ఏపీలో పీఆర్‌సీ రగడ

  • ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె
    ఎపి ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీఓలను తిరస్కరిస్తున్నట్లు ఎన్‌.జి.ఓ సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఐ.ఆర్‌.కన్నా తక్కువ ఫిట్‌ మెంట్‌ ఇచ్చిన సందర్భం చరిత్రలో లేదని శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగు లంతా ఆందోళనలు చేపట్టారు. కొత్త పిఆర్సి తమకు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె బాట పట్టనున్నారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి సమ్మె పై నిర్ణయంతీసుకుని ..ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటన. ఈనెల 26న అన్ని తాలుకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి.
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్‌ ప్రకటించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ నేతలు డిమాండ్‌ చేయగా..సర్కార్‌ మాత్రం నో చెప్పింది. సాంకేతిక అంశాల్ని అధ్యయనం చేయాల్సి ఉందన్న అధికారులు.. పీఆర్సీ నివేదిక బయటకు చెప్పేది లేదన్నారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో సర్కార్‌ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ రిపోర్ట్‌ ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని మండి పడ్డారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైసిపి తీవ్రంగా విమర్శించింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ఊరించింది. చివరికి టిడిపి ప్రభుత్వాన్ని మించిపోయి ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ముఖ్యమంత్రి తనకున్న పరిమితులను చెప్పట మంటే…తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిన లెక్కలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగుల మీద దాడి చేస్తుందని ముందుగా ఊహించినదే జరిగింది. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలతో పాటుగా ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, వారి సంక్షేమాన్ని చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉంటుంది. కనీస నైతిక సూత్రాలకు వైసిపి ప్రభుత్వం తిలోదకాలివ్వటం స్పష్టంగా బైటపడిరది.
    కనీస నైతిక సూత్రాలకు తిలోదకాలు
    పిఆర్‌సి నివేదిక వచ్చినప్పుడు దానిని వెల్లడిరచకుండా,చర్చ పెట్టకుండా వైసిపి ప్రభుత్వం దాచి పెట్టింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నివేదికను వెల్లడిరచకుండానే, ప్రభుత్వ సెక్రటరీలతో కమిటీ వేసి సిఫార్సులు చెయ్యమన్నది. సెక్రటరీల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం కంటే ఎక్కువగా తాము 23.29 శాతం ఎక్కువ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటిం చారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఇచ్చిన 27శాతం కంటే తాము ఇచ్చింది తక్కువ అనేది చెప్పలేదు. సమావేశంలో కూర్చున్న ఉద్యోగుల ప్రతినిధులు ఎవ్వరూ మారు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దగ్గర ఎవ్వరూ మాట్లాడకూడదని ముందుగానే ఇచ్చిన సూచనలను పాటించారు. దాంతో ఉద్యో గుల ప్రయోజనాలు ఒక్కొక్కటే కాలరాయటం కొనసాగింది. వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఉన్న 21శాతాన్ని 16శాతానికి తగ్గించి ఉద్యో గులకు అన్యాయం చేశారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వటం పిఆర్‌సి చరిత్రలోనే మొదటిసారి. డిఏ ను బేసిక్‌లో కలిపి దాని మీద ఫిట్‌మెంట్‌ ఇవ్వ కుండా బేసిక్‌ మీద మాత్రమే ఫిట్‌మెంట్‌ ఇచ్చి దానికి డిఏ ను కలపడం కూడా కనీస సూత్రా లకు విరుద్ధం. స్థూల వేతనాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వ సలహాదారులు చెప్పిన మాట కూడా ఖరారు కాకుండా, చివరికి స్థూల వేతనాలు తగ్గటమే ఖరారైంది. ఫిట్‌మెంట్‌ సంగతి వదిలేసిన జెఎసి నాయకత్వం హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ లకు పరిమితం కావటం నష్టం చేసింది. చివరికి హెచ్‌ఆర్‌ఎ,సిసిఎలు కూడా కోతకు గురిఅయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు కట్టాల్సి రావడం విచారకరం. 5 సంవత్సరాలకు ఒకసారి ఉన్న పిఆర్‌సిని 10 ఏళ్లకు మార్చి వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. పెన్ష నర్లకు అదనపు పెన్షన్‌ వచ్చే వయస్సు అర్హతను పెంచి వారికి నష్టం చేసింది. సిపిఎస్‌ రద్దు విషయం తేల్చకుండా వాయిదా వేసింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కూడా కట్టుబడలేదు.
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నష్టం
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఉండే పనులలోనే ఉన్నారు. అటువంటప్పుడు వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చెయ్యాల్సిన బాధ్యత, నైతికత ప్రభుత్వం మీద ఉంటుంది. కాని, మిగతా ప్రభుత్వాల మాది రిగానే వైసిపి ప్రభుత్వం కూడా వీరిని విభజించి పాలిస్తోంది. డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌,థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు అని విభజించినా…వారిద్దరూ చేసే పని ఒక్కటే. 2016లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుకు కూడా కొన్ని పరిమితులున్నాయి. సుప్రీంకోర్టు మినిమం బేసిక్‌ మాత్రమే ఇవ్వాలని చెప్పగా,కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ చట్టం నిబంధనలలో పర్మినెంట్‌ వర్కర్లు చేసే పనినే కాంట్రాక్ట్‌ వర్కర్లు చేస్తుంటే కాంట్రాక్టు వర్కర్లకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, డి.ఎ, అలవెన్సులు, ఇతర బెనిఫిట్లన్నీ కల్పించాలని ఉంది. సమాన పనికి సమాన వేతనానికి కాంట్రాక్ట్‌ వర్కర్ల చట్టం రూల్స్‌లో చెప్పింది మాత్రమే సరితూగుతుంది. ఇలా వుండగా… కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లందరిని పర్మినెంట్‌ చేస్తామనే వాగ్దానంతో జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారం లోకి వస్తే అందరినీ పర్మినెంట్‌ చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. కాని ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. కనీసం డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చెయ్యటం గురించి పట్టించుకోవటం లేదు. ఈ పిఆర్‌సి లో వీరి వేతనాల నిర్ణయంలో కూడా గతంలో మాదిరిగానే తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరి ముందు పిఆర్‌సి ప్రకటించే సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం బేసిక్‌ అమలు చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్పుడు వస్తున్న వేతనాల మీద 30శాతం పెంచు తామని ప్రకటించారు. ఆచరణలో ఈ రెండు అవాస్తవాలైనాయి. అంతిమంగా ఇచ్చిన జీవో లలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బాట పట్టింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది.
    పీఆర్సీ విధులు,విధానాలు
    పీఆర్‌సీని ఆంగ్లంలో (ూA్‌ RజుపIూIూచీ జూవీవీIుుజుజు) (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనా లను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూలవేతనాలు గా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు,ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతి పాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం,అయి దేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతానా లను ప్రతిపాదిస్తుంది.
    మధ్యంతర భృతి(ఐఆర్‌)
    ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలం లో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది.
    ఫిట్‌మెంట్‌
    తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితి శాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు.
    మాస్టర్‌ స్కేల్‌
    మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూలవేతనాల శ్రేణిని కమిటీకి నివేది స్తారు. కొత్త మూల వేతనాలు,మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు.మాస్టర్‌ స్కేల్‌లో మూల వేత నాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రి మెంట్‌ విలువలు పొందు పరుస్తారు.వేతన స్థిరీకర ణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.- పి.అజయ కుమార్‌