ఆర్ధిక నిఘా దాడులు అమానుషం

నా చిన్నప్పుడు, అంటే గత 50సంవత్సరాల క్రితం పలురకాల సామాజిక సమస్యలపై ప్రజాఉద్యమాలు నడిచేవి.తాగు,సాగునీరు,ప్రజల జీవనోపాధి,ప్రజావసరాలు,మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు ధర్నాలు,ర్యాలీలు,నిరసనప్రదర్శనలు చేసేవారు. ఇలా సమాజంలో ప్రజాజీవన విధానాలపైనే సామాజిక పోరాటాలు సాగేవి.సరళీకరణ,మిశ్రమ ఆర్ధిక విధానాలు పుణ్యమా అని ప్రస్తుతం ఆ ఉద్యమాలు దారిమళ్ళాయి. దళిత,గిరిజనుల భూములు కోల్పోవడం,స్థానిక వనరులు దోపిడి,పర్యావరణసమతుల్యం దెబ్బతినడం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను నిత్యం ప్రచార మాధ్యమాలు ద్వారా తెలుస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ,గిరిజన తెగలు నివాసించే అటవీప్రాంతాల్లో పెద్దపెద్ద పరిశ్రమలు,ప్రాజెక్టులు స్థాపన కోసం స్థానిక గిరిజనుల భూములు, వనరులు దోపిడికి గురికావడం వంటి తీవ్రమైనఅంశాల ఉద్యమాలు జరుగుతున్నాయి.నూతనఆర్ధిక విధానాలు తర్వాత ప్రైవేటీకీకరణ పెత్తనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి ప్రజల సామాజిక ఉద్యమాలు కాస్త పక్కదారి పట్టాయి.ప్రపంచీకరణనేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టినప్రాజెక్టులు,పరిశ్రమలవల్ల నిర్వాసితులైనప్రజలు,దెబ్బతింటున్న పర్యావరణసమతుల్యతపై పోరాటాలు నడుస్తున్నాయి.మిగతా ప్రజామౌళికావసరాలపై చేపట్టే సామాజికఉద్యమాలు తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో1991వరకు సామ్యవాద తరహా అక్కడ అక్కడా పరిశ్రమలు నెలకొల్పారు. కానీ ప్రైవేటీకరణ పెరగడంవల్ల వనరులు,పర్యావరణ సమస్యలతో ప్రజల పడుతున్న వెతలు వర్ణీతీతంగా మారాయి.మిశ్రమఆర్ధిక విధానం,సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడంవల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంలో పడిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసేవేయడం వంటి విధానాలవల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులురోడ్డున పడుతున్నారు. దీనికి తోడుగా గత రెండేళ్ళక్రితం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌`19 ఆంక్షలు స్థానిక ప్రభుత్వాలకు జతకట్టాయి.దీని ఆసరాగా తీసుకొని స్థానిక వనరులు,పర్యావరణ సమతుల్యతలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. పెట్టుబడులు ఉపసంహరణవల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థల(స్టీల్‌ ప్లాంట్‌ వంటి కంపెనీలు) పనితీరు మెరుగైన లాభాల బాట పట్టినప్పటికీ,శ్రామికులకు ఏమాత్రం మేలు చేకూరలేదు.ఫలితంగా బాధితుల ఒత్తిడి మేరకు సామాజిక, పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది.
ఈనేపథ్యంలో ఈఅంశాలపై పోరాటంచేసే వారిపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం ప్రయోగిస్తోంది. వారి నిరసన గళాన్ని అణిచివేసేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. వారిపై ఆర్ధిక నేర ఆరోపణ నెపంతో ఆర్ధిక నిఘా విభాగాలను ప్రయోగిస్తూ సరికొత్త తరహాలో దాడులు ప్రారంభించాయి. ఇలా ఇప్పటి వరకు దేశంలో సుమారుగా 300 మంది సామాజిక,పర్యావరణవేత్తలు,స్వచ్చంధ సంస్థలపై సోదాలు పేరుతో దాడులు చేపట్టాయి. టెర్రరిస్టులు తరహాలో వారిపై దాడులు చేసి భయాంబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంలో సామాజిక,పర్యావరణ పరిరక్షణ,మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలైన 1700మందిని హత్యలకు గురి చేసినట్లు నివేదకలు చెబుతున్నాయి.
ఇదింతా బడాపారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త లను భయాందోళనలకు గురిచేసి అడ్డుతొలగించుకోవడానికి స్థానికప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పెద్ద కుట్రలోని ఒక భాగమేనని ప్రజలు,పర్యావరణ,సామాజిక వేత్తలు భావిస్తున్నారు.-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

మన్యం కాఫీ తోటల కథ..

చల్లటి సాయంత్రానా..వేడి వేడి కాఫీని తాగుతూ..ఓ మంచి పుస్తకాన్ని చదువు తుంటే… ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓకప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ..పొగలు కక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రాలోను పండుతుం దండోయ్‌?.అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు… కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మరి ఈ కాఫీ కథేంటో కాస్త చూద్దామా…
ఓ మంచి కాఫీ… తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ… కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి. నర్సీపట్నం కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ ప్రస్థానం…మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్‌ డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడిరది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) ,ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు … ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది. తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న… నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయ కంగా ఉండేది. దీని ద్వారా కోట్లరూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మహిళా ఉపాధి…ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు…దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలిరోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం… దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.
లాభ, నష్టాల బేరీజు…ఈ ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ తోటలు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. గతంలో స్థానిక గిరిజనుల సహాయంతో బెంగ ళూరు వంటి పట్టణాల్లో ఈ గింజల విక్రయాలు జరిపేవారు. ప్రస్తుతం ఆన్‌?లైన్‌? లో వేలం వేస్తున్నారు. ఈ పంట వల్ల ప్రతి ఏటా 18 కోట్లు ఆదాయం వచ్చేది. ఏజెన్సీలో వీటి సేకరణపై మావోయిస్టుల ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం…వంటి కారణాలతో ఈ వ్యాపారానికి నష్టాలు తప్పటం లేదు. గత ఏడాది శుద్ధిచేసిన 234 టన్నుల గింజలు మాత్రమే విక్రయించగలిగారు . దీంతో 4.5 కోట్ల ఆదాయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సీజన్‌ ప్రారంభం కావడంతో కాఫీ శుద్ధి పనులకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. ఈ సంవత్సరం మన్యంలో కాఫీ పంట విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఆదా యం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నాలుగేళ్లుగా కొత్త వ్యాపారం. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నీలగిరి వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.మునుపు విశాఖ డివిజన్‌ లో దీనిని చేపట్టేవారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఆ డివిజన్‌ మూసి వేసి నర్సీపట్నంలో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని కసింకోట మండలం , కన్నూరు పాలెం…వంటి ప్రాంతా ల్లో ఏపీఎఫ్‌?డీసీకి చెందిన నీలగిరి తోటలను టెండర్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. వీటి ద్వారా సుమారు 10కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ కు తోడు టన్ను ధర 8వేల నుంచి 4వేల దిగిపోవడంతో అమ్మకాలు ముందుకు సాగడం లేదు.
అరకు కాఫీ’కి వందేళ్లు..
భారతదేశంలో అరకు కాఫీ టాప్‌ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసు కుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది.
చెట్ల మధ్య తోటల పెంపకం…
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌) మాజీ ఎండీ రవి ప్రకాష్‌ గతంలో వివరించారు.‘‘1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతా ల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువ గా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10వేల ఎక రాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగిం చింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిర పడిరది’’ అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిం చారు.వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు,అనంతగిరి,జీకే వీధి, చింతపల్లి, పెదబయలు,ఆర్వీనగర్‌, మిను మలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా… ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరిం చాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే…
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యం లోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యా లయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. ‘‘సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ…పొడవాటి మిరియాలు,సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్యలో సాగవు తాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది’’ అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండిరచే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.బ్రెజిల్‌ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో…12 రాష్ట్రా లు కాఫీని పండిస్తుండగా…అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమి ళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరి చారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్ట మొదటి ‘అరకు కాఫీ’ షాప్‌ ఇది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌ నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్‌ లో ఏర్పాటు చేసింది. ఆతర్వాత అరకు కాఫీ రుచులు జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్‌ లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌-2018 పోటీలో (ూతీఱఞ జుజూఱషబతీవం) అరకు కాఫీ గోల్డ్‌ మోడల్‌ గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాం డులకి పేరుపొందిన బ్రెజిల్‌, సుమత్రా, కొలం బోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.-(కిల్లో సురేంద్ర)

జానపద దర్శనంలో గిరిజన సాహిత్య జాడలు

గిరులు అనబడే కొండకోనల్లో ఉండే గిరిజ నులకు,జనపదాలు అనబడే పల్లెల్లో నివ సించే జానపదలకు, అవినా భావ సంబం ధం ఉన్నట్టే , ఇరువురి సాహిత్యం కూడా ఒకప్పుడు మౌఖిక సాహిత్యమే..!!,భాషల్లో వచ్చినఅభివృద్ధి మార్పు లు దృష్ట్యా, ప్రస్తుతం రెండిటికీ లిఖిత సాహిత్యం వచ్చి అనేక పరిశోధనలు,గ్రంథాలు, వెలు వడ్డాయి.. వెలువడుతున్నాయి. తద్వారా అయా సాహిత్యాలలోని అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి అందులో భాగంగానే,రచయిత్రి ‘‘చామర్తి అరుణ’’ వ్రాసిన చక్కని పరిశోధక పూర్వ రచన ‘‘జానపద దర్శనం’’వ్యాస సంపుటి. ఇందులోని మొత్తం 24వ్యాసాల్లో అధిక శాతం, గిరిజన జాతులకు చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ఆసక్తికరంగా తెలియజేసే వ్యాసాలే,!!
అడవి బిడ్డల సంస్కృతి అంటేనే విభిన్నమైన,విశిష్టమైన, మేలికలయికల సంగమం,రచయిత్రి అరుణ కూడా చక్కని పరిశీలన,ఎంచక్కని సృజనా త్మకత,జోడిరచి వ్యాసాలకు నిండుదనం చేకూర్చారు. నల్లమల అడవులకే తల మానికంగా ఉంటూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యాలు గల చెంచు జాతి గిరిజనులకు సంబంధించిన విశేషాలతో పాటు బాల్యవివాహాలు నిషేధించుకున్న గిరిజన తెగ ఒరాన్లు, ఏకపత్నితత్వం గల భిల్లులు, నిజమైన మాతృస్వామ్య వ్యవస్థకు కారకులైన ఖాశీలు,వారు అభివృద్ధికి చేస్తున్న ఆరోగ్య పర్యాటకం,చాలా అరుదైన గిరిజన తెగైన బిరహరు,గురించి కూడా రచయిత్రి ‘‘అరుణ’’ పరిశీలించడం ఆమెలోని అత్యుత్తమ పరిశీలన పరిశోధన కృషికి నిదర్శనం. కేవలం సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షకులుగానే కాక, జాతిని జాగృతం చేసే పోరాట పటిమకు చిరునామా దారులుగా కూడా గిరిజనులను ఇందులో అభివర్ణించారు. ‘‘సంతాల్‌’’ గిరిజనుల గురించి ఇందులో వివరిస్తూ ఛోటానాగపూర్‌ వారి మాతృ స్థానంగా, స్థిరమైన గ్రామ జీవనం గల జాతిగా చెబుతారు,వారిలోని ఏకపత్ని త్వాన్ని కూడా అభివర్ణించారు,వారు 12 పద్ధతుల్లో తమ తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటారనే సంగతి కూడా చెబుతారు. గ్రామపెద్ద నాయకత్వంలో వారసత్వంగా వీరి రాజకీయ వ్యవస్థ, పాలన సాగుతుంది. ఒకనాటి సంచార జాతి అయిన సంతాల్‌లు నేడు వ్యవసాయం సాయంగా చేస్తున్న స్థిర నివాసపు అభివృద్ధి గురించి ఇందులో పేర్కొన్నారు. గిరిజన తెగల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్న ‘‘నిద్రాశాలల’’ వ్యవస్థ గురించి రచయిత్రి తాను చదివిన పరిశోధన గ్రంథాల సాయంగా భిన్న కోణాల్లో వివరించారు. సాధారణంగా నిద్రాశాలలు, కీడుపాకలు, వంటి వ్యవస్థను మూఢనమ్మకంలో భాగమని, అవి స్త్రీ వివక్షతకు చిరునామాలని, నేటి ఆధునిక తరం అభిప్రాయ పడుతూ,వాటి నిర్మూలనకు ఏకీభవిస్తుండగా, రచయిత్రి అరుణ మరో కోణం నుంచి వీటిని ‘‘సామాజిక, ఆర్థిక,విద్యా,రంగాల్లో తమ పాత్రను నిర్వహించే సారథులు’’ అని అభిప్రాయ పడి రుజువు చేశారు. అలాగే మంచుకొండల్లో మన ఆదివాసుల ఉనికి గురించి తెలిపే క్రమంలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ చే నామీకరణ చేయబడ్డ ‘‘భో టాంతిక్‌’’గిరిజనుల మనుగడ,వారి నివాస సంప్రదాయాల్లోని విశేషాలు, కులంకషంగా వివరించడంలో రచ యిత్రి స్థూల పరిశీలన శక్తి వెల్లడవుతుంది. గిరిజనులు అనగానే ‘‘శారీరక శ్రమ భాండా గారాలు’’గా గుర్తు పెట్టుకుంటాం, కానీ వారిలో కూడా చక్కటి సృజనాత్మకత శక్తి దాగి ఉండి,తద్వారా చేతివృత్తుల వల్ల అలంకార సామాగ్రి తయారు చేసి,ఉపాధి కూడా పొందుతున్నారు అనే అంశాన్ని విశ్లేషణ చేసిన వ్యాసం ‘‘గిరిజనుల అనుబంధ చేతివృత్తులు పరిశీలన’’ గిరిజనులు ఎంతటి మానసికపరమైన సృజనాత్మక శక్తి దాగివున్న వారు శారీరక శక్తికే అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని చెప్పి, తద్వారా గిరిజన కళలు ఎందుకు ప్రాచు ర్యం చెంద లేదో సహేతుకంగా చెప్తారు రచయిత్రి.దీని ద్వారా వివిధ ప్రాంతా లలో నివసించే ఆయా గిరిజన జాతుల వారు ఎలాంటి హస్తకళ వస్తువులు తయారు చేస్తారో సవివరంగా తెలుస్తుంది. సృజనాత్మతోపాటు వైద్య పరమైన విజ్ఞానంలో కూడా అడవిబిడ్డలు ఆరి తేరారు అన్న విషయం మనం మర్చి పోరాదు. సహజ సిద్ధంగా అడవుల్లో పెరిగే వనమూ లికలు,వాటి స్థావరాలు, నివారణ కార కాలు, పరిజ్ఞానంగల గిరిజనుల వివరాలు,పొందుపర్చడంతో పాటు,అభివృద్ధి చెందిన తెగల్లో ఒకటైన ఖాసీ తెగవారు నివసించే ‘‘ఖాసీ కొండలు’’ ప్రపంచ ఆరోగ్య పర్యాటక ప్రాంతంగా ఎలా ప్రాచుర్యం పొందాయో కూడా రచయిత్రి ఇందులో సవివ రంగా పొందుపరిచారు. ప్రతి వ్యాసంలో ప్రధాన వస్తు వివరణ చేస్తూనే అంతర్గతంగా ఆయా గిరిజన సామాజిక వర్గాల వారి సంస్కృతి, సాంప్రదాయాల వివరణ కూడా అందించడంలో వ్యాసాల కర్త ముందుచూపు, బాధ్యతలు, అర్థమవుతాయి. సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని గిరిజనుల ఆచారాలు కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి ముఖ్యంగా వారి కుటుంబ వ్యవస్థకు ప్రధాన భూమికైనా వివాహ వ్యవస్థలో గిరిజనులు పాటించే బహు భార్యత్వం, బహు భతృ త్వం, బైగమి (ఒకరే అక్క’చెల్లెలి ని వివాహం చేసుకోవడం) మొదలైన వివాహ పద్ధతులు, బహిర్గతంగా చూసే వారికి గిరిజనులకు, లైంగిక స్వేచ్ఛ ఉందనిపిస్తుంది, దీనిని కొందరు కుహనా మేధావులు‘‘లైంగిక కమ్యునిజం’’గా కూడా అభివర్ణిస్తారు.
కానీ గిరిజనుల ఆలోచనల్లో విశ్రుంఖలత కనిపించదు, కేవలం వారి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుల ఆమోదం మేరకే, ఆయా పద్ధతులు పాటిస్తారనే నగ్నసత్యం వ్యాసకర్త చామర్తి అరుణ నిర్మొహమాటంగ, వివరించారు. ఈ ‘‘జానపద దర్శనం’’లో గిరిజన ఆచార వ్యవహారాలకు చెందిన ప్రతి వ్యాసం ఎంతో విలువైన విజ్ఞాన సమాచారం సంతరించుకుని ఉంటుంది, ప్రామాణిక పత్రికల్లో ప్రచురించబడ్డ ఈ వ్యాసాలు ఏర్చి కూర్చోడంలో, వ్యాస శీర్షికల ఎంపికలో రచయిత్రి అపరిపక్వత పాఠకులకు కాస్త నిరుత్సాహం కలిగించిన, దాని మోతాదు అత్యల్పం, మొత్తానికి వ్యాసకర్త అరుణ పరిశోధనాత్మక అక్షర కృషి పుస్తకం నిండా ఆగుపిస్తుంది, గిరిజన సాహితీ పరిశోధక విద్యార్థులకు ఈ ‘‘జానపద దర్శనం’’ మంచి మార్గదర్శి అనడంలో అక్షర సత్యంనిండి ఉంది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఉపాధి హక్కుల లక్ష్యంగా మహిళా ఉద్యమం

పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.
ధరల మోతతో,ఇంటా బయటా సాగు తున్న హింసతో బతకడమే సవాలుగామారిన నేప థ్యంలో రాష్ట్ర మహిళల వేదనకు ప్రతిబింబంగా నెల్లూరులో రాష్ట్ర మహిళా వజ్రోత్సవ మహాసభలు జరిగాయి.ఐద్వా15వ రాష్ట్ర మహాసభలు జయ ప్రదంగా జరిగాయి. హింస నుండి,దోపిడి నుండి, భద్రతతో,గౌరవంగాజీవించే హక్కు అమలు,ఉపాధి లక్ష్యాలుగా మహాసభ పిలుపునిచ్చింది.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను,కష్టజీవులను అందులోనూ మహి ళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మద్యం మహ మ్మారి మను షులను రాక్షసులను చేస్తుంది. బిడ్డలు మృగాలుగా మారి తల్లిదండ్రులను చంపుతున్న ఘోరా లను చూస్తున్నాము. మహిళల నిస్సహాయ తను ఆసరా చేసుకుని అత్యాచారాలు పెరుగుతు న్నాయి.వ్యాపార లాభాపేక్షతో విశ్రాంతి లేని జీవితా లు.రిక్రియేషన్‌ పేరిట బూతు.పనిచేసేచోట ఉద్యో గినులపై,పాఠశాలల్లో విద్యార్థినులపై ఎందెందు వెదికినా వేధిం పులే! మరి మార్గం ఏమిటి? ఈ దుస్థితికి కారణం ప్రభుత్వవిధానాలే! వీటిని ప్రశ్నిం చాలి! ప్రతిపక్ష పాలక పార్టీలుకూడా మహిళలపై హింసను నివా రించటానికి, అరికట్టడానికి ఏం చేస్తాయో నిలదీ యాల్సిందే! ఇందుకోసం నవం బరు 25నుండి డిసెంబరు 10వరకు సాగే హింసా వ్యతిరేక పక్షోత్సవం ప్రచారంగా మాత్రమేగాక కర్ర సాము,కరాటేలాంటి ఆత్మరక్షణ శిబిరాల నిర్వ హణకు పూనుకోవాలి.ఉన్నఉద్యోగాలు పోవడం,పని దొరకక పోవడం, అన్ని ఖర్చులు పెరగడం…ఇంటి పనికి పరిమితమైన మహిళలనుకూడా వీధుల్లోకి తెచ్చిం ది.పనులు దొరక్క గంటల కూలీకి పచారీ షాపుల్లోనో మరోచోటో వెతుక్కుంటున్నారు. సుదూర ప్రాంతాలకు మాత్రమే కాదు,దేశ దేశాలకు ప్రయాణి స్తున్నారు. ఒళ్ళమ్ముకుని బతకాల్సిన స్థితిలో కూడా నెట్టుకొస్తున్నారు.పని దొరికితే బతకొచ్చు. పథకా లతో కాదు. పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినె క్కాయి. పనులు,ఉద్యోగాలుకాపాడబడాలంటే విద్య, వైద్యం,పరిశ్రమలు,రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి.
ఉద్యోగం,ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి.ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులుపెంచాలి.వారికి వేతనాలు పెంచడమే కాదు,100రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణప్రాంతాలలోకూడా ఉపాధి చట్టంరావాలి. సాంప్రదాయాల పేర సంకెళ్ళు! వర కట్నం, బాల్య వివాహాలు, ఆడపిల్లను గర్భంలోనే చిదిమి వేసే వారసత్వపు వాసనలు. ఋతుస్రావాన్ని అంటరా నిదిగాముట్టరానిదన్న ఆచారాలు, వితంతు దురా చారం లాంటి దుస్సాంప్రదాయాలను అంత మొం దించాలన్న స్ఫూర్తిని ప్రజలకు,యువతకు అందిం చేందుకు పూనుకోవాలి.నేడు యువత, మహి ళలు విద్య,వైద్యం,మత్తుమందులు,మౌలిక సదు పాయాలు లాంటి అనేక సమస్యలను ఎదుర్కొం టున్నారు. చదువులలో,ఆటపాటలలో సమస్త రంగాలలో పట్టుదలతో సమర్ధవంతంగా పని చేస్తున్న యువ తుల సంఖ్య బాగా పెరుగుతున్నది.కానీ అదే సమ యంలో పెట్టుబడిదారీ క్షీణ విలువల ప్రభా వంలో యువత శలభాల్లా మాడిపోతున్నది. వీటి నుండి రక్షించుకోవాలి. యువత శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి.వారిని సామాజిక,రాజకీయ ఉద్యమాలలో సమీకరిం చాలి. అందుకు సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతపరచాలి.సమానతకు ఆటం కంగా ఉన్న మనువాద భావజాలాన్ని అడుగడు గునా ఎదిరిం చాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్రను, సమానత్వం కోసం సాగిన త్యాగాలను రంగరించి శిక్షణా తరగ తులను ముమ్మరంగా నిర్వహించాలి.
ఇవన్నీ తీర్మానాలతో, సంకల్పాలతో మాత్రమే అమలు జరుగవు.ఈరోజు కనీసం మనిషి మాదిరి బతకాలంటే ఉపాధి ఉండాలి.ఇంటా బయ టా రక్షణ, భద్రతఉండాలి. ఇది మహిళా సంఘం లో ఉన్నవారు మాత్రమే సాధించ గలిగేది కాదు. అన్ని రంగాలలో పని చేస్తున్న మహిళ లందరూ ఏకం కావాలి. మనతోపాటు కష్టంలో ఉన్న రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు భుజం కలపాలి. యువత ముందు పీఠిన నిలవాలి.సంస్థలతో, వ్యక్తులతో ఐక్య వేదికలను ఏర్పాటు చేసు కోవాలి. వర్తమాన కాలంలో మహిళలు అన్ని రకాల పోరా టాలలో వేలసంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణ వేతనాలు, భద్రత కోసమేగాక ప్రభుత్వ విధానాల మార్పు కోసం ఉద్యమించాలి.అందుకు అందరం కలవాలి,కలుపుకోవాలి.అందుకు మహిళా సంఘం ఉత్ప్రేరకంగా మారాలి. వేలాది మంది పాల్గొనడ మేకాదు, అనుసరించే అనుయాయులుగా మాత్రమే కాదు,ఊయలలూపే చేతులు,ఇంటిని నిర్వహణ చేసే సమర్థత ఉన్నమహిళలు ఉద్యమా లలో ముం దుడి దానికి నాయకత్వంవహించే నైపు ణ్యాన్ని సముపార్జించుకోవాలి.అందుకోసం అధ్య యనం-ఆచరణను మహాసభలక్ష్యాలుగానిర్ణ యించుకున్నది.
పైలక్ష్యాల సాధనకు ప్రతి సందర్భాన్ని సాధనంగా మలచాలి. స్త్రీలశక్తి సామర్ధ్యాలకు చిహ్నంగా ప్రజలు జరుపుకునే దసరా సంబరాలు సంబరాలుగా మాత్రమే కాదు, సంకల్ప వేదికలుగా మారాలి.మార్చుకోవాలి. నవంబరు 14 బాలల పండుగ.బాలలకు బంగారు ప్రపంచాన్ని ఉత్సా హంగా,ఆనందంగా జీవించగలిగే సమాజాన్ని అందించేందుకు కార్యాచరణకు అడుగు వెయ్యాలి. ఇవి తక్షణ కర్తవ్యాలుగా అమలుకు పూనుకోవాలి. దిగ్విజయంగా, ఫలప్రదంగా జరిగిన ఈ మహా సభలు75సంవత్సరాల వజ్రోత్సవాల సభగా జరగ డం మరో ప్రత్యేకత. అన్ని జిల్లాల నుండి ప్రాతి నిధ్యంతో 55 మందితో రాష్ట్ర కమిటీని మహాసభలు ఎన్నుకున్నాయి. ఎన్నికైన రాష్ట్ర మహిళా సంఘం నూతన కమిటీ పైలక్ష్యాల సాధనలో నాయకత్వం వహించనున్నదివ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి – (డి.రమాదేవి)

కవి కోకిల గుర్రం జాషువా సాహిత్య విశ్లేషణ

‘‘వినుకొండన్‌ జనియించితిన్‌ సుకవితావేశంబు చిన్నప్పుడే నను పెండ్లాడె, మదీయ కావ్యములు నానారాష్ట్ర సత్కారముల్‌ గొని కూర్చెన్‌, సుయశస్సు, కల్గుదురు నాకున్‌ భక్తులై నేనెఱుంగనివా రాంధ్రధ రాతలాన బహు సంఖ్యల్‌, సాహితీ బాంధవుల్‌ ! ’’
‘నేను’ అనే కవితాఖండికలో జాషువాగారి జీవి తాంశాలు మొత్తం వారు ఒకే పద్యంలో ఎంతో అద్భుతంగా వివరించారు. కవితా విశారద, కవి కోకిల,కవిదిగ్గజ,నవయుగకవి చక్రవర్తి మధుర శ్రీనాథ,విశ్వకవి సామ్రాట్‌,కళాప్రపూర్ణ, పద్మ భూషణ్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత గుర్రం జాషువా 1895 సెప్టెంబరు`28 సంవత్సరం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. 1971జులై 24పరమ పదించిన జాషువా…. అణు వణువున మన కణనిర్మితమైన చాతుర్వర్ణ వ్యవస్థలో పశువు కన్నాహీనంగా, ఘోరాతిఘోరంగా, అడుగ డుగునా అవమానాలతో అవహేళనలతో, తినడానికి తిండిలేక,ఉండటానికి కొంప లేక ఊరికి దూరంగా, బ్రతుకు భారంగా దిష్టితీసి పారేసిన వస్తువుల్లా, అస్తవ్యస్త జీవుల్లా,చెల్లా చెదు రుగా, చిల్లర పైసల్లాపడి సనానతన సవర్ణ హిందూ సంప్రదాయ నిరంకుశ కర్కష రక్కసి విషపు కోరల నుండి తప్పించు కోలేక బిక్కు బిక్కు మంటూదిక్కులు చూస్తున్న అస్ప ృశ్య దళిత జాతి నుండి అశాజ్యోతిలా అరుదెంచిన సంస్కరణ యశోర వికిరణం గుర్రం జాషువా ఆయన సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…. – (డా॥ఆర్‌.కుసుమ కుమారి)
‘‘ కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు కృతిని జెందునాడు మృత్యుడు గాడు పెరుగు దొటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంత్రు.’’
పిరదౌసితోపాటు,షానామా కావ్యా న్ని అందుకున్న సుల్తాను కూడా నేటికి జీవిస్తూనే ఉన్నాడు.సమాజమే పాఠశాలగా,వివక్షతే ఉగ్గు పాలుగా ఆరగించి అంటరానితనం వెంటాడి నాఒంటరిగానే పోరాటంచేసి,అవమానాలుగా భావించి,ఛీత్కారాలనుశిరోభూషణాలుగా స్వీక రించి దళిత జాతికి ప్రతినిధిగా నిలిచి పూ జారి లేని వేళ తన సందేశాన్ని వినిపించ మని గబ్బి లాన్ని పంపిన ఆధునిక దళిత కవితా, వైతాళి కుడు,పంచమస్వరంలో గానమాలపించిన కవి కోకిల,ఖండకావ్య ప్రక్రియలో అగ్రగణ్యుడు,సీనపద్యరచనలు, మధు ర శ్రీనాథుడు,విమల మనస్కుడు వినుకొండ, మగధీరుడు గుర్రం జాషువా. వీరి రచనల్లో ఎన్నో సామాజికాంశాలు, మహిళా భ్యుదయ ధోరణులు, ప్రజాసమస్యలు,రుగ్మతలు, మూఢ నమ్మకాలు ఇలా ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉంటాయి.
‘ఫిరదౌసి’ కావ్యంలో ‘‘రాజు మరణించె నొక తార రాలిపోయే కవియు మరణించె నొక తార గగనమెక్కెరాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు’’ రాజాధిరాజుల కన్నా కవి గొప్పవాడని, శాస్వితుడని చెప్పడం కవికుల పక్షం వహిం చడమే జాషువా కవిత్వంలో ఇలాంటి విలక్షణాంశాలు కోకొల్లలు. తన పూర్వ కవులతో పోల్చినా సమకాలీన కవిత్వంతో తులనాత్మీకరించినా జాషువా కవిత్వానికి ప్రత్యేకస్థానం ఉంది.
‘‘ బంగారు నాణెముల్‌ బస్తాల కెత్తించి మదపుట్టెన్గుల మీద పదిల పఱిచి లేత పచ్చలు నేఱి గోతాలతో కుట్టించి లోట్టి పిట్టల మీద దిట్టపరచి…’’
గజనిమహ్మద్‌ మనదేశం మీద దండెత్తి వచ్చి ఏ విధంగా సంపదను దోచుకున్నాడో ఈ కవి త్వం తెలియజేస్తుంది, ఇంకోక చోట మత తత్వం గురించి ‘‘ పామునకు పాలు, చీమకు పంచదార మేపు కొనుచున్న కర్మభూమి జనించు ప్రాక్తంబైన ధర్మదేవతకు గూడి నులికిపడు జబ్బుగలదు వీడున్నచోట!’’ అంటాడు. జాషువా ఈపద్యంలో మూఢభక్తికి నిశితంగా విమర్శిస్తారు. విష సర్పాన్ని కండ చీమను దైవంగా భావించి కొలిచే వాళ్ళు ఎంత విచిత్రమైన వాళ్లు కదా అంటాడు. మనిషి స్వభావాన్ని గురించి చెప్తూ ‘ముసాఫిర్‌ కథ’లో ….. ‘‘మంచి వాడొక్క తెగకు దుర్మార్గుడగును దుష్టుడొక వర్గమున మహాశిష్టుడగును ఒక్కడౌనన్న కాదను నొక్కరుండు బుఱ్ఱ లన్నియు నొకమారు వెఱివగును’’! అంటే ఒక వర్గానికి మంచి వాడైనవాడు వేరొక వర్గానికి దుర్మార్గుడవుతాడు. ఒక వర్గంలోని దుష్టుడు మరొక వర్గానికి మిక్కిలి మంచి వాడవుతాడు.ఒకడు ఔనంటే మరొకడు కాదంటాడు. బుద్ధులన్నీ ఒక్కసారిగా పిచ్చివైపోతాయి. ‘‘హృదయములేని లోకము సుమీయిది మాపుల ( బశ్చిమంబుగా నుదయము తూర్పుగా నడుచుచుండు సనాతన దర్మధేవుల్‌ పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలా )( బెదవి గదల్ప ) జారలర రవింద భవ ప్రముఖమృతాంథసుల్‌ ’’
ధర్మానికి కీడు కల్గినపుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ధర్మసంస్థాపన చేస్తారని మన పురణాలు పలుకుతుంటే దళితులపట్ల జరిగే అధర్మానికి, అన్యాయానికి దేవతలెవరూ పెదవి విప్పలేదని మన పురణాలని ప్రశ్నిస్తున్నాడు కవి.
‘‘ స్త్రీ కంటెంబురుషుండు శ్రేష్ఠుడనుచున్‌ సిద్ధాంతముల్‌ చేసి తాకుల్‌ కంఠములెత్తి స్త్రీ జగతి కన్యాయంబు గావించెనో యేకాలంబున పుట్టినింటయిన లేవ నాటి స్వతంత్య్రముల్‌ వే స్త్రీకిన్‌ మారు సమాన గౌరవ విబూతిన్‌ గాంతకుం గూర్చుమా’’ ఈ పద్యంలో జాషువా మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ సమాన స్వేచ్ఛ కావలంటారు. యుగ యుగాలుగా అణచివేతకు గురౌతున్న స్త్రీ పై పురుష అహంకారం తగదని అటువంటి సిద్ధాం తాలు మంటగలిసిపోతాయని చెప్పారు.జాషువా గారి కవిత్వంలో వాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుభోధకంగా సందేశాన్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గరగాను ఆలోచించే విధంగాను కనిపిస్తాయి.‘గబ్బిలం’లో….. ‘‘వాని రెక్కల కష్టంబులేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు’’ అంటూ అస్పృశ్యతను సమాజానికి బహిర్గతం చేస్తారు జాషువా. అస్పృశ్యుడై పేదరికాన్ని అనుభవించిన జాషువా ఆకలి మంటలతో అల్లాడిపోతూ, బుక్కెడు బువ్వకోసం తాను అనుభవిస్తున్న సమస్త కష్టాలు మరిచిపోయే అల్పసంతోషి అంటాడు. మరోచోట ‘‘ధర్మమునకు బిరికితనం మెన్నడును లేదు సత్యవాక్యమునకు చావులేదు వెరపనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టినీవు ’’ జాషువా నిరసనలు తెలుసుకోవాలంటే ఒక ‘గబ్బిలం’ కావ్యంచాలు.ఈ కావ్యం ఎంతో హేతువాద ధోరణితో రాయబడిరది. అంటరాని తనాన్ని, సమాజంలో మొత్తం కుళ్ళుని ఎండ గట్టాడు,కర్మ సిద్ధాంతం పేరుతో పేదల నోరు కట్టేసి వారు అనుభవిస్తున్న స్వార్ధపరుల గురించి పరమేశ్వరుని దగ్గర నిరసన వ్యక్తం చేసే విధం గా గబ్బిలాన్ని ప్రోత్సహించాడు. ‘పశ్చాత్తాపము’ అనే ఖండ కావ్యంలో…. ‘‘ పడుచు బిల్లల ముసలికి ముడి బెట్టితి, పసుపు కుంకుములకు నెవ్వలిjైు గడియించిన నా పాపము వడుపున నిపుడా యనాథ పుత్యక్షమగున్‌’’ చిన్న పిల్లలను ముసలి వారికి ఇచ్చి పెళ్ళి చేస్తూ, భర్త చనిపోగానే ఆమె విధవరాలని దూషిస్తారు. ఆమె పసుపు కుంకుములకు దూరంగా వెలి వేయబడుతుంది. ఆమె అనాథగా మారుతుంది. ఈ మూఢత్వం నుండి సమాజం బయటకు రావాలని జాషువా కోరారు.‘ సూర్యోదయం’ అనే ఖండికలో…. ‘‘కాకి పిల్పుల గీతి కారవ మాలించి సమయంపు నిదుర మంచంబు డిగ్గి మల యాచలము మీది యలతి వాయువులచే నిఖిలి లోకంబును నిద్రలేపి’’ ఈ పద్యంలో కాకుల పాటలతో సమయం నిదుర మంచం నుండి దిగిందనీ,కొండలు మీద నుండి వచ్చే పిల్లగాలులు సమస్త లోకాన్ని నిద్ర లేపాయనీ నెలరాజు పడమటి కొండలపైకి నెట్ట బడ్డాడని ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణించాడు. జాషువా‘ లేఖిని’లో … ‘‘ సకల దేశ మహిత సౌభాగ్య సంపత్తి మనకు గిట్ట దనుచు మధ్య పరచి కులమతాలు దొడ్డ గుండాలు ద్రవ్వించు స్వార్ధ పరులు దాడి నరిగట్టి దేశంబు పరువు నిలుపు కొమ్ముబీ భరతపుత్ర! ’’
జాషువా కోరిన జాతి సమైక్యతలో జీవనరాగం కనిపిస్తుంది. ప్రపంచం సర్వ సుభిక్షం కావా లన్నది ఆయనమతం ఎల్లసోదరులు ఏకోదరులై నిరంతర ఆనంద జీవనం గడపాలన్నది ఆయన కోరిక. ‘చదువు’ ఖండికలో.. ‘‘గుళ్ళు గోపురాలు కోసరంబై నీవు ధారవో యుచున్న ధనము జూచి కటికి పేదవాని కడుపులో నర్తించు కత్తులెన్నో లెక్క గట్టగలవె!’’
డబ్బున్నవారు గుడికి,గోపురాలకు పెట్టే ఖర్చులో కొంతైనా కడుపులో ఆకలితో బాధపడుతున్న వారిని గూర్చి ఆలోచన చేయవలసిందిగా సూచిస్తున్న ఈ పద్యం చిరస్మరణీయం. ఈవిధం గా జాషువాగారి కవిత్వంలోవాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుబోధకంగా సందేశా న్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గర గాను, ఆలోచించే విధంగాను కనిపిస్తాయి. జాషువా కొన్ని సందర్భాల్లో నాస్తికుడుగా కొన్ని సందర్భాల్లో ఆస్తికుడుగా కనిపిస్తాడు. అన్నింటికీ మించి జాషువా మానవ తావాదిగా కన్పిస్తాడు. ఆయన రచనల్లో ఎక్కువగా సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, నిరసన,ఆవేదన కనిపి స్తాయి. తెలుగు సాహిత్య లోకంలో జాషువా వంటి కవి మరొ కరు లేరు.దీనికి కారణం ఆయన హేతువాద రచనలే నిదర్శనం,కాబట్టే ప్రస్తుత సమాజంలో ఇటువంటి ఎందరో కవులకు జాషువా ఆదర్శమయ్యాడు.-వ్యాసకర్త : తెలుగు విభాగాధిపతి,
డా॥వి.యస్‌.కృష్ణా ప్రభుత్వ డిగ్రీÊ పి.జి.
కళాశాల(ఎ),విశాఖపట్నం.
సెల్‌ : 9963625639.

మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాల సాగు

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగామిరియాల సాగు, విస్తీర్ణం,వినియోగం,ఎగుమతుల్లో భారతదేశం మొదటిస్థానంలోఉంది.సంప్రదాయ సాగు ప్రాం తాలైన కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తి అధికంగా ఉంది. సంప్రదాయేతర ప్రాంతం అయినా అల్లూరిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు,నేల,శీతలవాతావరణం వం టివి అనుకూలంగా ఉన్నాయి.ఈపరిస్థితుల్లో చింత పల్లి,గూడెంకొత్తవీధి,పాడేరు,అరకు,అనంతగిరి వంటిప్రాంతాల్లోకాఫీలోఅంతరపంటగా మిరి యాల సాగు జరుగుతోంది.ప్రస్తుతంమన్యం వ్యాప్తం గా1.56లక్షలఎకరాల్లో కాఫీసాగు జరుగు తుండ గా అందులో అంతరపంటగా మిరియాలు50 వేల ఎకరాల్లో వేస్తున్నారు.ఏటా 3,300 మెట్రిక్‌ టన్నుల మిరియాల ఉత్పత్తిజరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటాఉద్యాన నర్సీరీల ద్వారా 9లక్షల మిరియాల మొక్కలను సిద్ధం చేసి గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.లి కేజీ కాఫీ గింజల ధర మార్కెట్‌లో రూ.100వరకూఉంటే అదే కేజీ మిరియాల ధర రూ.500 వరకూ ఉంది. ప్రధాన పంట అయిన కాఫీ కంటే నాలుగైదు రెట్లు ధరలు పలుకుతుండటంతో రైతులూ క్రమేణా మిరియాల సాగుపట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో కాఫీతోటల ద్వారా150కేజీల కాఫీని ఉత్పత్తి చేస్తు న్నారు. అదే తోటల్లో అంతరపంటగా వేసిన మిరి యాలవల్ల వంద కేజీల దిగుబడి వస్తోంది. అంటే సగటున ఎకరాకు ఒక్కో రైతుకు కాఫీ వల్ల ఏడాదికి రూ.15,000,మిరియాలవల్ల రూ.50వేల వరకూ ఆదాయం వస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంట లుగామిరియాలతోపాటుకమలా,నేరేడు,సీతా ఫలం,జాఫ్రా,అనాసపనస వంటివి పండిస్తు న్నారు. ఇవి కాఫీతోటలకు ఇటు నీడనిస్తూనే రైతులకు ఉద్యానఫలాలను అందిస్తున్నాయి.ప్రభుత్వ ప్రోత్సా హం..మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్లకాలవ్యవధితో కూడిన భారీ ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గిరిజన ఉప ప్రణాళికద్వారారూ.526.160కోట్ల భారీ వ్య యంతోఈప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015-2016లో మొదలైన ఈప్రాజెక్టు కాలపరిమితి 2024-2025వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తు తంఉన్న1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగావచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. కాఫీతోపాటు అనుసంధానంగా అంతరపంట అయి న మిరియాలసాగునూ ప్రోత్సహిస్తున్నారు. ఇందు లో భాగంగా ఏడాదికి పదివేల ఎకరాల చొప్పున కాఫీ తోటలను విస్తరించుకుంటూ వెళుతున్నారు.
జాతీయ ఉద్యాన మిషన్‌ సహకారంతో..
కేరళలోని కాలికట్‌లో అఖిల భారత సుగంధ ద్రవ్య పరిశోధనా కేంద్రం ఉంది. చింత పల్లి కేంద్రంగా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్య పంట లపై పరిశోధనల నిమిత్తం ఉద్యాన పరిశోధనా స్థానం పనిచేస్తోంది. దీని పరిధిలో సుగంధ ద్రవ్య సమన్వయ పరిశోధనా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులోభాగంగా మిరియాల్లో కొన్ని మేలు రకా లను గుర్తించివాటిని అభివృద్ధిపర్చి రైతులకు అంది స్తున్నాం.మిరియాల్లో17రకాలు అల్లూరి సీతా రామ రాజు జిల్లాలోని మన్యానికి అనుకూలమని అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి వాటిని సిఫార్సు చేస్తున్నాం. పన్నియూర్‌-1, 2, 3, 5, 6, 7, 8, 9రకాలతోపాటుశ్రీకర,శుభకర,పంచమి,పౌర్ణమి, మలబారు ఎక్సెల్‌,శక్తి,గిరిముండా,ఐఐఎస్‌ఆర్‌ దీపమ్‌, ఐఐఎస్‌ఆర్‌ శక్తి వంటి రకాలను మేలైనవిగా గుర్తించాం.
అదాయవనరుగా సాగు
మిరియాలుపంట కొండవాలు ప్రాంతా లు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనా భివృద్ధిసంస్ధ గిరిజనరైతులను మిరియాల సాగువైపు మిరయాల సాగుకు పెట్టింది పేరు కేరళ..ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ మన్యంలో మిరియాలు పంట సాగవుతుంది. మన్యంలో పండుతున్న మిరియాలు కేరళ మిరి యాలకు ఏమాత్రం తీసిపోవటంలేదు. దిగుబడితో పాటు నాణ్యత విషయంలోను మన్యం మిరియాలు ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించాయి. ఎలాంటి క్రిమి సంహార మందులు వినియోగించకుండానే కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తు న్నారు. కాఫీ తోటలతో ఎకరానికి 25వేల నుండి 40వేల వరకు అదాయంసమకూరుతుండగా, దానిలో అంతరపంటగా వేస్తున్న మిరియాల పంట తో40వేల నుండి60వేల వరకు అదనంగా అదా యం సమకూరుతుంది.ఈ ఏడాది ఒక్క మిరి యాల పంట ద్వారానే 150కోట్ల రూపాయల అదాయంన్ని మన్యంలోని గిరిజనరైతులు ఆర్జించారు. మిరియాల సాగుకు మన్యం ప్రాంతంబాగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడి గిరిజన రైతులకు మంచి అవకా శంగా మారింది. పస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు ప్రోత్స హిస్తోంది. కాఫీతోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్ల వద్ద మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు 60 నుండి 70కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో మిరియాల ధర 500 నుండి 600 రూపాయలు పలుకుతుంది.ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు4వేల మెట్రిక్‌ టన్నుల మిరి యాల దిగుబడి వచ్చింది.3.2 కిలోల పచ్చి మిరి యాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరి యాలతో సమకూరింది. అనే మిరియాల రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోజికోడ్‌ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి వేర్వేరు రకాల మొక్కలను తెచ్చి చింతపల్లి నర్సరీల్లో అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.- గునపర్తి సైమన్‌

ఇక నుంచి దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్‌ ఎరువులు

వన్‌ నేషన్‌-వన్‌ ఫెర్టిలైజర్‌ విధానంలో భాగంగా అక్టోబర్‌ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్‌ ఎరువులను కేంద్రం సరఫరా చేయనున్నది. ఈ మేరకు వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్‌ సంచులకు ఆర్డర్‌ ఇవ్వొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్‌ 31 లోపు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం యూరియా,డీఏపీ, ఎం వోపీ,ఎన్‌పీకే తదితర ఎరువులను వేరువేరు కంపెనీలు వేరువేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. ఈనేపథ్యంలో వన్‌నేషన్‌-వన్‌ఫెర్టిలైజర్‌ విధా నంలో భాగంగా దేశం మొత్తం ‘ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఉర్వారక్‌ పరియోజన’ బ్రాండ్‌ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్‌పై మార్కెట్లో అందు బాటులో ఉంటాయి. ఇక ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపు రేఖలు మారుస్తున్నారు..
బ్రాండ్‌…భారత్‌ .. ఒకే దేశం.. ఒకటే ఎరువు..
ఒకే దేశం-ఒకటే ఎరువు నినాదంతో కేంద్రసర్కార్‌?రసాయన ఎరువులు అమ్మే ప్రైవేటు కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయబో తోంది.డీఏపీ,యూరియా వంటి ఎరువులను భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో విక్రయించాలని నిబంధన పెట్టింది. ఈపథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలోని కొన్నిప్రాంతాల్లో అమల్లోకి తీసు కొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రసాయన ఎరువుల అమ్మకాల్లో ప్రైవేటు కంపెనీల గుత్తాధి పత్యానికి అడ్డుకట్ట పడబోతోంది. కృత్రిమ కొరత సృష్టించే సంస్థల ఎత్తుగడలను అడ్డుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీనిని ప్రాథమికంగా ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ‘ఒక దేశం-ఒకటే ఎరువు’ నినాదంతో డీఏపీ, యూరియాలను ఒకే బ్రాండ్‌ పేరుతో అమ్మాలని కేంద్రం అన్ని కంపెనీలకు నిబంధన పెట్టనుంది. భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో ఈ రెండు ఎరువులను కంపెనీలు మార్కెట్‌లో రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమలు ఇలా..
కేంద్ర ఎరువుల శాఖ సూచనల ప్రకా రం ఇకపై అన్ని కంపెనీలు తయారుచేసే బస్తాలపై ఒకటే లోగో ఉంటుంది. పక్కన ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అని పథకం పేరు ఉంటుంది. దానికింద ‘భారత్‌ యూరియా’ అనే బ్రాండు పేరు,దాని తయారీ,మార్కెటింగ్‌ కంపెనీ పేరు ముద్రిస్తారు.మొత్తం 16 భారతీయ భాషల్లో‘భారత్‌ యూరియా’అనే పేరు ఉం టుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలూ బస్తా లపై ఉంటాయి. ఈ పథకం అమలుకు చేపట్టా ల్సిన చర్యలపైఈనెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఎరువులకంపెనీలు,రాష్ట్రవ్యవసాయ శాఖల అధి కారులతో ఆన్‌లైన్‌లో చర్చించాలని కేంద్ర ఎరు వుల శాఖ నిర్ణయించింది. అనంతరం ఎరువుల నియంత్రణచట్టంకింద నోటిఫికేషన్‌జారీ చేస్తారు. దీని అమలుకు కంపెనీలు,వ్యాపారులు,కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తారు. సోషల్‌ మీడియాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణ యించింది.ఇవీ ప్రయోజనాలు..కొత్త పథకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కంపెనీలు 31 ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తూ వివిధ బ్రాండ్ల పేర్లతో రైతులకు అమ్ముతున్నాయి. మరో 3 ప్రభుత్వ వాణిజ్య సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.15కంపెనీలు డీఏపీ,ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను తయారు చేస్తున్నాయి. దేశీయంగా 45 కిలోల యూరియా బస్తా ఉత్పత్తి వ్యయం రూ.1,350 కాగా రైతుకు రూ.266.50కి విక్రయిస్తున్నారు.మిగిలిన రూ. 1083.50 కేంద్రం రాయితీగా భరించి ఎరువుల కంపెనీలకు చెల్లిస్తోంది. విదేశాల నుంచి దిగు మతి చేసుకున్న యూరియా బస్తా రూ.2,433 కాగా అందులో రూ.2166.50 కేంద్రం రాయి తీగా భరిస్తోంది. ఏకంగా 90శాతం సొమ్మును కేంద్రం రాయితీ రూపంలో భరిస్తుంటే కంపెనీలు సొంత బ్రాండ్‌ పేరుతో అమ్ముకోవడం ఏంటన్నది కేంద్రం వాదన. పైగా యూరియాలో ఉండే రసా యనం నత్రజని ఒకటే అయితే తమ కంపెనీ యూరియా వాడితే అధికదిగుబడి వస్తుందని కొన్ని కంపెనీలు రైతులను పక్కదారిపట్టిస్తున్నాయి. దీనివల్ల ఆబ్రాండ్‌ మార్కెట్‌లో లేకపోతే యూరి యా కొరత ఉందని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ‘భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ’ అంటూ ఒకటే బ్రాండు పేరుతో అమ్మాలనేది ఈ పథకం లక్ష్యం. దీనివల్ల రూ.3వేల కోట్ల వరకూ రవాణా వ్యయం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది.
నూతన ఎరువుల విధానం ఎందుకోసం ?
కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 24న నూతన ఎరువుల విధానం ప్రకటించింది. ‘’ఒకే దేశం-ఒకే ఎరువు’’నినాదంతో2.10.2022 నుండి మార్కెట్‌లో భారత్‌ బ్రాండ్‌ ఒక్కటే ఉండాలని నిర్ణయించింది. దీనిని ‘ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఉర్వరక్‌ పరి యోజన’ పథకంగా ప్రకటిం చింది.ఈ పథకం ప్రకారం దేశంలోని ఏ ఎరువుల కంపెనీ అయినా భారత్‌ యూరియా,భారత్‌ డి.ఎ. పి,భారత్‌ యం.ఓ.పి భారత్‌ ఎన్‌.పి.కె పేర్లతో అమ్మాలి. ఎరువుల సంచులపై మూడిరట రెండు వంతుల భాగంలో ఎరువుల పేరుతో పాటు పథ కంపేరు ప్రముఖంగా ముద్రించాలి. కంపెనీ పేరు మిగిలిన వివరాలన్నీ మూడిరట ఒకవంతు భాగం లోనే ఉండాలి. 15.9.2022 నుండి కొత్త సంచు లు వినియోగించాలని, పాత సంచులు డిసెంబరు 31 అనంతరం వాడరాదని ఎరువుల కంపెనీలకు మెమో ఇచ్చింది. ఈ పథకం వల్ల రైతులకు గాని, కంపెనీలకుగాని ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. గత ఏడాది సకాలంలో ఎరువులు సరఫరా కాలేదు. రైతులు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. రైతులకు ఎరువులు అందని విషయాన్ని పార్లమెంటరీస్థాయీ సంఘమే చెప్పిం ది. రూ.267 అమ్మాల్సిన యూరియా రూ.430కు అమ్మినట్లు వార్తలువచ్చాయి.హెచ్చు ధరతో అమ్మ డంతోపాటు ఎరువుల వ్యాపారులు రైతులకు అవసరమైన ఎరువు ఇవ్వాలంటే …తక్షణం అవస రం లేని ఇతర ఎరువులను లేదా క్రిమిసంహారక మందులను కొంటేనే అవసరమైన ఎరువులు ఇచ్చారనిస్థాయీ సంఘం దృష్టికి వచ్చినట్లు పేర్కొం ది. 2021-22బడ్జెట్‌ కన్నా 2022-23 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కేటాయింపులను భారీగా తగ్గిం చడంపై స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-1985 ప్రకారం ఎరు వుల సరఫరాలో, అమ్మకాలలో జరుగుతున్న అవక తవకలను అరికట్టాలి. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయిన ప్పటికీ ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల నిల్వలన్నీ ఎన్నికలు జరుగు తున్న ఉత్తరప్రదేశ్‌కు తరలి వెళ్ళాయని పత్రికలలో వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధా నంలో…’ఫెర్టిలైజర్‌ కంట్రోల్‌ ఆర్డర్‌-85’ను సక్ర మంగా అమలు చేయడం గురించిగాని, బ్లాక్‌ మార్కెట్టును అరికట్టేచర్యల గురించి గాని, అవస రానికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిం చే అంశం గాని లేకుండా…’ఒకే దేశం ఒకే ఎరువు’ నినాదం ఎవరి ప్రయోజనం కోసమో ఏలిన వారికే తెలియాలి. మన దేశం స్వాతంత్య్రం పొందేనాటికి తీవ్రమైన ఆహార కొరత ఉంది. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. ఆహారధాన్యాలు పండిరచడానికి భూమితో పాటు నీరు, ఎరువులు, విత్తనం అవసరం. ఆనాటికి దేశంలో ఒకే ఒక్క ఎరువుల కంపెనీ ఉన్నది. ప్రభుత్వ రంగంలో ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎసిటి) మాత్రమే ఉన్నది. స్వాతంత్య్రం అనం తరం ప్రణాళికా విధానంలో భాగంగా ప్రభుత్వ రంగం లోనూ సహకార రంగంలోనూ పది ఎరు వుల కర్మాగారాలు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగం లోని రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ‘’మణి రత్నం’’గా ప్రఖ్యాతి గాంచింది. ఎరువుల తయారికీ అవసరమైన నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌ మూడు ప్రధానమైన ముడి పదార్థాలు. ఈ మూడూ నేటికీ 90శాతం దిగుమతి చేసుకోవాల్సిన స్థితిలోనే ఉన్నాయి. ఈకాలంలో క్రమంగా ఎరువుల రంగం లో ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కాంప్లెక్స్‌ ఎరువులకు మిక్సింగ్‌ ప్లాంట్లు వచ్చాయి. ఈ ప్లాంట్లు దిగుమతి చేసుకున్న సందర్భంలోనూ మిక్సింగ్‌ చేసిన సందర్భంలోనూ రెండుసార్లు సబ్సి డీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాలం లో ఎరువులకు అవసరమైన ముడి సరుకుల దిగు మతి,ఎరువుల తయారీ,పంపిణీ,ఎరువుల ధరలు వంటి సమస్యలు ముందుకు వచ్చాయి. ఈ సమ స్యల పరిష్కారానికి సూచనలు చేయడం కోసం డజనుకు పైగా ఎక్స్‌పర్ట్‌ కమిటీలను వేశారు. ఈ క్రమంలోనే ఫెర్టిలైజర్‌ కంట్రోలు ఆర్డరు, ఎరువుల ధరల నియంత్రణచట్టం,ఎరువుల పంపిణీ విధా నం,సబ్సిడీల విధానాలు రూపొందాయి.సరళీకరణ విధానాల నేపథ్యంలోద్వంద్వధరల విధానం, కం ట్రోలు సడలింపులు వంటి ప్రయోగాలు బాగా జరిగాయి. సరళీకరణవిధానాలు అన్ని రంగా లలో వచ్చినా ఆంక్షలు తొలగించని రంగం ఎరు వుల రంగంగా ఉందని పేర్కొన్నారు. అయినా ఎరువుల కొరత సృష్టించడం, బ్లాక్‌ మార్కెట్‌ వంటి సమస్యలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఎరువుల రంగంలో ప్రయివేటు రంగం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వరంగం చిన్నచూపుకు గురవుతూనే ఉన్నది. ఈ కాలంలో ముడి కెమికల్స్‌ కన్నా, శుద్ధి చేసిన కెమికల్స్‌ దిగుమతి లాభసాటిగా మారింది. ప్రయి వేటు కంపెనీల వారు, మిక్సింగ్‌ ప్లాంట్ల వారు, శుద్ధిచేసిన కెమికల్స్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించడంతో ఎగుమతి చేసే దేశాలు ఎక్కువ లాభాలు పోగేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్ధలు అనేక వడిదుడుకులకు గురయ్యాయి. 1997-98 నాటికి ఉత్పత్తి సామర్ధ్యానికి మించి 118శాతంఉత్పత్తి చేసిన ప్రభుత్వ కంపెనీలు… 2009-10 నాటికి 79 శాతం ఉత్పత్తికి, 2014-15 నాటికి 66 శాతం ఉత్పత్తికి తగ్గిపోయాయి. గతనెలలో ప్రభుత్వ రంగంలోని ఎనిమిది ఎరు వుల కర్మాగారాలను ప్రెవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు వార్తలు వెలు వడ్డా యి. మణిరత్నంగా పేరుగాంచిన రాష్ట్రీయ ఫెర్టి లైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌,నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమి టెడ్‌,ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఎఫ్‌.సి.ఐ ఆరావళి జిప్సమ్‌ అండ్‌ మినరల్స్‌, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌,హిందుస్తాన్‌ ఫెర్టి లైజర్స్‌ కార్పొరేషన్‌ ఫ్యాక్టరీలు ప్రెవేటుపరం కానున్న జాబితాలో ఉన్నాయి.
ఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారు స్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో పైసా మిగలక రైతులు అప్పులపాలవుతున్న టైమ్‌?లో ఎరువుల ధరల పెరుగుదల రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పెట్టుబడిపై కనీస లాభాన్ని కళ్లజూడలేక పోతున్న రైతులు..ఏడాదికేడాది పెట్టుబడులు పెరుగుతుండడంతో వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తోంది. పెట్టుబడికి సరిపోను రుణాలను బ్యాంకు లు ఇవ్వకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి తెచ్చి అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారు.అవిభారమై చాలామంది ప్రాణా లు తీసుకుంటున్నారు. ఇందులో 60 శాతం మంది కౌలు రైతులుంటున్నట్టు ఎన్‌సీఆర్‌బీరిపోర్టు చెబుతోంది.
మన దేశంలో తయారీపై దృష్టేది?
వ్యవసాయ ఆధారితమైన మన దేశం లో ఇంకా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో సగటున ఎకరాకు 75 కిలోల ఎరువులు వాడుతున్నాం. ఇతర దేశాల్లో ఎకరాకు200కిలోలు వాడుతున్నట్టు లెక్కలు చెబుతు న్నాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో కలిపి రసాయన ఎరువుల వాడకంపెంచడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చు.గత పదేండ్లుగా దేశం లో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల స్థిరంగానే ఉంది. 2021-22లోకోటి టన్నుల ఉత్పత్తి పెరగ డంతో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 30.16 కోట్ల టన్నులకు పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. మిగిలిన పంటల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. వీటితోపాటు మరో రూ.3లక్షల కోట్ల విలువైన నూనెలు, పంచదార, పప్పులు, పత్తిని దిగుమతి చేసుకున్నాం.
రేట్లపై నియంత్రణ ఎవరిది?
మన దేశానికి ఎరువుల్ని దిగుమతి చేసే దేశాలులాబీగా ఏర్పడి రేట్లు, డిమాండ్‌?ను కం ట్రోల్‌? చేస్తున్నాయి. దీంతో మనం తీవ్రంగా నష్ట పోతున్నాం. చివరకు క్రిమిసంహారక మందులు, బయోపెస్టిసైడ్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌ తోపాటు వాటి తయారీ టెక్నాలజీని కూడా దిగుమతి చేసుకుం టున్నాం. దీంతో ఇండియా విదేశీ మారకద్ర వ్యాన్ని కూడా కోల్పోతున్నది.కాంప్లెక్స్‌ ఎరువుల కంపెనీలు ధరలు ఇష్టానుసారం పెంచుకోవడానికి చట్టం ఒప్పు కోదు. ప్రతి ఎరువు ధరను కేంద్రం నిర్ణయిం చాల్సిందే. కానీ ఇటీవల కంపెనీలు, వ్యాపారులు ధరలు పెంచుకోవడంతో రైతులు గతంలోకంటే ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వస్తోంది.
తయారీని ప్రోత్సహించాలె
రైతుల పెట్టుబడిని తగ్గించడంలో ఎరు వుల ధరలు కీలకం. ఎరువులు, ఉపకరణాల ధర లు పెంచి 2022లో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నహామీని కేంద్రం ఎలా నిలబెట్టుకుంటుం దో చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో రైతుల పెట్టుబడిని తగ్గించడం కేంద్రంపై ఉన్న ప్రధాన బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులు సక్రమంగా వ్యవసాయం చేయగలుగుతారు. ఎరువుల ధరల నియంత్రణ మన చేతుల్లో ఉండాలంటే ఇప్పటికైనా స్వదేశంలో తయారీని ప్రోత్సహించాలి. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఎరువుల వాడకం మోతాదును తెలియజెప్పాలి.ఎరువుల ధరలు, సప్లయ్‌,వాడకంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్లాన్‌?తో ముందుకెళ్లాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి రైతు గట్టెక్కాలంటూ వెంటనే ఎరువుల ధరల్ని తగ్గించాలి.
తగ్గిన సబ్సిడీ..
`2022-23ఏడాది మినహా పెరుగుతున్న బడ్జె ట్‌కు అనుగుణంగా,డాలర్‌ విలువ పెరుగు దలను లెక్కలోకి తీసుకుని ఎరువుల సబ్సిడీని కేంద్రం పెంచలేదు. గత ఏప్రిల్‌లో 58 శాతం పెంచిన ఎరువుల ధరలు ఆందోళన ఫలితంగా తగ్గిం చినప్పటికీ తిరిగి వ్యాపారులు సబ్సిడీ తగ్గిందన్న పేరుతో ధరలు విపరీతంగా పెంచారు. పెంచిన ధరలపై కేంద్రం స్పందించకపోవడంతో చాలా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ముంచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నత్రజని, భాస్వరం,పొటాష్‌ ఎరువుల వాడకం 272.28 లక్షల టన్నులు.ఇందులో పొటాష్‌ వాడకం 26.80 లక్షల టన్నులు. ఇది పూర్తిగా 100 శాతం దిగుమతి చేసుకోవాల్సింది. యూరియా, డీఏపీ కూడా దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న యూరియాపై2021-22లో రూ.53,619 కోట్లు సబ్సిడీని కేంద్రం చెల్లించింది. భాస్వరం, పొటాష్‌కు రూ.26,335 కోట్లు సబ్సిడీ ఇచ్చారు.
కేంద్రం తగ్గించినా..
కిందటి ఏడాది పెంచిన ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్రం వాటిని తాత్కాలికంగా పెండిరగ్‌లో పెట్టింది. 2022 జనవరి10వరకు పాత ధరలే ఉంటాయని చెప్పింది. కానీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కంపె నీలు అప్పటికే కేంద్రం ప్రతిపాదించిన ధరలను ఇంకాస్త పెంచి అమల్లోకి తీసుకొచ్చాయి. కేంద్రం తమకిచ్చే సబ్సిడీని తగ్గించడం వల్లే ధరలు పెం చాల్సి వచ్చిందని ప్రచారం చేసుకున్నాయి. ఈ రేట్ల కట్టడికి కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ కం పెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తుంది. కానీ కంపె నీలు షార్టేజ్‌ సృష్టించి బ్లాక్‌ లో అమ్మి రైతులకు రాయితీని దూరం చేశాయి.ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు సబ్బిడీ అందక రైతులు నష్ట పోయారు. –వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం సీనియర్‌ నాయకులు

పోలవరం అగమ్యగోచరం

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల జరిగిన శాసనసభలో ఆవిష్కృతమైన చర్చ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న వారిని మరింత అయో మయానికి,భూములు,ఊళ్లు,ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన లక్షల మంది గిరిజన నిర్వాసి తులను తీవ్ర వేదనకు గురి చేసింది. ప్రాజెక్టు పనులు మొదలయ్యాక, మరీ ముఖ్యంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతున్న తరుణంలో గోదావరికి కొద్దిపాటి వరదలొచ్చినా ముంపు గ్రామాలు మునుగు తున్నాయి. నిర్వా సితులు ఉన్నపళంగా కట్టుబట్టలతో ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. మొన్న వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి. నేటికీ కొండలపై, గుడారాల్లో ముంపు బాధితులు బతుకీడుస్తున్నారు. ఈ సమయాన అసెంబ్లీలో చర్చ అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను ఏకరువు పెట్టడానికే సమయాన్నంతా వెచ్చించింది. పోలవరం జాప్యానికి మీరు కారణం అంటే కాదు మీరు అన్న నిందారోపణలే తప్ప నిర్వాసితుల వెతలు పట్టించు కోలేదు. పైపెచ్చు కాంటూరు లెక్కలతో నిర్వాసితుల పరిహారం వాయిదా వేస్తున్నట్లు సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి ప్రకటించారు.
పోలవరం నిర్మాణాల్లో గతటిడిపి ప్రభు త్వ లోపాలను కనుక్కో గలిగిన వైసిపి ప్రభు త్వం, నిర్వాసితుల లెక్కల దగ్గరకొచ్చేసరికి ఆ ప్రభుత్వ గణాంకాలనే పొల్లు పోకుండా ఒప్పజెప్పడం విడ్డూరం. ప్రాజెక్టును ప్రతిపాదిత 45.72 మీటర్ల (కాంటూర్‌) ఎత్తులో నిర్మిస్తే లక్షా పది వేల మంది మునుగుతారు. 41.15 మీటర్లవద్ద నీరు నిలిపితే 20వేల మందే మునుగుతారన్నది గత ప్రభుత్వ లెక్క. ఇటీవలి వరదల్లో 38 మీటర్ల ఎత్తుకే 45.72 కాంటూ రు లోని 373 గ్రామాలూ మునిగాయి. అంతే కాదు,ఆపైన వంద గ్రామాల చుట్టూరా నీరు చేరింది. దీన్నిబట్టి కాంటూరు లెక్కలు కాకి లెక్కలనేగా? వాటిని పట్టుకొని ఈ ప్రభుత్వం వేలాడుతోంది. ప్రాజెక్టు కింద లక్ష మంది మునుగుతుంటే 41.15 కాంటూరు వద్ద 20 వేల మంది మునుగుతారు, ముందు వారికే పునరావాసం అంటే తతిమ్మా 90వేల మంది గతేంటి? చెప్పిన కాంటూర్‌ వరకు ఇస్తామన్న ఆర్‌ అండ్‌ ఆర్‌ చెల్లింపులకు జిఓ ఇచ్చేశా మన్నారు సిఎం. ఏడాదైనా రూ.6.5లక్షల నుంచి పది లక్షలకు పెంచి చెల్లింపులు చేయ నేలేదు. భూములు కోల్పోయిన వారికి ఎకరానికి రూ.10 లక్షలకు పెంచుతామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో తూచ్‌..అలా అనలేదు, రూ.5 లక్షలేననడం మాట తప్పడం కాదా? పోలవరంలో2013-భూ సేకరణ చట్టం ఎందుకు అమలు కాదు?ఈ ప్రాజెక్టు నిర్వాసితులేమన్నా వేరే దేశంలో ఉన్నారా? విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజె క్టుగా పేర్కొన్నారు. అంటే కేంద్రమే ప్రాజెక్టు కయ్యే నిధులన్నింటినీ పెట్టుకోవాలి. ఏప్రాజెక్టూ గాలిలో కట్టరు. భూమి కావాల్సిందే.కనుక భూ ములు కోల్పోయే నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు వ్యయంలో కలిసే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడుగా మాట్లాడు తోంది. నిర్వాసితుల వ్యవహారం తమది కాదంటోంది. కేంద్రాన్ని నిలదీసి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దాటవేస్తోంది. చేసిన పనులకు రావాల్సిన నిధులనూ గట్టిగా అడగలేకపోతోంది. 2013-14 అంచనాల ప్రకారం రూ.20వేల కోట్లే ఇస్తామని కేంద్రం ఒకటికి పదిసార్లు వల్లెవేస్తున్నా మౌనమే. పోల వరం తాజా అంచనా రూ.55 వేలకోట్లు. అందులో రూ.33వేల కోట్లు నిర్వాసితుల పున రావాసానికే. పోలవరం ప్రాజెక్టును ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణిస్తారు. అటువంటి జీవనాడికి ఊపిరులూదుతూ తమ సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు అందించే పునరా వాసంపై కేంద్ర సర్కార్‌ దోబూచులాడు తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. నిర్వాసితుల పట్ల మానవతతో ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా వ్యవహ రించడం దారుణం. జాతి అభివృద్ధి కోసం భూములను,ఊళ్లను,ఇళ్లను అర్పించిన త్యాగధ నులను గౌరవించి ఇతోధికంగా ఆదుకోవాలి. చట్టప్రకారం అది వారి బాధ్యత. నిర్వాసితులు ఉద్యమాలతో పాలకుల మెడలు వంచాలి. ‘‘నిరుడు చాలా కష్టాలు పడ్డాం.ఈసారి జూన్‌ నుంచే మాకు వరద ముప్పు మొదలైంది. దారులు మూసుకుపోతున్నాయి. ఊళ్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. పోనీ పరిహారం ఇచ్చేస్తే పోదామని చూస్తుంటే మీరు ఖాళీ చేయండి, ఆ తర్వాత మేం చూస్తామంటున్నారు’’ అంటూ ఆవేదన చెందారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తురాలు మాడే చినపోశమ్మ. ‘‘మా ఇల్లు, పొలం,చెట్టూ,పుట్టా తీసేసుకుంటే మేం ఇక్కడి నుంచి పోయి ఏం చేయాలి? ఏం తినాలి. ఎలా బతకాలి. ఇప్పటికే ఖాళీ చేసిన వెళ్లిన వాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ అన్నారామె. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవా హానికే వరద తాకిడి మొదలైంది.గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు. దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్న మవుతాయోనన్న ఆందోళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది. విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రక టించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆసమయంలో 18ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వా సితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటిం చారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎక రాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచ నాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది.దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఇప్పటి వరకూ ఇచ్చిందెంత?
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితం అవుతాయని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిర్ధరించింది. వాటిలో ఇప్పటి వరకు 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు.వారంతా ప్రస్తుతం స్పిల్‌ వే,కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సమీ పంలో నివసించిన వారు.పునరావాసం కోసం ఇప్పటివరకు రూ. 6,371 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మరో రూ.26, 796 కోట్లు అవసరం అవుతాయని తాజాగా రూపొందించిన డీపీఆర్‌-2లో పేర్కొన్నారు. అంటే పునరావాసం పొందిన వారి సంఖ్య 4శాతం లోపు ఉండగా,చేసిన వ్యయం కూడా దాదాపు 20 శాతమే.ప్రస్తుతం 41.5 అడుగుల వద్ద పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం లెక్కలేస్తు న్నారు. దాని ప్రకారం 18, 622 కుటుంబా లకు తక్షణమే పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ నేటికీ అందులో నాలుగో వంతు మందికే పునరావాస ప్యాకేజీ దక్కింది.
అమానవీయ ధోరణిలో ప్రభుత్వం
‘‘పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం తగదు. ప్యాకేజీ ఇచ్చేస్తే ఖాళీ చేస్తామని వారు చెబు తున్నారు. కానీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతూ పునరావాసం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లు ఏం కావాలి. నిరుడు నెల రోజులు పైగా వరద నీటిలోనే ఉన్నారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ మూసేశారు. కాబట్టి మూడు నెలల పాటు వరదలు వచ్చేలా ఉన్నాయి.1986 నాటి వరదలను మించి వస్తాయని అధికారులే చెబు తున్నారు. నిరుడు కూడా నిర్వాసితులకు వరద సహాయం అందించకుండా వేధించారు.ఈసారి అదే పద్ధతిలో కనిపిస్తున్నారు. ఇది తగదు. తక్షణమే పరిహారం చెల్లించాలి.వరదల సమ యంలో వారిని ఆదుకోవాలి’’అని ఏపీ గిరిజన సంఘం నేత ఎం కృష్ణమూర్తి అన్నారు. జిఓ ఇచ్చేశాం… : పోలవరం పరిహారంపై సభలో సిఎం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం పెంపునకు సంబంధించిన జిఓను ఎప్పుడో ఇచ్చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి అన్నారు. గతనెలలో జరిగిన శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విష యం ప్రస్తావనకు వచ్చింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు, చిన రాజప్ప, అచ్చెన్నా యుడులు పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ 10లక్షల ఇస్తామను హామీ ఏమైందని, గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబునాయుడు 6.86 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతామంటూ హామీ ఇచ్చామని, ఆ మేరకు2021 జూన్‌30 వ తేదీన జిఓ కూడా జారీ చేశామని చెప్పారు. జిఓ ఇచ్చిన విషయాన్ని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి దాని అమలు తీరుమాత్రం దాటవేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల సాధనకోసం ఏం చేయనున్నారను విషయాన్ని కూడా ఆయన వివరించలేదు. అదే సమయంలో 41.15 కాంటూరు పరిధిలోని వారికే పరిహారం ఇస్తామని మరోచెప్పారు. పరిహారం జారీకి సంబంధించి జారీ చేసిన జిఓను చూపిస్తూ ‘కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం’ అని టిడిపి సభ్యులనుద్దేశించి అన్నారు. పోలవరం డ్యామ్‌ 45.76 మీటర్లకు పూర్తిఅయినా భద్రత దృష్ట్యా మొదట నీటిని 41.15 మీటర్ల ఎత్తులో నిల్వ చేస్తామని అన్నారు. ఆ పరిధిలో ఉన్న వారికే పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుకింద 1,06,006 మంది నిర్వాసితులుండగా, 41.15 మీటర్ల పరిధిలోకి 20,946 మంది వస్తారనిచెప్పారు. వీరిలో 14,110 మందికి పునరావాసం పూర్తయ్యిందని, దీనికి గానూ రూ 1,960.95 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుం బాలకు ఈ ఏడాది అక్టోబర్‌లోపు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ‘ మొత్తం 41.15 కాంటూర్‌ వరకు చెల్లించాల్సిన పరిహారం రూ 6.86 లక్షలకు బదులు రూ10లక్షలు పెంచాం. దీని ద్వారి అదనంగా అయిన ఖర్చు 500 కోట్ల రూపాయలే. బటన్‌ నొక్కి రూ 6,500 కోట్లు, రూ 6,700 కోట్లు ఇచ్చే మా ప్రభుత్వానికి ఇది పెద్ద మొత్తం కాదు.’ అనిఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,900 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. గతంలో రూ 1.50లక్షలు నష్టపరి హారంగా తీసుకును వారికి కూడా రూ 5లక్ష లకు పెంచి ఇస్తామని చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని అన్నారు. స్పిల్‌వేను పూర్తి చేసి నీటినిడైవర్ట్‌ చేయకుండా కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ నిర్మాణాలు చేపట్టి, సగం సగం పనులు చేయడం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని అన్నారు. అక్టోబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలు పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
హామీ ఇవ్వలేదన్న అంబటి
అంతకుముందు టిడిపి సభ్యుల ప్రశుకు లిఖితపూర్వకంగా జవాబిచ్చిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిహారం పెంపునకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదని రాతపూర్వకంగా జవాబిచ్చారు. దీనిపై టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు వక్రీకరించి చెబుతున్నారని మంత్రిచెప్పారు. ఈ దశలో టిడిపి సభ్యులకు, మంత్రికి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో సభలోకి వచ్చిన సిఎం హామీ ఇచ్చామని, అమలుకు జిఓ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
వైఫల్యాలివీ….
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ను రాష్ట్ర పభుత్వం ఆమెదింపజేసుకోలేకపోయింది.2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లుకు సాంకే తిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమెదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటికీ అప్పజెప్పింది. ఆ కమిటీ రూ.47, 725.74కోట్లకు అంచనాలు ఆమోదిం చింది. ఇంతవరకు కేంద్ర మంత్రి మండలి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలియజేయ లేదు. కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా పరిష్కరించు కోలేకపోతున్నాం. నాడు డీపీఆర్‌ ఆమోదించు కోలేకపోయారని విమర్శలు గుప్పించిన జగన్‌ ఇప్పుడు..పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు..మనం కిందా మీద పడుతున్నాం.. రూ.1000 కోట్లో,రూ.2000కోట్ల అయితే నేనే ఇచ్చేవాణ్ణి..రూ.వేల కోట్లు కేంద్రం ఇవ్వాలి.. నేనేం చేయగలను అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 25ఎంపీ స్థానాలిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా.. కేంద్రం నుంచి అన్నీ తెస్తా.. అని ఎన్నికల్లో ఓట్లడిగిన జగన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ,అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి భేషరతుగా ఎందుకు మద్దతు పలికారు. రాజ్యసభలో,లోక్‌సభలో ఎందుకు మద్దతినిస్తున్నారు?పోలవరం డీపీఆర్‌`2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు..అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన స్పందించడం లేదు. పునరావాసం ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలు నానా అవస్థలు పడుతు న్నాయి.ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరద నీరు వెనక్కి ఎగుదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవి ల్లాడుతున్నారు. 2019వరదల్లో నిర్వాసితుల కష్టాలు అందరూ చూశాం. 2020వరదల్లోనూ వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.2021 వరదల సమయానికి కూడా కనీసం తొలిదశ పునరావాసం ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేక పోయింది.2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడేనాటికి తొలిదశ పునరావాసం పూర్తి చేసేందుకు రూ.2,728 కోట్లు అవసరమని లెక్కించారు. ఏదో రూ.వెయ్యి కోట్లో, రూ.2000కోట్లో అయితే నేనే ఇచ్చేస్తా అని ప్రకటించిన జగన్‌ ఈ మూడేళ్ళలో ఆ సొమ్ము లు ఎందుకు ఇవ్వలేకపోయారు? తొలిదశలో 20,946 కుటుంబాలకు పునరా వాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 8,272 కుటుంబాలకే పూర్తియింది. పునరా వాసం కోకవరం,జంగారెడ్డిగూడెం,చర్ల వంటి ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. నెలకు రూ.6,000 నుంచి రూ.8000 వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.55, 548కోట్లు కావాలి.భూసేకరణ, పునరా వాసానికి ఇంకా రూ.26,585కోట్లు అవసరం. ఇతర సివిల్‌ పనులన్నీ కలిపి రూ.7,174 కోట్లు,విద్యుత్కేంద్రం నిర్మాణానికి రూ.4,124 కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తి యితే ఉత్తరాం ధ్ర సుజల సవ్రంతికి నీళ్లు ఇవ్వచ్చు.- జిఎన్‌వి సతీష్‌

కౌలు రైతుల క‌ష్టాలు

తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. భూమిని కౌలుకు తీసు కొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన ఏ మేలు అందుకోలేక పోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు,పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో, రికార్డు లలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. -గునపర్తి సైమన్‌
భారతదేశంలో 60శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35లక్షల మంది కౌలు రైతులు ఉం టారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70శాతం సాగు భూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో,రికార్డులలో పేరో ఉం టేనే ఏమేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతుల్షు నష్టపో తున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలు దారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు – సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970,80దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగా లకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో,పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంప న్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80శాతం వెనుకబడిన తరగతులు,దళిత కుటుంబాలకు చెందిన వారే.ఈసామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడిరది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి,ఇన్‌పుట్‌ సబ్సిడీ,పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి.ఈచట్టం ద్వారా 2011లో5లక్షల మందికి,2012లో నాలుగు లక్షల మందికి, 2016లో4లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో40శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి.ఈరుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజ మాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ఆరుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం,రాజకీ య సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయాలు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈచట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూయజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35లక్షల మంది కౌలు రైతులుఉండగా,ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతు లకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సికౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు.ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు ‘ఇ-క్రాపింగ్‌’ కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలు దారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు – వివిధ కమిటీలు

  1. మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని…2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
  2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం,సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని…నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ…అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
  3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
  4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
    రాష్ట్రంలో ఏం జరగాలి?
    ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80శాతం కౌలురైతులపై ఆధారపడి ఉన్నది.కౌలు రైతు లకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.ఈ నేపథ్యంలో భూ యజమానులు కౌలుపెంచి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ 425 తెచ్చి పేదలు సాగు చేస్తున్న దేవాలయ భూములకు బహిరంగవేలం పెట్టి ఎకరాకు రూ.30 వేల నుండి 60 వేలు పెంచారని పేర్కొన్నారు. దేవుని పేరు చెప్పి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన నూతన కౌలుచట్టం సబ్సిడీ పథకాలు పొందడానికి అవకాశం లేకుండా చేసిందని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులే పంట రుణాలు పొందుతున్నారని వివరించారు. కౌలు రైతులు ఎనిమిది లక్షల మంది ఉంటే రైతు భరోసా 50 వేల మందికి మించి ఇవ్వడం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకాలూ కౌలు రైతులకు వర్తింపజేయడం లేదని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయని తెలిపారు. ట్రాక్టర్‌ డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెరిగి సాగు ఖర్చులు గతం కంటే ఈ ఏడాది రూ.ఐదువేల నుండి రూ.ఏడువేలు అదనంగా పెరిగిందని వివరించారు. రైతులకు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని వివరించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ముందుగా కౌలు చెల్లించిన వారికి వచ్చే ఏడాదికి జమచేసుకునే విధంగా చూడాలని కోరారు.
    రుణాలకు బ్యాంకుల విముఖత
    కౌలు రైతులు కష్టాల కడలిలో ఎదురీదు తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభు త్వాల సాయం అందక పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. కష్టాలకోర్చి పంటలు సాగు చేసినా చివరి దశలో ప్రకృతి కన్నెర్ర చేయడం, మద్దతు ధర లభించకపోవడం, ధాన్యం విక్ర యాల్లో ఇబ్బందులు ఎదురవడం వంటివి కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టా దారులకే వరంగా మారాయి.కౌలు ధరలు కూడా పట్టాదారు రైతులకే లాభాలు చేకూరు స్తున్నాయి. భూ తల్లిని నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం ఆర్థిక భరోసా లేక దిగుబడిపై నమ్మ కంలేక ప్రకృతిపై భారం వేసి సాగుబడి చేస్తు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 60 వేల మందికిపైగా కౌలు రైతులు ఉపాధి పొందుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వ పథకాలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందని పరిస్థితి. దీంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇస్తున్నారు. కనీసం కౌలు ధరలు కూడా తగ్గించడం లేదు. ఏటా పెంచుతూనే ఉన్నారు. భూమి, నీటి వసతిని బట్టి కౌలు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కౌలు విధానం కూడా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు ధరలతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు వరికోతలు, పత్తి ఏరడం, కలుపు తీయడం వంటి సమయాల్లో కూలీల కొరత అదనపు భారంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టాన్ని చవిచూసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
    ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా కౌలు రైతులకు నోటికి.. చేతికి దూరం తగ్గడం లేదు. కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్భాలే ఎక్కువ. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌) కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసంగా అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌ కార్డు ఉండాల్సిందే. వీటన్నిటికి ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకు అర్హత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైందని… ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమకు సీపీఆర్‌ కార్డులు అందుతాయని కౌలు రైతులు అంటున్నారు.
    సకాలంలో అందేనా?
    జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు మొదలయ్యాయి. సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలకు తోడు, ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా చేదోడుతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. వారికి ఏ ఆసరా లేదు. ప్రభుత్వం ఏటా వారికి అందించే సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్‌ చేయించు కోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రా లను కౌలు రైతులు సమర్పిస్తే వీఆర్వో ఆమో దంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగి కార్డులు అందేసరికి జూన్‌ ముగిసిపోవడం ఖాయం. దీని వల్ల కౌలు రైతుల సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందదు. సొంత భూమి ఉన్న రైతులే ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతోంటే సీసీఆర్‌ కార్డులు లేని కౌలు రైతుల కష్టాలు ఊహించవచ్చు.
    అవగాహన లేకపోవడమే..
    సీసీఆర్‌ కార్డులు అందరికీ అందకపోవడానికి కారణం భూ యజమానులకు వీటిపై అవగాహన లేకపోవడమే. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సీసీఆర్‌ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 10 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
    ఏటికేడు తగ్గుతున్న కౌలు రైతులు..
    వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. దీని వల్ల కౌలు రైతుల సంఖ్య జిల్లాలో బాగా తగ్గిపోతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. తీరా ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించాల్సిందే! మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది కౌలు వ్యవసాయం చేయడానికి సాహసించడం లేదు.
    అంతంత మాత్రంగానే..
    జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 25 నుంచి 30 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో సీసీఆర్‌ కార్డులు చాలా కొద్ది మందికే ఉన్నాయి. గత ఏడాది ఉమ్మడి జిల్లాలోనే ఈ సంఖ్య 35 వేలు దాటలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో. సీసీఆర్‌ కౌలు రైతుల కష్టాలన్నింటినీ తీర్చే సంజీవని అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే అందించే బీమా…దిగుబడు లకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ లింకు తప్పనిసరి. గత ప్రభుత్వంలో ఈ మెలిక లేకపోవడంతో కౌలు రైతులకు కొన్ని ఫలాలు అందేవి. రైతు సంక్షేమమే తమ ధ్యేయ మని వల్లె వేసే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ప్రక్షాళనల వల్ల కనీ సంగా కూడా తమను మేలు జరగడం లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.

మానసిక ఒత్తిడిళ్లుల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖ చిత్ర అటెండెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యా యులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్ర దేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండ లాల్లో ఇంటర్నెటట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
ప్రముఖ తత్వవేత్త ఎపిక్యూరస్‌ ‘’విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద’’ అనిపేర్కొన్నా డు.‘’విద్య అనే వృక్షం వేళ్లు చేదుగాను,ఫలాలు తియ్యగాను ఉంటాయని’’ గ్రీక్‌ తత్వవేత్త అరి స్టాటిల్‌ చెప్పాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి శక్తులతో పోరాడే క్రమంలో పొందిన అనుభవ పూర్వకమైన జ్ఞానమే విద్య. మానవ సమాజం ఆవిర్భవించిన నాటి నుండి మాన వుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించ టానికి విద్య ద్వారా ప్రయత్నంచేస్తూనే ఉన్నాడు. మానవ సమాజం సామూహికంగా సంపా దించిన జ్ఞాన, అనుభవాలసారాన్ని అందించ టమే విద్యగా నిర్వచించవచ్చు.అటువంటి విద్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఉచిత, నిర్బం ధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులలో 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది. కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారత దేశంలో,ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991 లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ-సరళీకరణ-ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారం గంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్ప డ్డాయి. పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌,కార్పొరేట్‌ పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాఠ శాలల్లో 73 లక్షల మంది పిల్లలు చదువుతుం డగా వారిలో 40లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలల్లో,33లక్షలమంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠ శాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 1,90,0 00 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేస్తుండగా,1,20,000 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుడు -సృజనాత్మకత
ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతగల సృజనాత్మక పాత్ర పోషిస్తు న్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందటంలో సామాజిక విలువ లు పెంపొందటంలో ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర కలిగి ఉంటా డు. ఉపాధ్యాయుడు ‘విద్యా ర్థి కేంద్రీకృత’ బోధన చేయడంతో పాటు విద్యార్థిలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యా యుడికి అవగాహన ఉండాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచు కుంటూ, బోధన పరికరా లు, అవసరమైన టెక్నాలజీ వినియోగిం చుకో వాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం,లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొం దించటానికి కృషి జరగాలి.
టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యా మ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు.కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన ‘ఆన్‌లైన్‌’ టీచింగ్‌ విధానంతో విద్యార్థులలో విపరీతమైన ‘ప్రవర్తనా పరమైన’ ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో ఆన్‌లైన్‌ విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే అవసరమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్‌ క్లాస్‌రూం’లు కూడా ఉపాధ్యా యుడు ఉపయోగిం చిన చోటే విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడి…
విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోద óనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తు న్నది. ఉపాధ్యాయులు 14రకాల యాప్‌లు ఉప యోగించవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఉపాధ్యా యుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపో తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖచిత్ర అటెం డెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియో గించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
3,4,5 తరగతుల తరలింపు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోగల హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదా స్పదమైనది. నిర్ణయాన్ని పేద తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యా పరిరక్షణ కమిటీ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన బడి కోసం బస్సు యాత్ర కూడా ఈ ఆందోళనను గమనించింది. 3,4,5 తరగ తుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. దీని వలన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు డ్రాపౌట్లు గా మారే ప్రమాదమున్నది. తరగతులు తరలించకుండా ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సంస్కరణల ద్వారా పాఠశాలల సంఖ్యను 45 వేల నుంచి15 వేలకు తగ్గించటానికి, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
ప్రైవేట్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో దాదాపు16 వేల ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1,20,000 వేల మంది ప్రైవేట్‌రంగ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.వీరిలో ఎక్కువ మంది అతి తక్కువ వేతనాలతో,ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో దాదాపు 15నెలలపాటు వీరికి వేతనాలు లేక కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్‌ ఉపాధ్యాయుల రక్షణకోసంచట్టం చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి వేతన భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ సహాయం అందించాలి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలలో దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉపాధ్యా యులు, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలలో 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్‌ ఉపాధ్యాయులు గా, సాంఘిక సంక్షేమ-గిరిజన సంక్షేమ-బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. తక్కువ వేతనాలతో పనిచేస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3,400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 1000కి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులను, అధ్యాపకులను క్రమబద్ధీకరించవలసిన అవస రమున్నది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు ఉపా ధ్యాయులకు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌ ఉపా ధ్యాయులకు కూడా న్యాయం చేయాలి.
రాజ్యాంగ లక్ష్యాలు -విద్య
విద్యా రంగంలో మార్పులు,సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు విద్యా రంగాన్ని ‘మార్కెట్‌’ దిశగా తీసుకువెళుతున్నాయి. విద్య ద్వారా ‘సామాజిక మనుషులను’ కాకుండా ‘మార్కెట్‌ మనుషులను’ తయారుచేస్తున్నారు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో కూడా మార్పులు, గ్రేడ్‌ పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరి ణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యా యులను బోధనకే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి.- (కె.ఎస్‌.లక్ష్మణరావు)

1 13 14 15 16 17 48