అరణ్యపర్వం

‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’ కథ ముగుస్తుంది. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987 వ సంవత్సరం, అరుణ తార త్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది.
తొలి తెలుగు కథానిక జన్మభూమి ఉత్తరాంధ్రకు చెందిన ఉత్తమ కథా రచయితల్లో ఒకరు ‘‘అట్టాడ అప్పలనాయుడు.’’ అనేక జీవన పోరాటాలను అరణ్యజీవుల సాక్షిగా అనుభవించి అంచెలంచెలుగా ఎదిగిన అక్షర శిఖరం ఆయన. అనేక చిరు ఉద్యోగాల పిదప చేతికందిన బ్యాంకు ఉద్యోగి గిరి చేస్తూనే తన అనుభవాలతో మదిలో మెదిలిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి అనేక కధలు నవలలు రచించిన సాహితీ నాయకుడు తను. జీవనం రీత్యా, ఉద్యోగరీత్యా, తన ప్రాంతంలో నిత్యం చూసే సవర జాతి గిరిజనుల జీవిత గాధలే అప్పలనాయుడు రాసిన కథలు. అరణ్య వాసుల అభివృద్ధి మీద,వారి ఎదుగుదల గురించి,ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న స్వార్ధపు ఆలోచనవల్ల వారి ఎదుగుదల కన్నా నష్టాలతో కూడిన నష్టాలే అధికం అనే కొత్త ఆలోచనను,ఉదాహరణ పూర్వకంగా వివరిం చారు రచయిత తన ‘‘అరణ్యపర్వం’’ ద్వారా. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987వ సంవత్సరం, అరుణ తారత్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది. ఇక కథ విషయానికొస్తే ‘‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’కథ ముగుస్తుంది. వాస్తవంగా కథలోని ఈ కొందరు గిరిజనులే కాదు..ఈదేశంలోని సమస్త అడవిబిడ్డల గోస,గోడుకు,ఈకథ అద్దం పడుతుంది.‘‘నమ్మకానికి ప్రతిరూపాలైన అడవి బిడ్డలు,తేడా వస్తే తిరుగుబాటుకు చిరునామాలుగా మారి పోతారు’’ అనే నిండు నిజం రచయిత ఈకథ ద్వారా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి సంఘటననూ పలుకుబడులను గిరిజన సామాజిక చిత్రణ చేయడంలో నాయుడు శత శాతం విజయం సాధించారు.
సాధారణంగా అడవిలోని గిరిజనులు ఎవరిని నమ్మరు.నమ్మితే సర్వస్వం అర్పిస్తారు. ఆడిన మాట అస్సలు తప్పరు. తమ గూడెంలోకి కాకిబట్టల వారు వచ్చిన.. తెల్లబట్టల వారువచ్చిన… వారిని గూడెంలోకి రానివ్వరు. సరికదా వారు అడిగిన సమాచారం కూడా చెప్పారు. దానికి నిరూపణ కథ ప్రారంభంలో పోస్ట్‌ మేన్‌ కథకు కారకులైన ఇస్రూ,బొంతు, కొయ్యం,ల చిరునామాలు దొరికించు కోవడంలో పడ్డ ఇబ్బంది. చివరకు ఆగిరిజనులు తమకు వచ్చిన బ్యాంకు బాకీల బాపతు కోర్టు నోటీసులు చదువుకునే శక్తిలేక పోస్ట్‌ మేన్‌ను, బ్రటిమిలాడుకోవడం, నోటీసులు చదివి పెట్టినందుకు అతనికి ఇస్తామన్నా జీలుగకల్లు, కందులు,చిన్నకోడి,మాట తప్పకుండా అతనికి ఇవ్వడంలో అడవి బిడ్డల నీతి నిజాయితీ కళ్లకు కట్టారు రచయిత. కోర్టు నోటీసులు సారాంశం తెలుసుకున్న ఆఅడవి బిడ్డలు, రాబోయే ప్రమాదం తలుచుకుని దానికి గల కారణాలను,గతంలోకెళ్లి ఆలోచనలగుండా వెతుకులాట ద్వారా విషయాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు రచయిత. గిరిజనులు ఆరుగాలం పడ్డ కష్టాన్ని బాకీలు,వడ్డీలు,రూపంలో దోచుకునే ‘‘వడ్డీ వ్యాపారులు’’ తక్కువ తూకాలు,నాసిరకం వస్తువులతో మోసం చేసే చిల్లర వ్యాపారులతో ఒకపక్క, నానా యాతనలు పడి అనేక విధాల నష్టం పోతుంటే అదిచాలదు అన్నట్లు.. మరోపక్క ప్రభుత్వ పథకాలు, ఉచితాలు,సబ్సిడీలపేరుతో బ్యాంకులు,గిరిజన అభివృద్ధిశాఖ వారు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేస్తున్న కార్యకలాపాల ద్వారా, ‘‘వారి వికాసం కన్నా వినాశనమే అధికంగా ఎలా జరుగుతుందో’’ రచయిత చెప్పే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల నుంచి వారిని రక్షించే నెపంతో వారిని సంఘ విద్రోహ శక్తులైన నక్సలైట్లు ఎలా ఆకర్షిస్తారు. వారిద్వారా గిరిజనులు పొందిన ఊరట తాలూకు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి. ఒకరోజు బూర్జగూడెంకు అడవిదారి గుండా అష్టకష్టాలుపడి ప్రజా ప్రతి నిధి ఆప్రాంత రిజర్వుడు ఎమ్మెల్యే, సీతంపేట బ్యాంక్‌ అధికారులు,వచ్చి అక్కడి గిరిజనుల అందరినీ సమావేశపరిచి,వారు అనవసరంగా పని పాట లేక నక్సలైట్లు, అభ్యుదయ సంఘాల చెంతచేరి విలువైన సంసా రాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల మేలు కోరి వారి ఆర్థికఅభివృద్ధి ఆశించి పెట్టిన’’కామధేనుపథకం’’ గురించి వారికి నమ్మకం కుదిరేట్టు,ఒక్కొక్కరు వివరిస్తారు. తమ జాతి వాడే అయిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వారి ‘‘కామదేను పథకం’’కు అను కూలం అంటే ఇక ఆఅడవి బిడ్డలు మారు ఆలోచన చేయరు, గూడెం మొత్తం వారి అనుమానాలు పక్కనపెట్టి ఆ పధకంలో చేరిపోతారు. అధికంగా పాలు ఇచ్చే మేలు జాతి గేదెలు కొనుగోలు మొదలు ఆఖరికి ఆ పాలను కొనే పాలకేంద్రం వరకు, అందరి చేతుల్లో ఘోరంగా మోసపోయిన ఆడబిడ్డలు,చివరికి తమ ప్రాంతపు ఆహారం వాతావరణం పడక మేలుజాతి అనుకున్న గేదలు కూడా చనిపోవడంతో వారికి ఆదాయం బదులు అప్పులు మిగిలాయి,సరికదా అన్నకాలానికి అప్పు కట్టనినేరానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పోస్ట్‌ మేన్‌అందించిన బ్యాంకు నోటీసు వల్ల వాళ్ళల్లో కలిగిన అలజడి ఆలోచనల ద్వారా గత నేపథ్యం తెలుసుకున్న పాఠకులు,వర్ధమానం లోకి వచ్చాక చివరి ఘట్టం కోర్టు భవంతిలోకి ప్రవేశిస్తారు. రుణ గ్రస్తులైన గిరిజనులను‘‘బ్యాంకు బాకీ ఎందుకు తీర్చలేదు? పథకంలో వచ్చిన గేదెలు ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ధైర్యం కూడా తీసుకుని తనదైన బాణిలో భాషలో ‘‘కుయ్యం’’ చెప్పుకు పోతాడు. గత నలభై ఏళ్ల నుంచి తాము మోసపోతున్న తీరు ఎవరు ఎలా మోసం చేసి తమ శరీర కష్టాలను దోచుకుంటున్నారు కొయ్య న్యాయమూర్తి కళ్లకు కట్టినట్టు ఒక్కొక్కటి చెప్పుకు పోతాడు. ఇలాంటి కష్టకాలంలో తమ కుల దేవత కనికరించి తమ గుండెలకు సంగాన్ని పంపిందని,దేవతల జెండాలు పక్కన సంగపు జెండాలు ఎగరే సామని, చెబుతూ షావుకార్లునుంచి అక్రమ బాకీల కోసం గుంజుకున్న భూములు విడిపించుకోవడం, వ్యాపారులు చేసే మోసాలను, ఎదుర్కొన్న తీరు. మొదలైనవి చెబుతూ సంగం వాళ్లబతుకుల్లో చీకటినితుడిచి వెలుతురు నింపిన తీరును అంత భయం లోనూ అంతమంది లోనూ ధైర్యంగా చెప్పుకు పోతాడు కొయ్యం.
‘‘ఇంత చేసినా లాభం ఏముంది? పాలకులు కన్నెర్ర చేసి సంఘ వ్యతిరేకులుగా ముద్ర వేసి గుడిసెలుతగలబెట్టి, మా గూడేల మీద తుపాకి గురి పెట్టారు, ఎందరినో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి నక్సలైట్ల ఖాతాలో జమ చేశారు, ఏసం ఘాల ఆదరువులేక దిక్కులేని పక్షులుగ మిగిలి పోయివలసలు పోయినం,ఆఖరికి ఏదో చేస్తామని ఆశ చూపి పథకాలని,సబ్సిడీలని, మాయమాటలు చెప్పి చివరికి మమ్ములను నేరగాళ్లను చేసి ఇక్కడకు రప్పించారు ‘‘…. అంటూ గుండెల్లో పొంగిపొర్లుతున్న బాధనంతా న్యాయమూర్తి ముందు చెప్పు పోయినాడు తను. తమకు పాలకేంద్రం వాళ్లు పాలు పోసినందుకు ఇచ్చిన రశీదు ముక్కలు తప్ప తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ప్రతినెల బ్యాంకు బాకీ పాలకేంద్రంవారే చెల్లిస్తామని చెప్పిన మాటలు నమ్ముకొని చివరికి అన్నీ కోల్పోయి తమ బతుకులు కోర్టుపాలయ్యాయి అని ఆవేదనతో చెపుతాడు. చివరికి ఈ ఆధునిక సమాజం తమకు వద్దని, తమదైన అడవి సమాజమే చాలని, ఈ కుట్రలు మోసాలను, పడలేమని ఇది తమ జాతి అందరి గోస అని గోడు పెట్టుకోవడంతో…… న్యాయమూర్తి ఆలోచనలో పడి, న్యాయశాస్త్రానికి చిక్కని జన జీవితం గురించి చెప్పిన గిరిజనుడి బాధ అర్థం చేసుకున్న న్యాయమూర్తి చలించినా….. కేసు వాయిదా వేయడంతప్ప, ప్రస్తుతానికి ఏమీ చేయలేని ఆయన అక్కడనుండి నిష్క్రమించడంతో…కధ ముగుస్తుంది .గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రయోజనకరమైనవి అయినా, స్వార్థపు బుద్ధిగల మధ్యవర్తుల ఆచరణ లోపాల కారణంగా, అభివృద్ధి పథకాలు నిర్వీర్యంఅయ్యి తద్వారా అడవి బిడ్డలు అనేక కష్టాలపాలై ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు, అనే ఇతివృత్తంతో చెప్పబడ్డ ఈ‘‘అరణ్యపర్వం’’ కథకు,.పేరు పెట్టడం మొదలు ముగింపు వరకు రచయిత ‘అట్టాడ అప్పలనాయుడు’ గారు తీసుకున్న శ్రద్ధ ఆచరణీయంగా సముచితంగాఉంది. ప్రతి సందర్భం విషయం కూడా కథకు అన్వయించడం, సందర్భోచితమైన నానుడులు ఉపయోగించడం… రచయితలోని పరిణితి, ప్రతిభకు, నిదర్శనాలుగా నిలిచాయి. మహాభారత కథ లోని పాండవులు అన్యాయంగా శిక్షించ బడి అరణ్యవాసం చేసిన సంఘటన మాదిరి అడవి బిడ్డలు కూడా అన్యాయాలకు గురైన అనవసరపు శిక్షలు అనుభవిస్తున్నారనే భావనతోనే రచయిత ఈ కథకు ‘‘అరణ్యపర్వం’’ అని పేరు పెట్టారు అనిపిస్తుంది. కథా లక్ష్యంలో …విషయాన్ని వివరించడమే తప్ప పరిష్కార మార్గం కానీ, చైతన్యం ఇవ్వడం కానీ కనిపించవు. కథ ముగింపు పాఠకుల ఆలోచనకే వదిలి వేయబడిరది. ఇది ఒక రకంగా ‘‘ఆరణ్య వాసుల జీవన చిత్రణ’’ను నూతనకోణంలో నమోదు చేయడం కోసమే వ్రాయబడిరది అనిపిస్తుంది. ఒక ప్రత్యేక జీవనంతో జీవించే అడవిబిడ్డల జీవనశైలిలోని భాగాలను ఇలా కథల రూపంలో నమోదు చేయడంవల్ల భావి కథ చరిత్ర పరిపుష్ఠం చెందడానికి ఎంతో దోహదం అవుతుంది.
(వచ్చే మాసం మీ కోసం జీవన్‌ కథ ‘‘పోటెత్తిన జన సంద్రం’’ విశ్లేషణ- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223