అడవిలో వెన్నెల

కథ అంటే ప్రధాన పాత్ర దృష్టి కోణం లో కొనసాగి దాని ఆలోచనల ప్రకారం ముందుకు సాగినపుడే సంబంధిత కథకు వాస్తవి కత వస్తుంది అని బలంగా నమ్మే ప్రసిద్ధ తెలుగు కథకుడు బేతి శ్రీరాములు. కథల కర్మాగారంగా యువత చేత తలవబడే అనబడే శ్రీరాములు వారి అనుభవాల ఆలోచనల నుండి 1989 ప్రాంతంలో అక్షయ్‌ హరించబడి కథ ‘‘అడవిలో వెన్నెల’’.

ఆయన జన్మస్థానం కరీంనగర్‌ ప్రాం తపు జగిత్యాల,ఆపక్కనేగల అడవుల జిల్లా అయిన ‘ఆదిలాబాదు’తో అక్కడి గోండుల జీవన పరిస్థి తులతో ఆయనకు గల అవినాభావ సంబం ధాలు, అంతకు మించి ఆయన నిర్వహించిన, పాల్గొన్న అనేక ప్రజా ఉద్యమాలు మొదలైనవి. ఆయనలో అల్లుకుపోయి ఉన్న సామాజిక స్పృహ సృజనాత్మ కతలు,కలిసి అడవిబిడ్డల జీవితాలను సంస్కృతి సంప్రదాయాలను అనేక కథల రూపం లో ఆవిష్క రించారు. ఉద్యమాల నాయకుడిగానే కాక సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగిస్తూనే.. విశాల సాహితి అకాడమీ సంస్థను స్థాపించి పలు పుస్తకాలు ప్రచు రణ చేశారు. అనేక సాహి త్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అనం త రకాలంలో తెలంగాణ రాష్ట్ర తొలిబీస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయన కలం నుంచి జాలువారిన ‘అడవిలోవెన్నెల’ కథలోని విశేషాలేమిటో విశ్లేషించు కుందాం!
ఆదిలాబాద్‌ అడవితల్లి సందిట్లో అమాయక జీవనం గడుపుతున్న గోండుల జీవన విధానం,సంస్కృతి,వారు అణచివేతకు గురవుతున్న తీరు, కళ్ల ముందు కదలాడేటట్టు తనదైన సుదీర్ఘ శైలిలో రచయిత ఆవిష్కరించారు.కథ మొత్తం ఇస్రు అతని కొడుకు ఏసు,కూతురు మోతిల కేంద్రంగా నడుస్తుంది. అతి నిరుపేద అయిన ఇస్రు భార్య జ్వరం బారినపడి,అదే సమయంలో వచ్చిన నెలసరి కారణంగా వారి కులాచారం ప్రకారం ఊరి బయ ట ఉండే మైలపాకలో మూడు రోజులుఉండే క్రమంలో చలి గాలులు భరించలేక అక్కడే చనిపో తుంది.తల్లిలేని ఇద్దరు బిడ్డలను తనే పెంచు తూ ఉన్న కొద్ది జొన్న చేను పంట పండిరచుకుం టూ అయిన అప్పులు చెల్లించుకుంటు, తనశక్తికి మించిన శారీరక శ్రమ చేస్తుంటాడు ఇస్రు. యుక్తవయసుకు చేరిన కొడుకు బిడ్డల భవిష్యత్తు కోసం తనసుఖాన్ని వదులు కొని కష్టపడుతూఉంటాడు అతను. ఆరుగాలం కష్టపడుతూ వచ్చిన ఆదాయంతో షావుకారుల అప్పులకుగాను పండిరచిన పంట ధాన్యం, కొలవడం దానితో కూడా అప్పు తీరక పోతే అడవికి వెదురు బొంగులు నరికే కూలికి పోవడం, అక్కడి గోండుల నిత్యకృత్యం.అదే ఆన వాయితీ అయింది ఇస్రుకు అబ్బింది. ఇది చాలదు అన్నట్టు అడవిలో కలపనరికి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే నెపంతో అటవీ అధికారులు పోలీసుల సాయంతో చేసే దాడులతో కూడా అక్కడి గోండ్లుగోస పడుతుంటారు. అవి వారికితరతరాలుగావస్తున్న తిప్పలు. బాధల నుండి బయటపడే మార్గం లేక అధికారులు షావుకార్లకు ఎదురు చెప్పలేక,నానా అగచాట్లు పడుతూ పేదరి కాన్ని కూడా భరిస్తూ.. తమ ఆచార సాంప్ర దాయా లు,కట్టుబాట్లు,ఎట్టిపరిస్థితుల్లోనూ తప్ప కుండా కాలానికి ఎదురీదుతుంటారు. అక్కడి గిరిజ నులు,అచ్చంగా అదే జీవితం మన కథాకర్త ఇస్రుది కూడా….!!
పేదరికానికి తోడు కాలికి తగిలిన దెబ్బ కు సంబంధించిన అనారోగ్యంతో మరింత ఇబ్బం దులు పడుతున్న ఇస్రు వేదనను రచయిత ఇందులో తనదైన కోణంలో ఆవిష్కరించారు.వాస్తవం ఎలా ఉందో చెప్పడంతో పాటు,ఎలా ఉంటే బాగుం టుందో అని చెప్పడం కూడా సోషలిస్టు వాస్తవి కత అన్నది రచయిత ప్రగాఢ విశ్వాసం. అందుకే అడవిలో వెన్నెల వృధాకాదు అది అడవి బిడ్డలకు ఉపయోగపడుతుంది అక్కడ ఉద్యమ మార్గంలో చైతన్యం వెల్లివిరిసి గోండు బిడ్డలకు ధైర్యంవచ్చి, వారు అందరిలా హాయిగా స్వేచ్ఛాగ జీవనం గడిపే రోజులు వస్తాయనే ఆశయం, ఆశతో కథ ముగించే నేపథ్యంలో భాగంగా తుపాకీ ఉద్యమ సంఘాన్ని వారికి పరిచయం చేసి కథ ముగిస్తూ… ఆలోచనాత్మక ముగింపును అందిస్తారు. కథలో రచయిత స్వీయ శైలి అయిన సుదీర్ఘత కనిపించిన, ఎక్కడ విసుగు రాకుండా గోండుల జీవనంలోని ఆచారవ్యవహారాలు అడుగడుగునా ఆసక్తిని కలిగిస్తూ పాఠకులను చేయిపట్టుకుని నడిపిస్తాయి. రచయితకు అడవిబిడ్డల సంస్కృతి,అలవాట్లపై అపారమైన గౌర వం,సమర్థింపు ధోరణి కనిపిస్తాయి. ఒకానొక సంద ర్భంలో వనవాసుల అలవాట్లుఅయిన లైంగిక స్వేచ్ఛ తదితరాలు,ఆధునిక దేశపు నాగరికుల అల వాట్లతో సరిపోల్చి చెప్పడం ఆశ్చర్యానికి లోనైన అది అసత్యంకాదు అనిపిస్తుంది.గిరిజనులకు సహజ సిద్ధంగా అలవాటైన చేపలవేట,వాటి రుచిపట్ల గల ఆపేక్ష గురించి ఇస్రుపాత్రద్వారా రచయిత అత్య ద్భుతంగా ఆవిష్కరిస్తారు, ఒకపక్క కాలిదెబ్బ పెడు తున్న భరించలేనిబాధను పడుతూనే చేపల వేటకు వెళ్లి తన లక్ష్యాన్ని అందుకోవడంతో ఇస్రుకుగల చేపలవేట ఇష్టత తెలుస్తుంది, ఎన్నో బాధలు భరిం చి ఇల్లు చేరిన తనకు ఇంటి వాతావరణం ఆందో ళన కలిగిస్తుంది. అడవిలో గిరిజనుల జీవాలు మేత మేసినందుకు,వారు ఇంటి అవసరాలకు అడవి నుంచి కర్రలు,కట్టెలు, తెచ్చుకున్నందుకు, వేర్వేరు కారణాలకు గాను ప్రతి కుటుంబం ఫారెస్ట్‌ వాళ్లకు ఏటా 50రూపాయలు చెల్లించాలి, డబ్బులు లేక పోతే అడవికి వెదురు బొంగు నరకడానికి వెళ్లాలి. ఆకూలీ డబ్బులతో వారి బాకీలు తీర్చుకుంటారు. అలా చేయడం ఆలస్యమైతే ఫారెస్టు అధికారులు ఇలా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, బెదిరిం చడం,కొట్టడం,ఇంట్లో వస్తువుల కు నష్టం కలిగిం చడం విప్పసారా,కోళ్లు, కనిపించినవి కనిపించినట్టు ఎత్తుకుపోవడం, గోండు గూడేల్లో నిత్యం జరిగే తంతులే !! ఇస్రు ఇంట్లో ఆరోజు అదే జరిగింది, అది గతం నుంచి అలవాటైనతను, వారిని బ్రతి మాలి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేస్తాడు.కానీ యువకుడైన కొడుకు ఏసుకు ఇదేమీ అర్థం కాదు, అంతకు ముందు ఫారెస్ట్‌ వాళ్ళుతనను కొట్టిన దెబ్బల బాధబరిస్తు తండ్రి నుంచి సరైన సమాధా నం రాక మౌనంగా రోదిస్తాడు. ఆదిలాబాద్‌ ప్రాం తంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గోండుల ఆచారాలన్నీ కాస్త విభిన్నంగానే అగుపిస్తాయి. దగ్గరి లోని అహిరి మహారాజును వారి కష్టనష్టాలను కాపాడే పెద్దదిక్కుగా ఆరాధిస్తారు. ముఖ్యంగా దసరా పండుగకు గూడేల నుండి ఇంటికి ఒకరు చొప్పున మహారాజు వద్దకు విధిగా వెళ్లాలి. ఆడ వాళ్లు తప్పకుండా వెళ్లి అక్కడ నాట్యాలు చేయాలి. పేరుకు తమ కష్టనష్టాల గురించి మహారాజుకు చెప్పుకోవడం కోసం వెళ్లడమే కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఏదోఒక వస్తువు,జంతువు,కానుకగా తీసుకు వెళ్లాలి. అక్కడ ఉండే రెండు రోజులకు సరిపడా తిండి కూడ ఎవరికి వారే తీసుకుపోవాలి. అయినా అక్కడి దసరా ఉత్సవాలకు పోవడానికి అందరూ ఇష్టపడతారు. కారణం వెళ్లకపోతే మనిషిని పది రూపాయల చొప్పున దండుగ పటేలుకు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆరోజు అక్కడ దొరికే లైంగిక స్వేచ్ఛకోసం గూడేలలోని యువత వెళ్లడానికి ఆరాట పడతారు. ఇస్రుకు ఈదసరా ఖర్చు ఒకటి గుర్తుకు వస్తుంది. తన కొడుకు ఏసు,పక్క గ్రామంలోని ధనికుడైన బాబురావు కూతురు లకింబాయి, ఒకరి కొకరు ఇష్టపడతారు.సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలంటే కన్యాశుల్కం తదితర ఖర్చులతో అబ్బా యి తండ్రికి అధికఖర్చు అవుతుంది.అమ్మాయి తన ఇష్ట ప్రకారం ఇంట్లోకి వస్తే కాస్త ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి కొత్త జంటలు ఏకం కావడానికి దసరా పండుగ,పంటకోతపండుగ,లాంటివి వారికి అను కూలంగా ఉంటాయి. అందుకే ఖర్చుకు భయపడ్డ ఇస్రు కొడుకు పెళ్లి ముందుగా చేయడానికి ఇష్టం చూపడు. ఎదిగిన తన కూతుర్ని తీసుకుని దసరా పండుగకు వెళ్లడానికి సిద్ధపడతాడు. అక్కడ కూతు రు మోతికి కావాల్సిన పూసల దండలు, పొడిపిం చాల్సిన పచ్చబొట్ల ఖర్చులకు డబ్బులు జమ చేసు కుంటాడు.ఏసు దసరాకు వెళ్ళలేకపోయినా.. తండ్రి లేనివేళ తన లకింబాయిని జొన్న చేనుకు రప్పించు కుని పండగలో పొందే ఆనందం ఇద్దరూ పొందు తారు. ఫారెస్ట్‌వారి దౌర్జన్యాలు జరిగిన ప్రతి రోజు రాత్రి గూడెం వాళ్ళు అంతా ఒక చోటచేరి మహారా జుకు ప్రజలకు మధ్యవర్తిగా ఉండే కుర్దుపటేలుకు తమ గోడువిన్నవించుకోవడం తను అంతా పరిష్కరి స్తానని సర్ది చెప్పడం ఎప్పుడూ పరిపాటే ! ఇలా ఉండగా దసరా ముగిసి పంట కోతల పండుగ వచ్చింది.రాత్రిగూడెం ప్రజలంతా పూజారి సమ క్షంలో పండుగలో పాల్గొంటారు. ముందే పథకం వేసుకున్న లకింబాయి జాకెట్‌ విడిచి ఆరాత్రి యేసు తో కలిసి ఆటపాటల్లో పాల్గొంటుంది, వారి ఆచా రం ప్రకారం అలాచేసి ఆఅబ్బాయి ఇంటికి వెళితే దాన్ని ఇష్టపూర్వకంగా ‘‘ఇల్లుజొచ్చు’’డుగా భావించి ఆఇద్దరికీ పెళ్లి చేస్తారు,పెళ్లి అయిన తరువాత ఛాతి మీద వేరే ఆచ్ఛాదన లేకుండా ఉండటం గోండు స్త్రీలకు ఆచారం. చాలా కొద్ది ఖర్చులతో ఏసు,లకింబాయి ఒక ఇంటివారు అవుతారు. కుల పెద్దలకు ఇచ్చిన బాపతులో భాగంగా ఇస్రు విప్ప సారా తాగి ఆనందం తెచ్చుకునే ప్రయత్నం చేస్తు న్నాడు కానీ కళ్ళముందు కనిపిస్తున్న అప్పులు,ఆడ బిడ్డపెళ్లి,బాధ్యతపట్టని కొడుకు, గురించి ఆలోచి స్తాడు ఆందోళనగ ఆనందానికి దూరమై… కొన్నాళ్లు గడిచాక అనుకున్నట్టే అప్పు పెట్టిన షావు కారు రాజారావు తన మందబలంతో ఇస్రు గుడి సెలమీద పడి దౌర్జన్యం చేసి పండిన జొన్నపంట మొత్తం ఎత్తుకు పోతాడు. కథ అచేతనంగా ముగిసి పోయింది అనుకుంటుండగానే ఊహించని మలుపుతో రచయిత సరికొత్త ముగింపును కలిపి స్తాడు. తుపాకీ దళంను కథలో ప్రవేశపెట్టడమే కాక,ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అడవులను వేదికలుగ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వారి బాధలు,కష్టాలు,తదితరాలు కూడా సవివరంగా చూపిస్తారు. చివరకు ఒకరాత్రి గూడెం చేరిన దళం కు గోండ్లు భోజనాలు పెట్టడం, తమ మధ్యవర్తి కుర్దు పటేల్‌ ద్వారా తమ గోడు వెళ్లబోసుకోవడం, దానికి వారి సహకారపు హామీ లభించడం, భవి ష్యత్తు మీద ఆశలు పెరగడం, ముఖ్యంగా ఏసు కు కమాండర్‌ తుపాకీ చూపించి ‘‘మనలను చంప వచ్చు మనుషులను కూడా దీనితో చంపవచ్చు’’ అని చెప్పిన మాటల ద్వారా అతని ఆలోచనల్లో మార్పు రావడం. ‘‘అడవి కాచిన వెన్నెల ఆకాశాన్ని కప్పేసిన వృక్షాల్ని చీల్చుకొని అడవినంతా పరుచు కుంటుంది, ఆ వెన్నెల్లో గూడెంలోని గుడిసెలన్ని తడుస్తాయి’’ అన్న వాక్యాలతో కథ ముగించడం, ఇవన్నీ రచయితలోని కట్టుబాట్లకు అర్థం చెబు తాయి, ఒక ప్రాంతపు గిరిజన ఆచారాలను ‘‘అక్షర నిక్షిప్తం’’ చేయడంతోపాటు, సంఘ చైతన్యాన్ని పురికొల్పడం వంటి ప్రయత్నాల ద్వారా రచయిత సఫలీకృతుడయ్యారు.
(వచ్చేమాసం మీకోసం వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథ ‘‘కొండ ఫలం’’) – డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223