వేలంబస

ఉత్తరాంధ్ర పలుకులు.. జీవితాలు,భిన్న సంస్కృతులు, సామాజిక అసమ తౌల్యాలు, సమతమమతలను వడపోసిన విఖ్యాత కథారచయిత చింతకింద శ్రీనివాసరావుకు బాగా తలుసు. తెలుసు అనేకంటే వాటిని ఆయన గాఢంగా పరిశీలిస్తారని చెప్పవచ్చు. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది.
తూర్పు కనుమల్లో తిరుగాడే అడవి బిడ్డలకు ఉండే ఆచారాలు అలవాట్లు, ఆధునికులకు అబ్బురం కలిగించే విషయా లు,అందులో దాగి ఉండే ఆత్మీయతలు ఐక మత్యాలు అందరికీ ఆదర్శనియాలే…! విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ చింతకింది శ్రీనివాస రావు. తనదైన పత్రికా రచన వృత్తి రీత్యా పాత్రికేయులు. ఉత్తరాంధ్ర జిల్లాలోని గిరిజనులతో మమేకమై వారితో దగ్గరగా జీవించిన వ్యక్తి, ఆదివాసుల జీవన చిత్రాలు అంటేనే పోరా టాలు,మోస పోవడం,ఉద్యమాల్లో బలి కావడం,వంటి విష యాలే ఎక్కువగా గుర్తుకు వచ్చి ఆకథాంశాలతోనే తెలుగు గిరిజనకథ విస్తరించింది. అందుకు భిన్నంగా వారి సంస్కృతి,సాంప్రదాయాలు, కథావస్తువు లుగా వెలు వడుతున్న కథల రాశి. అటు వంటి భావి అవసరా లను గుర్తించి కథలు రాసే అతి కొద్ది మంది రచయి తల్లో శ్రీనివాసరావు ఒకరు. తను రాసిన వన జీవుల కథల సంఖ్య తక్కువే అయినా సూక్ష్మ పరిశీలన గుణం చక్కని సంభాషణ శైలితో పాఠకులను తన కథవెంట పరవశంతో నడి పించే సృజన కారుడు ఆయన. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది. తాను 40 సంవ త్సరాల క్రితం ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు నేటికీ అరణ్యవాసుల జీవి తాల్లో సజీవంగా కనిపించడం సాంప్రదా యాల పట్ల వారు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అర్థమవుతుంది,అందుకే ఈరచయిత తన కథావస్తువుగా ఆవిష యాన్ని ఎంపిక చేసుకుని ‘‘వేలంబస’’ కథ అందించారు. ఇక కథ విషయాని కొస్తే జంబారి,గుమ్మీలుఅనే ఇద్దరు గిరిజన ‘‘చెలిమి గాళ్ళు’’అడవికి వేటకు వెళ్ళడంతో ప్రారంభమైన ఈ కథ ఆసాంతం అడవిలోనే సాగుతుంది, ఏకఅంశం,ఏకకాలం, అనే రెండు గుణాలు ఇందులో నిండుగా ఉండి కథానిక లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం కథ అంతా ఇద్దరి సంభాషణతో నడిపిం చడం,అది పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ కడదాకా కథను చదివింపచేయడం దీనిలోని విశేషాలు. కథలోని సంభాష ణలు తూర్పు మన్యం ప్రాంత గిరిజన యాస,పలుకుబడితో,కూడి ఉండటంతో పాటు,అచ్చమైన అటవీ వాతావరణం అడుగడుగునా కనిపిస్తుంది.అంతేకాదు అడవిబిడ్డలు చేసే వేటరకాలు,తొలకరి ఆరంభానికి ముందు ప్రతి గిరిజన గూడెంలో జరిగే వేటకు సంబంధిం చిన,’’ఇటిం పండుగ’’ విశేషాలు రచయిత ఇందులో సందర్భాలు గుణంగా వివరిస్తారు. ఈకథ కూడా ‘‘ఇటిం పం డుగ’’ నేపథ్యంలో కొనసాగుతుంది. విశాఖ మన్యంలోని గిరిబిడ్డలు ప్రతి ఏటా ఏప్రిల్‌,మే,నెలల్లో వేటకు సంబంధించిన ఈ పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ప్రతి గిరిజన యువ కుడు పొద్దున్నే అడవికి వెళ్లి సాయంత్రం గూడెం చేరుకునే వేళకు, సొంతంగా చేసే ‘‘ఒబ్బిడి’’ వేట ద్వారా గాని, సామూహికంగా చేసే ‘‘సోపు’’ వేటద్వారా గాని అడవి జంతువులను వేటాడి తెచ్చి,
‘‘వేలంబస’’ అనే పేరు గల ఊరి బయట ఖాళీస్థలంలో ఉంచాలి. అలా లక్ష్యంలోగా ఒక్క జంతువునైనా వేటాడి తీసుకురాక పోతే ఆగూడెం లోని వరసైన యువ తులంతా …ఒట్టి చేతులతో వచ్చిన యువకులపై పేడనీళ్లు, రంగునీళ్లు, మామూలు నీళ్ళు,పోసి సరాగాలు హాస్యా లు ఆడతారు.ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో ‘‘ఇటుకల పండుగ ‘‘అంటారు ఆనేపథ్యంలోనే ‘‘వేలంబస’’ కథ కొన సాగింది.ఇటుకల పండుగ నాడు అడవి జంతువుల వేటకు బయలుదేరుతారు జంబారి,గుమ్మీలు,అనే గిరిజన మిత్ర ద్వయం. అడవి తల్లి దయతోనే తమకు వేట జరిగి ఏదో ఒక జంతువు పక్షి దొరుకుతుందని తద్వారా గూడెంలో ఆడవారి ముందు పరువు దక్కించు కోవచ్చు అనే లక్ష్యంతో కొండ బాటన నడుస్తుంటారు. వేటలో జంభారి కాస్త చురుకైన వాడు, గుమ్మిలే మందకొడి, తను అడివంతా పొద్దుటి నుంచి తిరిగిన….ఎక్కడ ఏ జంతువు,పక్షి, చిక్కలేదు.మధ్యాహ్నం వస్తుండడంతో సాయంత్రం ‘వేలంబస’లో ఆడవాళ్లు చేసే వెక్కిరింతలు,అవమానాలు, గుర్తు కొచ్చి గుండెలు జల్లుమన్నాయి ఇద్దరికీ, దిప్ప (ఆనపబుర్ర)లో తెచ్చుకున్న చోడి అంబలి తాగి దాహం,ఆకలి,తీర్చుకుని మళ్ళీ వేట ప్రయత్నం మొదలు పెడ తారు.కిందటి రోజు గింజలు పోసి పెట్టిన ఉచ్చులో ఏమైనా పడ్డ ఏమో అన్న ఆశ కొద్ది అటువైపు వెడతారు. మూడో కం టికి తెలియకుండా గుర్తులు నాటిన, దగ్గరకు వెళ్లారు అక్కడి దృశ్యం చూసిన మిత్రద్వ యం ఆనందానికి హద్దులు లేకుండా అయ్యింది.వారు ఉంచిన ఉచ్చులో కుందేలు చిక్కుకొని ఉంది. వెంటనే లాఘవంగ దాన్ని తీసి సంచిలో వేసి, జాంబకు ఇచ్చి అంతకుముందే కోరింగ పొదలో పరిచిన వల వైపు కదిలారు ఇద్దరు.అదృష్టం వెంటవెంటనే మంది వచ్చినట్టు ఆ వలలో మరో రెండు కుందేళ్ళు చిక్కుకుని కనిపించడంతో వారి ఆనందం అడి వంత అయింది, కానీ అక్కడ వేట జరిగింది ‘జంబారి’ ఉచ్చులు,వలలు,వల్లే…!!మిగిలింది గుమ్మీలు వేట,అతను పెట్టిన ఉచ్చుల వైపు నెమ్మదిగా కదిలారు, కానీ అక్కడ వారి కళ్ళకు నిరాశే కనిపించింది.పెట్టిన ఉచ్చులు పెట్టినట్టే ఉన్నాయి. వేసిన దుం పలు వేసినట్టే ఉన్నాయి. గుమ్మీలు గుండె జారింది. బాధతో బావురుమన్నాడు అది చూసిన’’జంబారి’’ కళ్ళు చెమ్మగిల్లాయి.ఆ క్షణాన జంబారిలో అడవిబిడ్డల ఉండే సహజ గుణం సహకారం అనే మాటల ముందుకు వచ్చింది, వేటలో వారికుండే రెండు పద్ధతులు గుర్తు చేశాడు, ఇప్పుడు మనం చేసిన వేట నేను ఒక్కడినే చేసిన ‘ఒబ్బిడి’వేట కాదు,మనం సమానంగా పంచుకునే ‘‘సోపువేట’’ అన్నాడు ఆత్మీయంగా…అలా పంచుకున్న ఆనం దం తోడుతో గూడెం బాట పట్టి సాయం త్రం గూడెం బయట ఏర్పాటుచేసిన వేటలో తెచ్చిన జంతువులు, పక్షులు ప్రదర్శించే ‘‘వేలంబస’’కు చేరుకున్నారు. మిత్రులిద్దరూ వారి ఫలితాలను ప్రదర్శిం చబడే ముందు ఇద్దరు కలిసి చేసిన వేట అని చెప్పడం కన్నా ఇద్దరం వేరువేరుగా వేటాడి తెచ్చాము, అంటే ఆవిజయం తాలూకు అభినందనలు ఎవరికి వారుగా అందుకోవచ్చు, అనే స్వార్థం నిండిన ఆలోచన రావడంతో, కానుగ చెట్టు కింద కూర్చుని ఆనందంతో కలిసి వచ్చిన నిర్లక్ష్యం సాయంగా, నాలుగు కుందేళ్ళను రెండు గోనె సంచుల్లో సర్దబో తుండగా ..అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవి ఒక్కొక్కటిగా గోనె సంచు ల బందీఖానా నుండి బయటపడతాయి. ఊహించని సంఘటన తో మిత్రులిద్దరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.మానవ ప్రయత్నంగా వెతికారు కూడా,, చేతికం దిన వేట చేజారి పోయిందన్న బాధ ఒకవైపు, కాగా…వేట పడలేదు అంటే కలిగే అవమానం దూషణల కన్నా పడ్డ వేట తన్నుకుపోయింది అంటే మరింత అవమానం కూడా…!! వేట జరగలేదన్న భయం బాధతో పాటు దొరికిన వేట సమానంగా పంచుకోలేక పోయాము అని బాధ మరోవైపు ఆవహించాయి. చివరికి వేట జరగలేదు అని మాత్రమే నిర్ధారించు కుని అందుకుగాను జరిగే అవమా నాలకు,అవహేళనకు సిద్ధపడ్డ ‘‘చెల్లిమ య్యలు’’ ఇద్దరూ ‘‘వేలంబస’’ వైపు తమకు జరగబోయే హేళనలు తలుచు కుంటూ నడిచారు.
ఇలా ముగిసిన ఈ కథలో కేవలం గిరిజన సంస్కృతి, సాంప్ర దాయాలు, మాత్రమే తీసుకుని కథ రాశారు అంటే పొరపాటే…!! దీనిలో అడవిబిడ్డల సాంప్రదాయాలను గౌరవి స్తూనే మానవులందరికీ ప్రస్తుతం అత్యవ సరమైన మానవసంబంధాల గురించి, అంతర్వాహినిగా రచయిత ఇందులో వ్యక్తపరిచారు. భాషా నానుడులు సంపూ ర్ణంగా స్థానికతకు దగ్గరగా ఉండేటట్లు తీసుకుని నిర్ణయం, కథ మొత్తానికి నిండుదనాన్ని ఇచ్చి రచయితలోని, ప్రతిభ,పరిశీలన,తేటతెల్లం అవుతాయి. కథ పేరు కూడా ఆసక్తిని సముచి తత్వాన్ని కలిగిస్తుంది. ఇలాఅన్ని విధాల ఉన్న తత్వం కలిగిన ఈకథ, కొత్త కథకులకు నిజంగా దారి దీపమే…!!!
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు , ఫోను: 77298 83223