మొకం మల్లచ్చింది సారు

మానవతా దృక్పథం… సామాజిక స్పృహతో తన ఉద్యోగ ధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు.. తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రంలో కథారచయితగా స్థానం సంపాదించారు. గిరిజన జీవితాలపట్ల సంపూర్ణ అవగాహన కలిగిన అధికారి గుర్తింపు పొందారు. ఆనేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు . అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు అనగానే గుర్తుకు వచ్చే ఒకవిశిష్టమైన రచయిత ఎ. విద్యాసాగర్‌. వృత్తిరీత్యా ఆయన ఐఏఎస్‌ అధికారి,1988 నుంచి రెండేళ్ల పాటు పూర్వక ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి దాని పరిధిలో గోదావరికి ఆవల ఈవల గిరిజనగూడేలతో,గిరిజనులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. పాలన అధికారిగా మొక్కుబడిగా గిరిజనుల అభివృద్ధి గురించి పనిచేయలేదు. మానవతా దృక్పథంతో సామాజికస్పృహతో తన ఉద్యోగధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు..తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రం లో కథారచయితగా స్థానం సంపాదించారు. ఎ.విద్యాసాగర్‌గా సుపరిచితుడైన ‘అంగల కుర్తి విద్యాసాగర్‌’ పుట్టి పెరిగింది ప్రకాశంజిల్లా. స్వతహాగా తెలుగువాడు కావడం తెలుగు భాష మీద పట్టు ఉండటం గ్రూప్‌ వన్‌ పోటీ పరీక్ష ల్లో తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా తీసు కోవడం,ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాల్లో పని చేయడం ద్వారా గిరిజన జీవితాలపట్ల సం పూర్ణ అవగాహన కలిగింది ఆయనకు. ఆ నేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’.గిరిజనులు నిత్యం అడవుల్లో తిరగడం వల్ల అక్కడ ఉండేపెద్ద పులులు,ఎలుగు బంట్లు, బారినపడి గాయాలపాలవడం,ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవడం సర్వసాధారణం. ఇక కథ విషయానికొస్తే రచయిత పాల్వంచలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కాలం, అక్కడికి సమీపంలోని ‘‘యానం బయలు’’ వద్ద గల గిరిజన గ్రామంకు చెందిన ఒక గిరిజనుడు తన అల్లుడుతో కలిసి అడవికి వెళ్లగా, అక్కడ అతని పై ఎలుగుబంటి దాడి చేయగా మొహం అంతాగాయమై, ఒకకన్ను కూడా పోగొట్టుకొని, రెండు రోజులపాటు వారికి తెలిసిన పసరు వైద్యం చేసుకుని గాయం నయం కాక ముంబై లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోగా ప్రాథమిక చికిత్స చేసిన డాక్టరు ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వడంతో, దిక్కుతోచక నడిచి పాల్వంచరావడం, వీరి దీనస్థితి చూసిన కానిస్టేబుల్‌ అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఐటీడిఎకి వాళ్ళని చేర్చి క్షతగాత్రుని భార్య సీతమ్మద్వారా పూర్తి వివరాలు తెలుసు కున్న కానిస్టేబుల్‌ ఆరాత్రి వేళప్రాజెక్టు అధి కారికి విషయం తెలియజేసి,అక్కడ గిరిజనుల సహాయార్థం ఏర్పాటు చేయబడిఉండే జీపు సాయం అడుగుతాడు.కార్యాలయం బయట వరండాలో జుగుత్సా కరమైన స్థితిలో పడుకొని ఉన్నా ఆముసలి గిరిజనుడి దయనీయ స్థితి చూసిన ప్రాజెక్టు అధికారి చలించిపోతాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ కట్టు కట్టించి తెల్లవారాక ఒకవ్యక్తిని సాయం ఇచ్చి ఖమ్మం కాకుండా సరాసరి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తారు. అతడితో వచ్చిన అల్లుడు పెద్దాసుపత్రిలో ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి సొంత గ్రామం వెళ్లిపోతాడు. క్షతగాత్రునితో అతని భార్య ఒక్కతే వెడుతుంది.హైదరాబాద్‌ ఆసుప త్రికి పంపించిన నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండానే పాల్వంచ ఐటీడీఏవరండాలో ప్రాజెక్టు అధికారి ముందు ప్రత్యక్షం అవుతారు ఆముగ్గురు.ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ముసలాడి పరిస్థితిలో ఏమార్పు లేదు.అదే జుగు త్సాకరమైన రూపం. చీము నెత్తురుతో చివికి పోయి వాసన వస్తున్న బ్యాండేజీ కట్టు. ఆదృశ్యం చూసిన ప్రాజెక్ట్‌ అధికారికి కోపం విసుగు ఒక్కసారిగా వచ్చిన,గిరిజనుల్లో ఉండే అమాయకత్వం, నిస్సహాయతలకు ఆచేతనుడవు తాడు. చివరికి అతని భార్య ద్వారా అసలు విషయం తెలుస్తుంది.‘ఆపెద్దపట్నం పెద్దాసు పత్రిలో తన ముఖంనయంఅయి మళ్ళీ వస్తదో రాదో కానీ ఒకవేళ ఇక్కడే చచ్చిపోతే..!! దేశం కాని దేశంలో అసలుచావ, నన్ను మన ఊరికి తీసుకుపోండి అనే ముసలోడు ఒకటే గోల చేసిండు.’అని చెబుతూనే ఆదావత్‌ దవాఖా నాల్లో బిట్లు లేక కిందనే పడుకోబెట్టి వైద్యం చేశారని ఒకసారి డాక్టర్‌ వచ్చి చూసి పోతే మళ్ళీ పొద్దుట ఆయన వచ్చి చూసే దాకా ఎవరూ రారని అడిగిన ఏది చెప్పరని,అక్కడి దయనీయ స్థితి సీతద్వారా తెలుసుకున్న ప్రాజెక్టు అధికారి.ఈవిషయాల గురించి తాను ముందు గా తెలుసుకోనందుకు తనలో తానే సిగ్గు పడ తారు.‘సరే అయిందేదో అయింది కానీ రేపు మీతో ఉండటానికి ఒక మనిషిని ఇచ్చి రెండు వారాలపాటు అక్కడ ఉండటానికి మీకు ఏర్పాటు చేస్తామని’ అంటారు. కానీ మళ్లీ పట్నం పోవడానికి,వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు, సరే ఈరాత్రి ఇక్కడే ఉండి తెల్లవారాక చేయా ల్సిన దాని గురించి ఆలోచిద్దామని నచ్చచెప్తారు, కానీ తెల్లవారి వాళ్ళు అక్కడ కనిపించడం లేదని వాచ్‌ మెన్‌ చెప్పిన మాటలతో, కథకు డైన ప్రాజెక్టు అధికారిలో తను ఓడిపోయాననే భావం ఆవరిస్తుంది, పాపం అమాయకపు గిరిజనుడు ఏమవుతాడో!? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆరు నెలలయ్యాక ఒక రోజు పాల్వంచ మండలం లోని‘ఉలవనూరు’గిరిజన సదస్సులో పాల్గొన్న ప్రాజెక్టు అధికారి వద్దకు ముఖంపై కొంచెం మొర్రి ఉన్న ముసలాడు వచ్చి ‘‘నన్ను గుర్తుపట్టలేదా సారు నా మొకం మల్ల చ్చింది సారు’’ అంటూ తనను తాను పరిచయం చేసుకోవడమే కాదు….ఆస్పత్రిలో వైద్యం చేసిన డాక్టర్లు,తనకు సేవలు చేసిన తన భార్య సీతను, గుర్తుచేసుకుంటూ మీలాంటి గవర్నమెంట్‌ పెద్ద సార్లు మాలాంటి పేదలను ఆపదలో వున్నప్పు డు అట్ల ఆదుకుంటారని,డబ్బులు ఖర్చు పెడ తారని, నాకు అప్పుడు తెలియదు,మీ అందరి దయవల్లే బతికి మీ ముందు ఈరోజు ఇలా ఉన్నాను అంటూ అత్యున్నతమైన పశ్చాత్తాప గుణంతో ప్రాజెక్టు అధికారి ముందు కృతజ్ఞతా భావంతో నిలబడతాడు ఆగిరిజనవృద్ధుడు. ఆ గిరిజన ముసలాడి మాటలతో చలించిన ప్రాజెక్టు అధికారి ఆలోచనల సింహా వలోకనం తో ఈ కథ ప్రారంభమవుతుంది. కథ మొత్తం జ్ఞాపకాలు దారిలో నడిచిన, వాస్తవ సంఘట నల సమాహారంలా కనిపిస్తుంది. ప్రతి సంఘ టనలో సమకాలీన పరిస్థితులు, గిరిజనుల్లో ఉండే దయనీయ స్థితి, కష్టకాలంలో వారిలో ఉండే సహకారం, మానవ సంబంధాల గురించి, కథా రచయిత స్పష్టపరిచారు. ప్రస్తుత రోజు గడుపుకోవడానికే సతమతమయ్యే అరణ్య వాసులను భవిష్యత్తు గురించి ఆలోచించ మనడం,సబబు కాదనే భావన రచయిత ఇందులో వ్యక్తం చేస్తారు. తన కష్టాలకు తాను బాధపడుతున్న తన కర్తవ్యాన్ని, భార్యాభర్తల బంధాన్ని,మర్చిపోని గిరిజన స్త్రీ వ్యక్తిత్వం గురించి సీతమ్మ పాత్ర ద్వారా రచయిత చక్కగా ఆవిష్కరిస్తారు. తాను పూర్తిగా ప్రభుత్వం వారు అందించే వైద్య సాయం పొందక పోయినా, జన్మనిచ్చిన భూమి మీదే చనిపోవాలని కోరిక, పట్టణవాసపు వాసనలు,అక్కడి అసౌకర్యాలు, పడక వైద్యం చేయించుకోకుండా మధ్యలో పారిపోయి వచ్చితమదైన పసరు వైద్యంతో తన గాయం మాన్పుకున్నా…కొద్దిపాటి సాయాన్ని కూడా మరవ కుండా కృతజ్ఞతలు చెప్పిన గిరిజనవృద్దుడి లోని గొప్పదైన కృతజ్ఞతాభావం తన అనుభవసారం జోడిరచి చెప్పడంలో కథారచయిత పరిశీలనాశక్తి అర్థమవుతుంది. నిజానికి ఆగిరిజన వృద్ధుడికి చేయగలిగినంత సాయం చేయలేకపోయామని,పెద్దగా సాయం చేసింది ఏమీ లేదని,అవమానపడటంలో రచయిత పారదర్శకత స్పష్టమవుతోంది. చేసిన కొద్దిపాటి సాయాన్ని తమజీవితాంతం గుర్తు పెట్టుకునే కల్మషం ఎరుగని ఉన్నత వ్యక్తిత్వం అడవిబిడ్డల సొంతం,అనే గొప్ప విషయాన్ని రచయిత విద్యాసాగర్‌ ఇందులో అద్భుతంగా, అనుభవపూర్వకంగా,ఆవిష్కరించిన వైనం అభి నందనీయం.ఈ కథలో ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ గిరిజన వృద్ధుడి స్థితి హృదయ విదారకంగా చెప్పబడి కరుణరస భరితంగా సాగిన,కష్టాల్లో సైతం ధైర్యంగా వాటిని ఎదు ర్కునే ధీరగుణం గిరిజనుల్లో ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. ప్రభుత్వాలు గిరిజనుల సమగ్రా భివృద్ధికి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన దాని ఫలితాలు అందుకోవడంలో గిరిజనులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు అని దీనికి తెలియని అజ్ఞానం గిరిజనులది అయితే, వృత్తి పట్ల పూర్తి నిర్లక్ష్యం అధికారులది కావడం అని, నిర్మొహమాటంగా రచయిత చెబుతారు. తాను ఒకగిరిజన అభివృద్ధి అధికారి కూడా తమ శాఖల లోపాలను ఖచ్చితంగా తన రచన లో వెల్లడిరచడం ద్వారా ఈకథా రచయిత, ఉత్తమరచయిత గుణాలు సొంతం చేసుకుని ఆదర్శ రచయితగా నిలిచారు, ఇది రచయితలు అందరూ ఆచరించదగ్గ గొప్ప విషయం.కథ మొత్తం రచయిత తన జ్ఞాపకాల సాయంతో నడిపిన, సంబంధిత సంఘటనలు, పాత్రోచిత సంభాషణలు,రచయిత కథన శైలి, వెరచి పాఠకులకు మంచి కథ చదివామనే సంతృప్తి మిగులుతుంది. రచయిత తెలుగు భాషా నైపు ణ్యం కూడా కథమొత్తం విస్తరించింది.వాస్తవ సంఘటనలను కాకా చెబుతూనే భవిష్యత్తులో అడవిబిడ్డల మనుగడ కోసం మనం ఏంచే యాలో కూడా చెప్పిన ఈకథలో సంపూర్ణ కథా లక్షణాలు సలక్షణంగా కనిపిస్తాయి
-(వచ్చే మాసం మీకోసం స్వర్ణ ముఖి కథ ‘‘గోరపిట’’) -డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223