భిన్న‌త్వంలో ఏక‌త్వం..మాన‌వ వాదం

మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడా ల్సిందే!! తప్పదు.. వస్తువులైనా,మనుషులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్నవారిని,పైకి లేచిన వారినీ, పైకి లేచి కింద పడినవారినీ, అందరినీ! ప్రపంచంలోని అన్యా యాన్ని చూస్తూ ఉండకూడదు.అది మన వెలు గుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకో గూడదు.. సహించగూడదు. ఆలక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి!
భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం.బౌద్ధ,జైన,సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సంద ర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవిం చాయి. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజంలను కూడా భారతదేశం స్వాగతించి అక్కున చేర్చుకున్నది. ఆ పరమే శ్వరుడు ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా ఇష్టపడతాడు. లేకుంటే సృష్టిలో తాను ఒకే కులాన్ని, ఒకే మతాన్ని ఏర్పరచి ఉండేవాడు. కానీ అలా చేయలేదే! కనుక భగవంతుని సంకల్పం మేరకే ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాదులు, జీవన విధానాలు, సంస్కృతులు, సాంప్ర దాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే మతానికి చెందిన వారైతే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయని ఎవరైనా భావిస్తే పొరపాటు అవుతుంది. సత్యదూరమే అవుతుంది. ఊహాజనితమైనదై, వాస్తవికతకు దూరంగా జరిగినట్లవుతుంది. ఇపుడు మానవాళి ముందున్న ప్రధాన సమస్య భిన్నమతాలు కాదు. నిజమైన సమస్యలు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, కరువు కాటకాలు మొదలైనవి. ఇవి మతాలు పరిష్కరించే సమస్యలు కావు. భిన్నత్వమనేది కేవలం మత సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కాదు. భగవంతుడు సృష్టి చేసినపుడు పిల్లి, కుక్క, నక్క ఉంటే చాలనుకోలేదు.84 లక్షల జీవరాసులను సృష్టిం చాడు. ఒకచోట రాత్రి,ఒకచోట పగలు, ఒక ప్రాం తంలో వేడి, మరో చోట ఎండ ఉన్నాయి. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేరకంగా లేవు. అంటే వైవిధ్యం సృష్టి ధర్మం. ఈ వైవిధ్యంలో,భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.వైవిధ్యభరితమైన సృష్టికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవం తుడే. భగవంతుని ఒక రూపానికి, నామానికి పరిమితం చేయకుండా సృష్టి, స్థితి లయలకు కారణభూతమైన విశ్వ చైతన్య శక్తిగా మనం గ్రహించగల్గితే సమస్యలుండవు. మానవ దేహానికి చైతన్యం ఉన్నంత సేపు ఆశరీరం శివం. అంటే మంగళకరం. దేహం నుండి చైతన్యం వెలుపలకు వెళ్లిపోతే శ్వాస ఆగిపోతుంది. చలనరహితమవుతుంది. అప్పుడు ఆశరీరాన్ని ఫలానా వారి పార్థివ శరీరమంటాం.ఒక శరీరానికి ఈ చైతన్యం ఎటువంటిదో సకల జగత్తుకూ అలా ఆధారభూతమైనది విశ్వ చైతన్య శక్తే. ఇదే విశ్వమంతటా నిండి నిబిడీకృతమైన ఏకత్వం. మనకు కంటికి కన్పించే, చెవికి విన్పించే అంశాలలో మాత్రమే భిన్నత్వం. కానీ నిత్య సత్యమైనది, భిన్నత్వంలోనున్న ఏకత్వమే (విశ్వ చైతన్య శక్తి). ఏకత్వం నుండే భిన్నత్వం ఆవిర్భవించింది. తుదకు భిన్నత్వమంతా ఏకత్వంలో సంలీనమవుతుంది. ఈనాడున్న అన్ని మతాలనూ మనం ఈ రీతిగానే చూడాలి. ఆరాధనా పద్ధతులను, ఆచారవ్యవహారాలను ఈ రకంగానే అవగాహన చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఏకత్వం ఏమిటంటే.. అవన్నీ కూడా ఉత్తమమైన జీవన విధానాన్నే ప్రబోధిస్తాయి. మానవతా విలువలకే ప్రాధాన్యమిస్తాయి. శాంతి సామరస్యాలనే వాంఛిస్తాయి. పరోపకారం, క్షమ, త్యాగనిరతినే అభిలషిస్తాయి. భేదమంతా సృష్టిని, సృష్టి యందున్న భిన్నత్వాన్ని, భిన్నత్వంలో గల ఏక త్వాన్ని అర్థం చేసుకోలేని సగటు మనిషి మదిలోనే ఉంది.ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కార వంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా’నవ’ వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ,వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అని మానవత్వంలేని వారు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్ళీ వేరే విషయం. సరే.. అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతి కష్టం మీద ఐదువేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌లోని న్యూ ఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయవ్యాధి – విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడటమే మానవత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయి వాసి అమన్‌, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుతష్యమైన ప్రదేశం… ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి,వచ్చి..పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రయంలో చేర్పించారు. అబద్దాలతో సోషల్‌ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి. కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మానవ వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడటానికి కానీ, అంత్య క్రియలు జరిపించడానికి గానీ అతని బంధు మిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసకోవడానికి మనతరంలో సగం జీవితం అయిపోయింది కదా?తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దానివల్ల సమాజ పురోగతి వేగం పుంజుకుంటుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డ దిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు..తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో వారెంత మాత్రమూ పట్టించుకోరు. 2014 అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఉద్యోం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీ తీసుకుని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్‌ ఆనందంలో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని,ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతిసామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళకంటే గొప్పవాడు.. సొబెరన్‌! అతను తోపుడు బండిపై కూర గాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓమాట చెప్పాడు. ‘’నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది’’ అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీ,దండ్రీ అన్నీతానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్పమీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆశిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక… అవకాశాలివ్వక… ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?చాలా మంది సీతాసాహూ అనే మహిళ పేరు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలంపిక్‌ మెడల్స్‌ తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? ఉత్త పుణ్యానికి భారతరత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన ఓ క్రికెట్‌ ఆటగాడి పేరు చెబితే.. దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటివారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్‌ చంద్ర చూడ్‌ 2018 ఆగస్టు30న ఒక మంచి వివరణ ఇచ్చారు..‘’ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీవాల్వు’ లాంటిది. దాన్ని అనుమతించకపోతే,ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్‌ కుక్కర్‌ పేలిపోతుంది!’’ అని. కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా,తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కావాలని డిమాండ్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏమతానికీ చెందమని స్పష్టం చేశారు.’ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణ నీయంగా పెరుగుతూ ఉందని’’ అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్‌ ప్రకటిం చారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజ నకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వా లకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్‌ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్‌ సంచల నం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్‌ అప్లికేషన్లలో ప్రింట్‌ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం! నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్‌ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలను కుంటే… మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘’ఫైవ్‌ మీల్స్‌, టూ సస్పెండెడ్‌’’ అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే… ఆ రెస్టారెంట్‌ వాళ్ళు వారికి భోజనం పెడతారు! ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడిగిన వారికి ‘’ఎనీ సస్పెండెడ్‌ కాఫీ’’ అని అడిగిన వారికి రెస్టారెంట్‌ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్‌ గౌరవభావంతో డొనేట్‌ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్‌వాళ్ళూ, పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో.. అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా? వెనకేసుకుందాం’ అనే వ్యాపార ధోరణీ, కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మంచి మనసు కూడా రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఉంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కృంగిపోక – హుందాగా ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై – సస్పెండెడ్‌ కాఫీ, టిఫిన్‌, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాట పడతారు కూడా! అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు…‘’కత్తిరించిన ఒత్తులే / వెలుగు తాయి దివ్యంగా-బాధా దగ్ధకంఠాలే పలుకు తాయి శ్రావ్యంగా’’ అని! అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం ఉందో తెలుసా? ఈ సమా జంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమా నతలు ఉండకూడదని మానవ జాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులూ కావాలి! ‘సేవ’ అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమా జాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకు పోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా. వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ నిధులు పనితీరు
వినియోగం

ప్రభుత్వం 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ఫండ్స్‌ (డీఎంఎఫ్‌)పథకాన్ని మైనింగ్‌-బాధిత వర్గాలతో ప్రయోజనం-భాగస్వామ్య పథకంగా ప్రవేశపెట్టింది.ఈపథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30శాతం,2015 తర్వాత వేలం యంత్రాంగంద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పది శాతం చెల్లి స్తాయి. ఈనిధులు ప్రధాన మంత్రి ఖనిజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనకి అనుసం ధానించబడిన లాభాపేక్షలేని మరియు స్వతంత్ర ట్రస్టులు. మైనింగ్‌ ప్రభావిత సంఘాలు మరియు పర్యావరణం కోసం ఇది వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ నిధులలో కనీసం 60 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించాలి. ఈ గమనిక యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ ద్వారా భారతదేశంలోని టాప్‌ 12 మైనింగ్‌ రాష్ట్రాలలో సేకరణ, కేటాయింపు మరియు వ్యయ విధానాలను విశ్లేషిస్తుంది. సేకరణ నిష్పత్తికి కేటాయింపు మరియు సేకరణ నిష్పత్తికి వ్యయం మరియు అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు (డీఎంఎఫ్‌) కేటాయింపు శాతం,ప్రాధాన్యతా ప్రాంతాలలో విస్తరించడం వంటి గుణాత్మక సూచికలు వంటి పరిమాణాత్మక సూచికలపై రాష్ట్రాలను విశ్లేషిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది మరియు అన్ని సూచికలలో ఇతర రాష్ట్రాల కంటే నిలకడగా మెరుగ్గా ఉంది. మైనింగ్‌ అనేది తయారీ రంగాలకు ముడిసరుకును అందించే ముఖ్యమైన ప్రాథమిక రంగం. మైనింగ్‌ కార్యకలాపాలు స్థానిక కమ్యూనిటీలకు ఉపాధి అవకాశాలు మరియు అవస్థాపన సౌకర్యాలను అందజేస్తుండగా, ఇవి ప్రతికూల పర్యావరణ, ఆరోగ్యం,జీవనోపాధి ప్రభావాలతో సహా ప్రతికూల బాహ్య ప్రభావాలకు కూడా దారితీయవచ్చు (ఆంటోసి, రుస్సు, టిక్కీ, 2019). గిరిజనఅటవీ-నివాస వర్గాలతో సహామైనింగ్‌ ప్రభావిత వర్గాల సంక్షేమాన్ని భారత ప్రభుత్వం గుర్తిం చింది.అందువల్ల గనులు మరియు ఖని జాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) కింద మార్చి 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ (డీఎంఎఫ్‌) నిధిని ప్రవేశపెట్టింది. సవరణ చట్టం 2015. సవరణ చట్టం 2015లోని సెక్షన్‌ 9మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ప్రభావి తమైన ప్రతి జిల్లాలో (డీఎంఎఫ్‌)నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. (డీఎంఎఫ్‌) పథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30 శాతం మరియు 2015 తర్వాత వేలం యంత్రాంగం ద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పదిశాతం చెల్లిస్తాయి. మైనింగ్‌ సంబంధిత కార్యకలాపాల ద్వారా ప్రభా వితమైన వ్యక్తులు మరియు ప్రాంతాల ఆసక్తి మరియు ప్రయోజనం కోసం పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2015). (డీఎంఎఫ్‌)ఫండ్‌ స్థానిక కమ్యూ నిటీలను సహజ వనరుల ఆధారిత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలో సమాన భాగస్వా ములుగా గుర్తిస్తుంది. మైనింగ్‌-ప్రభావిత కమ్యూనిటీలతో ప్రయోజనం-భాగస్వామ్యానికి ఫండ్‌ ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది ఏదైనా నిర్దిష్ట పథకం లేదా పని ప్రాంతంతో ముడిపడి ఉండని ఒక ప్రత్యేక నిధి,ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది ముగియదు. బదు లుగా, ఉపయోగించని నిధులు సంవత్సరాలుగా పేరుకుపోతాయి. ప్రస్తుతం, భారతదేశంలోని 22 రాష్ట్రాల్లోని 600 మైనింగ్‌ ప్రభావిత జిల్లాల్లో (డీఎంఎఫ్‌)నిధులు ఏర్పాటు చేయ బడ్డాయి. లాభాపేక్ష లేని ట్రస్టులు ఈ నిధులను నిర్వహిస్తాయి. ప్రతి జిల్లాకు ప్రత్యేక ట్రస్ట్‌ ఉంది.ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సెప్టెంబరు 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఖనీజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనని ప్రకటించింది. పథకం మొత్తం లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2017)
(ఎ) మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ ప్రాజెక్టులు/ కార్యక్రమాలను అమలు చేయడం. ఈ ప్రాజెక్ట్‌లు/కార్యక్రమాలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ప్రస్తుత కొనసాగుతున్న పథకాలు/ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాయి.
(బి) మైనింగ్‌ జిల్లాల్లోని ప్రజల పర్యావరణం, ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థికాలపై మైనింగ్‌ సమయంలో మరియు తరువాత ప్రతికూల ప్రభావాలను తగ్గించడం/ తగ్గించడం.
(సి) మైనింగ్‌ ప్రాంతాలలో బాధిత ప్రజలకు దీర్ఘకాలిక స్థిరమైన జీవనోపాధిని నిర్ధారించడం.
(డీఎంఎఫ్‌)చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం, అన్ని రాష్ట్రాలు నియమాలలో చేర్చుతాయి. దీని ప్రకారం, (డీఎంఎఫ్‌)లు తమ తమ జిల్లాల్లోని అమలు చేస్తారు. (ఎ) తాగునీటి సరఫరా, (బి) పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నియంత్రణ చర్యలు, (సి) ఆరోగ్య సంరక్షణ, (డి) విద్య, (ఇ) సంక్షేమం వంటి వాటితో సహా, డిఎంఎఫ్‌ నిధులలో కనీసం 60శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించబడుతుంది. మహిళలు మరియు పిల్లలు, (ఎఫ్‌) వృద్ధులు వికలాంగుల సంక్షేమం, (జి) నైపుణ్యాభివృద్ధి మరియు (హెచ్‌) పారిశుధ్యం. మిగిలిన నిధులను ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తారు: (ఎ) భౌతిక మౌలిక సదుపాయాలు, (బి) నీటిపారుదల, (సి) ఇంధనం మరియు వాటర్‌షెడ్‌ అభివృద్ధి మరియు (డి) మైనింగ్‌ జిల్లాల్లో పర్యావరణ నాణ్యతను పెంపొందించడానికి ఏవైనా ఇతర చర్యలు.మార్చి 2020లో, కేంద్ర ప్రభుత్వం (డీఎంఎఫ్‌)నిధులకు సంబంధించి అదనపు సూచనలను జారీ చేసింది.30శాతం నిధులను కోవిడ్‌-19కి సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించవచ్చని మార్గదర్శకాలు సూచిం చాయి. సవరణ చట్టం 2021 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు (డీఎంఎఫ్‌)రాజ్యాంగం,విధులను నిర్దేశిస్తూనే ఉండగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల కూర్పు మరియు వినియోగానికి సంబం ధించి దిశానిర్దేశం చేయవచ్చు. జూలై 12, 2021న, కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది, (డీఎంఎఫ్‌) ఫండ్‌ నుండి ఏదైనా ఖర్చులకు ఎలాంటి అనుమతి లేదా ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి ఏజెన్సీ ద్వారా జరగదు’’ (గనుల మంత్రిత్వ శాఖ, 2021`ప).2015 సెప్టెంబర్‌ 2021 మధ్య (డీఎంఎఫ్‌)నిధుల కోసం రూ.53,830 కోట్లు సేకరించబడ్డాయి. బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి దాదాపు 39శాతం (రూ.20,766 కోట్లు), బొగ్గు మరియు లిగ్నైట్‌ కాకుండా ఇతర ప్రధాన ఖనిజాల నుండి 50శాతం (రూ. 27, 108 కోట్లు),మిగిలిన వాటి నుండి సేకరించ బడిరది. మైనర్‌ ఖనిజాల నుండి 11శాతం (రూ. 5,956 కోట్లు) (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2021). భారతదేశంలో ముఖ్యమైన మైనింగ్‌ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గోవా, గుజ రాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తమిళనాడు,తెలంగాణ. ఈ అగ్ర12 మైనింగ్‌ రాష్ట్రాలు దేశంలోని మొత్తం (డీఎంఎఫ్‌)సేకరణలో 96.4శాతం వాటా కలిగి ఉన్నాయి. అగ్ర 12 మైనింగ్‌ రాష్ట్రాలు సేకరించిన, కేటాయించిన మరియు ఖర్చు చేసిన మొత్తాలను ఇలా ఉన్నాయి. మొదటి నాలుగు రాష్ట్రాలు-ఒడిశా (రూ. 14,934 కోట్లు),ఛత్తీస్‌గఢ్‌ (రూ. 7,651 కోట్లు), జార్ఖండ్‌ (రూ.7,393 కోట్లు), రాజ స్థాన్‌ (రూ. 5,468 కోట్లు) దేశంలోని మొత్తం డిఎమ్‌ఎఫ్‌ వసూళ్లలో దాదాపు 66శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఒడిశా (77శాతం), రాజస్థాన్‌ (82 శాతం) మరియు కర్ణాటక (85 శాతం)(డీఎంఎఫ్‌)ఫండ్‌లో ఎక్కువ భాగం ప్రధాన ఇంధనేతర ఖనిజాల నుండి వచ్చిన ప్పటికీ,జార్ఖండ్‌ తన (డీఎంఎఫ్‌)లో 78శాతం బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి సేకరిస్తుంది (మూర్తి 2). బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి అధిక(డీఎంఎఫ్‌)సేకరణ ఉన్న ఇతర రాష్ట్రాలు తెలంగాణ (89శాతం),మహారాష్ట్ర (88 శాతం),మధ్యప్రదేశ్‌ (70 శాతం),ఛత్తీస్‌గఢ్‌ (54శాతం).ఒడిశాలో అత్యధికంగా రూ.14, 934 కోట్ల డీఎంఎఫ్‌ వసూళ్లు ఉండగా, అందులో కేవలం 50శాతం మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు,ఛత్తీస్‌గఢ్‌ రూ.7,651 కోట్లు వసూలు చేసి 68శాతం ఖర్చుచేసింది. నాలుగు రాష్ట్రాలు ఒడిశా,తెలంగాణ,గుజరాత్‌ ,కర్ణాటక (డీఎంఎఫ్‌)నిధుల సేకరణ కంటే ఎక్కువ మొత్తాన్ని కేటాయించాయి. అయితే, నిధుల కేటాయింపు తప్పనిసరిగా వాస్తవ వ్యయంలోకి అనువదించబడదు. ఉదాహరణకు, ఒడిశా అత్యధిక మొత్తాన్ని కేటాయించగా, అది 49 శాతం మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా, కర్ణాటక దాని %ణవీఖీ% సేకరణకు దాదాపు 1.26 రెట్లు కేటాయించింది, అయితే దాని కేటాయించిన నిధులలో 31 శాతం మాత్రమే ఖర్చు చేసింది (మొత్తం సేకరణలో 39 శాతం).సెక్షన్‌ 1లో పేర్కొన్నట్లుగా, మార్గదర్శకాలు కనీసం 60 శాతం(డీఎంఎఫ్‌) నిధులను అధిక ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ఉపయోగించాలని సూచిస్తున్నాయి. అయిన ప్పటికీ, అధిక ప్రాధాన్యత మరియు ఇతర ప్రాధాన్యత ప్రాంతాలలో పంపిణీ నిర్దేశించబడలేదు. డేటా,ఇతర సమాచారం లేకపోవడంతో,కొన్నింటిపై వినియోగాన్ని కేంద్రీకరించడం కంటే ప్రాధాన్యతా ప్రాంతా లలో సమానమైన పంపిణీ ఉత్తమమని మేము భావిస్తున్నాము. (డీఎంఎఫ్‌)నిధుల వినియోగాన్ని అంచనా వేయడానికి ఒక మంచి కొలమానం వ్యయానికి సంబంధించిన వివిధ రంగాలలో వైవిధ్యం యొక్క గుణకం (ప్రామాణిక విచలనం సగటు ద్వారా విభజించబడిరది). వైవిధ్యం యొక్క తక్కువ గుణకం మెరుగైన పంపిణీని సూచిస్తుంది. 12 అగ్ర మైనింగ్‌ రాష్ట్రాల్లో 10 (డేటా లభ్యత సమస్యలు)లో రంగాల వారీగా కేటాయింపుల పంపిణీని టేబుల్‌ 3 చూపు తుంది. జార్ఖండ్‌ తన(డీఎంఎఫ్‌)నిధులలో అత్యధిక భాగాన్ని అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు (89 శాతం) కేటాయించింది. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రం అధిక-ప్రాధాన్య ప్రాంతాలు మరియు ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలలో వైవిధ్యం యొక్క పేలవమైన గుణకాన్ని చూపుతుంది.
లక్ష్యాలు
త్రాగునీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, పర్యా వరణ పరిరక్షణ మరియు పరిరక్షణ, స్త్రీలు మరియు శిశు సంక్షేమం, వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశుధ్యం (మినిస్ట్రీ) వంటి అధిక ప్రాధాన్యతా రంగాలకు (డీఎంఎఫ్‌)నిధిలో కనీసం 60 శాతం కేటాయించాలని సూచిస్తుంది. మైన్స్‌, 2015%ప). మిగిలిన నిధిని భౌతిక మౌలిక సదుపాయాలు, నీటి పారుదల,శక్తి అభివృద్ధి మరియు మైనింగ్‌ ప్రాంతాల పర్యావరణ నాణ్యతను పెంపొం దించడానికి ఏవైనా ఇతర చర్యలతో సహా ఇతర ప్రాధాన్యతా రంగాలకు ఉపయోగించ వచ్చు. (డీఎంఎఫ్‌)యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ అనేది ఫండ్‌ ఎంత బాగా ఖర్చు చేయబడిరదో అంచనా వేయడానికి పరిమాణాత్మక,గుణాత్మక చర్యల మిశ్రమంగా గణించబడుతుంది. ఒక రాష్ట్రం లేదా జిల్లా మొత్తం (డీఎంఎఫ్‌) కేటాయింపు వ్యయం (డీఎంఎఫ్‌)వినియోగం యొక్క పరిమాణాత్మక సూచిక అయితే, వివిధ ప్రాధాన్యతా రంగాలలో గుణాత్మక వ్యాప్తిని విశ్లేషించడం కూడా అంతే ముఖ్యం. కొన్ని రాష్ట్రాలు లక్ష్యాలను సాధించడంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలు వాటి ఖర్చుల పరిమాణం మరియు నాణ్యతలో కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే, అన్ని రాష్ట్రాలు,జిల్లాలకు నవీకరించబడిన మరియు సంబంధిత డేటా అందుబాటులో లేదు. అందు బాటులో ఉన్న డేటా ఆధారంగా, ప్రస్తుత అధ్యయనం ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిషా,రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణ వంటి పది రాష్ట్రాలకు (డీఎంఎఫ్‌)ని గణిస్తుంది.
మెథడాలజీ
12అగ్రశ్రేణి మైనింగ్‌ రాష్ట్రాలలో10,అంటే ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌, తమి ళనాడు మరియు తెలంగాణలలో వ్యయ విధా నాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర స్థాయి సూచిక ప్రయత్నిస్తుంది. ఈ రాష్ట్రాలు ఐదు వేర్వేరు సూచికలపై విశ్లేషించబడ్డాయి సేకరణ నిష్పత్తికి కేటాయింపు,సేకరణ నిష్పత్తికి వ్యయం వంటి పరిమాణాత్మక సూచికలుబీ మరియు (సి) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలపై కేటాయింపుల వాటా, (డి) అధిక-ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయింపుల వ్యాప్తి మరియు (ఇ) ఇతర ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయిం పుల వ్యాప్తి వంటి గుణాత్మక సూచికలు. ఇతర రెండు రాష్ట్రాలు, అంటే గోవా,మధ్యప్రదేశ్‌, అవసరమైన డేటా అందుబాటులో లేనందున సూచిక చేయబడలేదు. పరిమాణాత్మక సూచికలకు 50 శాతం బరువు ఇవ్వబ డుతుంది-మూడిరట ఒక వంతు కేటాయింపు/సేకరణ మరియు మిగిలిన మూడిరట రెండు వంతుల వ్యయం/సేకరణ. కేటాయింపు డేటా ఉద్దేశాలను సూచిస్తున్నప్పుడు, వ్యయాలు పూర్తి చేయబడిన పనిని సూచిస్తాయి మరియు అందు వల్ల కేటాయింపు/సేకరణ కంటే ఖర్చు/సేకరణకు అధిక బరువు కేటాయించబడుతుంది. మిగిలిన 50 శాతం మూడు గుణాత్మక సూచికల మధ్య సమానంగా విభజించబడిరది. ప్రతి రాష్ట్రం యొక్క తుది స్కోర్‌ను లెక్కించడానికి ఈ ఐదు సూచికల సగటు ఉపయోగించబడుతుంది. బరువు రేఖాచిత్రం టేబుల్‌4లో ఇవ్వబడిరది.
(డీఎంఎఫ్‌)ఇండెక్స్‌ అధ్యయనం సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ (జూజుూ) సస్టైనబుల్‌ మైనింగ్‌ అట్రాక్టివ్‌నెస్‌ ఇండెక్స్‌ (చద్దా,కపూర్‌,శివమణి, 2021) ఫ్రేజర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కెనడా) ద్వారా మైనింగ్‌ కంపెనీల వార్షిక సర్వే (స్టీడ్‌మ్యాన్‌, యునిస్‌, అలియాక్‌బారి, 2020) మరియు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీజAజుR) ద్వారా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పొటెన్షియల్‌ ఇండెక్స్పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య బరువు పంపిణీని అనుకరించడం ద్వారా వెయిటింగ్‌ రేఖాచిత్రం వైవిధ్యత కోసం తనిఖీ చేయబడిరది. పరిమా ణాత్మక సూచికల బరువును 60 శాతానికి పెంచడం మరియు గుణాత్మక సూచికలను 40 శాతానికి తగ్గించడం ఫలితాల క్రమాన్ని ప్రభా వితం చేయలేదు. ఇంకా, పరిమాణాత్మక సూచికల బరువును 40 శాతానికి తగ్గించడం మరియు గుణాత్మక సూచికలను 60 శాతానికి పెంచడం ద్వారా ఇదే విధమైన అనుకరణ అసలైన సమాన-బరువుల ఫలితాల క్రమాన్ని వక్రీకరించలేదు. అందువల్ల, పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య సమాన బరువులు ఎంపిక చేయబడ్డాయి.
డేటా సోర్సెస్‌
మునుపటి విభాగంలో పేర్కొన్న ఐదు సూచికలపై వివిధ ద్వితీయ మూలాల ద్వారా డేటా సేకరించబడిరది. ఈ మూలాల్లో కేంద్ర రాష్ట్ర స్థాయిల నుండి ప్రభుత్వ డేటా ఉంటుం ది. టేబుల్‌ 5 ఈ మూలాల యొక్క వివరణా త్మక జాబితాను అందిస్తుంది. ఆరు రాష్ట్రాలు తమ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ (ణవీG) వెబ్‌సైట్‌లో తాజా డేటాను కలిగి న్నాయి. అయితే, నాలుగు రాష్ట్రాలకు, నవంబర్‌ 2019 నాటికి రంగాల వారీగా కేటాయిం పులను అందించే సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనా మిక్‌ ప్రోగ్రెస్‌ నివేదిక (శల్య,2020) నుండి డేటా ఉపయోగించబడిరది.
సేకరణ నిష్పత్తికి కేటాయింపు
ఈ నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్రాల దీర్ఘకాలిక ఉద్దేశాలకు ముఖ్యమైన సూచిక. అధిక నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణ యొక్క మెరుగైన కేటాయింపును సూచిస్తుంది. సెక్షన్‌ 2లో పేర్కొన్నట్లుగా, కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125శాతం కేటాయించగా,గోవా మొత్తం సెం టర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో32శాతం మాత్రమే కేటాయించింది.
సేకరణ నిష్పత్తికి వ్యయం
సేకరణ నిష్పత్తికి వ్యయం అనేది రాష్ట్ర నిజ-సమయ వ్యయ నమూనాల సూచిక. అధిక నిష్పత్తి మెరుగైన ప్రస్తుత/కొనసాగుతున్న పనితీరును సూచిస్తుంది. కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125 శాతం కేటాయించింది, అయితే దాని మొత్తం సేకరణలో 39 శాతం మాత్రమే వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది. %ణవీఖీ% సేకరణలో దాదాపు 98 శాతం కేటాయించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో అత్యధిక శాతం (68శాతం) ఖర్చు చేసింది.
అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు మొత్తం కేటాయింపుల శాతం
రాష్ట్రాలు,జిల్లాలు వాటి సంబంధిత కేటాయిం పులు,వ్యయ నమూనాల ఆధారంగా నేరుగా గ్రేడ్‌ చేయబడి ఉండవచ్చు. అయితే, అదే సమయంలో, వారి కేటాయింపు నమూనాల గుణాత్మక అంశాలను సంగ్రహించడం ముఖ్యం. ఉదాహరణకు,గుజరాత్‌ తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో దాదాపు 82 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించగా, తమిళనాడు అత్యల్ప శాతం (54శాతం) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించింది. ఈనియమాలకు కట్టుబడి ఉండడాన్ని సంగ్రహిం చడంలో మాకు సహాయపడుతుంది,ఇది కనీసం 60శాతం అధిక ప్రాధాన్యతగల ప్రాంతాలపై ఖర్చు చేయబడుతుందని పేర్కొంది.- (రాజేష్‌ చద్దా /ఇషితా కపూర్‌)

పాఠ‌శాల చుట్టూ సామాజిక ఉద్య‌మాన్ని నిర్మిద్దాం..!

ఓవైపు మనమంతా 23 శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం.
పిఆర్‌సిలో అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి ప్రతిఘటించింది ఉపాధ్యాయులు. పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు లను ఊడగొడతూ, కొత్త హక్కుల మాట ఎత్తకుండా చేస్తూ ఎందరికో విద్యా పునాది వేసిన ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పాఠశాల చుట్టూ సామాజిక ఉద్య మాన్ని నిర్మించాలి. ప్రాథమిక పాఠశాల-ప్రభుత్వ వైఖరి వచ్చే20ఏళ్ళ తరువాత పోటీ పరీక్షలకు విద్యార్థు లను సిద్ధంచేసేలా ఒకటవ తరగతిలోనే బీజం వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. 96 శాతం మంది తల్లులు తమ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుతున్నారు.అందువల్ల ప్రీప్రె ౖమరీ నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతు న్నామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అను గుణంగా విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకుం టున్నది.రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలలు1010వుండగా,40లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 16827. 30లోపువున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 1531. వంద లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 483.వీటన్నింటిలో46,769మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30వుండవలసి వుండగా1:16 మాత్రమే వుందని, అలాగే ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 1:35 కి బదులుగా 1:7.8 వుందని, ఉన్నత పాఠశాలల్లో 1:40కు బదులుగా 1:24 మాత్రమే వుందని చెబుతున్నారు. కనుక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలి. అలాగే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ప్రత్యామ్నాయ పాఠశాలలుగా మార్చి విద్యా వలంటీర్లతో నడిపితే ఎలా వుంటుందో ఆలోచన చేస్తున్నారు. ఈగణాం కాలను పరిగణ లోకి తీసుకొని మే 30,2020న సర్క్యులర్‌172తీసుకొచ్చారు. మూడు రకాల పాఠ శాల వ్యవస్థను ముందుకుతెచ్చి ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ఎమ్మెల్సీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆరురకాల పాఠశాలల వ్య వస్థను ముందుకు తెచ్చి, ఉన్నత పాఠశాలకి 500 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగుతులను మాత్రమే విలీనం చేస్తామని చెప్పారు. గతంలో సర్క్యులర్‌ 172కి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కనుక దానిని యథాతథంగా అమలు చేయడం లేదని తాత్కాలికంగా వెనక్కి తగ్గినా,తర్వాత ఆర్‌.సి.నెం.151 (18-10-20 21) ఉత్త ర్వులు ఇచ్చి దూకుడుగా తాము అనుకున్న విధానాల అమలుకు సిద్ధమయ్యారు. విద్యా హక్కు చట్టానికి భిన్నంగా జీవో 85 తీసుకొచ్చారు.ఈ ఉత్తర్వులలో ఎన్‌ఇపి 2020ని, ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని ఉటంకిస్తూ…1,2 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా చూడాలని, ఒకే మీడియంను పరిగణలోకి తీసుకోవాలని, వారానికి 30 నుండి 32 గంటల బోధన సమయం వుండాలని,45 పిరియడ్స్‌ వుండాలని…ప్రాథ మికోన్నత పాఠశాలలో 35లోపు విద్యార్థులున్న చోట, అలాగే 75లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠ శాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు ఎందరు వున్నారో లెక్క తేల్చాలని,20లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలల్లో పనిచేస్తూ ఉన్నతవిద్య అభ్యసించిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలు విలీనం అయ్యే ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోతే ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి బోధించాలని, 3కిమీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల సారాంశంగా ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ అస్తవ్యస్ధంగా వున్నదని, 3వ తరగతి నుండే సబ్జెక్ట్‌ బోధన, నాణ్యమైన విద్య అందించాలని, అంగన్‌వాడీతో కలిపి 1,2 తరగతులకు పునాది విద్య అందిస్తామని చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థ ఎందుకు బలహీనంగా వుందో అధ్యయనం చేసి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయత్నం చేయకుండా పాఠశాల వ్యవస్ధను మాయం చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాలి.
సమాధానం లేని ప్రశ్నలు దేశంలో ఏరాష్ట్రంలో లేని 3-10 తరగతుల వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చేసిన ఇలాంటి ప్రయోగం విఫలం అయ్యింది కదా! 1-5 తరగతుల విద్యార్థి సామర్థ్యాలు,6-10 తరగతుల సామర్థ్యాలు వేరువేరుగా వుంటాయి కదా. పిరియడ్స్‌ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన నుండి దూరం చేస్తుంది కదా! ప్లే స్కూల్‌గా వున్న అంగన్‌వాడీ కేంద్రాలలోకి 1,2 తరగతుల పిల్లలను చేర్చడం చదువు నేర్పడానికేనా? ‘ఒక్క పాఠశాల మూసివేయం. ఒక పోస్టు తగ్గించం’ అని ప్రభుత్వం చెబుతూ 1:30 నిష్పత్తిని ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలి? పునాది విద్యను నేర్పే ప్రాథమిక పాఠశాలను విడదీసిన తరువాత విద్యార్థికి చదువు దూరం కాదా! 1 కిమీలో పాఠశాల వుండాలనే ప్రాథమిక విద్యా హక్కు చట్టం నిబంధనకు ప్రస్తుత ఉత్తర్వులు విరుద్ధం కాదా! ఎన్‌ఇపి 2020 లోని 8వ తరగతి లోపు మాతృభాషలో విద్య అనేది ఎందుకు విస్మరించారు. ఎన్‌ఇపి 2020లో 3,4,5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడదీయాలని ఎక్కడైనా వుందా! తమ నివాస ప్రాంతాలలో స్కూలు లేకపోతే… దూరం పోలేని, దూరం పంపించడానికి ఇష్టపడని విద్యార్థులు పాఠశాలకు దూరం కారా! ఇప్పటికే ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి పాఠశాల వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపించడానికి చేసే ప్రయత్నం కాదా! ఒకే మీడియం వల్ల ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు మిగులుగా మారిపోతే, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం వల్ల వచ్చే ఎస్‌జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు రావు కదా! మొత్తం విద్యార్థులు, మొత్తం ఉపాధ్యాయులను పరిగణ లోనికి తీసుకొని ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని నిర్ధారించడం అశాస్త్రీయం కదా! ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీ ఉపాధ్యాయుల సంఖ్యను కేటాయించాలి కదా! ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోగా… విప్లవాత్మకమైన మార్పులను మీరు అంగీకరించాలని చెబుతున్నారు. ఐనా ‘ఒక్క సంవత్సరం ఆగండి. మా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తాయ’ని చెబుతున్నారు.
ఏం జరగబోతున్నది ?
75 సంవత్సరాలుగా ప్రజలందరికి అమ్మ ఒడి లాంటి ప్రాథమిక వ్యవస్థ కనుమరుగవుతుంది. విద్యార్థులు లేక కొన్ని, విలీనం వల్ల అన్ని ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొన్ని మాయమవుతాయి. ఉపాధ్యాయుల సంఖ్య (సుమారు 54 వేలు) తగ్గిపోతుంది. 1-2 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన బోధన వుండదు. ఇప్పటికే బడి బయట వున్న విద్యార్థులకు తోడు మరింత మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు.
ఏం చేయాలి ?
ఓవైపు మనమంతా 23శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం. వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు- ఎన్‌. వెంకటేశ్వర్లు

మన పంచాయితీ..మనదే రాజ్యాం

‘‘పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు కావలసిన సౌక ర్యాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. వార్డు సభ్యులు పంచాయతీ సమావేశాల్లో, కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా తమ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయా లను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. దీంట్లో భాగంగా గ్రామసభ విధివిధానాలను పాటిస్తూ విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ గ్రామసభ సంర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. విశేషాధి కారులన్న పీసా చట్టంపై ప్రతి గిరిజన గ్రామం లోను గిరిజనులను చైతన్య పర్చడం, పంచా యితీకి ఆదాయవనరులపైన, గిరిజను లకు సమత తీర్పును అనుసరిస్తూ స్థానిక వనరులను కాపాడుకోవడం వంటి అంశాలను గ్రామసభలో తీర్మానించి ఆమోదించడం జరిగింది’’
బొర్రా గేటువలస పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయితీ పరిధిలో ఉన్న 15గ్రామాల నుంచి పంచాయితీ సభ్యులు,మరియు కొంతమంది గ్రామస్థులు,వివిధ శాఖల అధికారులు,మార్కెట్‌ యార్డ్‌ కమిటి డైరెక్టర్‌ దోనేరి పార్వతి, ఎం.పి. టి.సి.కురిసేలా అరుణ, పీసా ఉపాధ్యక్షులు దోనేరి డానియల్‌, మరియు బొర్రా స్కూల్‌ సిబ్బంది,ఉపాధి హామీ పధకం వి.ఆర్‌.పి సాంరెడ్డి గోపి,టెక్నీకల్‌ అసిస్టెంట్‌ జగన్‌,హెల్త్‌ సిబ్బంది,సచివాలయం సిబ్బంది హజర య్యారు.గ్రామసభలో పంచాయితీ సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లాడుతూ బొర్రా పంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు,ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యుల ఆమోదం,పంచాయితీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను రాబట్టేందకుగాను పీసా చట్టం ప్రకారం పలు అంశాలను తీర్మానిం చారు. బొర్రా గుహల వద్ద వాహన పార్కింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నుంచి పంచా యితీకి రావాల్సిన 20శాతం వాటా,వీధి దీపాలు ఆధునీకరణ,ఎన్‌ఆర్‌జీఎస్‌ పనిదినాలకు రావాల్సిన కూలీల సొమ్ములు, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలను తీర్మాణించడం జరిగింది. తర్వాత సర్పంచ్‌ జన్ని అప్పారావు స్వాగతం పలికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము ఆరోగ్య శ్రీ,రేషన్‌ కార్డు, పెన్షన్‌,పి.యం.కిసాన్‌, రైతు భరోసా మొదలగు పధకాల గురించి పంచాయతీ ఆఫీసు లో బోర్డు పెట్టియున్నాము. అది మీరు చదువుకొని ఏదైనా సమస్య ఉంటె మీరు సచివాలయం నకు పిర్యాదు చేయవచ్చు. అలానే మన సమస్యలు ఏమి ఉన్న ఇక్కడ చర్చించా వచ్చు. గతంలో మన గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు కొంతవరకు ఈ సమస్యను తగ్గించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కరెంటు కొరత ఉంది. గ్రామాల్లో కరెంటు స్తంభాలు వేయాలి. ఆ సమస్య కూడా ఎలెక్ట్రిసిటీ వారితో మాట్లాడతానని చెప్పారు. సర్పంచిగా నేను మాట్లాడటం కాదు…అన్ని శాఖలు నుండి గవర్నమెంటు వారు వచ్చారు కాబట్టి ఒకొక్కరిని మాట్లాడమని పిలవడం జరిగింది. సంవత్స రానికి మూడు, నాలుగు గ్రామసభలు జరుగు తాయి. ఒకటి సాధారణ సమావేశం,మిగతావి గ్రామసభ ఇందులో మనకి ఉన్న సమస్యలు గురించి చర్చించు కోవడం. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా బొర్రా కేవ్స్‌ పార్కింగ్‌ గురించి ఒకతీర్మానం చేయడం జరిగింది. డి.పి.ఓ. డి.ఎల్‌.పి.ఓగారికి కూడా లెటర్‌ ఇవ్వడం జరిగింది. ఈరోజూ ట్రయిల్‌రన్‌ చేసి పి.ఓ గారి ద్వారా ఓపెన్‌ చేయడం జరుగుతుంది. పార్కింగ్‌ ఫీజు పంచాయతీ వాసులు చేస్తది. వ్యాసకర్త : కె.సతీష్‌కుమార్‌,సమత ఫీల్డ్‌కో`ఆర్డినేటర్‌

ఉపాధి బ‌హుదూరం..పెరుగుతున్న నిరుద్యోగం!

స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ.నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి.
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవించడంతో ఉపాధి బహు దూరమైంది. ఈ సమస్య సమీప భవిష్యత్తులో ఓమహాఉద్యమంలా మారనున్నది. సిఎమ్‌ఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ) విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు పరీశీలిస్తే..దేశంలో ఎంతమంది ఉపాధిలేక రోడ్డున పడినట్టు తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం..2021 డిసెంబర్‌ చివరి నాటికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్టు వెల్లడిరచింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల నిరుద్యోగ రేటు పెరుగుతోందని, అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం నమోదు కాగా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. గత ఏడాది 2020-21ఏప్రిల్‌-జూన్‌ త్క్రెమాసికంలో దేశంలో ‘నిరుద్యోగ రేటు’ 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో ఇదే త్క్రెమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8శాతానికీ, స్త్రీలలో 21.2 శాతానికీ పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 21 శాతమైంది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి,ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటిదోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలు ఆట్టే ఆశ్చర్యం అనిపించవు. ఇంకా చెప్పాలంటే,ఈ లెక్కల్లో కనిపించని వ్యథార్థ జీవుల యథార్థ గాథలు ఇంకెన్నో అనిపిస్తుంది. పాలకుల తక్షణ కర్తవ్యమూ గుర్తుకొస్తుంది. ఎంచుకున్న శాంప్లింగ్‌ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్నిసార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలవుతాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ అందించే లెక్కలు, చేసే సర్వేల నుంచి అసలు సూక్ష్మం గ్రహిం చడం కూడా ముఖ్యం. ఏడాది మొత్తంగా తీసుకొని 2019 జూలై మొదలు 2020-21 జూన్‌ వరకు చూస్తే మాత్రం నిరుద్యోగ రేటు నిరుటి 5.8 శాతం నుంచి 4.8శాతానికి తగ్గినట్టు పైకి అనిపిస్తుంది. కానీ, కరోనా తొలి వేవ్‌ సమయంలో 70 రోజుల లాక్‌డౌన్‌ సమయం అత్యంత కీలకం. ఆ కాలాన్ని లెక్కించిన ఆఖరు త్క్రెమాసికం చూస్తే, పట్టణ ప్రాంతాల్లో ఐటీ సహా సేవారంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఫలితంగా గణనీయంగా నిరుద్యోగం పెరిగిందని అసలు కథ అర్థమవుతుంది. నిజానికి, నాలుగేళ్ళ క్రితం 2017 ఏప్రిల్‌ నుంచి ప్రతి త్క్రెమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబం ధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు’ (యూఆర్‌) ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మస్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడు తుంది. కానీ, ద్రవ్యోల్బణం,మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది. ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. నిరుటి జూలై నుంచి సెప్టెంబర్‌ త్క్రెమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరు గున ఉన్న బంగ్లాదేశ్‌ (30.5 శాతం), శ్రీలంక (33.7 శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళు గానే ఉపాధి పొందుతున్నారు. దురదృష్ట వశాత్తూ, ఈ రంగాలన్నీ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతినడం వారికి ఊహించని ఇబ్బందిగా మారింది. సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31శాతమే అని లెక్క. అదనుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండ వచ్చు. కానీ, దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్క్రెమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయింది. ఆ సంగతి ఆర్థికవేత్తలే తేల్చారు. 15 ఏళ్ళు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి29ఏళ్ళ లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్‌, ఆఫీస్‌లు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదు. ఇది నిష్ఠురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55లక్షల ఉద్యోగాలు పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సైతం అంచనా వేయడం గమనార్హం. నిజానికి, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో ఈ మార్చితో ముగిసిన ఆర్థిక వత్సరంలో భారతఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర కుంచించుకు పోయింది. స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ. నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనిం చాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్త లు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీకా అస్త్రంతో అందరికీ కరోనా నుంచి ఆరోగ్య సంరక్షణ నివ్వాలి. అప్పుడు జనం సత్వర ఉపాధి అన్వేషణలో పడతారు. ఆర్థికవ్యవస్థ పురోగతిలో భాగమ వుతారు.
ఉపాధి బహుదూరం.. కోట్లలో పని లేనివారు
మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు నిరుద్యోగులకు అక్కరకు రావడం లేదా?ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు,చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు! ‘ప్రపంచంలో ఉపాధి అవకాశాలు, సామాజిక కోణం సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన తాజా నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా…2018లో అది 1.86 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. 2019 నాటికి ఇది ఇంకా పెరిగి 1.89 కోట్లకు చేరు కుంటుందనే అంచనాకు వచ్చింది ఐఎల్‌వో. 2018లో ఈ పెరుగుదల శాతం 3.4గా ఉం డొచ్చని తొలుత అంచనా వేసినా అది 3.5 శాతం దగ్గరే కొనసాగవచ్చని అభిప్రాయ పడిరది. వాస్తవానికి మన దేశంలో 2012లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్య 2014 నాటికి 3.4 శాతానికి తగ్గింది. కానీ 2015లో 3.5కి చేరుకుంది. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతుండటం గమనార్హం.2017కి ముందు కూడా ఐఎల్‌వో ఈ అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2017 నాటికి 1.78 కోట్లు, 2018లో 1.80 కోట్లగా నిరుద్యోగుల సంఖ్య ఉంటుందని అంచనా వేసినా.. 2017లో అంచనాలకు మించి 5 లక్షలు ఎక్కువగానే నిరుద్యోగుల సంఖ్య ఉన్నట్లు గుర్తించింది. ఈ మధ్య చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 70లక్షల ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. పైగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయాడం లేదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. విచిత్రం ఏమంటే ప్రధాని చెప్పిన లెక్కలకు, ఐఎల్‌వో నివేదించిన అంశాలకు ఎక్కడా పొంతన లేదు.
మొత్తంగా కొంత ఊరట!
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం, నిరుద్యోగ సమస్య మూడేళ్లలో తొలిసారిగా కొంత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయంగా ఐఎల్‌వో పేర్కొంది.2017లో 19.27 కోట్లగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2018లో 19.23 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉపాధి కోసం ఎదురు చూసే వారి సంఖ్య 19కోట్ల దగ్గర స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం గా పేర్కొంది.
ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన
ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు.సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు. భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది. దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం7శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా.భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది అని ఇండియాస్‌ లాంగ్‌ రోడ్‌ పుస్తక రచయిత డాక్టర్‌ జోషి చెబుతున్నారు. కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువ మంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు. ఈ కారణాలతో తక్కువ జీతాలతో,ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది.
భారత్‌ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా
ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్‌, లెదర్‌ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్‌ ఎగుమతులు తగ్గిపోయాయి.తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు,నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం,తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఛీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిన శర్మ అన్నారు. చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్‌ శర్మ అభిప్రాయపడ్డారు.బహుశాఉద్యోగాల కల్పన విషయంలో భారత్‌ తనఅవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో? – ఎన్‌.వి.సోమేశ్వరరావు

ఎంత కాలం ఈ పోరాటం

  • నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల వెతలు …..
  • ” పుట్టింది..పెరిగింది… నివసిస్తున్నది…అంతా ఏజెన్సీ ప్రాంతంలోనే. అయినా కొందరు గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేక పోతు న్నారు. కొందరు మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా.. కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజనులు ఆ హక్కులను, చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు. మరి కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు? ఎవరు తొలగిం చారు. ఎందుకు తొలగించారు..? అనే విషయాలు తెలుసుకుందాం..!!”
    నాన్‌ షెడ్యూల్‌ గిరిజన ప్రాంతాలను ఐదోవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో చేర్చాలనే నినాదంతో ఉపప్రణాళిక ప్రాంత గిరిజనులు, గాంధే యమార్గం లో చేస్తున్న పోరాటం ఆగలేదు.ఈసుదీర్ఘ ఉద్య మ ప్రస్థానంలో వారు న్యాయంకోసం,సాయం కోసం తొక్కని గడపలేదు.కలవని రాజకీయ నాయ కుడు లేడు.అనేక మంది నాయకులకు,అధికారులకు లేఖలురాస్తూ,విజ్ఞపన పత్రాలు అందిస్తున్నారు.ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆపార్టీ ముఖ్య మంత్రిని, మంత్రులను,నాయకులను కలసి మద్దతివ్వాలని అభ్యర్ధించారు. వానొచ్చినా,వరదోచ్చినా,ఎండలు నిప్పులు చెరుగుతున్నా..కరోనా భూతం కోరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పిల్లపాపలతో కలెక్టర్ల కార్యాలయాలు,ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయాలు తిరగని రోజంటూ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో తాము ఆదివా సులమే..అందరం అడవి బిడ్డలమే కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి.. అయి నా అభివృద్ధికి ఆమడదూరం..అటవీవనరులు పరిరక్షణ,తమహక్కులు సాధన కోసం ఎన్ని అవంత రాలు ఎదురైనా అహర్నిశులు శ్రమించి సాధించే వరకు పోరాటం ఆపేది లేదని నాన్‌షెడ్యూల్‌ ఏరి యా గిరిజన ప్రజలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తు న్నారు.
    వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్నగిరిపుత్రులదుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్నిగ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండ టమే దీనికి కారణం. రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులున్నా, ఇలాప్రభుత్వ రికార్డుల కార ణంగా గిరిజనులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పోతున్నారు.మరి,కొన్ని గ్రామాలుఏజెన్సీ ఏరియా రికార్డుల్లో లేకపోవడం కారణంగా వారిబ్రతుకులు నేటికీ అగమ్యగోచరంగానే ఉన్నాయి.
    బ్రిటిష్‌పాలనలో…గిరిజన తెగలు నివ సించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొ న్నారు.అందుకోసం(ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874)అమల్లోకి తెచ్చారు.మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్య వేక్షణ లో ఈప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలోఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొన సాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌ లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామా లను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర,ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటివి 800 గ్రామాలు ఉన్నాయి.
    అయిదవ షెడ్యూల్‌లో ఏముంది…
    అయిదో షెడ్యూలులోని క్లాజ్‌ 6 ప్రకా రం ప్రభుత్వం నోటిఫైచేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొం దుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార,సంప్ర దాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయి దో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొల గించడం లేదా కొత్తగాఏర్పాటు చేయడం వంటి వాటిపైఅధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ఏరియాలోఉంటున్న గిరిజనులకు… హక్కులు,చట్టాలు,రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70 వంటి చట్టాలు అమలులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు,అమ్ముకోవచ్చు. ఈ భూములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయవచ్చు’’ కేంద్ర ప్రభు త్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తాయని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టంలాంటివి అమల్లో ఉంటాయి. మైనింగ్‌ అనుమతులు ఇవ్వా లన్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు.‘నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసాచట్టం,గ్రామసభల అనుమతులతో పని లేదు.ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణ ను పొందలేక పోతున్నారని విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన నాన్‌ షెడ్యూల్‌ గిరిజన సంఘం ఉద్యమకారుడు, గిరిమిత్ర కార్యదర్శి బండి గంగరాజు ఆవేదన.
    ఉద్యోగాలు రావట్లేదు
    ప్రభుత్వ రికార్డులు ప్రకారం నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలుగా ఉన్న గిరిజన గ్రామాలు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా శంఖవరం,రౌతులపూడి, ఏలేశ్వరం,ప్రత్తిపాడు,కోటనందూరు మండలాల్లో 56నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామా లున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈగ్రామాల్లోని గిరిజనులు మౌలిక వస తులు,అభివృద్ధి,హక్కులు,రక్షణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీడీఏ పరిధిలో ఏదైనా ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు వెళ్లినా షెడ్యూల్డ్‌ ఏరియా లో లేని ఆదివాసీలుగా భావించి…ఉద్యోగాలు ఇవ్వ డం లేదని నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామానికి చెందిన వసుంధర చెప్పారు.కనీసం కులధృవీకరణ పత్రాలు సైతం మంజూరు చేయడం లేదని పెదమల్లాపురం కు చెందిన షెడ్యూల్‌ ఏరియా గిరిజన సాధన కమిటీ అధ్యక్షుడు బాలరాజు చెప్పారు.
    రాజకీయంగా కూడా దెబ్బే…
    ‘షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామ పంచాయి తీ సర్పంచ్‌ పోస్టులు,మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షు డి పోస్టులు అన్ని ఆదివాసీలకే రిజర్వు అయి ఉం టాయి. కానీ,నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న ఆది వాసీలకు మాత్రంరోస్టర్‌ విధానం(వంతుల వారీగా) ఉంటుంది. అందువల్ల గిరిజనులున్న ప్రాంతాల్లో కూడా అధికారం చాలాసార్లు గిరిజనేతరులకు వెళ్తుంది. దీని వలన రాజకీయంగా కూడా మేం ఎదగలేకపోతున్నాం’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా అజయ్‌పురానికి చెందిన కిల్లో రాంబాబు చెప్పారు. ‘ఉపాధి హామీ పనులకు కూడా మమ్మల్ని పిలవడం లేదు. పేరుకే ఆదివాసీలం. హక్కులు లేవు’ అని రాంబాబు అన్నారు.
    షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చమంటే… వీఎం ఆర్డీఏలోకి
    ఇప్పుడు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న ఆదివాసీలకు మరో సమస్య వచ్చింది. ఇప్పటి వరకు నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా నుంచి షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనిగిరిజనులు డిమాం డ్‌ చేస్తూంటే…వారి గ్రామాల్ని వీఎంఆర్డీఏ (విశాఖ మెట్రోపాలిటన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ)లో చేర్చారు.‘రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ ఏరి యాలోఉన్న11మండలాలను మినహాయించి… మిగిలిన జిల్లా అంతటినీ కూడా వీఎంఆర్డీఏ పరిధి లోకి తీసుకు వచ్చింది. ఇదంతా కూడా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో మైనింగ్‌ యధేచ్ఛగా సాగిం చేందుకే.విశాఖ జిల్లాలోని నాతవరం మండ లంలో సరుగుడు పంచాయితీ ఏరియా పరిధిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలే ఇందుకు ఉదాహ రణ. అలాగే తూర్పుగోదవరి జిల్లా శంఖవరం మండలం పెద్దమల్లాపురం,వేళింగి పంచాయితీ నాగులకొండపై కూడా లేట్‌రైట్‌ తవ్వకాలపై కన్ను పడిరది. ఇప్పటికే ప్రత్తిపాడు మండలం వంతాడ కొండంతా లేట్‌రైట్‌ తవ్వకాలు చేపట్టి ఆ ప్రాంతాన్ని శ్మశానవాటికల చేసి వదిలేశారు. విశాఖజిల్లా రావి కమతం మండలంలో ఆదివాసీ గ్రామాలు ఎక్కువ గా ఉన్నాయి. కానీఈగ్రామాలేవీ షెడ్యూల్డ్‌ ఏరియా లోఉండవు.ఇక్కడే మైనింగ్‌ ఎక్కువగా జరుగు తుంది. అయిదో షెడ్యూలు ఏజెన్సీ ప్రాంతాల్లో పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే… రాష్ట్ర గిరిజనసలహామండలి,రాష్ట్ర గవర్నర్‌ సిఫార్సు, సలహాలతో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుంది. నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరి యాలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఖనిజ వన రులు దోపిడీ,భూములఅమ్మకాలు,కొనుగోళ్లు యధే చ్ఛగా జరుగుతున్నాయి.అయితే ప్రజాప్రతినిధుల మాట మాత్రం వేరుగా ఉంది. వీఎంఆర్డీఏ కలిసే ప్రాంతాలన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందు తాయి. నాన్‌-షెడ్యూల్డ్‌ ప్రాంతాలు కూడా కల వడంవల్ల అవి త్వరగా అభివృద్ధి చెందుతాయి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.
    సరుగుడు పంచాయితీయే ఉదాహరణ…
    1985 వరకూ సరుగుడు ఏజెన్సీ ప్రాంతమంతా కొయ్యూరు తాలూకాలో ఉండేది.ఈపంచా యితీలో 16గ్రామాల్లో లేటరైట్‌ గనులు విస్తారంగా ఉన్నా యి. అయితే సరుగుడు ఏజెన్సీ మండలాల విభజ నలో నాతవరం మండలంలోకి మారింది. నాతవ రం మండలంనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంది. ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు గిరిజనేత రులకు,బినామీలకు ఇవ్వడం చట్ట విరుద్ధం. సరు గుడు ప్రాంతంలో లేటరైట్‌ ఖనిజ తవ్వకాల ప్రక్రి యలో ఈ నిబంధనలేవి పాటించడం లేదు. ఇక్కడ పూర్తిగా గిరిజన కుటుంబాలే ఉన్నాయి. అయినా అధికారుల దగ్గరవారు తాము గిరిజనులమని నిరూ పించుకోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో సరుగుడు ప్రాంతాన్ని వీఎంఆర్డీఏలో చేర్చారు. ఇదంతా లేట రైట్‌ మైన్స్‌ కోసమే’’ అని నాతవరం గిరిజన సంఘం నాయకులు అంటున్నారు.
    షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
    విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాం తాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పుపడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు.ఈమండలంలోనాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియా లో 33 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఎస్టీ జనాభా 50 శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత,సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌లో ఉంది. రావికమతం మండ లంలో 5గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు అని కనకరావు చెప్పారు.
    గతంలో జరిగిన ప్రయత్నాలెన్నో
    1976లో ఉమ్మడిరాష్ట్రంలో 800 గిరి జన గ్రామలునాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్నా యని…వాటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 2007లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న రెడ్యా నాయక్‌ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 800 గిరిజన గ్రామాలను (శ్రీకాకుళం-240,విజయనగరం-181,విశాఖపట్నం-90, తూర్పుగోదావరి-40,పశ్చిమగోదావరి-01) షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన ఉన్నట్లు అసెంబ్లీలో తెలిపారు. ఆతర్వాత దీనిపై మళ్లీ చర్చ జరగలేదు. అయితే 2018లో రాజ స్థాన్‌లోని 6జిల్లాలలో ఉన్న 9మున్సిపాలిటీలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’అని విశాఖ జిల్లా గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు డిమాం డ్‌ చేస్తున్నారు.
    వైఎస్సార్‌ హామీని…జగన్‌ నెరవేరుస్తారా
    2004లో పాదయాత్ర సందర్భంగా వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విశాఖజిల్లా వడ్డాదిలో నిర్వ హించిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఈ ప్రాం తంలోని నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని హామీ ఇచ్చారు.అయితే,వైఎస్సార్‌ మరణం, రాష్ట్రం లో సమైక్య, ప్రత్యేక ఉద్యమాలు,రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈఅంశం తెరమరుగైంది.అయితే ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉం దని…అర్హతలున్న అన్ని నాన్‌-షెడ్యూల్డ్‌ గ్రామాల్ని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేరుస్తామని పాడేరు ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ స్పష్టం చేశారు.
    కల నెరవేరేనా?
    తూర్పు,విశాఖజిల్లానాన్‌షెడ్యూల్‌ ప్రాంత గిరిజనగ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరం లో కొట్టుమి ట్టాడుతున్నాయి. మారుమూల గ్రామా ల్లో కనీస సదుపాయాలులేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఉచితవిద్య అందించే ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు,జూనియర్‌ కాలేజీలులేవ్వు. ఇక్కడనివసించే గిరిజన విద్యార్ధులకు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు.పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీఓ కార్యాలయాన్ని పెదమల్లాపురంలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన గ్రామాల్లో 1/70చట్టం వర్తించకపోవడంవల్ల గిరిజనేతరులు దళారీ చేతుల్లో తమ భూములను చేజిక్కించుకొని అన్యాయానికి గురవుతున్నారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం తాము సాగుచేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలు మంజూరు చేయాలి.ఈ ప్రాంత సమస్యలపై ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులు, అధి కారులను కలసి మొరపెట్టుకున్నాం. అయినా పట్టిం చుకోవడం లేదని గిరిజన సంక్షేమ సంఘం కార్య దర్శి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.– గున‌ప‌ర్తి సైమ‌న్‌

గోరపిట్ట

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన తెలుగు కథా ప్రియుల పాలిట ‘సువర్ణముఖి’గా సుపరిచితుడైన ‘రౌతు బంగా రు నాయుడు’’ కథారచన ‘ గోరపిట్ట ’ కథా చదవండి..! – సంపాదకులు

సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపిస్తుంది… ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా కథాసారాంశం. ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయాని కొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం1999.
మనిషి జీవితమే నిత్య పోరాటాల మయం..కొన్ని కనిపించేవి మరికొన్ని కనిపించనివి.. ఈమానవ జాతికి మూలవాసులుగా చెప్పబడే అడవిబిడ్డలకు…పోరాటాలకు విడదీయరాని నిత్య సంబంధాలు సదా కనిపిస్తూనే ఉంటాయి. కాలాలు మారిన పోరాటాలు మారలేదు అవి చేసే మను షులు,విధానాల్లో మార్పులు ఉండవచ్చు గాక కానీ వాటి అంతిమలక్ష్యం ఒకటే!! ఆర్థికలేమి, అమా యకత్వాలు,సొంతం గిరిబిడ్డలుచేసే పోరాటాల్లో వాళ్ళంతా సేవకులే తప్ప,నాయకులుగా ఉండక పోవడం దురదృష్టం,వారిలోని శారీరక శక్తిని పెట్టు బడి పెట్టుకుని కొందరు మానసిక శక్తిగల వారు, వారి స్వార్ధ పోరాటాల్లో ‘గిరిపుత్రులశ్రమను’ విని యోగించుకున్న వినియోగించుకుంటున్న సంద ర్భాలు అనేకం.
అలాంటి అరణ్యవాసుల శ్రమతో సాగిన పోరాటాలను చేరువనుంచి పరిశీలించిన సామా జిక చైతన్య కలం యోధుడు, తెలుగు కథా ప్రియుల పాలిట‘సువర్ణముఖి’గాసుపరిచితుడైన‘రౌతు బంగా రు నాయుడు’’ విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద దరి పెదమేరంగి గ్రామనివాసి. ఆయన కథల కలంకన్ను నిత్యం గిరిజనజీవితాల పోరాటాలను చూస్తూ స్పందిస్తూ ఉంటుంది. ఆయన రాసిన కథ లన్నీ అడవిబిడ్డల జీవన పోరాటాలు,సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంపడుతుంటాయి. ఇక సువర్ణముఖి రాసిన అనేక గిరిజనకథల్లో ఒకటి ‘‘గోరపిట్ట’’సాధారణంగా ‘మైనా’ పిట్టగా పిలవబడే మాటలు నేర్చే ఈపక్షిని ఉత్తరాంధ్ర గిరిజనులు, సవరలు,గోరపిట్టగా పిలుచుకుంటారు. ప్రాంతీయ అభిమానంతో స్థానికనేపథ్యాలు,విషయాలను కథ ల్లో నమోదు చేసే ఉత్తమ రచయిత లక్షణాలు జాలువారిన తనకలం ద్వారా సొంతం చేసుకు న్నారు. ఇక సువర్ణముఖి కథల్లో వైవిధ్యం కనిపి స్తుంది. ఒకేకథలో భిన్నమనుషులు,భిన్న ప్రాంతా లు కనిపిస్తాయి.కథ అంతా ఓనాటకంలా నడిచి పోతుంది. పాఠకుడు ప్రతిక్షణాన్ని,అక్షరాన్ని పరిశీల నాత్మకంగా పట్టుతప్పకుండా పఠించాల్సిందే!!
పాత్రోచితమైన సంభాషణలు,పాత్రోచితమైన వ్యక్తులను,తీసుకుని కథకు నిండుదనాన్ని హుందా తనాన్ని నింపడంలో ఈకథకుడు బహునేర్పరి. కథ లోని వాస్తవ సంఘటనలు రచయిత అనుభవాలే తప్ప ఎక్కడా అభూతకల్పనలకు చోటు లేదు. అది రచయిత రచనలోని ప్రామాణికతకు మూలా ధారం.ఈరచయిత ఎన్ని సంఘటనలు, ప్రాంతాలు, తీసుకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా తాను ఎంచుకున్న అంత సూత్రం ఆధారంగా నడిపించడం ‘సువర్ణ ముఖి’లోని కథా శైలికి పసిడికి పూత లాంటిది. ఇక గోరపిట్ట కథ విషయానికొస్తే ఇది కూడా ఒక భిన్నమైన గిరిజనపోరాటకథ. దీని రచనా కాలం 1999.సోములు-బంతెమ్మ అనే సవర గిరిజన దంపతులకు మనెమ్మ,శిరిమెల,జ్యోతి,అనే ముగ్గురు ఆడబిడ్డలు,ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం కూడా దీనిలో ఒక భాగం చేయబడిరది. కథ మొత్తం ప్రారంభం ఎత్తుగడ ముగింపువంటి ప్రాథమిక విషయాల మీదగాక పాత్రల జ్ఞాపకాల తలపోతలు వివిధ ప్రాంతాలు,సంఘటనలు,మేళవింపుతో రచయిత తనదైన శైలిలో సుదీర్ఘంగా కొనసాగుతుంది. మల్లు, భార్య శిరిమెలలు తమకు అడవిలోదొరికే గుమ్మడి కాయ,ఇతర అటవీఉత్పత్తులు,తీసుకుని పట్టణం లోని మనెమ్మను కలవడానికి బస్సెక్కి పోవడానికి సిద్ధమైవస్తూ మార్గమధ్యలో జన్మభూమి కార్యక్రమం కు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు తార సపడటం వారి మాటల సందడి వీరువిన డండంతో కథ ప్రారంభమవుతుంది.గ్రామాల్లో జరిగే కాంట్రాక్టులు అప్పగించడంలో నీతిపరుల కన్నా….అవినీతిపరులకే ఎందుకు అప్పగించాల్సి వస్తుందో….స్థానిక ఎమ్మెల్యేకి ఓరాజకీయ నాయ కుడికి మధ్య జరిగిన సంభాషణ సాయంగా రచ యిత ఇందులో ఎరుక పరుస్తారు.అంతలోనే పట్ట ణం పోతున్నమల్లు,శిరిమెలను చూసిన ఎమ్మెల్యే వారి వద్ద గల కుందేలు పిల్ల మీద మనసు పడటం, వారి నుంచి అందుకునే లోపు అది తప్పించు కోవడం,గోరపిట్ట,అంతకుముందే ఎగిరి పోవడం, తప్పించుకు పోయిన వాటిని వెతకడంలో విఫల మైన మల్లు,గీదరయ్యల,స్థితి చెబుతూనే అడవి జంతువులపై పట్టణవాసులు ఎలాఆశపడి అనుభవి స్తున్నారు.అడవిబిడ్డలను కూడా అదేతీరుగా దోచు కుంటున్నారు అనే ‘అక్షరదృశ్యము’ రచయిత ఈ సంఘటన ద్వారా చూపిస్తూ బావు ఎక్కడికెళ్లి పో తుంది బావు! మనుషులు అయినా జంతువులైన, పిట్టయినా,ఒడుపు దొరికితే పారిపోతాయి, కుదరక పోతే అమిరిపోతాయి.పోయినప్రతిదీ మన సంపద ఐతే,మనకు దొరక్కుండా ఎక్కడికెలిపోతది!? అంటూ ఎమ్మెల్యే గారితో మైదాన ప్రాంత నాయకు లనడంలోని మాటల ద్వారా అడవిబిడ్డల అభద్రత ఎలా ఉందో రచయిత స్పష్టం చేస్తారు.అదే సభలో ‘కందికొత్తపండుగ’కు రమ్మని గీదరయ్య, ఎమ్మెల్యేని ఆహ్వానించిన అందుకు సుముఖత చూపని అతనికి గిరిజనుల ఓట్లుమాత్రం ముఖ్యంగాని,వారి పండు గలు, సంప్రదాయాలు, అవసరం లేదనే విషయం వ్యంగ్యంగా చెప్పబడిరది. అంతేగాక జన్మభూమి మీటింగ్‌ అంటే ప్రజల కోసం పొద్దస్తమానం కొనసా గదని, కేవలం నాయకుల కోసమే అలా మొదలై ఇలా ముగిసిపోతుందని మాటలు నేర్చినగోరపిట్ట ప్రజనాయకుల కళ్లుకప్పి దూరం నుంచి ఎదురు వచ్చి తన భుజంమీద వాలగ,దాంతో మల్లు అన్న మాటల్లో రచయితకు జన్మభూమి కార్యక్రమంపై గల అభిప్రాయం అర్థమవుతుంది. మరోమారు జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, పాల్గొని గ్రామస్తుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రజల కోరికలు తీర్చడంలో వాళ్ళుచూపిన అనాసక్తి, నిర్ల క్ష్యం కూడా రచయిత అక్షరీక రించారు.గ్రామ రచ్చబండ వద్దకు వచ్చిన శిరిమెల పెంపుడు గోర పిట్ట మీద ఒకఅధికారి కన్నుపడటం,చేసేది లేక శిరిమెమలకు నచ్చచెప్పి ఆపిట్టను అధి కారికి అప్పజెప్పడం,గోరపిట్ట అధికారి చేతుల్లోగిల గిల కొట్టుకోవడం,దానికోసం శిరిమెల హృదయ విదా రకంగా ఏడవడం గురించి రచయిత కరుణ రసా త్మకంగా వివరించడం విశేషం. అంతేకాదు అడవి బిడ్డల్లోని ప్రేమ,ఆప్యాయతలు,అనుబంధాలు, కేవ లం మనుషులపట్ల మాత్రమేగాక పశుపక్షా దులు, పట్ల కూడా ఎలాఉంటాయో వివరిస్తారు. గోర పిట్టను ఇప్పుడు అధికారి తీసుకెళ్లినట్టు ఇరవై ఏళ్లక్రి తం శిరిమెల అక్క మనెమ్మను మరో అధికారి పట్టణం తీసుకుపోయిన వైనం, గీదరయ్య జ్ఞాపకాల ద్వారా రచయిత పాఠకులకు పరిచయం చేస్తాడు, పెద్ద బిడ్డను బలవంతంగా కోల్పోయిన బాధ వర్ణనా తీతం.ఒకపక్కఉద్యమంలో అమరుడైన భర్త సోము లు జ్ఞాపకాలు..మరోపక్క తమ ఆచారం ప్రకారం చేరదీస్తానని ముందుకు వచ్చిన మరిది. ఆత్మాభి మానంతో ..ఏడ్చి,ఎడ్చి,చివరికి జ్యోతి,శిరిమెలలను వదిలేసి భర్తదగ్గరకు చనిపోతుంది.భర్తచని పోయిన స్త్రీని ఆమెమరిది వివాహం చేసుకునే ఆచా రాన్ని చెప్పడంఇక్కడ మరొక ప్రధాన విషయంగా గమనిం చాలి. అలాగే పట్టణంలో గిరిజనేతరుని వివాహం చేసుకున్న మనెమ్మ తిరిగి తనభర్త సూర్య రావుతో విడాకులు తీసుకోవడంలో ఎదు ర్కొన్న చట్టపరమైన చిత్రమైన ఇబ్బందులు కూడా ఇందులో చూపించ బడతాయి., ఆదివాసి వివాహం హిందూ వివాహ చట్టం పరిధిలోకి రాదని కోర్టు తీర్పు ఇవ్వడం ఇందులో గమనించదగ్గ విషయం.అందుకే గిరిజను లు తమ తగువు లను కుటుంబ పంచాయితీలు ద్వారా తీర్చుకుం టారు అనిపిస్తుంది. ఇక కథ చివరి అంకంలో మారుమను వు చేసుకున్న సిరిమెల మల్లుల పెళ్లి విషయంరచయిత గుర్తుచేస్తూ గిరిజను ల్లో వుండే ‘ఓలి విధానంపెళ్లి’ విషయం చెబుతూ అలా ఓలిరూపంలో ఖర్చుచేసి కట్టుకున్న గిరిజనస్త్రీ తనకు ఆభర్త ఇష్టం లేకపోతే తనకు నచ్చిన వ్యక్తిని మారుమనువు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని, అయితే మొదటి పెళ్లి సమయంలో గిరిజనస్త్రీ తండ్రికి ధనం పశువులు,ధాన్యం,రూపంలోముట్టచెప్పినఓలిని మొదటిభర్తకు ప్రస్తుతం చేసుకున్న భర్త అప్ప చెప్పాల్సిన పద్ధతి, ఆచారంగురించి శిరిమెల-మల్లు ల మారుమనువు సంఘటనద్వారా రచయిత వివరి స్తారు.అలాగే ఈముగ్గురు అక్కచెల్లెళ్ళల్లో చివరిదైన జ్యోతి, అడ్డయ్యను పెళ్లి చేసుకోవడం అతడు క్రైస్తవ మతం లోకి వెళ్లి ‘జేమ్స్‌’గా…జీవనం సాగించడం, ఒక రోజు ఊహించని పరిణామంగా, జ్యోతి తన భర్త జేమ్స్‌తో రాత్రిసినిమాచూసి వస్తుండగా పోలీసులు అడ్డగించి‘నక్సలైటుజ్యోతక్క’గా… భావిం చి జ్యోతిని అన్యాయంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు పోవడం,అనంతరం ఆచుట్టుపక్కల గ్రామాలన్నీ గతంలోచేసిన పోరుబాటపట్టి జరిగిన అన్యా యాన్ని ఎదిరించడంకోసం గుంపులు గుంపులుగా మణెమ్మ సారధ్యంలో తరలిరావడం,చివరికి జరిగిన పొర పాటును గుర్తించిన పోలీసులు జ్యోతిని విడుదల చేయడం,ఇంతటి జనాదరణగల మణమ్మను రాజకీ యాల్లోకి ఆహ్వానించాలని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆశిం చడం,కథలో ముక్తాయింపుగా చెప్పబడిరది.గూడెం చేరినమణెమ్మ,శిరిమెల,జ్యోతిలు వారి కుటుంబ సభ్యులతో పాల్గొనడం దారిలోనే తమ పాత కాలపు సంఘం సభ్యులు తిరిగిరావడం.అంతేకాక, మనెమ్మ తండ్రిలాగే పోరుబాటకు తనవారితో కలిసి సిద్ధం కావడం,శిరిమెల ప్రాణప్రదంగా పెంచుకున్న ‘‘గోర పిట్ట’’బలవంతంగా పట్టణం పంపబడ్డ, తిరిగి తన గూటికే మరలివచ్చి ‘‘పరాయి చేయి తగిలి మాడి పోయిన అడవి’’లూజ్‌ చనిపోవడంతో ఈకథ సాం కతిక సందేశంతో ముగుస్తుంది. కథ ఆద్యంతం ఆదివాసీపోరాట నేపథ్యంలో సాగిన..అంతర్గ తంగా,అంతర్లీనంగా,వారి సంస్కృతి సంప్రదా యాలు జీవన విధా నాలు కలుపుకుని నడుస్తుంది అడవిబిడ్డల జీవన చిత్రాన్ని నూతనకోణంలో ఆవిష్కరించిన కథ ఈ గోరపిట్ట. (వచ్చే మాసం… మీకోసం కె. సీతారాములు కథ ‘‘తెలంగాణ గట్టు మీద పోలవరం)

బంజారా భావిపౌరుల ముచ్చ‌ట్లు

ఏ సమాజమైనా ఉన్నత స్థితికి చేరాలంటే అది ఆసమాజపు విద్యా వ్యవస్థ పైన, దాని ప్రధాన నిర్వాహకులు ఉపాధ్యాయుల పైన వారినిబద్దత పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు అన్నిటికీ కేంద్రబిందువైన ‘‘ఉపాధ్యాయకత్వం’’ పైకి కనిపించేటంత సామాన్య మైనది కాదు.వివిధ విభాగాలుగా విభజిం చబడి ఉన్న ఉపాధ్యాయ ఉద్యో గాలు ఆయా వ్యక్తులు చేసే నిబద్ధతగల కృషి ద్వారానే సంబంధిత ఉద్యోగాలకు, వ్యక్తు లకు,భవిష్యత్తు గుర్తింపు,సంతృప్తి, సమ పాళ్ళలో అంది వస్తాయి. కొద్ది కాలపు పంటల రక్షణ దిగుబడి కోసం రైతు మిత్రులు ఎంత ప్రయాస పడతారో మనకు తెలిసిందే..!
అలాగే ‘‘భావి సమాజపు నిర్మాణ పం టలైన’’ విద్యార్థులు అనబడే ఈ పసి పం టల గురించి,ఉపాధ్యాయ కృషి వలురు ఎలాంటి కృషి చేస్తున్నారో..! ఎంతగా కృషి చేయాలో చెప్పకనే చెప్పిన పుస్తకం ‘‘మా పిల్లల ముచ్చట్లు’’ టీచర్‌ అనుభవాలు….అనే అనుబంధ శీర్షికతో వెలువడిన ఈ విలువైన పుస్తకం వెలువరించింది ప్రముఖ కథా రచయిత్రి ‘‘సమ్మెట ఉమాదేవి’’.
ఇలాంటి అనుభవాలు అనుభూతులు ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయినికి ఉంటాయి ఇందులో విశేషం ఏముంది? అనుకోవచ్చు,కానీ ఇక్కడ ఆ అనుభవా లను పంచుకుంది ఓ..ఉపాధ్యాయిని,చక్కని సృజనాత్మక రచయిత్రి,దానితో ‘పసిడికిపన్నీరు పూసిన’చందమై ఈ సాధారణ అనుభవాలు,భావితరానికి బాగా పనికివచ్చే ఆదర్శ అక్షరాలై,అవి పుస్తకంగా అలంకరించ బడటానికి అన్ని అర్హతలు సాధించాయి. ఈ పుస్తక రచయిత్రి వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాప కురాలు. కానీ అమ్మభాష తెలుగు మీద ఇష్టం..పట్టు అధికం…అందున ఆమె అనుభవాలను, అనుభూతులను, మేళ వించి మేలైన కథలు రాయడంలోనేర్పరి, అలా కలగలిసిన అనుభవాల సృజనా త్మకతల కలబోతగా వెలువడిరదే… ఈ ‘మా పిల్లలముచ్చట్లు’.
ఇది సాధారణంగా కనిపించే అసాధారణ పుస్తకం,ముఖ్యంగా రచయిత్రి ఉమాదేవి శిష్య గణానికి భవిష్యత్తులో ఇదో ‘అపూ ర్వ కానుక’కానుంది,ఆయా విద్యా ర్థులం తా మరో పాతికేళ్ళకు మంచి మంచి స్థితుల్లో స్థిరపడి అబ్బురపరిచే తమతమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పరవశించడానికి ఈ పుస్తకం సచిత్రంగా చక్కగా సహకరిస్తుంది.ఇక ఈ పుస్తకంలోని విషయాలు ఇలా అక్షరీక రించడంలోని అవసరం..నేపథ్యం ఏమిటో తెలిస్తేనే పుస్తకం పట్టుదలగా పట్టుబట్టి చదవగలం. రచయిత్రి ‘సమ్మెట ఉమాదేవి’ సంపూర్ణ సామాజిక స్పృహ గల వ్యక్తే కాదు. పరిపూర్ణ పరోపకార గుణం గల స్త్రీ మూర్తి.
తనకు జీవనభృతి,సామాజిక గౌరవం, బ్రతుకుభద్రత,కలిగించిన తన ఉద్యోగం పట్ల అమితమైన ఇష్టం,గౌరవం కలిగిన వ్యక్తి,కనుక ఈనిస్వార్థ కార్యానికి కంక ణం కట్టుకుంది. తమ ఆరోగ్యం,ఇంటి సమస్యలను బూచిగా చూపి ఉద్యోగ జీవి తాలను మొక్కుబడిగా దొర్లించుకుపోతు న్న నేటితరం ఉద్యోగగణం.రచయిత్రి కృషిని ఆదర్శనీయంగా గమనించి ఆచర ణలో పెట్టాల్సి ఉంది. అందరూ పడే ఇబ్బందులు కన్నా కాస్త అధికం గానే ఆరోగ్య సంసారిక ఇబ్బందులున్నా…తన సమస్యల కన్నా తనవిద్యార్థుల సమస్యలు ముఖ్యం. తనకు ఆగుణం తల్లిదండ్రుల నుంచి అలవడిరది,.ఇక తను‘నిత్య బాట సారి’గా ఉంటూ మారుమూల లంబాడా తండాల్లో మాతృభాష తెలుగుకాని తండా పిల్లల విద్యావికాసం కోసం నిత్యం తపించి పనిచేసిన నిజమైన అధ్యా పకురాలు ఆమె. విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో విషయాలు లెక్క ప్రకారం చెప్పేసి,పరీక్షల్లో గట్టెక్కించడమే నేటి ఆధునిక ఉపాధ్యాయవృత్తి దారులకు పని గాఉన్న కాలంలో,విద్యార్థుల సొంత జీవి తాల్లోకి తొంగి చూసి తనకు చేతనై నంత లో సాయపడటం తనకు మించిన భార మైనప్పుడు,అర్హులైన దాతలకు విషయం వివరించి వారి దాతృత్వంను నిజా యితీ గా నిజమైన లబ్ధిదారులకు చేరవేయడం, ఆమె ఉద్యోగంలో ఒకభాగంగా భావిం చారు. రచయిత్రి ఉద్యోగ జీవిత నేపథ్యం అలాంటిది కనుకనే అంతటి అపూర్వ మైన రచన తెలుగు సాహిత్యానికి అంది వచ్చింది.ప్రక్రియ తదితర ప్రామాణిక తలను పక్కనపెడితే ఇదో‘చిత్రాక్షరి’. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జీవిత నేపథ్యంతో బ్రతుకు బండ్లను నెట్టు కొస్తున్న భావిపౌరులు ప్రతిచోటఉన్నారు.. ఉంటారు. కానీ వారిని చూసి సాను భూతిచూపడటం..దురదృష్టాలను తిట్టు కుంటూ..కాలంవెల్ల బుచ్చకుండా,వాటి పరిష్కారం కోసం ఎమి చేయాలో ఈపుస్త కం మార్గదర్శనం చేస్తుంది. ఇక ఈ అను భవాల పూరేకులను ఒక్కొక్కటిగా విప్పా రిస్తే ప్రతి రెమ్మ ఓ ఆదర్శనీయ అపురూ పమైన అనుభూతే..! అమాయకత్వంకు తోడు పేదరికం కలగలిసిన ఈబంజారా భావి పౌరులను ఉమాటీచర్‌ ఎలాతీర్చిది ద్దిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ‘జేగంట’ మొదలు‘ఉపసంహారం’వరకు సాగిన ఈచిరు వ్యాసాల సమ్మేళనంలో ప్రతివ్యాసం ఓప్రత్యేకతను కలిగి ఉన్నది. ముఖ్యంగా లంబాడా పిల్లలు బడికి రావడంలో ఎదురయ్యే ఇబ్బందులు వచ్చాక బడిలో పాఠాలు నేర్చుకునే వేళ పడే పాట్లు రచయిత్రి సున్నితంగా ఆలో చింపజేసేట్టు చెబుతారు.‘తండాల చరిత’ అనే ఒకఅనుభవంలో పట్టణాలకు దూ రంగా ఉండే లంబాడా లైన తండా వాసులు రవాణా సౌకర్యం లేక నేటికీ ప్రయాణాలు వేళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెబుతూనే ‘ముత్యాలం పాడు’లో తను పనిచేసే సమయంలో అక్కడి తన విద్యార్ధినిలను తాను ఉండే కొత్తగూడెం పట్టణంకు ఒకసెలవురోజు తీసుకువచ్చి పట్టణ వాతావరణంలో పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేసిన సమయంలో ఆరాత్రి కూడా ఆధునిక సౌకర్యాలను గడపాలన్న తాపత్రయంతో పిల్లలు చెప్పిన ‘రాత్రి ప్రయాణఅసౌకర్య’ వివరాలు తెలుసుకుని ఒకపక్క బాధ అని పించిన,పిల్లలు పథకం పారినందుకు పరవశిస్తుంది ఈపంతులమ్మ. ఇలా తాను విద్యాబోధన వేళ ఎదుర్కొన్న ప్రతి అను భూతిలో ఒకసామాజిక సమస్యను, అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ సాగటం,రచయిత్రిలోని సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. ఇక ఆ గిరిజన తం డాలలోని బతుకమ్మ ఆటో డి తీజ్‌ పండుగ వంటి వారి సాంప్రదాయ పండు గలు విశేషాలు వివరిస్తూ అందులో విద్యా ర్థులకు ఆధునికతను జోడిరచి భాగస్వా ములను చేయడం విద్యార్థులకు మరువ లేని మధురానుభూతులే…!! గిరిజన జనావాసాలు యుక్తవయసు బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వాటిని నివారించే పరిష్కార మార్గాల గురించి తనదైన బాణిలో చక్కటి సూచ నలు చేస్తుంది ఉమా మేడం‘ఫంక్షన్‌ సెలవులు’సంఘటన ద్వారా,బడి ప్రాణ లో చేసే సీమంతాలు,యుక్త వయసు లోని బాలబాలికలు తెలుసుకోవలసిన వ్యక్తిగత శుభ్రత,ఆరోగ్య జాగ్రత్తల గురిం చి,కూడా నిర్వహించిన కార్యక్రమాలు తాలూకు అనుభవాలు ఇందులో చెబు తారు.ఆడపిల్లలు మరుగుదొడ్లుతో పడుతున్న పాట్లు, ఇలా ఎన్నో విషయాలు ఆనందపు పోతపోసిన అగచాట్ల తాలూకు హృదయవిదారక, ఇబ్బందులను ఆలోచించే విధంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఇంతసమానత సమాజంలో చక్కర్లు కొడుతున్న… ఇంకా తండాల్లో కనిపిస్తున్న కుల వివక్షత గురించి‘ఒక కంచం కథ’ ద్వారా చూపిస్తారు.అలాగే తండాల్లో నేటికీ నెలకొని ఉన్నారు నిండు పేదరికానికి తార్కాణం ’కంచం గ్లాసు’ అనే సంఘటన చెబుతుంది. మనిషి జీవితం అన్న,మనుషులు నివసించే సమాజమైనా,భావి పౌరులను తయారు చేసే బడులైనా,ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఎదురయ్యే ఇబ్బందుల్లోనే సౌకర్యాలు సృష్టించుకొని ముందుకు సాగిపోవాలనే అక్షర సత్యాన్ని ఆవిష్క రిస్తుంది ఈటీచరమ్మ అనుభవాల తోట 255 పేజీల ఈబుల్లి గ్రంథం నిండా ప్రతి పేజీ గిరిజన తండా పిల్లల అగచాట్లు అగుపిస్తాయి. అందుకు అధ్యాపకులు అందించిన చేయూత, మరి కొందరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఆలోచనలు అందిస్తూ ఈఅనుభూతుల పుస్తక రచన సాగింది. నేటి కాలపు ఆధునిక అధ్యాపకులు అంతా తప్పక చదివి ఆచరించాల్సిన విషయాలు ఈపుస్తకంలో చాలా ఉన్నాయి.విద్యార్థుల మనసుల్లో పది కాలాలపాటు గుర్తుండి పోయే కృషి చేసి ‘ఉత్తమ ఉపాధ్యా యులు’గా నిలవాలి అనుకునే ప్రతి ఉపాధ్యాయుడు…ఉపాధ్యాయని ఈపుస్త కాన్ని తప్పక సొంతం చేసుకుని చదవాలి. పుస్తకాన్ని పాఠక ప్రపంచానికి అందించడానికి ముందుకు వచ్చిన ‘శాంతా వసంతట్రస్ట్‌’ వారు, ద్వితీయ ముద్రణ చేసిన ‘కవీర్ణప్రచురణలు’ వారూ.. అభినందనీయులు.
పుస్తకం వివరాలు :- ‘మా పిల్లల ముచ్చట్లు… ఒక టీచర్‌ అనుభవాలు’, (కవీర్ణ ప్రచురణలు)
రచన :- సమ్మెట ఉమాదేవి. పేజీలు :-256
వెల :- రు 250/- పుస్తకాల కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు :- 9849406722 డా: అమ్మిన శ్రీనివాసరాజు

అటవీహక్కుల చట్టంతోనే… ఆదివాసీలకు భరోసా….!

ఆదివాసీలు, గిరిజనులకు అడవి అమ్మ లాంటిది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది అడవే. వారి బతుకుదెరువు మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంది. అటవీ వనరులను వాడుకుంటూ, పోడు భూములను దున్నుకుంటూ బతికేవారే ఎక్కువ. వీరి హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిందే అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ప్రజాస్వామిక విలువలను పాటించడమే. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే ఆదివాసీలు,గిరిజనేతరుల హక్కులను రక్షించగలు గుతాం. అడవుల పరిరక్షణకు, ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించగలుగుతాం.
అన్ని రాజకీయపార్టీలు,ప్రజాసం ఘాలు కలిసికట్టుగా చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అటవీహక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు రైతుల సమస్యలకు పరిష్కారం వెతుకు తామని ప్రకటించింది. ఇదిఆహ్వానించ దగిన పరి ణామం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈచట్టం అమలు బాధ్యతను పూర్తిగా అటవీ శాఖకు అప్పగిం చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికా రులు శాటిలైట్‌ ఫొటోల్లో 2005కు ముందు పోడు భూములు దున్నుకున్నట్టు సాక్ష్యం కనబడకపోతే క్లైమ్‌ ఫారాలను తిరస్కరించే ప్రమాదం కనబడు తోంది. ఈ ప్రమాదం నుంచి పోడు రైతులు రక్షణ పొందాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అర్థం చేసుకోవాలి.
హక్కును కోల్పోయిన ఆదివాసీలు
అడవులను చట్టబద్ధంగా గుర్తించి, ప్రభుత్వ అధీ నంలోకి తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలకు, ఆడవు ల్లో నివసించే ఇతర సమూహాలకు జరిగిన అన్యా యాలను సరిదిద్దడానికే అటవీ హక్కుల చట్టం వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు అడవులను హస్తగతం చేసుకున్న నాటికే.. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనే తరులు నివసిస్తున్నారు. అటవీ వనరులను వీరంతా ఉపయోగించుకునే వారు. దానికి తోడు అడవుల్లోనే పోడు చేసుకొని బతుకుదెరువు పొందేవారు. అడవి వారికి ఇల్లు, జీవిక. ఎప్పుడైతే ఈ అడవుల చుట్టూ గీత గీసి వాటిని తమసొంత ఆస్తిగా బ్రిటిష్‌ పాల కులు,స్థానిక సంస్థానాధీశులు ప్రకటించారో.. అక్కడ నివసించే ఆదివాసీలు, గిరిజనేతరులు అప్ప టి వరకు తాము అనుభవించిన వనరులపై కలిగి ఉన్న సంప్రదాయక హక్కులను కోల్పోయారు. హక్కులను కాపాడేందుకే కుమ్రం భీం పోరాటం ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసమే కుమ్రంభీం పోరాటం చేశారు. 1940దశకంలో నిజాం ప్రభుత్వం అడవుల సం రక్షణ పేరుతో చట్టం ప్రకారం అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. అందువల్ల అడవుల్లో నివ సించే ఆదివాసీలు,గిరిజనేతరులు ఆక్రమణదారు లుగా మారిపోయారు. అడవుల్లో దున్నుకోవటానికి గాని, అటవీ ఉత్పత్తులను అనుభవించడానికి గాని వారికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు,ఉపయోగించినందు కు వారిపై అటవీశాఖ శిక్షలు వేయడం ప్రారంభిం చింది. అలా అడవులను తమ ఇల్లుగా భావించిన ఆదివాసీలు,గిరిజనేతరులను రాష్ట్ర ప్రభుత్వం చొరబాటుదారులుగా చూడటం మొదలైంది. దాని ఫలితంగా ఆదివాసీలు తమ బతుకుదెరువు కోల్పో యారు. తమ హక్కుల సాధన కోసం కుమ్రం భీం నేతృత్వంలో పోరాడారు. అప్పటి నుంచి ఆదివాసీలు పోయిన తమ హక్కుల సాధన కోసం ప్రతి ప్రభు త్వాన్ని అడుగుతూనే ఉన్నారు.
ఇది భూమి పంపిణీ చట్టం కాదు
చివరికి 2004లో అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సంప్రదాయకంగా ఆదివాసీలు అనుభ విస్తున్న హక్కులను గుర్తించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చిందే అటవీ హక్కుల చట్టం. ఇది భూమి పంపిణీ కోసం ఏర్పడిన చట్టం కాదు. ఆదివాసీల, ఇతర అటవీ సమూహాల సంప్రదాయక హక్కుల పరిరక్షణ కోసం వచ్చింది. ఆహక్కులను గుర్తించడానికి కూడా ఇది వరకటి చట్టాల మాదిరి గా కాకుండా చాలా వినూత్నమైన పద్ధతు లను తీసుకొచ్చింది. హక్కుల గుర్తింపు ప్రక్రియలో ప్రజ లకు విస్తృత భాగస్వామ్యం కల్పించింది. ఇవన్నీ అర్థమైతే తప్ప ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని గమనించాలి. అందుకే ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
అనుభవిస్తున్న భూమికి పట్టాలు
ఈచట్టం మిగతా భూమి పంపిణీ చట్టా లు, ఉత్తర్వుల కన్నా భిన్న మైనది. ఆచట్టాల ప్రకా రం ప్రభుత్వ మిగులు భూమి ఉంటే, అధికారులు సర్వే చేసి అలాంటి భూమిని పంపిణీ చేయవచ్చు. భూమి పంపిణీకి ఒకగరిష్ట పరిమితి ఉన్నది. అంత కు మించి ఇవ్వరాదు. ఈ చట్టాలతో పోలిస్తే అటవీ హక్కుల చట్టానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం భూమిని పంచదు. అడవుల్లో ఆదివాసీలు,గిరిజనేతరులు అనుభవిస్తున్న హక్కు లను గుర్తిస్తుంది. 10ఎకరాల లోపు ఎంత భూమి అనుభవిస్తే అంత భూమికి పట్టా ఇవ్వాలి. పోడు రైతుల యాజమాన్యపు హక్కులను నిర్ధారించేది గ్రామసభ ద్వారా ప్రజలేనని తెలుసుకోవాలి. దరఖా స్తులు తీసుకునేది, క్లెయిములను పరిశీలించేది గ్రామ సభ నియమించిన అటవీ హక్కుల కమిటీ అని గుర్తు పెట్టుకోవాలి.
రాజకీయ జోక్యం తగదు
చట్టం అమలులో ఎమ్మెల్యేలకు పాత్ర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మీడి యాలో వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజలకు, పోడు రైతులకు నష్టం చేసే విషయం. గ్రామసభ పనిలో కానీ,క్లెయిమ్‌ ఫారాల పైన నిర్ణయాల్లో కానీ రాజకీ య జోక్యం ఉండరాదు. సబ్‌-డివిజన్‌, జిల్లా కమి టీల నిర్మాణం జరగాలి. అన్ని నిర్ణయాలు కమిటీ ల్లోనే తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో మానిటరింగ్‌ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీ అటవీ హక్కుల చట్టం అమలును పర్య వేక్షించాలి. గిరిజన సంక్షేమ శాఖను నోడల్‌ ఏజెన్సీ గా నియమించాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం చేసే బాధ్యత గిరిజన సంక్షేమ శాఖకు ఇవ్వాలి. కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టం అమలు కావడం కష్టంగా మారుతుంది.
చట్టాన్ని అర్థం చేసుకోవాలె
అటవీ హక్కుల చట్టం అమలు చేయా లంటే ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని పాటించడం చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చట్టం అమలులో మార్గదర్శిగా, గ్రామసభ ద్వారా తన పాత్రను పోషించాలి. ప్రజల నిర్ణయశక్తిపైన గౌరవం లేకపోతే ప్రభుత్వ యం త్రాంగం చట్టాన్ని అర్థంచేసుకొని అమలు చేయ లేదు. అవినీతికి తావివ్వకుండా, రాజకీయ జోక్యం లేకుండా,పారదర్శకంగా,ప్రజాస్వామికంగా వ్యవ హరిస్తేనే అడవులను కాపాడవచ్చు. ఆదివాసీల, గిరిజనేతరుల హక్కులను రక్షించవచ్చు. అడవుల పరిరక్షణకు,ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వైరుధ్యాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించ వచ్చు. చివరగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయడమంటే ప్రజా స్వామిక విలువలను పాటించడమే. ఈ స్పృహతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ప్రతి పౌరుడు కోరుకోవాలి. అలావ్యవహరించేటట్టు ప్రతి ప్రజా స్వామికవాది తమ వంతు ప్రయత్నం చేయాలి.
గ్రామ సభకే సకల అధికారాలు
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామసభకే ఉన్నదని ప్రభుత్వం గుర్తిం చాలి. గ్రామ సభ తన తరఫున తాను నిర్వర్తించ వలసిన పనులను చేయడానికి అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. అటవీ హక్కుల కమిటీ సాక్ష్యాలను పరిశీలిస్తుంది. భూమి సరిహద్దులను రెవెన్యూ,అటవీశాఖలతో కలిసి నిర్ధారిస్తుంది. అటవీ హక్కుల కమిటీ నివేదికపై తుది నిర్ణయం గ్రామసభదే. గ్రామసభను పని చేయనివ్వక పోతే చట్టం అమలులో అటవీశాఖ పెత్తనం మాత్రమే కొనసాగుతుంది.
శాటిలైట్‌ ఫొటోలు ప్రామాణికం కాదు
భూమిని అనుభవిస్తున్నట్టు సాక్ష్యంగా పూర్తిగా శాటిలైట్‌ ఫొటోల మీద మాత్రమే ఆధార పడటానికి వీలు లేదు. చట్టానికి సంబంధించిన నియమాల్లో 14రకాల సాక్ష్యాలను పేర్కొన్నారు. అందులో ఏ రెండు ఉన్నా చాలునని నియమాలు చెపుతున్నాయి.నిజానికి శాటిలైట్‌ ఫొటోలను ప్రామా ణికంగా తీసుకోరాదని గతంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఆదివాసీలు
అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీ లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూములు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాల కులు.. వారిని ఇంకింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం,పంటలు ధ్వంసం చేయ డం,నివాసాలు ఖాళీ చేయిస్తూ..వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడు తున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆది వాసీల హక్కులను కాపాడాలి. ప్రపంచవ్యాప్తంగా 90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడువేలకు పైగా భాషలు,5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నా యి. ప్రకృతితో పెనవేసుకున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంత ర్భాగం. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తీవ్ర సమ స్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధారం. ఐక్యరాజ్య సమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి. కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయి లో కాపాడటం లేదు. అభివృద్ధి, ఇతర అవసరాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పోవడం వల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య, ఆర్థిక అవసరాల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికి కనీస పౌర సేవలు అందడం లేదు. ఇండి యాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.6శాతం అంటే 10.42కోట్ల ఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు,విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభు త్వం1/70 పీసా చట్టం చేసింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసులకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం 1967 ప్రకారం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13 డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమి స్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆ తేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికా రం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది. అటవీ హక్కులు పొందాలంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్రమణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ,ప్రభుత్వ రికార్డులు గానీ,ఏదైనా సెటిల్‌మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు, వర్కింగ్‌ ప్లానులు,అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాం టిది ఆధారాలుగా చెల్లుతాయి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు,ఇంటి పన్నురసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌,సర్వే రిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆప్రకారం రాష్ట్రంలో 1.78లక్షల ఎకరాలు లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయకుండా పక్కనపెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్నభూమిపై ప్రభు త్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికారులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూము లపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఆ పేద బతుకులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతు న్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుంటున్నారన్న నెపంతో గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూ బ్‌నగర్‌,వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.ఆఫీసర్ల వేధింపులు తట్టు కోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుం టు న్నారు.2011జనాభా లెక్కలప్రకారం తెలంగాణ లో 31లక్షల75వేలమంది ఆదివాసీలుఉన్నారు. ఆదివాసీల్లో ఉప తెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుం చితే..వారి వనరులు దోచుకోవడం,ఆవాసాలను, భూములను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్క లకు శ్రీకారం చుట్టింది.ఈలక్ష్యం మంచిదే అయి నా.. ఈ హరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు. కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీచట్టాలు నిర్వీర్యం అవు తున్నాయి. పోలీసులు, కోర్టుల గురించి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వందలాది ఎక రాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పారు. ఇంత వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆది వాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28 లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదం టే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజనులు మరో జల్‌,జంగల్‌,జమీన్‌ పోరాటానికి సిద్ధమ వుతారు.
– వ్యాసకర్త : రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లోక్‌ సత్తా పార్టీ.

ఏపీలో పీఆర్‌సీ రగడ

  • ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె
    ఎపి ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీఓలను తిరస్కరిస్తున్నట్లు ఎన్‌.జి.ఓ సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఐ.ఆర్‌.కన్నా తక్కువ ఫిట్‌ మెంట్‌ ఇచ్చిన సందర్భం చరిత్రలో లేదని శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగు లంతా ఆందోళనలు చేపట్టారు. కొత్త పిఆర్సి తమకు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె బాట పట్టనున్నారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి సమ్మె పై నిర్ణయంతీసుకుని ..ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటన. ఈనెల 26న అన్ని తాలుకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి.
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్‌ ప్రకటించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ నేతలు డిమాండ్‌ చేయగా..సర్కార్‌ మాత్రం నో చెప్పింది. సాంకేతిక అంశాల్ని అధ్యయనం చేయాల్సి ఉందన్న అధికారులు.. పీఆర్సీ నివేదిక బయటకు చెప్పేది లేదన్నారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో సర్కార్‌ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ రిపోర్ట్‌ ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని మండి పడ్డారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైసిపి తీవ్రంగా విమర్శించింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ఊరించింది. చివరికి టిడిపి ప్రభుత్వాన్ని మించిపోయి ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ముఖ్యమంత్రి తనకున్న పరిమితులను చెప్పట మంటే…తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిన లెక్కలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగుల మీద దాడి చేస్తుందని ముందుగా ఊహించినదే జరిగింది. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలతో పాటుగా ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, వారి సంక్షేమాన్ని చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉంటుంది. కనీస నైతిక సూత్రాలకు వైసిపి ప్రభుత్వం తిలోదకాలివ్వటం స్పష్టంగా బైటపడిరది.
    కనీస నైతిక సూత్రాలకు తిలోదకాలు
    పిఆర్‌సి నివేదిక వచ్చినప్పుడు దానిని వెల్లడిరచకుండా,చర్చ పెట్టకుండా వైసిపి ప్రభుత్వం దాచి పెట్టింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నివేదికను వెల్లడిరచకుండానే, ప్రభుత్వ సెక్రటరీలతో కమిటీ వేసి సిఫార్సులు చెయ్యమన్నది. సెక్రటరీల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం కంటే ఎక్కువగా తాము 23.29 శాతం ఎక్కువ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటిం చారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఇచ్చిన 27శాతం కంటే తాము ఇచ్చింది తక్కువ అనేది చెప్పలేదు. సమావేశంలో కూర్చున్న ఉద్యోగుల ప్రతినిధులు ఎవ్వరూ మారు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దగ్గర ఎవ్వరూ మాట్లాడకూడదని ముందుగానే ఇచ్చిన సూచనలను పాటించారు. దాంతో ఉద్యో గుల ప్రయోజనాలు ఒక్కొక్కటే కాలరాయటం కొనసాగింది. వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఉన్న 21శాతాన్ని 16శాతానికి తగ్గించి ఉద్యో గులకు అన్యాయం చేశారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వటం పిఆర్‌సి చరిత్రలోనే మొదటిసారి. డిఏ ను బేసిక్‌లో కలిపి దాని మీద ఫిట్‌మెంట్‌ ఇవ్వ కుండా బేసిక్‌ మీద మాత్రమే ఫిట్‌మెంట్‌ ఇచ్చి దానికి డిఏ ను కలపడం కూడా కనీస సూత్రా లకు విరుద్ధం. స్థూల వేతనాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వ సలహాదారులు చెప్పిన మాట కూడా ఖరారు కాకుండా, చివరికి స్థూల వేతనాలు తగ్గటమే ఖరారైంది. ఫిట్‌మెంట్‌ సంగతి వదిలేసిన జెఎసి నాయకత్వం హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ లకు పరిమితం కావటం నష్టం చేసింది. చివరికి హెచ్‌ఆర్‌ఎ,సిసిఎలు కూడా కోతకు గురిఅయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు కట్టాల్సి రావడం విచారకరం. 5 సంవత్సరాలకు ఒకసారి ఉన్న పిఆర్‌సిని 10 ఏళ్లకు మార్చి వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. పెన్ష నర్లకు అదనపు పెన్షన్‌ వచ్చే వయస్సు అర్హతను పెంచి వారికి నష్టం చేసింది. సిపిఎస్‌ రద్దు విషయం తేల్చకుండా వాయిదా వేసింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కూడా కట్టుబడలేదు.
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నష్టం
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఉండే పనులలోనే ఉన్నారు. అటువంటప్పుడు వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చెయ్యాల్సిన బాధ్యత, నైతికత ప్రభుత్వం మీద ఉంటుంది. కాని, మిగతా ప్రభుత్వాల మాది రిగానే వైసిపి ప్రభుత్వం కూడా వీరిని విభజించి పాలిస్తోంది. డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌,థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు అని విభజించినా…వారిద్దరూ చేసే పని ఒక్కటే. 2016లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుకు కూడా కొన్ని పరిమితులున్నాయి. సుప్రీంకోర్టు మినిమం బేసిక్‌ మాత్రమే ఇవ్వాలని చెప్పగా,కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ చట్టం నిబంధనలలో పర్మినెంట్‌ వర్కర్లు చేసే పనినే కాంట్రాక్ట్‌ వర్కర్లు చేస్తుంటే కాంట్రాక్టు వర్కర్లకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, డి.ఎ, అలవెన్సులు, ఇతర బెనిఫిట్లన్నీ కల్పించాలని ఉంది. సమాన పనికి సమాన వేతనానికి కాంట్రాక్ట్‌ వర్కర్ల చట్టం రూల్స్‌లో చెప్పింది మాత్రమే సరితూగుతుంది. ఇలా వుండగా… కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లందరిని పర్మినెంట్‌ చేస్తామనే వాగ్దానంతో జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారం లోకి వస్తే అందరినీ పర్మినెంట్‌ చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. కాని ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. కనీసం డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చెయ్యటం గురించి పట్టించుకోవటం లేదు. ఈ పిఆర్‌సి లో వీరి వేతనాల నిర్ణయంలో కూడా గతంలో మాదిరిగానే తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరి ముందు పిఆర్‌సి ప్రకటించే సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం బేసిక్‌ అమలు చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్పుడు వస్తున్న వేతనాల మీద 30శాతం పెంచు తామని ప్రకటించారు. ఆచరణలో ఈ రెండు అవాస్తవాలైనాయి. అంతిమంగా ఇచ్చిన జీవో లలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బాట పట్టింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది.
    పీఆర్సీ విధులు,విధానాలు
    పీఆర్‌సీని ఆంగ్లంలో (ూA్‌ RజుపIూIూచీ జూవీవీIుుజుజు) (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనా లను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూలవేతనాలు గా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు,ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతి పాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం,అయి దేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతానా లను ప్రతిపాదిస్తుంది.
    మధ్యంతర భృతి(ఐఆర్‌)
    ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలం లో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది.
    ఫిట్‌మెంట్‌
    తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితి శాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు.
    మాస్టర్‌ స్కేల్‌
    మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూలవేతనాల శ్రేణిని కమిటీకి నివేది స్తారు. కొత్త మూల వేతనాలు,మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు.మాస్టర్‌ స్కేల్‌లో మూల వేత నాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రి మెంట్‌ విలువలు పొందు పరుస్తారు.వేతన స్థిరీకర ణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.- పి.అజయ కుమార్‌
1 2