కొండఫలం

భూమిమీద పుట్టిన ప్రతిజీవికి, భూమితో విడదీయరాని సంబంధం ఉంటుంది. అదే అడవి బిడ్డలకైతే!! ఆబంధంమరింత బలంగా ఉంటుంది. వారి బ్రతుకు బండికి జీవ నాధారమైన పంట భూములద్వారా ఆదివాసీలు అనుభవిస్తున్న ఇబ్బం దులు కథావస్తువుగా చేసుకుని ప్రముఖ కథా రచయిత్రి‘వాడ్రేవు వీరలక్ష్మిదేవి’రాసిన కథ‘కొండ ఫలం’.రచయిత్రి బాల్య అనుభవాలనుంచి,ఉద్యోగ రీత్యా,తూర్పు గోదావరి జిల్లా శరభవరం, కాకర పాడు,కొయ్యూరు,గిరిజనప్రాంతాల్లో గడిపిన జీవ నం నుంచి నేర్చు కున్న ప్రత్యక్ష అనుభవపాఠాల సారమే ఈ కథ. రచనా కాలం 1999. ఈమె తండ్రి గిరిజనగ్రామాల్లో కరణీ యకం వృత్తిచేయుడం,నిత్యం అక్కడి గిరిజ నులు, గిరిజనేతరులు,పేదలు,మధ్య జరిగే భూవివాదా లను ప్రత్యక్షంగా చూశారు. ఆయా సంఘటనల ద్వారా తమ భూములను కోల్పోవడం రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలున్నా సరే విలువైన ఆస్తులు ఎలా కోల్పోతున్నారో, వివరించారు. ప్రభుత్వాధి కారులు చేసేఅవినీతి,గిరిజన చట్టాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం ఎలా చేస్తున్నాయో రచయిత్రి వెల్లడిస్తారు. భూ సమస్యల్లో ఆదివాసీ మహిళలు అనుభవిస్తున్న అగచాట్ల గురించి, కళ్ళకుకట్టినట్టు చెప్పడంలో శతశాతం విజయం సాధించారు. రచయిత్రి మిత్రురాలు యూనివర్సిటీ రీడర్‌ పద్మిని, గిరిజన సమస్యల మీదపరిశోధన చేసింది. ప్రస్తు తం గిరిజన భూసమస్యల మీదప్రాజెక్టు పరిశోధన చేయడం కోసం ఆమె నివసిస్తున్న ప్రాంతానికి తను రాకతో కథప్రారంభమై చివరికి సమస్య పరిష్కా రానికి గిరిజనస్త్రీ విద్యా వంతురాలు కావడమే మార్గమని పరిశోధకురాలు భావించడం తో ముగు స్తుంది.కథఆసాంతం చదివింప చేస్తూ పాఠకులను అడవి అందాలగుండా నడిపించి..అనిర్వచనీ యమైన అనుభూతిని అందిచారు. ఇక కథలోకి వెళితే…!! రచయిత్రి పొద్దున్న పనుల్లో ఉండగా ఏడుపు మొహంతో అక్కడకు చేరిన ‘కొండకాపు యువతి’సీతాలు తనకు జరగ బోతు న్న ప్రమాదం తాలూకు కోర్టువారిచ్చిన నోటీసు తనకు చూపించ వచ్చింది. ఆ గిరిజన గూడెంలో గంగరాజు అనే గిరిజనేతర యువ కునితో కలసి కాపురం చేస్తూ చిన్న హోటల్‌ నడుపుతుంది. రోజువారీ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో బ్రతుకు బండి నడుపు కుంటుంది సీతాలు.సర్కారు వారు ఉచితంగా ఇచ్చే ఐదుఎకరాల భూమిని తన కులం సాయంగా పొం దిన ఆమె,భర్త సాయంతో దానిలో జీడిమామిడి పంట సాగు చేస్తూ.. భావి ఖర్చులకు ధనం కూడా పెట్టు కుంటుంది. కానీ సర్కారు వారుఇచ్చిన భూమి అసలు యజ మాని దళితవాడకు చెందిన ఫకీర్‌ రావు,అతను పెట్టుకున్న అర్జీతో ఆభూమిని తిరిగి అతనికే అప్పజెప్పనున్నట్టు, సీతాలుకు ‘గిరిజనకోర్టు వారి చ్చిన నోటీసు’ సారాంశం. సాగుకు పనికిరాని ఆభూమిని సీతాలు దంపతులు రెక్కలకష్టంతో ఒక దారికితెచ్చి జీడిమామిడిపంట సాగుతోదాని ఖరీదు పెంచుకుని సంతోషిస్తున్న వేళ,ఇప్పుడు పిడుగు లాంటి ఈ సంఘటన. గిరిజన గ్రామంలో టీచరుగ పనిచేస్తున్న రచయిత్రికి తన ప్రాంతంలోని గిరిజను లకు సాయపడటం,సలహాలు ఇవ్వటం,నిత్యకృ త్యం అందులో భాగంగానే సీతాలు ఇప్పుడు అక్కడికి వచ్చింది.బాధలోగల సీతాలును ఓదార్చి‘నీభూ మికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు, కోర్టుకు పోయి ‘స్టే’ తెచ్చుకోవచ్చు. అంటూ ఆమెకు సలహా ఇచ్చి ధైర్యం చెబుతుంది టీచరు. తను అక్కడి గిరిజను లతో ఎంతో చనువుగా ఉండేది. ముఖ్యంగా మహి ళల పట్ల అక్కడి వారంతా ఆర్థికంగా చితికి పోయి న, ఆచారాలు సాంప్రదాయాలు వదలలేక, అష్ట కష్టాలు పడేవారు. వారిఅమాయకత్వానికి రచయిత్రి టీచర్‌ జాలిపడేది. తాను ఆగ్రామానికి వచ్చిన కొత్తలో అక్కడి వారి పనులు, అలవాట్లు, చూసి ఆశ్చర్య పడిన, తరువాత తర్వాత అలవాటుపడి, తాను వారిలో ఒకటిగా ఉండడం, వాళ్ళ పెళ్లిళ్లకు అతిథిగా వెళ్ళటం చేసేది, అక్కడి గిరిజనుల పెళ్లిల్లలో పెద్ద వయసు వధూవరులు, పేరంటం అనబడే బట్టలు, వస్తువులు, బంగారం వెండి, నగల ప్రదర్శన అమ్మాయికి ఇంటివారు తినడం మానేసి అయినా బలవర్ధక ఆహారం పెట్టడం
వల్ల, వారి పెళ్లిల్లలో పెళ్లికూతుర్లు బలిష్టంగా కనిపించడం, మొదలైన ఆచారాలన్నీ అక్కడి గిరిజనులకు మాత్రమే సొంతమైనవిగా రచయిత్రి స్వీయ అనుభవం రంగరించి అందంగా చెప్పారు.
కానీ మరో విచిత్రమేమిటంటే ఆప్రదర్శనలో పెట్టిన నగలు,చీరలు, అన్ని ఎరువుగా తెచ్చిన వేనట! అది అక్కడ వారికి సాధారణ వ్యవహారమే!! అని చదివిన పాఠకులకు విచిత్రం కలగక మానదు. తను ఆ ఊరికి వెళ్ళిన కొత్తలో సావిత్రి అనే గిరిజన మహిళ తన పొలాన్ని గవర్నమెంట్‌ వారు స్వాధీనం చేసు కుంటారని అందుకుగాను తనకు అందిన కాగితాలు చూపించడానికి ఒక రాత్రివేళ ఆమె వద్దకు వస్తుం ది. టీచర్‌ అసలు విషయం తెలుసుకోవడానికి గ్రామాధికారి వద్దకు వెళ్ళగా..అతను చెప్పింది ఏమి టంటే,’సావిత్రి భూమి కొనుక్కున్నది గిరిజనేతరుల వద్దని గిరిజన వ్యవసాయ చట్టం ప్రకారం గిరిజను లు కానివారికి అక్కడ భూములు చెల్లుబాటు కావని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని’. సావిత్రి గిరిజనేతరుడు అయిన కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని మొదట ఎంతో వైభవంగా అనుభవించిన, అది మూడునాళ్ళ ముచ్చటై…తన పెళ్లి పేరంటంలో పెట్టిన బట్టలు,నగలు,మాదిరి ఇప్పుడు తన భర్త భూమి తెచ్చుకున్నతాత్కాలిక వస్తువులెక్క అయి పోయింది. విషయం వివరించి తగిన సలహా టీచర్‌ ఇచ్చిన..ఆశ చావని కృష్ణమూర్తి కోర్టులో కేసు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ తనఇంట్లోని, తన భార్య ఒంటి మీద,సంపద నగలు పోగొట్టుకుంటాడు. చివరికి ఆకుటుంబం పేదరికంలో కూరుకు పోతోంది. అలా..సావిత్రిభూమి దీనగాథకు సాక్ష్యం అయిన టీచరుకు ఇప్పుడు సీతాలు వ్యధ ఒకటి తోడైంది. గిరిజనేతరుని చేసుకున్న సీతాలుకు మొదట్లో ఆమె పేరు మీద గవర్నమెంట్‌ వారు ఐదు ఎకరాల పంటభూమికి పట్టాఇచ్చారు. గిరిజ నేతరులు బినామీ పద్ధతిలో భూములు సంపాదిం చడం అక్కడి అలవాటుపద్ధతి అయిపోతుంది. అంతేగాక అక్కడ నివసించే వాల్మీకితెగ వారిని మొదట్లో ఎస్సీలుగా గుర్తించి,ఆతర్వాత వారిని ఎస్టీలుగా గుర్తింపు ఇస్తూ ప్రభుత్వాలు, అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి తగాదాలు వారి మధ్య చెలరేగి, కోర్టులచుట్టూ తిరిగి,భూస్వా మి కటికపేదవారుగా మారిపోతున్నారు. ఇప్పుడు జరిగిన విషయం అదే! సీతాలు అనే గిరిజన స్త్రీని ఆమె భూమికి ఆశపడి గంగరాజు అనే గిరిజ నేతరుడు ఆమెను చేరదీయడం, వాళ్లుకొన్న భూమి దారు ఫకీర్రావు భూమి అమ్మినప్పుడు ఎస్సీ వాల్మీకి జాతిగా, ఉండి ప్రస్తుతం యస్‌.టి వాల్మీకి సర్టిఫికెట్‌˜ సంపాదించడం,సీతాలు భర్తగంగరాజు గిరిజ నేతరుడు కనుక,అతడు ప్రస్తుత ‘యస్‌టి వాల్మీకి’ తెగకు చెందిన ఫకీరావు భూమినికొనే హక్కులేదు కనుక,అతని భూమిని అతనికిచట్టప్రకారం అప్ప గించాలి.వాస్తవానికి‘‘ఫకీర్‌ రావు’’చేసింది అన్యా యమే! అయినా తనకు గల సర్టిఫికెట్‌ వల్ల ప్రభుత్వ చట్టం ప్రకారం, అది న్యాయమైనపని అయి పోయింది ప్రస్తుతానికి.అసలు ఆధారాలు చూపించ టానికి గడువు కోరే సమయం అయిన ‘కోర్టుస్టే’ కోసం టీచరమ్మ సాయంతో సీతాలు పట్నం పోయింది.అక్కడ పడరాని పాట్లు పడుతుంది. లాయర్‌ కు విషయం చెప్పి ‘సీతాలు నువ్వు అక్కడే వుండు,వేరేపని గురించి పెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాను’అని చెప్పివెళ్లి వచ్చిన టీచరమ్మకు సీత స్థితి కన్నీరు పెట్టిస్తుంది. వెళ్ళిన కోర్టుస్టే పని కా లేదు,సరికదా పొద్దుటనుంచి తిండి,నీళ్లు, లేక అల మటిచడంతోపాటు అత్యవసరమైన’మూత్ర విసర్జన’ కు,కూడా లాయరు ఇంటివద్దచోటులేక, నరక యాతన పడ్డ సీతాలు స్థితిని రచయిత్రి కరుణ రసాత్మకంగా అక్షరీకరించి కన్నీరు పెట్టించింది. సీతాలు వారం పోయాక లాయర్ను కలవడానికి ఒక్కటే వెళ్లాలట. వెళ్ళేటప్పుడు రెండు వేలు తీసు కుని రమ్మన్నాడు’’అని చెప్పడంతో టీచర్లకు, గిరిజనులు,అటు గిరిజనేతరులు,అధికారులు, లాయర్ల,నుండి ఇలాంటి కష్టాలు పడి ఆస్తులు పోగొట్టుకుని పేదవాళ్లుమారుతున్నారో అర్థమవు తుంది.అటు పకీర్‌ రావు కూడా అప్పులు చేసే అతను ఎస్‌టి సర్టిఫికెట్‌ తెచ్చుకున్నాడు. సీతాలు తన భూమిని కాపాడుకోవడానికి అప్పులే చేసింది. ఇక ఇరువర్గాలు చేసుకున్న పనులవల్ల లాభపడిరది మాత్రం వడ్డీ వ్యాపారులు,అధికారులు, లాయర్లు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేసిన చట్టాలు సాయం తో స్వార్థపరుల ఎత్తులు పై ఎత్తులతోగిరిజనులు ఎలా నష్టపోతున్నారో వివరించబడిరది. చివరికి సీతాలు యస్టి సర్టిఫికెట్ను, ఫకీర్రావు నుంచి అధిక డబ్బులు పొందిన లాయర్‌ కోర్టుకు దాఖలు చేయక తాను గిరిజన జాతిగా కోర్టు ముందు నిరూపించుకో లేక తన పంట భూమిని కోల్పోవడం భూమి కోసమే చేరదీసిన గంగరాజు సీతాలును వదిలివేయడం జరుగుతుంది.ఈ ‘సీతాలు జీడిమామిడి తోట కథ’ని గిరిజన భూసమస్యలపై పరిశోధనకు వచ్చిన,తన స్నేహితురాలు పద్మినికి వివరిస్తుంది,రచయిత్రి టీచరమ్మ.గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, గిరిజనేతరులు, ఇద్దరూ సమానంగా మోసగించ పడుతున్న విషయం గమనించిన పద్మిని కి ఇక్కడ పరిస్థితులు మార్చడానికి వారికి అందించాల్సిన ఆయుధం విద్య మాత్రమే అని రచయిత్రి సూచిం చటం,అందుకోసం పద్మిని ఆచరణాత్మకంగా ఆలో చించడంతో ఈకథముగిస్తోంది. –డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,
ఫోను: 77298 83223