బంజారా భావిపౌరుల ముచ్చ‌ట్లు

ఏ సమాజమైనా ఉన్నత స్థితికి చేరాలంటే అది ఆసమాజపు విద్యా వ్యవస్థ పైన, దాని ప్రధాన నిర్వాహకులు ఉపాధ్యాయుల పైన వారినిబద్దత పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు అన్నిటికీ కేంద్రబిందువైన ‘‘ఉపాధ్యాయకత్వం’’ పైకి కనిపించేటంత సామాన్య మైనది కాదు.వివిధ విభాగాలుగా విభజిం చబడి ఉన్న ఉపాధ్యాయ ఉద్యో గాలు ఆయా వ్యక్తులు చేసే నిబద్ధతగల కృషి ద్వారానే సంబంధిత ఉద్యోగాలకు, వ్యక్తు లకు,భవిష్యత్తు గుర్తింపు,సంతృప్తి, సమ పాళ్ళలో అంది వస్తాయి. కొద్ది కాలపు పంటల రక్షణ దిగుబడి కోసం రైతు మిత్రులు ఎంత ప్రయాస పడతారో మనకు తెలిసిందే..!
అలాగే ‘‘భావి సమాజపు నిర్మాణ పం టలైన’’ విద్యార్థులు అనబడే ఈ పసి పం టల గురించి,ఉపాధ్యాయ కృషి వలురు ఎలాంటి కృషి చేస్తున్నారో..! ఎంతగా కృషి చేయాలో చెప్పకనే చెప్పిన పుస్తకం ‘‘మా పిల్లల ముచ్చట్లు’’ టీచర్‌ అనుభవాలు….అనే అనుబంధ శీర్షికతో వెలువడిన ఈ విలువైన పుస్తకం వెలువరించింది ప్రముఖ కథా రచయిత్రి ‘‘సమ్మెట ఉమాదేవి’’.
ఇలాంటి అనుభవాలు అనుభూతులు ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయినికి ఉంటాయి ఇందులో విశేషం ఏముంది? అనుకోవచ్చు,కానీ ఇక్కడ ఆ అనుభవా లను పంచుకుంది ఓ..ఉపాధ్యాయిని,చక్కని సృజనాత్మక రచయిత్రి,దానితో ‘పసిడికిపన్నీరు పూసిన’చందమై ఈ సాధారణ అనుభవాలు,భావితరానికి బాగా పనికివచ్చే ఆదర్శ అక్షరాలై,అవి పుస్తకంగా అలంకరించ బడటానికి అన్ని అర్హతలు సాధించాయి. ఈ పుస్తక రచయిత్రి వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాప కురాలు. కానీ అమ్మభాష తెలుగు మీద ఇష్టం..పట్టు అధికం…అందున ఆమె అనుభవాలను, అనుభూతులను, మేళ వించి మేలైన కథలు రాయడంలోనేర్పరి, అలా కలగలిసిన అనుభవాల సృజనా త్మకతల కలబోతగా వెలువడిరదే… ఈ ‘మా పిల్లలముచ్చట్లు’.
ఇది సాధారణంగా కనిపించే అసాధారణ పుస్తకం,ముఖ్యంగా రచయిత్రి ఉమాదేవి శిష్య గణానికి భవిష్యత్తులో ఇదో ‘అపూ ర్వ కానుక’కానుంది,ఆయా విద్యా ర్థులం తా మరో పాతికేళ్ళకు మంచి మంచి స్థితుల్లో స్థిరపడి అబ్బురపరిచే తమతమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పరవశించడానికి ఈ పుస్తకం సచిత్రంగా చక్కగా సహకరిస్తుంది.ఇక ఈ పుస్తకంలోని విషయాలు ఇలా అక్షరీక రించడంలోని అవసరం..నేపథ్యం ఏమిటో తెలిస్తేనే పుస్తకం పట్టుదలగా పట్టుబట్టి చదవగలం. రచయిత్రి ‘సమ్మెట ఉమాదేవి’ సంపూర్ణ సామాజిక స్పృహ గల వ్యక్తే కాదు. పరిపూర్ణ పరోపకార గుణం గల స్త్రీ మూర్తి.
తనకు జీవనభృతి,సామాజిక గౌరవం, బ్రతుకుభద్రత,కలిగించిన తన ఉద్యోగం పట్ల అమితమైన ఇష్టం,గౌరవం కలిగిన వ్యక్తి,కనుక ఈనిస్వార్థ కార్యానికి కంక ణం కట్టుకుంది. తమ ఆరోగ్యం,ఇంటి సమస్యలను బూచిగా చూపి ఉద్యోగ జీవి తాలను మొక్కుబడిగా దొర్లించుకుపోతు న్న నేటితరం ఉద్యోగగణం.రచయిత్రి కృషిని ఆదర్శనీయంగా గమనించి ఆచర ణలో పెట్టాల్సి ఉంది. అందరూ పడే ఇబ్బందులు కన్నా కాస్త అధికం గానే ఆరోగ్య సంసారిక ఇబ్బందులున్నా…తన సమస్యల కన్నా తనవిద్యార్థుల సమస్యలు ముఖ్యం. తనకు ఆగుణం తల్లిదండ్రుల నుంచి అలవడిరది,.ఇక తను‘నిత్య బాట సారి’గా ఉంటూ మారుమూల లంబాడా తండాల్లో మాతృభాష తెలుగుకాని తండా పిల్లల విద్యావికాసం కోసం నిత్యం తపించి పనిచేసిన నిజమైన అధ్యా పకురాలు ఆమె. విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో విషయాలు లెక్క ప్రకారం చెప్పేసి,పరీక్షల్లో గట్టెక్కించడమే నేటి ఆధునిక ఉపాధ్యాయవృత్తి దారులకు పని గాఉన్న కాలంలో,విద్యార్థుల సొంత జీవి తాల్లోకి తొంగి చూసి తనకు చేతనై నంత లో సాయపడటం తనకు మించిన భార మైనప్పుడు,అర్హులైన దాతలకు విషయం వివరించి వారి దాతృత్వంను నిజా యితీ గా నిజమైన లబ్ధిదారులకు చేరవేయడం, ఆమె ఉద్యోగంలో ఒకభాగంగా భావిం చారు. రచయిత్రి ఉద్యోగ జీవిత నేపథ్యం అలాంటిది కనుకనే అంతటి అపూర్వ మైన రచన తెలుగు సాహిత్యానికి అంది వచ్చింది.ప్రక్రియ తదితర ప్రామాణిక తలను పక్కనపెడితే ఇదో‘చిత్రాక్షరి’. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జీవిత నేపథ్యంతో బ్రతుకు బండ్లను నెట్టు కొస్తున్న భావిపౌరులు ప్రతిచోటఉన్నారు.. ఉంటారు. కానీ వారిని చూసి సాను భూతిచూపడటం..దురదృష్టాలను తిట్టు కుంటూ..కాలంవెల్ల బుచ్చకుండా,వాటి పరిష్కారం కోసం ఎమి చేయాలో ఈపుస్త కం మార్గదర్శనం చేస్తుంది. ఇక ఈ అను భవాల పూరేకులను ఒక్కొక్కటిగా విప్పా రిస్తే ప్రతి రెమ్మ ఓ ఆదర్శనీయ అపురూ పమైన అనుభూతే..! అమాయకత్వంకు తోడు పేదరికం కలగలిసిన ఈబంజారా భావి పౌరులను ఉమాటీచర్‌ ఎలాతీర్చిది ద్దిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ‘జేగంట’ మొదలు‘ఉపసంహారం’వరకు సాగిన ఈచిరు వ్యాసాల సమ్మేళనంలో ప్రతివ్యాసం ఓప్రత్యేకతను కలిగి ఉన్నది. ముఖ్యంగా లంబాడా పిల్లలు బడికి రావడంలో ఎదురయ్యే ఇబ్బందులు వచ్చాక బడిలో పాఠాలు నేర్చుకునే వేళ పడే పాట్లు రచయిత్రి సున్నితంగా ఆలో చింపజేసేట్టు చెబుతారు.‘తండాల చరిత’ అనే ఒకఅనుభవంలో పట్టణాలకు దూ రంగా ఉండే లంబాడా లైన తండా వాసులు రవాణా సౌకర్యం లేక నేటికీ ప్రయాణాలు వేళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెబుతూనే ‘ముత్యాలం పాడు’లో తను పనిచేసే సమయంలో అక్కడి తన విద్యార్ధినిలను తాను ఉండే కొత్తగూడెం పట్టణంకు ఒకసెలవురోజు తీసుకువచ్చి పట్టణ వాతావరణంలో పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేసిన సమయంలో ఆరాత్రి కూడా ఆధునిక సౌకర్యాలను గడపాలన్న తాపత్రయంతో పిల్లలు చెప్పిన ‘రాత్రి ప్రయాణఅసౌకర్య’ వివరాలు తెలుసుకుని ఒకపక్క బాధ అని పించిన,పిల్లలు పథకం పారినందుకు పరవశిస్తుంది ఈపంతులమ్మ. ఇలా తాను విద్యాబోధన వేళ ఎదుర్కొన్న ప్రతి అను భూతిలో ఒకసామాజిక సమస్యను, అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ సాగటం,రచయిత్రిలోని సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. ఇక ఆ గిరిజన తం డాలలోని బతుకమ్మ ఆటో డి తీజ్‌ పండుగ వంటి వారి సాంప్రదాయ పండు గలు విశేషాలు వివరిస్తూ అందులో విద్యా ర్థులకు ఆధునికతను జోడిరచి భాగస్వా ములను చేయడం విద్యార్థులకు మరువ లేని మధురానుభూతులే…!! గిరిజన జనావాసాలు యుక్తవయసు బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వాటిని నివారించే పరిష్కార మార్గాల గురించి తనదైన బాణిలో చక్కటి సూచ నలు చేస్తుంది ఉమా మేడం‘ఫంక్షన్‌ సెలవులు’సంఘటన ద్వారా,బడి ప్రాణ లో చేసే సీమంతాలు,యుక్త వయసు లోని బాలబాలికలు తెలుసుకోవలసిన వ్యక్తిగత శుభ్రత,ఆరోగ్య జాగ్రత్తల గురిం చి,కూడా నిర్వహించిన కార్యక్రమాలు తాలూకు అనుభవాలు ఇందులో చెబు తారు.ఆడపిల్లలు మరుగుదొడ్లుతో పడుతున్న పాట్లు, ఇలా ఎన్నో విషయాలు ఆనందపు పోతపోసిన అగచాట్ల తాలూకు హృదయవిదారక, ఇబ్బందులను ఆలోచించే విధంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఇంతసమానత సమాజంలో చక్కర్లు కొడుతున్న… ఇంకా తండాల్లో కనిపిస్తున్న కుల వివక్షత గురించి‘ఒక కంచం కథ’ ద్వారా చూపిస్తారు.అలాగే తండాల్లో నేటికీ నెలకొని ఉన్నారు నిండు పేదరికానికి తార్కాణం ’కంచం గ్లాసు’ అనే సంఘటన చెబుతుంది. మనిషి జీవితం అన్న,మనుషులు నివసించే సమాజమైనా,భావి పౌరులను తయారు చేసే బడులైనా,ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఎదురయ్యే ఇబ్బందుల్లోనే సౌకర్యాలు సృష్టించుకొని ముందుకు సాగిపోవాలనే అక్షర సత్యాన్ని ఆవిష్క రిస్తుంది ఈటీచరమ్మ అనుభవాల తోట 255 పేజీల ఈబుల్లి గ్రంథం నిండా ప్రతి పేజీ గిరిజన తండా పిల్లల అగచాట్లు అగుపిస్తాయి. అందుకు అధ్యాపకులు అందించిన చేయూత, మరి కొందరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఆలోచనలు అందిస్తూ ఈఅనుభూతుల పుస్తక రచన సాగింది. నేటి కాలపు ఆధునిక అధ్యాపకులు అంతా తప్పక చదివి ఆచరించాల్సిన విషయాలు ఈపుస్తకంలో చాలా ఉన్నాయి.విద్యార్థుల మనసుల్లో పది కాలాలపాటు గుర్తుండి పోయే కృషి చేసి ‘ఉత్తమ ఉపాధ్యా యులు’గా నిలవాలి అనుకునే ప్రతి ఉపాధ్యాయుడు…ఉపాధ్యాయని ఈపుస్త కాన్ని తప్పక సొంతం చేసుకుని చదవాలి. పుస్తకాన్ని పాఠక ప్రపంచానికి అందించడానికి ముందుకు వచ్చిన ‘శాంతా వసంతట్రస్ట్‌’ వారు, ద్వితీయ ముద్రణ చేసిన ‘కవీర్ణప్రచురణలు’ వారూ.. అభినందనీయులు.
పుస్తకం వివరాలు :- ‘మా పిల్లల ముచ్చట్లు… ఒక టీచర్‌ అనుభవాలు’, (కవీర్ణ ప్రచురణలు)
రచన :- సమ్మెట ఉమాదేవి. పేజీలు :-256
వెల :- రు 250/- పుస్తకాల కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు :- 9849406722 డా: అమ్మిన శ్రీనివాసరాజు