా యించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.
వాలంటీర్లకు టార్గెట్లు
గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడాఅవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్‌, తడిపొడిచెత్తల వేర్వేరు సేకరణ,నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది.అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్‌ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్‌ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, ాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికా రులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ˜ోన్లకు వచ్చే టీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్‌ పెట్టారు.
ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ…
స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్ర మాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా నివాస్‌ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేం దుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలం టీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్ర మాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి. ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీ య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
టాప్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే లక్ష్యం..
ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో జరిగిన జీ-20సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ సమావేశానికి, జీవీఎంసీ మౌలిక సదు పాయాల అభివృద్ధి పనుల కోసం సుమారు 110కోట్లు ఖర్చు చేసింది మరియు సుమారు 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ల బయో మైనింగ్‌ను కూడా పూర్తిచేసింది.మూల్యాంకనంలో మంచి స్కోర్‌ కోసం అవసరమైన అన్ని రంగాలను మేము కవర్‌ చేసాం.ఈ సంవత్సరం టాప్‌ 1ర్యాంక్‌ సాధిస్తామనేది మా ఆకాంక్ష.
` సాయి క్రాంత్‌ వర్మ,కమిషనర్‌,జీవీఎంసీ-గునపర్తి సైమన్‌

ప్రైవేట్‌ ఫీజులం తగ్గేనా?

రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. పాఠ శాలల ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజులే ఉం డడంతో ప్రైవేట్‌ స్కూళ్లు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో నైతే అప్పుడే అడ్మిషన్లు అయి పోయినట్లు సమాచారం. తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం, కార్పొరేట్‌ చదువులు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం రూపకల్పనకు ఐదు నెలల క్రితమే కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ మంత్రులతో సబ్‌ కమిటీని కూడా నియమించారు. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణపై ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో గతంలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.

ప్రతి ఏటా 10శాతం ఫీజు పెంచుకో వచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను ప్రజ లకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచిం చింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కావొ స్తున్నా ఇంతవరకూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్ట్కంట స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో? లేదో? అనేదానిపై స్పష్టమైన మార్గ దర్శకాలు ఏవని పలు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులకు రూ. వేలు, లక్షల్లో ఫీజులు కట్టించుకున్న కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు..ప్రస్తుతం జూన్‌ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకావొస్తుండటంతో ఆ నష్టాన్ని ఈసారి రాబట్టాలనే నయా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫీజులను కడితెనే ఈ ఏడాదికి తరగతు లకు అనుమతిస్తామనే నిబంధనలు కూడా పెడుతు న్నట్లు తెలుస్తోంది.కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిభంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదు. ప్రైవేటు స్కూల్స్‌ అధిక ఫీజులకు అడ్డు కట్టవేస్తాం.. అని రెండేళ్ల క్రితం జీవోతెచ్చిన ప్రభుత్వం చతి కలపడిరది.ఫీజుల నియంత్రణ నిబంధన ప్రచా రానికే తప్ప ఆచరణకు నోచుకోలేదు.వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజుల నియంత్రణపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టడంపై తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే అమలు ఎలా ఉంటుం దనేదానిపై లెక్కకు మిక్కిలి అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి దాదాపు 62,063 పాఠశాల లున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ, ఎలిమెంటరీ,సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠ శాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన పిల్లల వాటా గురిం చి 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం…7 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలోదాదాపు 39.5శాతం మంది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారు. అలాగే 11నుండి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు 32శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పైలెక్కలను చూస్తే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రైవేటు పాఠశాలల పాత్ర గణనీయమైనదని అర్థమవు తుంది. ఇంత ప్రాముఖ్యత గలిగిన ప్రైవేటు పాఠశా లలు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రైవేటు పాఠశాలల నిర్వహణపట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరి స్తున్నది.ఈప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని బాహాటంగానే ఉల్లంఘిస్తున్నాయనేది జగ మెరిగిన సత్యం.పోయిన సంవత్సరం మొదటి సారిగా,రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠ శాలల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలలో ఇంటర్మీడియట్‌ కోర్సుల కోసం 2023-24వరకు ఫీజులను నిర్ణయిం చింది. ప్రభుత్వం ప్రాథమిక విద్య అయిన నర్సరీ నుండి 5వ తరగతి వరకు పంచాయతీలలో రూ. 10,000, మునిసిపాలిటీలలో రూ. 11000, మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.12000గా నిర్ణయిం చింది. అలాగే మాధ్యమిక విద్య అయిన 6 నుండి 10వ తరగతులకు పంచాయితీలలో రూ.12000, మునిసిపాలిటీలలో రూ.15000,మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.18000గా నిర్ణయించింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బాహా టంగానే ఈ ఫీజు నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. పంచాయితీలలో సాధారణంగా ప్రైవేటు పాఠశా లలు తక్కువగా ఉంటాయి, మండల కేంద్రాలలోనే ప్రైవేటు పాఠశాలలు కేంద్రీకృతం అయ్యి విద్యార్థులను బస్సుల ద్వారా పాఠశాలలకు రవాణా చేస్తూ ఉంటాయి. మండల కేంద్రాలలో సరాసరి ప్రతి ప్రైవేటు పాఠశాల నర్సరీ,5వ తరగతి విద్యా ర్థుల నుండి రూ.10,000 వేల నుండి రూ.25, 000 వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే మాధ్య మిక విద్య అయిన 6 నుండి పదవ తరగతులకు రూ. 20,000 నుండి రూ.60,000 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనికి అదనంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రాథమిక తరగతుల విద్యార్థుల నుండి రూ.3వేల నుండి రూ.5 వేల వరకు, అలాగే మాధ్యమిక విద్యార్థుల నుండి రూ.5 వేల నుండి రూ.10వేల వరకు పుస్తకాలు అమ్ముతున్నాయి. వేల రూపాయల పుస్తకాలను అంత చిన్న వయసులోనే ఎందుకు కొనిపిస్తున్నారో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. డిగ్రీ వంటి పైచదువులకు కూడా పుస్తకాల ఖర్చు సంవత్సరానికి రూ.3000కు మించదు. అలాంటిది పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రుల నుండి ఈ ప్రైవేటు యాజ మాన్యం ఫీజులకు అదనంగా వేలకు వేల రూపాయలను పుస్తకాల పేరుతో దోచుకుం టున్నాయి.
ఇలా బాహాటంగా చట్టాలను ఉల్లంఘి స్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా విద్యార్థి సంఘం నాయకులు విషయాలను గుర్తించి ఆందోళన చేసి నట్లైతే అధికారులకు రాజకీయ నాయకుల నుండి వత్తిళ్లు వస్తాయి. అధికారుల ఉదాసీనతపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదోరకమయిన రాజీ కుదురుస్తున్నారు.విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య చెప్పాలని చట్టం చెబుతున్నాగానీ ఎక్కడా అమలు చేయటం లేదు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రభుత్వం దుర్మార్గంగా దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠాశాలల్లో కలిపి పేదపిల్లలు బడికి దూరం అయ్యేలా చేస్తున్నది. విద్యార్థులను ఆటోలలో తరలించకూడదని చట్టం చెబుతున్నా సెవెన్‌ సీటర్‌ ఆటోలలో పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు. ఇలా ప్రయాణ సమయాలలో ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ప్రమాదం జరిగిన పుడు కొంత హడావుడి చేసే అధికారులు చివరగా యాజమాన్యానికే మద్దతు తెలిపి ఏ చర్యా తీసుకోకపోవటమో లేదా నామమాత్రపు చర్యలు తీసుకోవటమో పరిపాటిగా మారింది.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

అంతర్గత వలసరాజ్యాన్ని మిగిల్చిన..

అతి ధనవంతులు అవన్నీ ఇతరుల నుండి దూరంగా తీసుకున్నారు..భారతదేశంలోని ధనవంతు లైన 70లక్షల మంది పేదవారు 80 కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే, ఎగువ 0.5 శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాది స్తారు. ఈ సంఖ్యలు వివాదాస్ప దంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమా నత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ మరియు అతని సహచరుల అంచనాల ఆధారంగా నేను వాటిని రూపొందించాను. వివాదాస్ప దమైన విషయం ఏమిటంటే, భారతదేశం చాలా అసమాన దేశం…
కానీ అసమానత అనేది సాపేక్ష పదం. వెయ్యి మంది జనాభా ఉన్న ఊహాజనిత గ్రామం గురించి ఆలోచించండి. ప్రతిఒక్కరూ కొంత మొత్తం లో ఆదాయం ఉన్న పెద్దలు అని మేము అనుకుం టాము. ఈ గ్రామంలో ఐదుగురు అత్యంత ధనిక రైతులు ఉన్నారు, వారు సంవత్సరానికి రూ.25 లక్షలు సంపాదిస్తారు.మరో చివరలో, 570 మంది పేద రైతులు ఏటా కేవలం రూ.22,000 సంపాది స్తున్నారు. సమిష్టిగా,ధనిక రైతులు రూ.1.25 కోట్లు ఆర్జించవచ్చు, ఇది పేద రైతుల మొత్తం సంపాదన తో సమానం. ఇది నేను ప్రారంభించిన నిష్పత్తికి సరిగ్గా అద్దం పడుతుంది. ఎగువ 0.5శాతం దిగు వన ఉన్న 57శాతంతో సమానం.
ఈ గ్రామం పెద్ద నగరానికి సమీపంలో ఉందని కూడా అనుకుందాం.ఈ నగరంలో ధన వంతులైన 10శాతం మంది సగటు వార్షిక ఆదా యం రూ.ఈసూపర్‌ రిచ్‌ నగర ప్రజలతో పోల్చి నప్పుడు, గ్రామంలోని ధనిక రైతులు వేరుశెనగను సంపాదిస్తారు.అంటే గ్రామంలో విపరీతమైన అస మానతలు ఉన్నప్పటికీ,నగరంలోని అత్యంత ధనవం తులు సంపాదించినంత సంపాదనకు అక్కడి ధనవంతులురారు.అభివృద్ధి చెందిన పెట్టుబడి దారీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులతో పోల్చిన ప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులు ఎలా ఉంటారు? మేము సగటు ఆదాయాలను డాలర్లలో మార్చవచ్చు మరియు వాటిని పోల్చవచ్చు. అయితే, ఇది సరికాని మరియు అన్యాయమైన పోలిక. ఒక యుఎస్‌ డాలర్‌ ప్రతిచోటా ఒకే బుట్ట వస్తువులను కొనుగోలు చేయదు. యుఎస్‌లో ఒకడాలర్‌తో కొను గోలు చేయగల అదే వస్తువులను స్థానిక కరెన్సీలో కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చవుతుందో చూడ డానికి సరైన పోలిక అవసరం. దీనిని కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)అంటారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)ప్రకారం ప్రస్తుతం యూఎస్‌లో ఒక డాలర్‌ కొనుగోలు చేయగలిగిన దాని ధర భారత దేశంలో కేవలం రూ.24మాత్రమే. మరో మాట లో చెప్పాలంటే,మీ బ్యాంకులో డాలర్‌ కొనడానికి మీరు దాదాపు రూ.82 చెల్లించాల్సి ఉంటుంది. పీపీపీ పరంగా,డాలర్‌ విలువ కేవలం రూ.24. మరోవైపు నుండి చూస్తే,యుఎస్‌లో ఎవరైనా నెలకు వి30,000సంపాదిస్తే, అతను నెలకు రూ. 7.2లక్షలు సంపాదించే భారతీయుడు ఇక్కడ కొనుగోలు చేయగలిగిన వస్తువులనే విస్తృతంగా కొనుగోలు చేయగలరు.
నేను ఈ సంఖ్యలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నాను.ధనవంతులైన 10శాతం అమెరి కన్‌ పెద్దలు నెలకు సుమారు వి30,000శాతం సంపాదిస్తారు. భారతదేశంలోని 0.5 శాతం ధన వంతులైన పెద్దలు పీపీపీ పరంగా సంపాది స్తున్న దానికి సరిగ్గా ఇదే. అందువల్ల,కొనుగోలు శక్తి సమానత్వ పరంగా,భారతీయులలో అత్యంత ధనవంతులైన 0.5 శాతం మంది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అగ్రశ్రేణి 10శాతం మంది వ్యక్తులతో సమానం. ఊహాత్మక గ్రామం మరియు పెద్ద నగరం యొక్క మా ఉదాహరణతో దీనిని పోల్చండి.ఆ సందర్భంలో, గ్రామంలోని 0.5శాతం ధనవంతులు నగరంలో నివసిస్తున్న 10శాతం సంపన్నులలో కొంత భాగాన్ని సంపా దించారు. మేము ఇదే సంపాదన థ్రెషోల్డ్‌ని తీసుకుంటే,యూకే,జర్మనీల ఉమ్మడి వయోజన జనా భాలో అగ్ర 4శాతంమంది ఈసూపర్‌ రిచ్‌ కేటగిరీ లోకి వస్తారు. సంపూర్ణ సంఖ్యలో, భారతదేశంలో నెలకు వి30,000శాతం సంపాదించే దాదాపు 50 లక్షల మంది పెద్దలు ఉన్నారు, ఇది యూకె, జర్మనీలలో కలిపి అటువంటి పేదల సంఖ్యకు సమానం. అంటే యూరప్‌లోని రెండు పేదల ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నంత మంది అతి సంపన్నులు భారతదేశంలో ఉన్నారు.ఈ పెద్దలపై ఆధార పడిన పిల్లలను కూడా చేర్చినట్లయితే, అభివృద్ధి చెందిన ప్రపంచంలో అత్యంత సంపన్నులు సంపా దించినంత మాత్రాన 70లక్షల మంది భారతీ యులు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
పేద భారతీయుల సంగతేంటీ?
పేద భారతీయుల సంగతేంటి? వారు భూమిలోని దౌర్భాగ్యులతో-ప్రపంచంలోని అత్యం త పేదప్రజలతో ఎలాపోలుస్తారు? నేను ప్రపంచం లోని అత్యంత పేద ఐదు దేశాలలో రెండిరటిని చూస్తాను-అత్యంత పేదగా పరిగణించబడే బురుండి మరియు నాల్గవ పేద దేశమైన మడ గాస్కర్‌. డేటా పరిమితుల కారణంగా నేను ఈ రెండు దేశాలను ఎంచుకున్నాను. నేను ఉపయోగిం చిన మొత్తం డేటా ప్రపంచ అసమానత డేటాబేస్‌ నుండి వచ్చింది.నేను భారతదేశంలోని పేద ప్రజల యొక్క వివిధ జనాభా విభాగాల సగటు ఆదాయాన్ని పోల్చి చూడవలసి వచ్చింది మరియు యూకె డాలర్‌ పరంగా అదే ఆదాయానికి దగ్గరగా వచ్చే పేద దేశాలను కనుగొనవలసి వచ్చింది. బురుండి మరియు మడగాస్కర్‌ సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదాయాలతో దాదాపు సమానంగా ఉంటాయి. 2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750శాతం భారతదేశంలో దిగువన ఉన్న 42 శాతం మంది పేదలు దాని కంటే తక్కువ సంపాదించారు. దాదాపు వి1,720శాతం. అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065శాతం.భారతదేశంలో దిగువన ఉన్న 52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు ు దాదాపు వి3,060శాతం. దీనర్థం దాదాపు 58 కోట్ల మంది భారతీయులు (ఈపేద్దలపై ఆధారపడిన పిల్లలతో సహా) ప్రపం చంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తి వలె పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయ పరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నారు. ఇప్పుడు, రెండు సంఖ్యలను కలపండి. 70లక్షల మంది భారతీయులు మొదటి ప్రపం చంలో అత్యంత ధనవంతుల వలె ధనవంతులు కాగా,70కోట్ల మంది భారతీయులు మూడవ ప్రపంచంలోని పేద ప్రజల కంటే పేదవారు. ఇది కేవలం అంతర్గత ఆదాయ అసమానత సమస్య మాత్రమేకాదు. ఆర్థికాభివృద్ధి స్థాయితో సంబంధం లేకుండా ప్రపంచంలోని ధనిక మరియు పేదల మధ్య సంపూర్ణ వ్యత్యాసంతో పోల్చినప్పుడు మన అసమానత అపారమైనది.మూడు దశాబ్దాల సరళీ కరణ,ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ఎల్‌పీజీ నుండి భారత దేశం పొందింది ఇదే. నెహ్రూ వియన్‌ ‘సామ్య వాదం’దాని అన్ని తప్పులకు, రెండు శతాబ్దాల దోపిడీని మన వలస ప్రభువులు మనకు బహుమతిగా అందించిన తీవ్రమైన ఆకలి మరి యు నిరుపేదలను తగ్గించడంలో భారీ పురోగతి సాధించింది.ఎల్‌పీజీ సంస్కరణలు మనకు అంత ర్గత వలసరాజ్యాన్ని మిగిల్చాయి, ఇక్కడ మైనస్‌ క్యూల్‌ సూపర్‌-రిచ్‌ జనాభా మిగిలిన వాటి నుండి అన్నింటినీ దూరం చేసింది. అసమానత: ఎగువ 0.5 శాతం భారతీయులు దిగువ 57శాతంతో సమానం.
సరళీకరణ, ప్రైవేటీకరణ,ప్రపంచీకరణ అంటే ఏమిటీ?(ఎల్‌పీజీ)
1991లో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త ఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపం చీకరణ మరియు ప్రైవేటీకరణ ఒక భాగం. ఈ సంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవ డం మరియు దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకు రావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభి వృద్ధికి అవరోధంగా మారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇదిదోహదపడిరది. ఇది దేశం లో ప్రైవేట్‌ రంగం విస్తరించడానికి మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేసింది.సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ (లిబరేజేషన్‌,ప్రైవేటేజేషన్‌ అండ్‌ గ్లోబులైజేషన్‌(ఎల్‌పీజీ)దేశ నూతన ఆర్థిక నమూనాలో మూడు అంశాలు. సరళీకరణ అనేది ప్రభుత్వం యొక్క కొన్ని నియమాలు మరియు నిబంధనలను కలిగి ఉండే కఠినమైన చట్టాలు మరియు అభిప్రాయాల నుండి సడలింపును నిర్ధారి స్తుంది. ప్రైవేటీకరణ అనేది పబ్లిక్‌ యాజ మాన్యంలోని పాత్రలు మరియు కార్యకలాపాలను ప్రైవేట్‌ యాజమాన్యానికి పూర్తిగా బదిలీ చేయ డం.దీనర్థం,ప్రభుత్వం యొక్క ఆస్తి లేదా వ్యాపారం బాగా పని చేయడానికి మరియు క్రమశిక్షణగా ఉండాలనే లక్ష్యంతో ప్రైవేట్‌ యజమాని ద్వారా తీసుకోబడుతుంది. ప్రపంచం మొత్తాన్ని పరస్పరం అనుసంధానించే వాణిజ్యం మరియు సంస్కృతి యొక్క నెట్‌వర్క్‌ను పెంచడానికి ప్రపంచీకరణ తదుపరి దశ. ఇది ఏవాణిజ్యం,సేవలు లేదా సాంకేతికత సరిహద్దులచే పరిమితం చేయబడదని నిర్ధారిస్తుంది, తద్వారా ప్రపంచం మొత్తాన్ని కలుపు తుంది మరియు ఏకీకృతం చేస్తుంది. వారు తరచుగా కలిసి ఎల్‌పీజీగా సూచిస్తారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, తద్వారా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పోటీగా మరియు పూర్తి చేయ గలదు.ఎల్‌పీజీ అనేది సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణను సూచిస్తుంది. భారత దేశం తన నూతన ఆర్థిక విధానం ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం అంతర్జాతీయ బ్యాం కులను సంప్రదించినప్పుడు, భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య ఎక్కువగా ప్రైవేట్‌ రంగాలు చేసే వాణిజ్యంపై ఆంక్షలవైపు ప్రభు త్వం తెర వాలని వారు సూచించారు. అంతరా ్జతీయ బ్యాం కుల సూచన మేరకు భారతప్రభుత్వం కొత్త ఆర్థిక విధానం లేదా ఎన్‌ఇపిని ప్రకటించింది. ఈ విధానంలో విస్తృతమైన సంస్కరణలు ఉన్నాయి. ఈ చర్యలు విస్తృతంగా రెండు గ్రూపులుగా వర్గీకరించబడ్డాయి- నిర్మాణాత్మక సంస్కరణలు మరియు స్థిరీకరణ చర్యలు. అంతర్జాతీయ పోటీత త్వాన్ని పెంపొందించడమే నిర్మాణాత్మక చర్యల లక్ష్యం. అంతేకాకుండా,దేశ ఆర్థికవ్యవస్థలోని వివిధ విభాగాలలోని దృఢత్వాన్ని తొలగించేందుకు చర్య లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థిరీకరణ చర్యలలో, ద్రవ్యోల్బణం మరియు చెల్లింపుల బ్యాలెన్స్‌ని నియం త్రించడంలో అభివృద్ధి చెందిన బలహీనతను సరిదిద్దడం మరియు సరిదిద్దడం లక్ష్యం. రెండు సెట్ల చర్యలు స్వల్పకాలిక వ్యవధి కోసం తీసుకో బడ్డాయి.
స్థిరీకరణ చర్యలో సరళీకరణ, ప్రైవేటీ కరణ మరియు ప్రపంచీకరణ ఉన్నాయి.ఈ ప్రమా ణం ప్రకారం,ఒక సంవత్సరంలో మిగిలిన ప్రపం చంతో దేశం యొక్క అన్ని రకాల ఆర్థిక లావాదేవీ లను రికార్డ్‌ చేయడానికి చెల్లింపు బ్యాలెన్స్‌ ప్రారం భించబడిరది. అటువంటి దృష్టాంతంలో, ద్రవ్యోల్బ ణం అనేది ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు మరియు సేవలలో ధరల పెరుగుదలను సూచిస్తుంది.
సరళీకరణ
దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న కఠినత్వాలు మరియు ఆంక్షలకు ముగింపు పలకడ మే సరళీకరణ లక్ష్యం.ఇంకా,ఈ విధానంలో, ప్రభు త్వం దేశంలో తననియంత్రణకు అనువై నదిగా ఉంటుందని భావిస్తున్నారు.ఈవిధానం యొక్క లక్ష్యాలు దేశీయ పరిశ్రమల మధ్య పోటీని పెంచ డం మరియు ప్రణాళికాబద్ధమైన దిగుమతులు మరి యు ఎగుమతులతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. అంతేకాకుండా, ఇది అంతర్జాతీ య సాంకేతికత మరియు మూలధనాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఈ విధానం దేశం యొక్క అంతర్జాతీయ మార్కెట్‌ సరిహద్దును విస్తరి స్తుంది మరియు దేశంలో రుణ భారాన్ని తగ్గిస్తుంది.
ప్రైవేటీకరణ
స్థిరీకరణ చర్య యొక్క రెండవ విధానం ప్రైవేటీకరణ.ఈ విధానం ప్రైవేట్‌ రంగ సంస్థల ఆధిపత్యాన్ని విస్తరించడం మరియు ప్రభుత్వ రంగా లపై నియంత్రణను తగ్గించడం లక్ష్యంగా పెట్టు కుంది. అందువలన, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ తక్కువ యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కంపెనీలను రెండు విధానాలతో ప్రైవేట్‌ రంగ కంపెనీలుగా మార్చ వచ్చు.ఈవిధానాలు ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభు త్వ నియంత్రణను ఉపసంహరించుకోవడం మరి యు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా. ప్రైవేటీక రణ యొక్క మూడు రూపాలు ఉన్నాయి, అవి వ్యూహాత్మక విక్రయం, పాక్షిక విక్రయం మరియు టోకెన్‌ ప్రైవేటీకరణ. వ్యూహాత్మక విక్రయం లేదా జాతీయీకరణలో, ప్రభుత్వం 100%ఉత్పాదక వనరుల యాజమాన్యాన్ని ప్రైవేట్‌ కంపెనీల యజ మానులకు అందించాలి. పాక్షిక విక్రయం లేదా పాక్షిక ప్రైవేటీకరణ వాటాల బదిలీ సహాయంతో కనీసం 50% యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల,వారు మెజారిటీ షేర్లను కలిగి ఉంటారు మరియు సంస్థ యొక్క స్వయంప్రతిపత్తి మరియు పనితీరుపై నియంత్రణను కలిగి ఉంటారు. టోకెన్‌ లేదా లోటు ప్రైవేటీకరణలో,బడ్జెట్‌లో కొరతను తీర్చడానికి ప్రభుత్వం వాటా మూలధనాన్ని 5-10%వరకు డిజిన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి,ఈవిధానం దేశంలో ఆర్థికపరిస్థితిని మెరుగు పరచడం మరియు ప్రభుత్వ రంగ సంస్థల పని ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకా కుండా,డిజిన్వెస్ట్‌మెంట్‌ నుండి నిధులు సేకరించ వచ్చు. తగ్గిన పని ఒత్తిడితో ప్రభుత్వ రంగం యొక్క సామర్థ్యం స్వయంచాలకంగా పెరుగుతుంది మరి యు వినియోగదారుల ఉపయోగం కోసం మంచి నాణ్యతగల వస్తువులు మరియు సేవలను అంది స్తుంది.
ప్రపంచీకరణ
ఈ విధానంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహాయంతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.దీని అర్థం విదేశీ వాణిజ్యం మరియు సంస్థాగత మరియు ప్రైవేట్‌ పెట్టుబడులపై ప్రాథమి క దృష్టి ఉంటుంది. ఇది మూడవ మరియు చివరి విధానం అమలు చేయవలసి ఉంది. ఈ దృగ్విష యం యొక్క లక్ష్యం తగిన వ్యూహాల సూచనలతో ప్రపంచాన్ని అభివృద్ధి చేయడం మరియు స్వతంత్రం చేయడం.ఇది ఒక దేశం యొక్క అవసరాలు నడిచే మరియు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చగల ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం. గ్లోబలైజేషన్‌ యొక్క ప్రధాన ఫలితాలలో ఒకటి అవుట్‌సోర్సింగ్‌. అవుట్‌ సోర్సింగ్‌ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతర దేశాల నిపుణులను ఒక సంస్థ నియమిం చుకోగలదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దాని అభివృద్ధికి దారితీసే కాంట్రాక్టు పనులు చాలా ఉన్నాయి. ఇది చాలా ప్రైవేట్‌ రంగాలకు కొత్త మార్గా లను తెరిచింది మరియు భారతీయ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైనవి మరియుశక్తివంతమైనవిగా పరిగణించబడుతు న్నాయి. తక్కువ వేతన రేటు మరియు అంకితభావం కలిగిన ఉద్యోగులు భారతదేశాన్ని అంతర్జాతీయ ఔట్‌సోర్సింగ్‌కు అనువైన నిర్మాణాత్మక దేశాలలో ఒకటిగా మార్చారు.` వ్యాసకర్త : సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌, –(ఔనింద్యో చక్రవర్తి)

జగనన్న సురక్ష

ప్రజా సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడం,అర్హులందరికీ పథకాలు అందిం చడం లక్ష్యంగా జూన్‌ 23 నుంచి జూలై 23 వరకు నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్య క్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి సచివాలయ పరిధిలో విస్త్రతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా మరో కొత్త కార్యక్రమైన జగనన్న సురక్ష కార్యక్రమం అనే శ్రీకారం చుట్టబోతోంది.ఇది ఎప్పట్నించి ప్రారంభమౌతుందనేది పరిశీలిద్దాం.!
వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో మరో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది.ఇది జూన్‌ 23 నుంచి ప్రారంభం కానుంది.. ప్రతి ఇంట్లో ఏసమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్ర మం ఉద్దేశ్యమం.
ఇదో బృహత్తర కార్యక్రమం
ప్రభుత్వం చేపడుతున్న వివిధకార్య క్రమాలు,సంక్షేమపథకాలు, గడపగడపకూ ప్రభుత్వం,ఉపాధిహామీ పనులు, రెవెన్యూ, హౌసింగ్‌, వ్యవసాయం,సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు కార్యక్రమాలపై సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టరేట్‌ స్థాయివరకు ఎప్పటికప్పడు సమీక్ష చేసుకొని అర్హుల్కెన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రధాన లక్ష్యం.ఈబృహాత్తర క్యాక్రమం నెల రోజుల పాటు నిర్వరామంగా కొనసాగుతుంది. సచివాలయ సిబ్బందికి సైతం శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన జనన,మరణ,కుల,మత, నివాస పత్రాలు,సర్టిఫికేట్లు జారీ,ప్రభుత్వపథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు.ఈపనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిస్తారు.ఎవరి సమస్యైనా తిరస్కరించ బడితే ఎందుకు తిరస్కరించారనేది ఆఫిర్యాదు దారుడి ఇంటికెళ్లి వివరిస్తారు.అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యను 24గంటల్లోగా పరిష్కరమయ్యే అవకాశం ఉంది. అర్హత ఉండీ ప్రభుత్వపథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆపధకాల లబ్ది పొందేలా చేస్తారు.
సమస్యలపై మండలాధికారులు క్యాంపులు
సర్టిఫికెట్లకు సంబంధించి,అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా యా? లేవా?అన్నదానిపై ఈ కార్యక్ర మంలో జల్లెడపడపట్టనున్నారు.నగర/పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌,జోనల్‌ కమిషనర్లు,సిబ్బంది ఒక టీమగా ఏర్పాటు చేసుకుని వివిధ వార్డుల్లో పర్యటిస్తారు.మండల స్థాయిలో ఎంపీడీఓ,డిప్యూటీ తహాసీల్దార్‌ ఒక బృందం,తహాసీల్దార్‌ ఈఓ పంచాయితీ రాజ్‌ కలసి రెండు బృందాలుగా గ్రామాలకు వెళ్తారు. సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి,ఆ రోజు వాటికి గ్రామంలో ఉన్న క్షేస్థ్రాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.నెల రోజులపాటు జరిగే ఈక్రార్యక్రమంలో ప్రతిరోజుఒక టీమ్‌ ఒక్కో సచివాలయాన్ని మాత్రమే సందర్శిస్తారు.
వాలంటీర్ల గుర్తించుకోవాల్సిన విషయాలు
పనిని సమర్ధవంతంగా అర్ధం చేసుకోవడానికి ఎంఎల్‌ఓ,మండల ఇన్‌చార్జిలు,కలసి ఏర్పాఉ చేసిన శిక్షణా సమావేశానికి హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలి. ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుంచి తీసుకొని సచివాలయంలో సమర్పించాలి.ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్‌ యాప్‌లో సర్వేని పూర్తి చేయాలి.ఇంటికి తాలం వేసి ఉంటే..వేరే సమయంలో మళ్లీ సందర్శించాలి. ఆయా సచివాలయ పరిథిలో క్యాంపు జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పాలి.ఆవ్యక్తి అనుమతితో వారి జియో`ట్యాగ్‌ చేయబడిన చిత్రాలను క్లిక్‌ చేయాలి.అదే రోజున యాప్‌,వాట్సాప్‌ గ్రూపుల్లో పోటోలు, అప్‌టడేట్‌ను షేర్‌ చేయాలి.పథకాలు లేదా డాక్యుమెంట్‌ సంబంధింత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్‌కు రావడానికి ప్రొత్సహించాఇ. క్యాంపుకు ముందు ఫిర్యాదు చేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్‌ రోజు సందర్శించ వచ్చు. దీనికి సంబంధించి ఆయా వార్డు/గ్రామ సచివాలయంలో ప్రత్యేక డెస్కలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి శనివారం నుంచే మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 1వతేదీన అర్హత పత్రాలు అందించే కార్యక్రమం
జగనన్న సురక్షలో వివిధ పథకాల కిందఅర్హు లుగా గుర్తించినవారికి ఆగస్టు1వతేదీన అర్హత పత్రాలు అందిస్తారు.ఇందులో సమస్యల పరిష్కారంలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికా రులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉం డాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు.. గ్రీవెన్స్‌రిజెక్ట్‌ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరిస్తున్నారు. ప్రజలకు అన్నిరకాలసేవలు అందించాలని సీఎం ఆదేశించారు.
కల్తీ విత్తనాల పట్ల అలర్ట్‌..
అదే విధంగా వర్షాకాలం ప్రారంభమైనందున విత్తనాలు,ఎరువులు,పురుగుమందుల కొరత రాకుండా రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంది.కల్తీవిత్తనాలపట్ల అలర్ట్‌గా ఉండటం,ఎక్కడ్కెనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించారు. జుల్కె1నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించి,సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు,భగరక్షకార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌,రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదా రులను కూడా కవర్‌ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడం, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకాలన్ని ప్రారంభించినట్లు మంత్రి మేరుగ తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా భావించి..సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. దేశ చరిత్రలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క రోజులోనే సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది
జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడే ప్రజల సమస్యకు పరిష్కారం చూపు తూ.. అదేవిధంగా అర్హులైన వారికి పథకాలు వచ్చేలా సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు. ఇక అవసర మైన వారికి ఉచితంగా సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుం దని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వాలం టీర్లు, సచివాలయ గృహసార థులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి సమస్య లను తెలుసుకుని టోకెన్లు ఇస్తారని.. ఇక జులై 1 నుంచి 30 వరకు సచివాలయాల పరిధిలో క్యాంపులు పెట్టి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్‌, పథ కాల లబ్ది, సమస్యలను మండల, సచివాల య అధికారులు దగ్గరుండి పరిష్కరి స్తారని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసు కోవాలని మంత్రి మేరుగ అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని కూడా లేదని.. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. అప్పులపాలు అవుతుందని ప్రచారం చేయిం చారని, ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు తానూ ఇస్తానని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పారదర్శక పాలనకు నిదర్శనంగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌
సంక్షేమ పథకాల అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా..అర్హతే ప్రామాణికంగా ఉందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 2.16లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది మండల అధికారులు,జిల్లా అధికారులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ‘’జగనన్న సురక్ష పథకాన్ని జులై నెలలో ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం.. ఈ నెల లోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది, దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నుంచే పథకాల క్యాలెండర్‌ అమలవుతుంది..అందు కని ఈ నెలలో పథకాలకు లింక్‌ చేయా ల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తోంది’’ అని ఎమ్మె ల్సీ మర్రి రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ సిఫార్సు లు,టీడీ పీ నాయకుల సూచనల మేరకు పథకాలు ఇచ్చే వారని, కానీ సీఎం జగన్‌ నాయకత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తు న్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని..ఇక వారి సచివాలయ పరిధిలో క్యాంపులు పెట్టి వాటిని పరిష్కరి స్తారని ఎమ్మెల్సీ రాజశేఖర్‌ చెప్పారు. ప్రజల వద్దకే పాలనను ఆచరించి చూపాం
‘’జగనన్న సురక్ష వంటి కార్యక్రమం అమలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి, ఆ లక్షణా లు మా నాయకుడు సీఎం జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, కానీ సీఎం జగన్‌ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి మీ సమస్య లు ఏంటి అని తెలుసుకుని..వాటిని పరిష్కరిం చేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం ఇది సుపరిపా లనకు నాంది పలకడమేనని’’ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి 2 చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన ద్నృవపత్రాలు, ప్రభు త్వ సేవలను అక్కడికక్కడే అందించినట్లు ఎమ్మె ల్సీ పేర్కన్నారు. దీనికి సంబంధించి ఆయా సచి వాలయాల పరిధిలోని వాలంటీర్లు జూన్‌ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతులను సేకరిం చి జగనన్న సురక్ష యాప్‌ లో నమోదు చేశారని తెలిపారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండావారి భోజన, త్రాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.-జిఎన్‌వి సతీష్‌

అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది..!

భారతదేశంలోని ధనవంతులైన 70లక్షల మంది పేదవారు 80కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే,ఎగువ0.5శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాదిస్తారు.ఈసంఖ్యలు వివాదాస్పదంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమానత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ,అతని సహచరుల అంచనాల ఆధారంగా ప్రముఖ సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌ ఔనింద్యో చక్రవర్తి రూపొం దించారు.
199లో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ ప్రవేశపెట్టింది.ఈసంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవడం,దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగామారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇది దోహద పడిరది.ఇదిదేశంలో ప్రైవేట్‌రంగం విస్తరించడానికి మరియు ఆర్థికవృద్ధికి దోహదం చేసింది. ఈనేపథ్యంలోనే నూతన ఆర్ధికసరళీకరణ విధానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్‌ మోనార్టింగ్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌),వరల్డ్‌ బ్యాంక్‌లు అప్పటి నుంచి వీటిని తమ గుప్పెట్లోకి వచ్చాయి.
దాని ముందర మనకు సోషలిస్టు విధానం ఉండేది. 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తోంది.కానీ డేటా పరిశీలిస్తే0.5శాతం జనాభ ధనికవర్గానికే చెందు తుంది. సంపాదనలో 80కోట్ల మంది పేదవారి సంపాదనతో సమానం అని డేటా చెబుతుందని ఔనింద్యోచక్రవర్తి ద్వారా తెలుస్తోంది.దీనబట్టి పరిశీలస్తే,ముప్పైయేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానం ధనవంతులకే ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందినదేశాల కంటే అత్యంతపేదగా పరిగణించబడే బురుండి,మడగాస్కర్‌.ఈ రెండుదేశాల సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదా యాలతో దాదాపు సమానంగా ఉంటాయి.ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ..ఆదాయం తక్కువ.
2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750 (ూూూ).భారత దేశంలో దిగువన ఉన్న42శాతం మంది పెద్దలు దానికంటే తక్కువ సంపాదించారు దాదాపు వి1,720 (ూూూ).అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065 (ూూూ).భారతదేశంలో దిగువన ఉన్న52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు.దీనర్థం దాదాపు58కోట్ల మంది భారతీయులు(ఈపెద్దలపై ఆధార పడిన పిల్లలతోసహా) ప్రపంచంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తివలే పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయపరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నట్టు డేటాద్వారా తెలుస్తోంది.
అయితే దేశరాజ్యాంగం మాత్రం ఒకసోషలిస్టు విధానాన్ని స్థాపించేదిగా ఉంది.కానీ ఆర్ధిక విధానంమాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతోంది.అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది.ఆర్ధిక విధానాలను రూపొందించే సమయంలో పాలకులు ఇలాంటి అంశాలపై దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తయారుకు భలోపేతం చేసినవాళ్లం అవుతాం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

ఫ్టాస్టిక్‌పై పోరు బాట

‘‘ ప్లాస్టిక్‌ మహ మ్మారిపై పోరును ఒకఅత్యవసర ఉద్యమంగా చేపట్టాలి. పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్క రించాలి. క్లాత్‌ బ్యాగులను వాడకాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.నిత్య జీవితంలో ప్లాస్టిక్‌వినియోగం విడదీయలేని స్ధాయికి చేరుకున్నది. ప్రతి నిత్యం మనకు నిత్యావసరాలైన కూరగాయలకు,కిరాణా సామాన్లకు, ఫ్యాన్సీ వస్తువులకూ మందులకు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు కూడా ప్లాస్టిక్‌ బ్యాగుల వాడడం మనకు అలవాటై పోయింది. తెలీకుండానే మన పరిసరాలు,భూమి,పర్యావరణం,ఆరోగ్యాలను తీవ్రంగా నష్టపరచుకుంటున్నాం.ఈ నేపథ్యంలో ముందుగా పర్యావరణాన్నీ, ప్రజారోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్‌ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! ’’
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులు వినియోగించ బడుతున్నాయి.మన దేశంలో ప్రతి పౌరుడు సగటున ఒక్క సంవత్సరకాలంలో11కేజీల ప్లాస్టిక్‌(బ్యాగులు, బాటిల్స్‌, స్ట్రావంటివి) వాడటం జరుగుతున్నది.ప్లాస్టిక్‌ బాటిల్స్‌ భూమిలో కరిగి పోవడానికి 450ఏళ్లు,సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌బ్యాగులు కరిగిపోవడానికి వెయ్యి సంవత్స రాలు పడుతుంది.మొత్తంఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో కేవలం 9శాతం మాత్రమే రీసైకిల్‌ చేయబడుతున్నది. దాదాపు గా14ప్లాస్టిక్‌ బ్యాగుల ఉత్పత్తికి అవసరమయ్యే పెట్రోలియం నుండి ఒకమైలు దూరం వాహనం నడపటానికి అవసరమయ్యే గ్యాసును ఉత్పత్తి చేయవచ్చు. ప్రతి ఏటా పెద్దసంఖ్యలో పక్షులు,చేపలు,జంతువులు ప్లాస్టిక్‌వల్లచనిపోతున్నాయి.అంతరించి పోతున్న ప్రాణుల్లో దాదా పు700జాతులు ప్లాస్టిక్‌వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు.మనం తినే జలచరాల్లో(చేపలు,రొయ్యలువంటివి) మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు ఉం టున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.ప్లాస్టిక్‌ కాల్చి నప్పుడు విడుదలయ్యే డయాక్సిన్స్‌,ఫ్యురాన్స్‌, మెర్క్యురి,పాలిక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ వంటి హానికరమైన రసాయనాలు మానవ ఆరోగ్యాన్నీ,మనం నివసించే భూమినీ,తాగే నీటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోసి కాల్చడం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 20మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగా 60లక్షల మంది మరణిస్తున్నారని తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడంవల్ల దగ్గు,ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. మనం తినే ఆహారం,తాగే నీటిలో సూక్ష్మస్ధాయిలో ఉంటున్న ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాల వలన క్యాన్సర్‌, చర్మవ్యాధులు,హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు, సంతానలేమి,గుండెపోటు వంటి వ్యాధులు సోకుతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉల్లాసంగా, ఆహ్లాదంగా గడపడానికి సందర్శించే సముద్ర తీరాలలో(బీచ్‌లలో)పడవేసే వ్యర్థపదార్ధాలలో 73శాతం ప్లాస్టిక్‌ ఉంటున్నది.ప్లాస్టిక్‌ బ్యాగులు, బాటిల్స్‌ వంటి ఉత్పత్తుల నుండి విడుదలయ్యే వ్యర్ధాలతో కలుషి తమైన సముద్ర జలాల వలన సముద్రంలో విస్తారంగాఉండి,ప్రపంచంలో పది శాతం ఆక్సిజన్‌ను కిరణ జన్య సంయోగక క్రియ ద్వారా అందిస్తున్న ప్రోక్లోరో కోకస్‌ అనబడే బ్యాక్టీరియా తీవ్రంగా దెబ్బతింటున్న ట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం 2050 సంవత్సరం నాటికి సముద్రా లలో చేపలకంటే ప్లాస్టిక్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తెలు స్తోంది. ప్రస్తుతానికి నదుల్లోనూ, సముద్రా ల్లోనూ మన ఆహారం నిమిత్తం సేకరించే చేపల్లో ప్రతి మూడు చేపలలో ఒక్క చేప ప్లాస్టిక్‌ అవశేషాలు కల్గిఉన్నట్లు తెలుస్తోంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా సగటు మనిషి తినేఆహారంలో ఒకవారానికి 5గ్రాముల మైక్రోప్లాస్టిక్స్‌ కణాలను తింటున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా.ప్రపంచ వ్యాప్తం గా 1974సంవత్సరం నాటికిప్లాస్టిక్‌ తలసరి విని యోగం 2కేజీలు ఉండగా 2023నాటికి 43 కేజీ లకు చేరుకున్నది.ఈవినియోగం నానాటికీ ఆందోళన కరంగా పెరుగుతున్నది.2060నాటికి ప్లాస్టిక్‌ తల సరి వినియోగం123కేజీలకు చేరనున్నట్లు అంచనా. ఇంత ప్రమాదకరంగా పరిణమించి గాలి, నీరు, నేల,మానవ ఆరోగ్యాలను కబళిస్తున్న ప్లాస్టిక్‌ విని యోగాన్ని ప్రభుత్వాల స్ధాయిలోనే కాకుండా ప్రజ లందరూ వ్యక్తిగత స్ధాయిలో దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకుని సరైన దృక్పథంతో స్పందించకపోతే రానున్న తరాలకు మనం మిగిల్చేది క్యాన్సర్లు, ఆస్తమా,గుండెపోటువంటి అనారోగ్యమూ, కలుషిత మైన నేల,నీరు,గాలి మాత్రమే. రామేశ్వరం పోయి నా శనీశ్వరం వదలదన్న సామెతలాగా మన దృక్ప థం మార్చుకోకపోతే భూమిని వదిలి చంద్ర మం డలం పోయినా మనకు తిప్పలు తప్పవు.
వ్యక్తిగతంగా మనమేం చేయవచ్చు?
టీ,కాఫీ తాగడానికి ప్లాస్టిక్‌ కప్పులు కాకుండా మట్టి,సిరామిక్‌, స్టీల్‌ కప్పులు వాడాలి. కూరగాయలు,పండ్లు, కిరాణా సరుకులు తెచ్చుకునే ప్రతిసారీ క్లాత్‌ బ్యాగును తీసుకు వెళ్లాలి.చికన్‌, మటన్‌, పాలు వంటి పదార్ధాలు కొనుక్కురావడానికి స్టీల్‌ క్యాన్‌,బాక్స్‌ వాడాలి.బయటకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ,ప్రయాణాలలోనూ మంచినీళ్ల కోసం స్టీల్‌ బాటిల్‌ తీసుకువెళ్లాలి.బర్త్‌ డేలు,శారీ ఫంక్షన్లు,వివాహాలు,గృహప్రవేశాలు వంటి పలు సందర్భాలలో స్టీల్‌ గ్లాసులు మాత్రమే వాడాలి. ఫంక్షన్లలో ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌లు ప్లాస్టిక్‌వి కాకుండా పర్యావరణానికి మేలు చేసే…మొక్కలు,క్లాత్‌, జ్యూట్‌ బ్యాగులు వంటివి ఇవ్వాలి. ఇప్పటికే అనేక దేశా లలో ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించడం జరిగింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్లాస్టిక్‌ వినియో గంపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. అధికా రికంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 120 మైక్రాన్ల సైజు కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను మరియు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించారు.
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగు రహిత దినం సందర్భంగా…పర్యావరణ ప్రేమి కులు, ప్రజారోగ్య ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు ప్లాస్టిక్‌ మహమ్మారిపై పోరును ఒక అత్య వసర ఉద్యమంగా చేపట్టాలి.పర్యావరణం, ప్రజా రోగ్య పరిరక్షణ కోసం,భావితరాలకు సురక్షిత మైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్కరించాలి.క్లాత్‌ బ్యాగుల వాడ కాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజ లూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని పరిష్కరించడానికి పర్యాటకాన్ని పునర్నిర్మించడం
కోవిడ్‌-19 మహమ్మారికి ప్రతిస్పందన గా 2020లో పెరిగిన వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పతి,వినియోగం బీచ్‌లు,ఇతర ప్రాంతాలలో ప్లాస్టిక్‌ కాలుష్యానికి గణనీయంగా దోహదపడిరదని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్లాస్టిక్‌ కాలు ష్యం పెరగడానికి దారితీసే కోవిడ్‌-19మహ మ్మారి మాత్రమేకాదు.కొత్త ఐక్యరాజ్యసమితి పర్యావ రణ కార్యక్రమం (ఖచీజుూ) నివేదిక,కాలుష్యం నుండి పరిష్కారం వరకు: సముద్రపు చెత్త మరియు ప్లాస్టిక్‌ కాలుష్యం యొక్క ప్రపంచ అంచనా, మహ మ్మారి కంటే ముందు కూడా ప్లాస్టిక్‌ కాలుష్యం సంవత్సరానికి పెరుగుతోందని చూపిస్తుంది. సము ద్రంలో ప్రస్తుతం75-199మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి మరియు 2016లో 9-14 టన్నుల వ్యర్థాలు జల జీవావరణ వ్యవస్థలోకి ప్రవేశించాయి. కానీ2040 నాటికి, ఇది దాదాపు మూడు రెట్లు పెరిగి సంవత్సరానికి 23-37 మిలి యన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా. సముద్రపు చెత్తలో ప్లాస్టిక్‌లు అతిపెద్దవి, అత్యంత హానికరమైనవి మరియు అత్యంత నిరంతరాయంగా ఉంటాయి, మొత్తం సముద్ర వ్యర్థాల్లో కనీసం 85 శాతం వాటా కలిగి ఉంది. ప్లాస్టిక్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు మానవ మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రయాణి కులు, ప్రభుత్వం ,సంస్థాగత విధానాలకు మార్పులు అవసరం.
ప్రయాణీకుల ఎంపికలు
సింగిల్‌-యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విని యోగాన్ని తగ్గించడం మరియు కోవిడ్‌-19 ఇతర వ్యాధుల నుండి రక్షించడానికి ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్య చర్యలకు కట్టుబడి ఉండటం పరస్పర విరుద్ధం కాదని నిపుణులు అంటున్నారు. ‘‘మహ మ్మారి సమయంలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ కంటే స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ తక్కువ సురక్షి తమైనవి వంటి పునర్వినియోగ ఉత్పత్తులపై మేము అపోహను చూశాము’’అని యూనిస్కో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ హెలెనా రేడిఅసిస్‌ చెప్పారు. ‘‘ఈ తప్పుడు అవగాహన వినియోగదారులచే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచింది మరియు ప్రభుత్వ మరియు టూరిజం ఆపరేటర్ల నిబంధన లను ప్రభావితం చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు మరియు ప్యాకేజింగ్‌ స్వతహాగా శానిటై జేషన్‌ చర్యలు కాదు. వైరస్‌ వీటిపై జీవించగలదు వాటి రవాణా లేదా నిర్వహణ సమయంలో అవి కలుషితమవుతాయి. సెలవుదినం ప్రయాణీకులు ఖర్చులను ఆదా చేస్తూ వారు ఉత్పత్తి చేసే వ్యర్థాల మొత్తాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చని రే డి అసిస్‌ చెప్పారు. సొంతంగా బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు,టాయిలెట్లను తీసుకురావడం వల్ల స్థానిక వ్యర్థాలు మరియు రీసైక్లింగ్‌ మౌలిక సదుపాయా లపై భారం తగ్గుతుంది.ఇది సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై స్థానిక ఆర్థిక వ్యవస్థల ఆధారప డటా న్ని కూడా క్రమంగా తగ్గిస్తుంది.కోవిడ్‌ యొక్క క్లీన్‌ సీస్‌ ప్లాట్‌ఫారమ్‌ -సముద్ర ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి అంకితమైన అతిపెద్ద ప్రపంచ కూటమి-‘‘మీ బాత్రూంలో ఏముంది?’’అనే పేరుతో ఒక ఇంటరాక్టివ్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. సాధారణ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ వ్యాప్తిని హైలైట్‌ చేస్తుంది. ఈఉత్పత్తులు చాలా వరకు పర్యాటక వసతి గృహాలలో అందుబాటులో ఉన్నందున,ఆచరణీయ ప్రత్యామ్నాయాలకు మార డం ప్లాస్టిక్‌ ముప్పును తగ్గించడంలో సహాయపడు తుంది.
ప్రభుత్వ చట్టం
బీచ్‌లు,సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయా ణికులు వసతి గృహాలు పునర్వినియోగ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అన్‌స్ప్లాష్‌/ జాన్‌ కామెరాన్‌ ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రేరణ కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి, తగ్గించడానికి లేదా దశలవారీగా తొలగించడానికి బలమైన చట్టం ప్రభావవంతమైన మార్గంగా చూపబడిరది. నిషేధాలు స్థానిక పర్యా టక రంగాన్ని ఆవిష్కరించడానికి, సందర్శకు లకు పర్యావరణ అనుకూల ఎంపికలను అందించ డానికి మరియు వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ప్రేరేపించగలవు. కెన్యాలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లపై నిషేధం దాని ‘‘ప్లాస్టిక్‌ కాలుష్య విపత్తు’’ను పరిష్కరించింది, కెన్యా యొక్క పర్యాటక మరియు వన్యప్రాణుల మంత్రిత్వశాఖ క్యాబినెట్‌ సెక్రటరీ నజీబ్‌ బలాలా తెలిపారు. ‘‘నిషేధం తగ్గిన ప్లాస్టిక్‌ కాలుష్యంతో కెన్యా బీచ్‌లు మరియు జాతీయ పార్కుల స్థితిని మెరుగుపరిచింది’’అని బలాలా చెప్పారు.‘‘ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి ఎందుకంటే మనం మన దేశాన్ని శుభ్రం చేసినప్ప టికీ,ఎత్తైన సముద్రాలలోని ఓడల నుండి విసిరి వేయబడే ప్లాస్టిక్‌లు మన బీచ్‌లకు తుడిచివేయ బడతాయి. అందువల్ల, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించి,చివరకు పూర్తిగా రద్దు చేయా లని ప్రజలకు ప్రపంచవ్యాప్త విజ్ఞప్తిని చేయాలను కుంటున్నాను.
సంస్థాగత ప్రోత్సాహకాలు
టూరిజం ఆపరేటర్లు, వ్యాపారాలు సంస్థలు కూడా పరిశ్రమ ప్లాస్టిక్‌పై ఆధారపడ కుండా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికి చొరవ తీసుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంలో ముందుంటే వాణిజ్య ప్రయోజ నాలను పొందవచ్చు. తక్కువ చెత్త, ఉదాహరణకు, మరింత సుందరమైన వీక్షణలు మరియు ఎక్కువ మంది సందర్శకులకు దారి తీస్తుంది. కోవిడ్‌ నేతృ త్వంలోని గ్లోబల్‌ టూరిజం ప్లాస్టిక్స్‌ ఇనిషియే టివ్‌ (జీటీపీఐ),జాతీయ,స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేట్‌ కంపెనీలు మరియు పర్యాటక రంగంలోని సహాయ క సంస్థలు ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి 2025 నాటికి సర్క్యులారిటీకి మారడానికి కట్టుబడి ఉం డాలి.ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫారమ్‌ దీశీశీసఱఅస్త్ర. షశీఎ ప్లాస్టిక్‌ల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొం దించడానికి కట్టుబడి ఉన్న జీటీపీఐకి సంతకం చేసిన 100మందికి పైగా ఒకటి.ఈ నిబద్ధతలో ఆరోగ్య ప్రోటోకాల్‌లను కొనసాగిస్తూ సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌లను తొలగించే దశలుఉన్నాయి. ‘‘ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైనదని మేము అంగీకరిస్తున్నప్పటికీ, మా భాగస్వాములలో చాలా మందికి వారి ప్రాపర్టీలలో అధిక స్థాయి పరిశుభ్రత,పరిశుభ్రతను అందించే ప్రత్యామ్నాయ, ప్లాస్టిక్‌ రహిత మార్గాల గురించి తెలియదని మేము చూశా ము’’ అని సస్టైనబుల్‌ సప్లై,థామస్‌ లౌగ్లిన్‌ అన్నారు. బుకింగ్‌ డాట్‌.కామ్‌లో లీడ్‌ చేయండి. ‘‘అందుకే మేము జీటీపీఐ భాగస్వామ్యంతో రూపొం దించిన మా స్వంత మార్గదర్శకాలను ప్రచురించా ము. మాభాగస్వాములు విశ్వసనీయమైన, ఆచర ణాత్మక సమాచారం యొక్క విస్తృత శ్రేణికి ప్రాప్యత కలిగి ఉన్నారని మేము నిర్ధారించుకోవాలను కుంటు న్నాము,కాబట్టి వారు ఈ సవాళ్లను స్థిరమైన మార్గం లో ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలరు. ఖచీజుూ తూర్పు ఆఫ్రికాలో ఉన్న ఒక సర్క్యులర్‌ ఎకానమీ ఉద్యమం అయిన ఫ్లిప్‌ఫ్లోపి మరియు రూట్స్‌ అడ్వెం చర్‌తో భాగస్వామ్యమై, కెన్యాలోని లాము పర్యాటక ప్రదేశంలో సెట్‌ చేయబడిన ‘‘పీసెస్‌ ఆఫ్‌ అస్‌’’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను విడుదల చేసింది. పర్యాటక ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడే దిశగా స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చడంలో సందర్శకులు పోషిం చిన పాత్రను ఈ చిత్రం హైలైట్‌ చేస్తుంది. మహ మ్మారి-అమలు చేయబడిన మూసివేతలను అను సరించి,పర్యాటకులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు పర్యాటక పరిశ్రమను దాని హృదయంలో స్థిర త్వంతో పునర్నిర్మించడానికి ఒకప్రత్యేకమైన అవకా శాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు పరిశుభ్రమైన, మరింత స్థితిస్థాపకంగా మరింత ఆర్థికంగా లాభ దాయకమైన భవిష్యత్తును నిర్ధారించడానికి సమయం ఆసన్నమైంది.-(డా.కె.శివబాబు)

పరిశ్రమల్లో ప్రమాదాలు రక్షణ లేని జీవితాలు

పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం గల కార్మికులను తీసుకోకపోవడం అధిక ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించక పోవడంతో పాటు కొన్నిమార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు లేక నగరానికి చేరేలోపు మరణించిన ఘటనలు కోకొల్లలు. – గునపర్తి సైమన్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహా యింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపో కుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికులభద్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటినిఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాలశాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తు న్నాయి. పరిశ్రమకు విస్తృతార్ధం వుంది.ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రక్రియ మానవుని శ్రమపై ఆధారపడినట్లే,ఓపరిశ్రమ ఏర్పాటులో మానవుని త్యాగాలు ఎన్నో వున్నాయి.ఎంతోమంది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతారు.కొన్నేళ్ల నుంచి కలిసిమెలిసి బతికే మనుషులు నిర్వాసితులై చెల్లాచెదురవుతారు. వ్యవసాయాధారిత చేతివృత్తుల కుటుంబాల జీవనోపాధి దెబ్బ తింటోంది. ఎన్నో కుటుంబాలు,ఎంతో మంది జీవితాలు శిథిలమైతే తప్ప,నష్టాన్ని చవిచూస్తే తప్ప పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడవు. పారిశ్రామికోత్పత్తి ప్రక్రియ జరగడానికి ముందు,తరువాత మనిషి త్యాగం, శ్రమ వుందన్న విషయం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా విస్మరి స్తోంది.లాభం కోసం అమానవీయ అంశాలను ముందుకు తెచ్చి మానవీయ విలువలను, శ్రమను, మనిషి ప్రాణాలను అప్రధానమైనవిగా భావిస్తోంది.ఈ చులకన,హేయమైన భావనలో నుంచి మనిషిని మనిషిగా చూడ్డం, గౌరవిం చడం,ప్రేమించడం అనే నైతికత నశించి…తానెదగడానికి, లాభాలు పోగేసు కోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్న పరిస్థితులను తరచూ చూస్తు న్నాం.చట్టపరమైన ఉల్లంఘనలు,యాజమాన్య నిర్లక్ష్యమే పరిశ్ర మల్లో ప్రమా దాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోవడానికి,గాయాల పాలు కావడానికి దారితీస్తున్నదన్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి.పారిశ్రామికాభి వృద్ధి పేరుతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పరిశ్రమాధిపతులకు కల్పిస్తున్న వెసులుబాట్లు ప్రమాదాలు పెరగడానికి ఒక హేతువుగా మారాయి.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు,రాయితీలు ఇచ్చాయి.దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి,వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణవ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి.కార్మిక భద్రత,ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు.చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి. తమ లాభాలకు మూలం కార్మికుల శ్రమన్న వాస్తవాన్ని గ్రహించ నిరాకరిస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్లలో జరిగిన119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు చనిపోయారు.68మంది గాయపడ్డారు.గతేడాది 24కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20మంది మృతి చెందారు.18 మంది వికలాంగులయ్యారు.పరిశ్రమల్లో జరిగిన ప్రమా దాల తీవ్రతకు ఇవి అద్దం పడుతున్నాయి. ప్రమా దాలు జరిగినప్పుడు మృతిచెందిన కార్మిక కుటుం బాలకు పరిహారం చెల్లించే ఒక పద్ధతిని యాజమా న్యాలు అనుసరిస్తున్నాయి గానీ పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఖర్చు చేయడానికి ఇష్ట పడ్డంలేదు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలు విలువ ఇవ్వడంలేదు. విశాఖనగరంలో 2020 మే 7న ఎల్‌.జి పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది మరణిం చారు.దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ ఎల్‌.జి పాలిమర్స్‌ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషి యో ఇప్పించింది. ఎంత డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావు.ప్రాణాలు కోల్పోయిన కుటుం బాల బాధలు తీరవు. కుటుంబాలకు పెద్దదిక్కుగా వున్న వారు,విద్యార్థులు,ప్రమాదం నుంచి తప్పించు కోలేక ఊపిరాడక చనిపోయిన వృద్ధులు ఇలా వివిధ వయస్సుల వారు చనిపోయారు. ఈ మరణాలకు, అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలై ఆరో గ్యాలు కోల్పోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యల్లేవు. మనిషి తలకు విలువ కట్టే ఈ వ్యవస్థలో బహుశా ఇంతకంటే మెరుగైన, ప్రగతిదాయక ఆలోచనలు పరిశ్రమాధిపతుల బుర్రల్లో మొలకెత్తు తాయని ఆశించలేము. పరిశ్రమ అనగానే డబ్బులు పోగు చేసుకొనే యంత్రాంగంగా యాజమాన్యం భావించినంత కాలం మనిషి శ్రమకు, ప్రాణాలకు విలువ వుండదు. ప్రమాదాలు ఎల్‌.జి పాలిమర్స్‌, పరవాడ ఫార్మా కంపెనీల్లోనూ, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రం లోని రసాయన, మందుల పరిశ్రమల్లోనూ ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి.హెచ్‌పిసిఎల్‌లో జరిగిన ప్రమా దంలో 12 మంది, స్టీల్‌ప్లాంట్‌ లోని ఎస్‌ఎంఎస్‌2 లోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ప్రమాదం ఏ పరిశ్ర మలో ఎప్పుడు జరిగినా కార్మికులు చనిపోతూనే వున్నారు. ఈ చావులకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమేనని ప్రమాదనంతరం జరిగిన నివేదికల్లో బట్టబయలవుతున్నాయి.పరిశ్రమలో భద్రత, కార్మి కులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలో చూపుతున్న అలసత్వాన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. అయినా పరిశ్రమాధిపతుల వైఖరిలో మార్పు రావడంలేదు.భద్రతను పట్టించుకోవడంలేదు. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులపై నెపం నెట్టి తప్పించుకొనే ప్రయత్నాలు యాజమాన్యాలు చేస్తు న్నాయి.తన నిర్లక్ష్యంవల్ల జరిగిన ప్రమాదానికి కార్మి కులు చనిపోయారన్న అసలు విషయాన్ని దాచిపెట్టి, చనిపోయిన కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెల్లించడాన్ని గొప్ప ఉదారతగా యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటున్నాయి. నాణ్యమైన రియాక్టర్లు ఏర్పాటు చేయడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాద స్థలం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పని ప్రదేశంలో యాజమాన్యాలు కల్పించడంలేదు. పరిశ్రమలో ప్రమాదం ముందు గానే గుర్తించి హెచ్చరించే ఆధునిక అలారం వ్యవస్థ లేదు.ఫైర్‌ సిస్టమ్‌ సరిగాలేదు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదు. పరిశ్రమల్లో అంతర్గత ప్రమాదాలకు ఇవి కారణ మౌతుండగా,పర్యావరణ సమస్యలతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు సమీప ప్రాంత ప్రజలను సొంత మనుషుల్లా చూసు కుంటామని చెప్పిన యాజమాన్యాలు, హామీ ఇచ్చిన ప్రభుత్వాలు తరువాత ఆప్రజల బాధలు వినడంలేదు.పర వాడ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న తాడిని తరలి స్తామని ఎన్నికలహామీ ఇవ్వడం తప్ప తరలించి వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. కంపెనీల వల్ల కలుషితమైన భూగర్భ జలాలను తాగలేక… పరవాడ, లంకెలపాలెం నుంచి వాటర్‌ క్యాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి తాడి వాసులకు ఏర్పడిరది. రసాయన, ఔషధ పరిశ్రమ వున్న ప్రతీ చోటా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే పేరిట మానవ,పర్యావరణ విధ్వం సాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.తనకు కంపె నీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో కనీస వేతనాలు అమలు కావడంలేదు. వారి భద్రతను పట్టించు కోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బర్నింగ్‌వార్డు సహా అత్యవసర వైద్య సేవలు అందించేలా పారిశ్రా మిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిం చాలి.కార్మికుల ప్రాణాలు కాపాడే చర్యలు చేప ట్టాలి.గతేడాది అచ్యుతాపురం సెజ్‌ లోని బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువులు లీక యిన ఘటనలో వందలాది మంది మహిళా కార్మి కులు ఆస్పత్రుల పాలయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)…ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కార్మికునికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు రూ.10కోట్లు కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన తీర్పును యాజమాన్యం పట్టించు కోని పరిస్థితి వుంది. కోర్టు తీర్పులు అమలు చేయా ల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టుకొని యాజమాన్యం వద్ద నిలబడేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, సమీప ప్రజల ఆరోగ్య బాధ్యత యాజమాన్యాలు తీసుకొనేలా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరా డాలి.నిర్వాసిత కుటుంబ సభ్యుల విద్యార్హత ఆధా రంగా ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలి. భద్రత పాటించని కంపెనీల జాబితాను బహిర్గత పర్చాలి. నిర్దిష్ట కాలపరిమితిలో లోపాలను సరిచేయని కంపె నీల రిజస్ట్రేషన్‌ రద్దు చేయాలి.
ప్రమాదాల నివారణకు ఇలా..
ఇటీవల కాలంలో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్న నేపథ్యంలో.. వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక నుంచి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. పరిశ్ర మలు-భద్రతా ప్రమాణాలపై రాష్ట్రపర్యవేక్షణ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికా రులతో మంత్రులు పరిశ్రమల్లో భద్రతా ప్రమా ణాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా జరుగుతున్న ప్రమా దాలను పూర్తిగా కట్టడిచేయాలని మంత్రులు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందు కు మూడునెలల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని హెచ్చరికగా తీసుకోవా లన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగ కుండా కట్టుదిట్టంగా భద్రతా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.పరిశ్రమలు,కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖల అధికారులు సంయుక్తంగా ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని మంత్రులు సూచించారు. కలెక్టర్లు ఛైర్మన్‌గా ఏర్పడిన జిల్లా కమిటీలు స్వయంగా ఈ తనిఖీలు చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నట్లు వెల్లడిరచారు. రెడ్‌ కేటగిరీ పరిశ్రమలకు సమీపంలో జనావా సాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్నపరిశ్రమల చుట్టూ పట్టణీకరణ పెరిగితే.. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యా మ్నాయ మార్గాలను పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ లపై ప్రత్యేక నిఘా పెట్టి.. పరిశ్రమల చుట్టూపక్కల ప్రజలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. భవిష్యత్తుల్లో భద్రతా వైఫల్యాల కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడానికి వీలులేదన్నారు. సీఏం జగన్మోహన్‌ రెడ్డి ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని మంత్రులు తెలిపారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఎంత మంది మృతి చెందారు..?
దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ కు రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలిం పులతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో పరిశ్ర మల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్‌ లీకేజీ, పేలుళ్లు వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికులు మృతి చెందారు.ఈ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిపరిశ్రమల్లో ప్రమాదాలు జరిగా యంటే..?ఈ ఏడాది మే నుండి పరిశ్రమ లలో కనీసం 33 ప్రమాదాలు జరిగాయి.76మంది మృతి చెందారు.195 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మే 3 నుంచి జూలై 14మధ్య జరిగిన 33 ప్రమాద ఘటనల్లో ఛత్తీస్‌గఢ్‌ నుండి గరిష్టంగా ఏడు ఘట నలు జరిగాయి. గుజరాత్‌లో ఆరు, మహారాష్ట్రలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అన్ని ప్రమాదాలు జరిగిన సంద ర్భాల్లో పరిశ్రమల్లో కార్మికులు, పరిశ్రమలకు సమీప దూరంలో ఉన్న నివాసితులు విషపూరిత రసాయ నాలకు గురయ్యే కనీసం అవకాశం ఉంది.ఈప్రమాదాలవల్ల రాబో యే నెలలు లేదా సంవత్స రాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయనేది హెచ్చరిక సంకేతం.
చత్తీస్‌గఢ్‌ లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి.ఈ కాలంలో ఒకే పరిశ్రమలో అత్యధికంగా ప్రమాదాలు ఇక్కడే జరి గాయి.ఈ ప్రమాదాల్లోఒకవ్యక్తి మృతి చెందగా,మరో ఏడుగురు గాయపడ్డారు.మే,జూన్‌నెలల్లో తమిళ నాడులోని నెవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాలలో 20 మంది కార్మికులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లోగ్యాస్‌ లీక్‌ కావడం వల్ల కనీసం 11 మంది మృతి చెందగా,100 మంది గాయ పడ్డారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద ఘట నలలో ఒకటి నమోదైంది.దీని తరువాత కోవిడ్‌ -19సమయంలోనూ,తరువాత కర్మాగారాలు తిరిగి తెరవడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి వారంలోనే ఉత్పత్తిని పెంచ వద్దని,బదులుగా ట్రయల్‌ ప్రాతిపదికన అమలు చేయమని వారికి సలహా ఇస్తుంది. ఉత్పాదక విభా గాలలో గ్యాస్‌లీకేజీల కారణంగా ఐదుసంఘ టన లు జరిగాయి. ఇందులో 17మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 111మంది గాయపడ్డారు. బాయిలర్‌ పేలుడు జరిగిన మూడు సంఘటనలలో 22 మంది ప్రాణాలు కోల్పోగా,49మంది గాయ పడ్డారు.ఈ కాలంలో తయారీ యూనిట్లలో ఎని మిది అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 14 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మే నుండి లాక్‌ డౌన్‌ సమయంలో పరిమితులతో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. జూన్‌ నుండి ప్రభుత్వం‘అన్‌లాక్‌’ప్రక్రియను ప్రారంభ మైనప్పుడు నుంచి పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది.గత నెలలోప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇండస్ట్రియల్‌ గ్లోబల్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ వాల్టర్‌ సాంచెస్‌ ‘‘భయంకరమైన వాస్తవం ఏమిటంటే..ఈ తీవ్రమైన ప్రమాదాల జరగడానికి పరిశ్రమల వైఫల్య నమూనాను సూచిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలుసంభవించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘భద్రతా నియంత్రణలో ఈ రక మైన నిర్లక్ష్యం గమనించినప్పుడు. 1984 భోపాల్‌ విపత్తు స్థాయిలోపెద్ద విపత్తు సంభవించే అవకా శాన్ని తోసిపుచ్చలేము’’ అని సాంచెస్‌ రాశారు.

అడవే తిండి పెడుతోంది..

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది.
ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయ కుండానే అనేక రకాల ఆకుకూరలు,దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో,దుంపో దొరుకుతుంది.సంతల్లో 21 రకాల ఆకుకూరలు,పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు,చిన్న రొయ్యలు,కొక్కులు అమ్ము తుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్‌గఢ్‌),చింతూరు (ఆంధ్ర ప్రదేశ్‌), చర్ల(తెలంగాణ),మోటు (ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు,ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. ప్రకృతిని ప్రేమించాలి. దండ కారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్‌ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం…కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతు న్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్‌, డిస్‌ప్లేస్‌మెంట్‌, క్లైమేట్‌? ఛేంజ్‌, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే..వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్‌ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు.
ఇవి దొరుకుతున్నయ్‌
మిర్చిలో బొబాయి,బోరాయి,చిన్ని కోర్‌ మిడియా పెద్దకోర్‌ మిడియా,నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి.వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్‌జాట,బామ్‌జాట, కిసీర్‌ జాట-2,లుగ్గి జాటా తెల్ల వంకాయ, పెద్ద రాముల్క,చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్‌?మీట,నారదుంప,అడవి ఎలేరి దుంప, నాగేల్‌మాటి దుంప,నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్‌?, ఇత్తోడ్‌కుసీర్‌, కుక్కాళ్‌ కుసీర్‌,దోబకుసీర్‌, పండ్లలో తోలె,పరిగి,ఎర్క,వెలగ,పుసుగు.. సీజన్‌ బట్టి దొరుకుతాయి.
ఆహార భద్రతకు ముప్పు
ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ)-2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ‘ఉచిత రేషన్‌’ నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూ హంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడిరట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది ‘ఉచితం’ ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్ర యులు,వితంతు ఫించను పొందేవారు, ఏ ఆస రా లేని నిరుపేదలు, నిరుద్యోగులు,వయో వృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలోరూ.3), గోధు మలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికా హారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధార పడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితా లకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన ‘జీవించే హక్కు’ అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల ‘అమృతోత్సవ భారతావని’ గొప్పలు ఎంత ఘోరమైనవో.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తు న్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనే వుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చి లో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది.ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యా లతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.
ఆహార భద్రత అందరి బాధ్యత
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించి నట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35శాతం వరకు వృథా అవుతు న్నాయి. భారత్‌లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ఈ లోపంవల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది.భారత్‌లో 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకా హార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపో వడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండిరచే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవ సాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథావల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్‌ పద్ధతులు పాటించాలి. ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడిరది. తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంత మొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుం చింది.ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అను కూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది. ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధి కులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది. మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారత దేశంలోనే ఉంటారని హెచ్చరించింది. 2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌,నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది. 2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమ టిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్స రాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది. ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడిరది. ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదిం చిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి,దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడిరది. తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడిరది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడిరది. అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికా హారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడిరది.
2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని వేసింది.ఆ వ్యా జ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకా లను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి.2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం.ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనం తరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడిరది. ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ,6-14 సంవ త్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు. -జి ఏ సునీల్ కుమార్ 

ప్రకృతి రణం

సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రకృతి మనిషిని అల్లకల్లోలం చేస్తోంది. నిజానికి భూమ్మీద ప్రతిజీవి ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతుంది. మూడు కాలాలు, ఆరు రుతువులు టైం టు టైం ఉంటేనే ?జీవన చక్రం కరెక్ట్‌గా ఉంటుంది. అలాకాకుండా ఎండా కాలంలో వానలు,చలికాలంలో ఎండలు కాస్తే! వాతావరణంలో వచ్చే మార్పులకు మనిషితో సహా భూమ్మీద ఉన్న ఏప్రాణీ తట్టు కోలేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అంతటి విపత్తుల వెనక బోలెడన్ని కారణాలు?ఉండొచ్చు. వాటన్నింటికి ముఖ్య కారణం మాత్రం మనిషే. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి లైఫ్‌స్టైల్‌లో మార్పులు తెస్తోంది. దాంతో వాతావరణంలో విషవా యువులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం ప్రకృతి మీద తీవ్రంగా ఉంటోంది. కొంత కాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. అకాల వర్షాలు, వరదలు,భూకంపాలు,కరువు..ఇవి సహజంగా వచ్చే మార్పులు కావు. అసహజం గా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రకృతి ప్రకోపానికి బలవ్వాల్సిందే.
ఇది మింగుడుపడని విషయమే.అయితే ఇప్పటికైనా ఒంటిమీదకు కాస్త తెలివి తెచ్చుకుని నడుచుకోకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టం. అంతెందుకు మనల్ని మనమే రక్షించుకోలేం. జీవనానికి సరిపడా వనరులు ఉంటే చాలు. కానీ, అవసరమైనదానికంటే ఎక్కువైతేనే విపరీత పరిణామాలు ఎదురవు తుంటాయి. ఇక్కడా అదే జరిగింది. నిజానికి వానలు లేకపోతే తాగు, సాగు నీరు ఉండదు. కానీ, ప్రకృతి లైఫ్‌?సైకిల్‌?లో మార్పులు వచ్చి ఏకధాటిగా వానలు కురిస్తే మాత్రం ఇలాంటి నష్టాలే జరుగుతాయి. వానల్ని కంట్రోల్‌? చేయడం సాధ్యం కాదు కదా? మన చేతుల్లో ఏముంది? అనొచ్చు. కానీ, వాతావరణంలో వచ్చే మార్పులకు పరోక్షంగా మనమే కారకులవుతున్నాం అన్నది అక్షర సత్యం. అసలు వాతావరణ మార్పులకు కారణాలేంటి? వాటి వల్ల ఏం జరుగుతుంది?
వాయు కాలుష్యం..
శిలాజ ఇంధనాల(ఫాజిల్‌ ఫ్యూయల్స్‌)ను కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల భూగ్రహం వేడెక్కింది. దాంతో గ్లేసియర్స్‌ ఐస్‌?క్రీంలా కరిగిపోతున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి నల్లని మసి, రేణువులను విడుదల చేస్తాయి. ఆ రేణువులు గాలి ద్వారా పైకి వెళ్లి మంచుపై పడతాయి. అక్కడ అవి మంచు కంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల మంచు వేగంగా వేడెక్కి కరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల గ్లేసియర్స్‌ను రక్షించొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఇటుక బట్టీలు, కలప నుండి వచ్చే పదార్థం ఈప్రాంతంలో మూడిరట రెండు వంతుల బ్లాక్‌ కార్బన్‌ను కలిగి ఉం టుంది. రెండవ అతిపెద్ద కాలుష్య కారకాలు డీజిల్‌ వాహనాలు.ఇవి 7-18 మధ్య కాలు ష్యానికి కారణమవుతున్నాయి.
2021 రిపోర్ట్‌ చెప్పే నిజాలివి
2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమెట్‌ రిపోర్ట్‌ చెప్తోంది. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్స్‌ సాంద్రత రికార్డు స్థాయికి చేరుకుంది. దాంతో గత ఏడేండ్లుగా టెంపరేచర్‌ పెరుగు తోందని ఈ స్టడీలో తెలిసింది. అదే విధంగా గ్రీన్‌ల్యాండ్‌లో మంచుకు బదులు మొదటిసారి వాన కురిసింది. కెనడా, అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు చెలరేగాయి. వాటి వల్ల కొన్నిచోట్ల టెంపరేచర్‌ అమాంతం పెరిగింది. చైనాలోని ఒక ప్రాంతంలో నెలలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లో కురిసింది. యూరప్‌?లో వచ్చిన వరదల కారణంగా ప్రాణ,ఆర్థిక నష్టాలు చాలా జరిగాయి. దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు వచ్చింది.దాంతో నదుల్లో నీటిమట్టం తగ్గింది. అగ్రికల్చర్‌,ట్రాన్స్‌పోర్ట్‌, ఫ్యూ యల్‌ ప్రొడక్షన్స్‌ బాగా దెబ్బతిన్నాయి.1990లో శాటిలైట్‌ బేస్డ్‌ సిస్టంతో సముద్ర మట్టాన్ని కొల వడం మొదలైంది.1993 నుంచి 2002మధ్య సముద్ర మట్టాలు ఏడాదికి 2.1మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఈ లెక్క రెట్టింపయింది. ఏడాదికి 4.4 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. ముఖ్యంగా మంచు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.‘‘గత రెండు వేల ఏండ్లలో ఇలా పెరిగింది లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటిపోవచ్చు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 63కోట్ల జనాభా ఇండ్లు కోల్పోతారు. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో ఊహిం చలేం’’ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌
ముందే పసిగట్టారు
పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతంలో 70 లక్షల మంది ప్రజలు మరింత వరదల బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్‌ల అంచనా. కానీ, భూమి వేడెక్కకుండా చేయగల శక్తి మనలో లేదు. పాకిస్తాన్‌లో విడుదలయ్యే వాయువులు కేవలం1% వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ వంటి దేశాలు కూడా అందుకు తక్కువే కారణమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశాలే వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రమా దం అంచున ఉన్నట్లే అనిపిస్తోంది. వాతా వరణ మార్పులు వల్ల జీవరాశులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనుషులకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మొదటిది వేడి వాతావరణం.
వేడి పెరిగితే కష్టమే
ఓమాదిరి వేడి వరకు మాత్రమే శరీరం తట్టుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే తట్టుకోలేదు. వేడి తీవ్రత పెరిగిపోతే ఆ వేడికి కండరాలను బ్రేక్‌ చేసేంత శక్తి ఉంటుంది. అందుకనే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే ఆ వేడికి గుండె కండరాలు, కణాలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేడి ఎక్కువైతే ఒత్తిడికి కూడా లోనవుతారు. అప్పుడు గుండె.. రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. అదే టైంలో చెమట రూపంలో సోడియం, పొటాషియం శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడతాం అనే విషయం తెలిసిందే. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. అప్పటికే కిడ్నీల కండిషన్‌ సరిగా లేకపోతే వేడి తీవ్రతవల్ల ప్రాణం పోయే అవకాశంఉంది. ఈ విషయంలో వృద్ధులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. భూమి వేడెక్కేకొద్దీ, దోమలు వాటికి అనుకూలమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో చేరి…జికా వైరస్‌,డెంగీ,మలేరియా వంటి వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవేకాకుండా కలరా,టైఫాయిడ్‌,పారాసైట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
తిండి కూడా దొరకదు
వాతావరణంలో మార్పులవల్ల ఫుడ్‌ ప్రొడక్షన్‌ తగ్గుతుంది. సరఫరాపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఇంటర్‌ గవర్నమెంటల్‌ పానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) స్పెషల్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఉష్ణోగ్రతలు పెరగడంవల్లే పంటలు సరిగా పండడం లేదు. అంతేకా కుండా వాతావరణంలో ఉన్న కార్బన్‌%-డై -ఆక్సైడ్‌ పెరగడంవల్ల మొక్కల్లో ఉన్న జింక్‌, ఐరన్‌, ప్రొటీన్‌ వంటి న్యూట్రియెంట్లు నాశనం అవుతున్నాయి.పోషకాలు లేని ఫుడ్‌ ఎంత తిన్నా వేస్టే. పోషకాలు తగ్గితే అనారోగ్యాలు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అలాగైతే నీళ్లలో పెరిగే జలచరాల్ని తిందాంలే అనుకుంటున్నారా అదికూడా లాభంలేదు. ఎందుకంటే వేడి వాతావరణాన్ని తట్టుకోలేక అవి ధృవ ప్రాంతాలకు వలసపోతున్నాయి. దాంతో చేపలు, రొయ్యల వంటి వాటి నుంచి వచ్చే పోషకాలు కూడా మనిషికి అందకుండా పోతాయి.
ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ
అడవులు కాలిపోవడం, సునామీల వంటి ప్రకృతి విపత్తులు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల ఊహించని నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆగస్ట్‌లో అమెరికా యూరప్‌, సైబీరియా దేశాల్లో అడవులు కాలిపోయాయి. దాంతో గాలిలో కాలుష్యం పెరిగి పోయింది. ఆగాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, రక్తంలోకి కలుషితాలు చేరిపోతాయి. శరీరంలోని అవయ వాల మీద నేరుగా ప్రభావం చూపకపోయినా, ఇమ్యూనిటీ సిస్టమ్‌ మీద దాని తాలూకా ప్రభావం తప్పక పడుతుంది. దీనివల్ల ఏటా3.6 నుంచి 90లక్షల వరకు అకాల మరణాలు జరుగుతున్నాయని అంచనా. అంతేకాకుండా 65ఏండ్లు పైబడిన వాళ్లకు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
మానసికంగా కూడా…
ప్రకృతి విపత్తులవల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు విదేశాల్లో అడవులు తగలబడ టాన్నే తీసుకుందాం.అప్పుడు అక్కడ నివసించే వాళ్లలో కొందరు తమ ఇండ్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరైతే సొంతవాళ్లను కోల్పోయారు. మనదేశంలో వరదలు వచ్చిన ప్పుడు కూడా ఇదే పరిస్థితి.సునామీలవల్ల స్ట్రెస్‌,యాంగ్జైటీ పెరిగి పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌కి దారితీస్తుంది.దీన్నే ‘సొలా స్టాల్జియా’ అంటారు. ఈ జబ్బు పోను పోను సూసైడ్‌ చేసుకునే వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?
భౌగోళికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇన్ని అనర్థాలను ఎలా ఆపాలి? అందుకేం చేయాలని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చేసింది. అలాగే ప్రకృతికి మనం చేస్తున్న నష్టాల గురించి అవగాహన పెంచుకోవాలి కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవు. భూములు ఎండిపో తాయి. పంటలు పండవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటన్నింటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువు అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చెట్లు నరకడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. అలాగే వాహనాలు.. వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది. మనిషి తెలివితేటల్ని ఉపయోగించి లైఫ్‌?ని ఈజీ చేయాలన్న ఆలోచనతో ఏసీలు, ఫ్రిజ్‌?లు కనిపెట్టాడు. కానీ, వాటి నుంచి విడుదలయ్యే గాలి చాలా ప్రమాదకరం. నిజానికి వీటినుంచి వెలువడే విషగాలులవల్లే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిరది. కానీ, అవి లేకుండా బతకలేనంతగా ఆ వస్తువులకి అలవాటు పడిపోయాం.ఆ అలవాటుకు దూరమవ్వాలంటే….ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలి. ఇంటికి మంచి వెంటిలేషన్‌ ఉం డాలి. ఇంటినుంచి బయటకు అడుగుపెడితే టూవీలర్‌ లేదా కార్‌ ఎక్కకుండా.. ఎక్కువ దూరాలు జర్నీ చేయాలంటేనే వెహికల్స్‌ వాడాలి. వీలైనంత వరకు నడిచి వెళ్లాలి. నడిచి వెళ్లే దూరం కాదంటే సైకిల్‌ మీద వెళ్లడం మంచిది. ఇప్పటికే కొన్ని దేశాలు, మనదేశంలో కొన్ని రాష్ట్రాలు సైకిల్‌ వాడకాన్ని పెంచాయి. దీనివల్లగాలి కాలుష్యంతో పాటు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా తగ్గుతుంది.
సముద్రాలు పొంగితే అంతా నాశనమే
మధ్య ఆసియా పర్వత ప్రాంతాన్ని-‘హై-మౌం టైన్‌ ఆసియా’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాం తంలో హిమాలయన్‌, కారకోరం,హిందూ కుష్‌ పర్వతాలు ఉన్నాయి. చైనా నుండి అఫ్గానిస్తాన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. మధ్య ఆసియా పర్వత ప్రాంతంలో 55,000 గ్లేసియర్‌లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాల బయట మరెక్కడా లేని విధంగా ఎక్కువ మంచి నీటి నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కరిగే నీరు ఆసియాలోని10 అతిపెద్ద నదులకు ఆధారం. దీని బేసిన్లలో దాదాపు రెండొందల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2015 ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌? ప్రకారం75 కోట్ల ప్రజల జీవనోపాధికి గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు మాత్రమే నీటి వనరులు. చైనాలోని యాంగ్జీ నది ఖండంలోనే అతిపెద్దది-ఆగ్నేయాసి యాలోని మెకాంగ్‌ కూడా హిమాలయ జలాలపై ఆధారపడిరది. కానీ,వేడి ఉష్ణోగ్రతలు వాటిని ప్రమాదంలో పడేస్తాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం,హిమాలయాల్లో ఉష్ణో గ్రతలు ప్రపంచ సగటు కంటే రెండిరతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మంచు కరుగుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేయడంలో విఫలమైతే, మధ్య ఆసియాలోని పర్వతాల్లోని మంచు కరిగి, వందేండ్లు పూర్తయ్యేనాటికి మూడిరట రెండు వంతుల భాగం కనుమరుగైపోతుంది. జర్మన్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌ ప్రకారం-వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పది దేశాల్లో నేపాల్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. అయితే మొదటి ఇరవై దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ‘హిమానీనదాలు కచ్చితంగా కరిగిపోతాయి. ప్రస్తుతానికి సరిపడా మంచినీరు ఉంది. కానీ, ముందుముందు ఎంత నీరు ఉంటుందో తెలి యని పరిస్థితి. మన దగ్గర ప్రజలకు వ్యవసా యం ప్రధాన ఆదాయవనరు. మెరుగైన నీటి నిర్వహణ, నీటి శుద్ధిలో పెట్టుబడి పెట్టకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’ అని కోల్‌కతా, జెఐ ఎస్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ భట్టాచార్య హెచ్చరించారు.
చల్లటి దేశాల్లో వేడి!
చల్లటి వాతావరణం ఉండే అమెరికా, యూరప్‌లోని దేశాల వాతావరణంలో కూడా కొన్నేండ్లుగా మార్పులొచ్చాయి. ఇవి సంపన్న దేశాలు కావడంతో అక్కడ ఫ్యాక్టరీలతోపాటు వెహికల్స్‌, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ. దాంతో కార్బన్‌ ఎమిషన్స్‌ గాల్లో ఎక్కువగా కలుస్తాయి. దానివల్ల గాలిలో కాలుష్యం, టెంపరేచర్స్‌ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల వల్లే రెండుమూడేండ్లుగా అమెరికా,యూరప్‌ దేశాల్లో వేడి తీవ్రత ఎక్కువై అడవులు కార్చిచ్చులతో మండిపోతున్నాయి. అలాగే అక్కడి మంచు కూడా కరిగిపోతోంది.చలి కాలంలోనూ టెంపరేచర్స్‌ బాగా పెరిగి,ప్రజలు ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
మనదేశంలో..
తూర్పు పసిఫిక్‌ గాలులు బలంగా ఉంటే, అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వీచే గాలులు బలహీన పడతాయి. ఇలాంటప్పుడు నార్మల్‌గా కాకుండా ‘లా నినా’ లేదా ‘ఎల్‌ నినో’ కండిషన్స్‌ ఏర్పడతాయి. తూర్పు పసిఫిక్‌లో వేడి వాతావరణం ఉంటే, ఎల్‌ నినో కండిషన్‌,చల్లగా ఉన్నప్పుడు లా నినా కండిషన్‌ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వాల్యూ వస్తే ఎల్‌ నినో,తక్కువ వస్తే లా నినా వస్తుంది. ఇవి ఐదారేండ్లకు ఒకసారి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గాలి దిశలో మార్పులు వస్తాయి. పసిఫిక్‌? సముద్రం మీద వీచే గాలుల్లో తేడా వచ్చినప్పుడు అవి బలహీనంగా ఉండి, మన దేశాన్ని తాకకపోతే ఎల్‌? నినో కండిషన్‌ ఏర్పడి వర్షాలు తగ్గిపోతాయి. అన్ని ఎల్‌ నినో సంవత్సరాలు కరువు తీసుకురావు. కానీ.. నార్మల్‌ రోజుల కంటే తక్కువ ఉన్న సంవత్స రాలు కూడా ఉన్నాయి. అది ఎల్‌ నినో లక్షణం. చాలావరకు ఎల్‌? నినో ఇయర్స్‌ కరువు తీసుకొస్తాయి. అప్పుడు మన దేశంలో వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో వర్షాలు పడవు.లా నినా కండిషన్‌లో తీవ్రమైన గాలులు వీస్తాయి. దాంతో సముద్రం నుంచి తేమ ఎక్కువగా వాతావరణంలోకి రావడంతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అన్ని లా నినా కండిషన్స్‌?లో వరదలు వచ్చే సూచన ఉండదు. కానీ.. లా నినా కండిషన్‌లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు లోకల్‌గా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. ప్రస్తుతం లా నినా కండిషన్‌ మనదేశం మీద ఇంకా ఉంది.ఈపరిస్థితి ప్రపంచమంతటా ఇలాగే ఉంటుంది. యూరప్‌ వంటి దేశాల్లో వాతావరణం వేరేగా ఉంటుంది.కానీ..లా నినా కండిషన్‌ ఎక్కువ అవ్వడంవల్ల గ్లోబల్‌ సర్క్యులేషన్‌లో మార్పులు వచ్చాయి. దాంతో టెంపరేచర్స్‌ ఆపోజిట్‌గా పనిచేశాయి. మన రాష్ట్రం విషయానికొస్తే..రెండేండ్ల నుంచే లా నినా కండిషన్స్‌ వల్ల వర్షాలు ఎక్కువగా వస్తు న్నాయి. మిగతా టైంలో వర్షాకాలంబాగానే ఉంది.ఎంత వర్షపాతం ఉండాలో అంతే ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ప్రకృతి విపత్తులు అకస్మాత్తుగా వచ్చినవి కాదు. కొన్నేండ్ల నుంచి ఉన్నవే. మొదటి సారిగా1992లో జర్మనీలోని రియో డి జెనిరోలో ‘వరల్డ్‌ ఎర్త్‌ సమ్మిట్‌’ జరిగినప్పుడే దీన్ని డిక్లేర్‌ చేశారు. అది డిక్లేర్‌ చేసి,ఇప్పటికే 30 ఏండ్లు అయింది. అప్పటి నుంచి ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) రిపోర్ట్స్‌రావడం మొదలైంది. దీన్ని మొదలుపెట్టడానికి కారణం…ప్రాంతీయంగా పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం, డెవలప్‌మెంట్‌ చేస్తున్నామంటూ గుడ్డిగా వెళ్లడం, నేచర్‌ని నిర్లక్ష్యం చేయడం. వీటివల్లే ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనదగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది. స్థానికంగా వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్‌నే చూస్తే…ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. బిల్డింగ్‌లు, ఫ్యాక్టరీలు,వెహికల్స్‌ పెరిగిపోయాయి. కాలుష్యం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షం గుర్తుందా ఏ ప్రభావం వల్ల అలా జరిగిందనేది తెలుసుకోవాలి. కానీ, 20 ఏండ్లుగా దాని సంగతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు.ఆ తర్వాత 2005లో,2016లో ఇలాంటి విపత్తులే వచ్చాయి. గత ఐదేండ్ల నుంచి ఏటా వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారు. తర్వాత దాని ఊసే ఉండదు. దీనికి ముఖ్య కారణం వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(నీటి మౌలిక సదుపాయం) సరిగా లేకపోవడం. వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంటే.. మంచి నీటి సరఫరా ఎలా జరగాలి వాన నీళ్లు, మురికి నీళ్లు ఎలా వెళ్లాలి అనే వాటి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వరద, మురికి నీళ్లు రెండూ కలిసి ప్రవహిస్తున్నాయి. -జిఎన్‌వి సతీష్‌

1 2 3 4 5 48