నూతన మంత్రివర్గం..సరికొత్త సవాళ్లు

విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రి వర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్తమాత్రులుగా మార్చబడిన స్థితి.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు ఎడతెగని చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవుల చుట్టూ రాజకీయాలు, మీడియా కథనాలు పరిభ్రమించే ప్రస్తుత కాలంలో ఇది అనూహ్యమేమీ కాదు. తన మంత్రివర్గాన్ని సగం పదవీ కాలం తర్వాత మారుస్తానని జగన్‌ తమ మొదటి లెజిస్లేటివ్‌ సమావేశంలోనే ప్రకటించారు. కనుక మంత్రులుగా చేరిన వారంతా ఆ షరతుకు లోబడే చేరారన్నది స్పష్టం. నూటయాభై స్థానాలతో ప్రభంజనం సృష్టించిన ఆరంభ ఘట్టం అది. నాయకుడూ శాసనసభ్యులూ కూడా పాలనా పగ్గాలు చేపట్టాలనే ఉత్సుకతతో వున్న దశ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పరి స్థితి ఎలాగూ వుండదు. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర విధానాల కారణంగా ధరల మంటలు, అప్పుల ఊబి, అమరావతి ప్రతిష్టంభన ఒకటేమిటి అనేకానేక సవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న స్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హుకుంలు వాటిని ప్రశ్నించకపోగా అత్యుత్సాహంగా సమర్థిస్తూ తనూ ఒక వేటు వేసే జగన్‌ ప్రభుత్వ విధానాలు ఇందుకు మూల కారణంగా వున్నాయి. అందుకే ముంచుకొచ్చిన కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేసినా అనివార్యంగా ఇప్పుడు ఆ పునర్యవస్థీకరణ ముందుకొచ్చి కూచుంది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి స్వీయకల్పితం. ఒక ముఖ్యమంత్రి సగం కాలానికే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తర్వాత మారుస్తానని చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కనుక దీనికి ఇంతకు ముందు నమూనా ఏదీ దేశంలో లేదు. దాని ప్రభావాన్ని చెప్పడానికీ ఉదాహరణ లేదు.
మూడు దొంతరలు, విధాన ప్రశ్నలు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా బడ్జెట్‌ లీకైందంటూ మొత్తం మంత్రివర్గాన్ని సామూహికంగా బర్తరఫ్‌ చేసి అందరి రాజీనామాలు తీసుకున్న ఉదంతంతో కొన్ని పోలికలున్నా అది వేరే తరహా సందర్భం. దాని ఫలితంగా ఆ పార్టీలో చీలిక వచ్చింది, అప్పటికే ఆ ప్రభుత్వంపై వున్న అసంతృప్తి మరింత పెరిగి ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఓటమితో సహా ఆ పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల తర్వాత రెండు మాసాల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయనేలేదు. కేవలం తనూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ మాత్రమే ప్రభుత్వంగా నడిపించారు. కేంద్రంలో ప్రధానిమోడీ తన మంత్రివర్గ సహచరులలో దాదాపు 70శాతం మందిని దశలవారిగా తప్పించారు. అంతేగాక గతంలో కాంగ్రెస్‌ చేసినట్టే రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రులను వరుసగా మార్చేశారు. ఏతావాతా జాతీయ పాలకవర్గ పార్టీలలో ముఖ్యమంత్రులకూ ప్రాంతీయ పార్టీలలో మంత్రులకు పదవులు ఎప్పుడైనా ఊడిపో వచ్చనే భావం బలపడిరది. అయితే జగన్‌ నేరుగా అందరినీ మార్చేస్తానని ముందే ప్రకటించి మరీ పాలన ప్రారంభించడం కొత్త వ్యూహం. దాని అమలు ఎలా వుంటుంది, అనంతర ప్రభావాలు ఏమిటి అన్నదే ఇప్పుడు కీలక చర్చగా తయారైంది. ఏప్రిల్‌ 7న జరిగిన క్యాబినెట్‌లో పాత మంత్రులందరూ రాజీనామా చేయడం,వాటిని గవర్నర్‌ ఆమోదించడం జరిగిపోయింది. అయితే వారిలో కొనసాగే వారెవరు,ఎందరు అనే రసవత్తర కథనాలు మాత్రం నడుస్తూనే వున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగించడం తప్ప అత్యధికులను మార్చవలసి వుంటుందని ఆయన మొదట అన్నారు. అనుభవం కోసం కొందరు కొనసాగుతారన్నారు. చివరి సమావేశంలోనూ సంఖ్య చెప్పకపోయినా ఇలాంటి మాటలే మాట్లాడినట్టు మంత్రులు చెబుతున్నారు. అయిదారుగురు పాతవారు వుండొచ్చన్న లెక్క కాస్త పెరిగి పది పైన ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు ఆలస్యంగా చేరిన వారు కాగా ఒకరిద్దరు ఆ వర్గాలకు ఏకైక ప్రతినిధులుగా వున్నవారు. ఇవి కూడా ఊహాగానాలు తప్ప ఆధారం లేదు. పదిమందికి పైగా కొనసాగిస్తే అప్పుడు తప్పించబడే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం మరింత అధికమని అధినేతకూ సలహాదారులకు తెలుసు. తప్పించిన మంత్రు లను జిల్లాలకు లేదా ప్రాంతాలకు సమన్వ యకర్తలుగా పంపి వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యత అప్పగిస్తామన్నారు. మరి వారికి సంస్థాగత నాయకత్వం అప్పగిస్తే కొత్తమంత్రుల కాళ్లకు పగ్గాలు వేసినట్టు కాదా. ఈ రెండు తరహాలలో దేనికీ చెందకుండా ఏపదవీ బాధ్యతలు దక్కని మూడో తరహా నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా వైఎస్‌ఆర్‌సిపి లోనూ ప్రభుత్వంలోనూ మూడు దొంతరలు ఏర్పడే సూచనలున్నాయి. ఈ వైరుధ్యాలను సర్దుబాటు, సమన్వయం చేయడం తేలికేమీ కాదు. ఎన్నికల సన్నాహాలు, సమరం మొద లైనట్టే మాట్టాడుతున్న ముఖ్యమంత్రి తీరు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నది.తాము వచ్చేసినట్టే మాట్టాడుతున్నారు. కనుక కొత్త మంత్రులు లేదా మంత్రివర్గం ఆది నుంచి ఎన్నికల వేడిలోనే పని చేయవలసి వుంటుంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నా ప్రజలూ ప్రతిపక్షాలూ సమస్యల తీవ్రతపై ఉద్యమిస్తున్న నేపథ్యం. ఈ సమస్యలకు కారణమైన విధానాలు, పని విధానాలు మారకుండా కేవలం కొన్ని శాఖల మంత్రుల మొహాలు, విగ్రహాలు మార్చినంత మాత్రాన కలిగే ప్రయోజనం వుండదు. ప్రభావమూ వుండదు.
అసహనం, అవకాశవాదం
విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రివర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్త మాత్రులుగా మార్చబడిన స్థితి. నూటయాభై స్థానాలు గెలిచిన జగన్‌ ప్రభుత్వం వంటి వాటిలో ఇది మరింత ఎక్కువ. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి గురించి విమర్శించినవారే ఇప్పుడు ఆయన బలహీనపడ్డారనీ, ఆ విధంగా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా తనపై విమర్శల గురించి కొన్ని ఆరోపణలు గురించి అసహనంతో విరుచుకు పడుతున్నారు.గత రెండు రోజులలో టిడిపి పైన దాన్ని బలపర్చే మీడియా పైన ఆయన వ్యాఖ్యలు ఇందుకు పరాకాష్టగా వున్నాయి. దీనికి ముందు ఢల్లీి వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలసి వచ్చిన జగన్‌ బిజెపిని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడం లేదు. బిజెపి మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను కూడా టిడిపి దత్తపుత్రుడుగా విమర్శిస్తున్నారు! వామపక్షాలు మినహాయిస్తే ఈ ప్రాంతీయ పార్టీలేవీ మోడీ సర్కారు రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించలేకపోవడం నష్టదాయకం. పైగా ఆ బిజెపినే ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వాధినేత మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని భావించే జగన్‌… ఆయన, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌…కేంద్రంపై పోరాడుతున్న తీరును గమనించడం లేదా?
దిద్దుబాటుకు ఒక అవకాశం
మళ్లీ పునర్వవస్థీకరణకు వస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, ఎప్పుడూ తమ మాటే చెల్లుతుందనుకోవడం పొరబాటని ఈ మంత్రివర్గ వ్యవహారమే స్పష్టం చేస్తున్నది. లేకపోతే ఇంత కసరత్తు, ఇన్ని మల్లగుల్లాలు అవసరమై వుండేవి కావు. సామాజిక లెక్కలతో పాటు మంత్రులలో కొందరు అనుభవజ్ఞులు, బలాఢ్య ధనాఢ్య వ్యక్తులు, విశ్వసనీయత గలవారు కొనసాగడం సహజం. కేవలం నోరు జోరు బట్టి కొందరు వుంటారని, కొందరు వస్తారని వేసే లెక్కలు నిలవకపోవచ్చు. ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్న పేర్లు కూడా వున్నాయి. ఈ దెబ్బతో వైసిపి లో ముసలం పుడుతుందని, ముక్కలైపోతుందని ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్థులూ వున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంత భారీ నాటకీయ మార్పులు వుండకపోవచ్చు. పాలకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తారు. వారిలో ఒకరు మూరు?లనీ మరొకరు దార్శనికులనీ చెప్పడం అనవసరం. వ్యక్తులను బట్టి తరతమ తేడాలున్నా రాజకీయాలలో వర్గ ప్రయోజనాలే శాసిస్తుంటాయి. నాలుగు వందల మంది ఎంపిలను తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి ఫిరాయింపుల నిరోధకచట్టం కావలసి వచ్చింది. నూట యాభై మంది ఎంఎల్‌ఎలు వున్న జగన్‌ మధ్యలో మార్పు ద్వారా ఎక్కువమందిని సంతృప్తిపర్చాలని తలపెట్టారు. వాస్తవంలో ఇది అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చు. తనే కీలకం, మిగిలిన వారు నిమిత్తమాత్రులనే సంకేతం కూడా ఇందులో వుండొచ్చు. తమ పార్టీలోనూ బయిటివారిలోనూ స్పందనలను తెలుసుకోవడం కోసం గత వారం రోజులూ రకరకాల లీకులతో ఊహాగానాలు నడిపిం చారు. దీన్ని కేవలం వ్యూహాత్మక చర్యగానూ ఎన్నికల ఎత్తుగానూ హడావుడి పెంచితే ఉప యోగం వుండదు. ఈ అవకా శాన్ని తమ తప్పు లు దిద్దుకోవడానికి ఉపయో గించుకుంటే ఈ కసరత్తుకు కాస్తయినా ప్రయోజనం వుంటుంది. ప్రజల స్పందనా దాన్ని బట్టే వుంటుంది. ఇక ఆశావహులు, నిరాశోపహతుల తదుపరి అడుగులు ఎలా వుండేది ఆచరణలో చూడ వలసిందే. ముందే ప్రకటించిన ఈతతంగం నుంచి అంత కన్నా ఆశించవలసిందీ అభిశం సించవలసిందీ మరేమీ వుండదు. ఎప్పుడైనా సరే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వా మిక పునాది కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు (ప్రజాశక్తి సౌజన్యంతో…)

జిల్లాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌- ప‌రిపాల‌న సౌల‌భ్యం

‘‘ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కార మయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్ర లైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా …!’’ – ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
జగన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికినాంది పలికింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతర్వాత ఉన్న13 జిల్లాలకుతోడు కొత్తగామరో13జిల్లాలు ఏర్పాట య్యాయి. మొత్తం26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 4నుంచి కొత్త రూపు దిద్దుకుంది. వై.ఎస్‌.జగన్‌ 2019ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాలన సామాన్య ప్రజలకు,బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని నవశకానికినాంది పలికారు. ఇప్పుడు మొత్తం26జిల్లాలకుకాగా..72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాట య్యాయి.కొత్త జిల్లాల ఏర్పాటుతో..వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌,జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు..వారి క్యాంపు కార్యాలయాలు..అలాగే అన్ని ప్రభుత్వ శాఖల
కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిజిల్లాలో కనీసం ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా విష యానికి వస్తే..ఒక్కో జిల్లాకు 18నుంచి23లక్షల వరకు ఉన్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి నాలుగు వరకు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కసరత్తు చేశారు. అంతేకాదు కొత్త డివిజన్లతోకలిపి మొత్తం72 రెవె న్యూ డివిజన్లు ఏర్పాట య్యాయి.ప్రభుత్వం శాస్త్రీ యంగా అధ్యయనం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను చేసింది. జనవరి26న రిపబ్లిక్‌ డే రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యం తరాలు,సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదా పుగా17,500సలహాలు,సూచనలు వచ్చాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలించారు.. అనంతరం అధ్యయనంచేసి జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది.
కొత్త కళ..గడప వద్దకే పాలన-సిఎం జగన్‌
సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందు లో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరి పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.కొత్తజిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథ కాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13జిల్లాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాల యం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు.26జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగు తుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌,పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి…ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవ సరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజ న అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.
కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాలపేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం,రాజమహేంద్రవరం గత జిల్లా
లకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరు తున్నాయి. 1970మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భ విస్తే చివరిగా 1979జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్తజిల్లాలు ఏర్పాటు కాక పోవడంతో పరిపాలనసంస్కరణలు,వికేంద్రీ కరణ విషయంలోబాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలి పోయాం.జిల్లాలసంఖ్య,రెవెన్యూ డివిజన్లు పెరగ డంవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో727జిల్లాలు ఉండగా యూపీ లో అత్యధికంగా75,అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమై న ఏపీలోమాత్రంనిన్నటివరకు13జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి.2011 లెక్కలప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38లక్షల మంది ఉన్నారు. దేశం లో ఏరాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభాలేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6లక్షల మందికి ఒకజిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు.

భానుడు ప్ర‌తాపం..మండుతున్న ఎండ‌లు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. – సైమన్‌ గునపర్తి
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌, పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు.పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి,కానీ మీరు కాటన్‌ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.

జాతీయ
విద్య విధానాలు..
చదువులకు దూరమౌతున్న చిన్నారులు…!

మూడవ వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థి తులు వేరు. వారి ఆహారపు విరామ సమ యం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగంలోకి దిగుతాయి.
భారత దేశంలో పేద,అణగారిన వర్గాల పిల్లల విద్యవిషయంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిరది. ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులలో ప్రతి ముగ్గురులో ఒకరు పాఠశాలకు తిరిగి రావడం లేదు. విద్యారంగం నేడు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో ముందు ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుం దని యునెస్కో భారత్‌ను హెచ్చరించింది. ఈ పరి స్థితి నుంచి బైటపడాలంటే కేంద్ర,రాష్ట్రప్రభు త్వా లు… పేద,అణగారిన వర్గాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా కారణంగా బడికి దూరమైన విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌.ఇ.పి), దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఆ కొద్ది మంది పేద విద్యార్థులు కూడా చదువుకు దూరమైపోతారనేది స్పష్టమవుతోంది.
మ్యాపింగ్‌ తో విద్య కేంద్రీకరణ
కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకుకు దాసోహమంటున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభు త్వం…నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తును మొగ్గలోనే తుంచేస్తున్నది. పైకి మాత్రం ప్రపంచ స్థాయి విద్య అందిస్తామంటూ నమ్మబలుకుతున్నది.విద్యా రం గంలో నూతన విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తుందని విద్యార్థులు, తల్లిదం డ్రులు, ప్రజానీకాన్ని మభ్యపెట్టేందుకు అవగాహన సదస్సులలో చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేస్తామని గొప్పలు చెప్తున్నారు. అం దుకు, అంగన్వాడీ పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రాథమిక స్థాయి విద్య అందించేందుకు గాను వారిని ప్రాథమిక పాఠశాలలో కలుపుతామం టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవంకతో…అద్దె భవ నాల్లో నడుస్తున్న అంగన్వాడీల అద్దెలు కట్టకుండా వాటి నిర్వహణకు పెట్టాల్సిన మదుపు తగ్గించు కోవాలనుకుంటోంది. దీంతో పసిపిల్లలకు, బాలిం తలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారం దూరమై మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది.దీన్ని గ్రహించ కుండా కేంద్ర ప్రభుత్వం…పెరిగుతున్న మాతా శిశు మరణాలు తగ్గించేందుకు స్త్రీల వివాహ వయ స్సు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆటలాడుకునే వయసులో విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీర కంగా అనారోగ్యం పాలవుతారు.
ఇకపోతే3,4,5 తరగతులను ఉన్నత పాఠశా లలకు తరలిస్తామంటున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు 3వతరగతి పిల్లవాడిని అంతదూ రం పంపించడానికి భయపడుతున్నారు. ఎందు కంటే చాలా పాఠశాలలు రద్దీగా ఉన్న రహదారి పక్కన లేదా రహదారికి అవతలి వైపున ఉన్నాయి. వాహనాల రద్దీవల్ల చిన్నారులకు ఎప్పుడేమవు తుందోనన్న భయం తల్లిదండ్రుల్లో ఉరది. అలాగని పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి తీసుకురావడం కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు సాధ్యం కాని పని. అందుకే చదువులైనా మాన్పించేస్తార కానీ పిల్లలనుఅంతదూరంపంపలేమనే దగ్గరికొస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీపిల్లల బంగారు భవిష్యత్తు కోసం దూర ప్రయాణం అసౌకర్యం అయినప్పటికీ దాన్ని అధిగమించి పిల్లలను ఉన్నత పాఠశాలకు పంపాలంటున్నది. ఉన్నత పాఠశా లల్లో అయితే సకల సౌకర్యాలు, ల్యాబులు, కంప్యూ టర్లు ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని… పిల్లల మానసిక వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు హైస్కూల్‌ విద్య తోడ్పడు తుందని చెబుతుంది. అయితే అవే సౌకర్యాలు ప్రాథమిక పాఠశాలల్లో కల్పించవచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉన్న 5 తరగతులకు 5 క్లాసులు బోధించి మిగిలిన3 పిరియడ్స్‌లో ముందున్న క్లాసు కు ప్రిపేర్‌ అయ్యేవారు. ఇప్పుడు ఈ3,4,5 తరగ తులను కలుపుతూ మొత్తంగా 8 తరగతులకు 8 క్లాసులను విరామం లేకుండా బోధించేట్లు చేయా లనుకుంటున్నది. దీంతో ఉన్నకొద్దిమంది ఉపాధ్యా యులతోనే అన్ని తరగతులకు సర్దుబాటు చెయ్య వచ్చు. మరో వైపు రాష్ట్రంలోఉన్న ఎయిడెడ్‌ పాఠశా లలను మూసివేస్తూ ఆ అధ్యాపకులను ఖాళీ పోస్టుల్లో భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఎస్‌జిటి లకు కొంత శిక్షణ ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్లుగా బోధించాలం టున్నది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఈ రకంగా అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సంవత్సరానికి ఒక డిఎస్సీ తీస్తామన్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కడిఎస్సీ కూడా తీయలేదు. భవిష్య త్తులో సైతం తీయకుండా ఉండేలా రిటైర్మెంట్‌ వయస్సు రెండు సంవత్సరాలు పెంచింది. దీంతో డిఎస్సీకి ప్రిపేర్‌ అయినవాళ్లు దాన్ని పక్కన పెట్టి ఇతర ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నారు. ఎన్‌ఇపి ద్వారా విద్యను ఒక దగ్గర కేంద్రీకరించి అధ్యాప కులను సర్దుబాటు చేస్తూ విద్యారంగానికి పెట్టాల్సిన ఖర్చు తగ్గించుకోవాలనుకుంటున్నది.
విద్య వ్యాపారీకరణ
‘నాడు-నేడు’ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అదనపు భవనాలు గానీ అదనపు మరుగుదొడ్లు గానీ నిర్మించలేదు. ఉన్నఫళంగా విద్యార్థులను మెర్జ్‌ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి. ఇప్పటికే గదులు చాలక చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ గది, స్టాఫ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌లను తరగతి గదులుగా మార్చి బోధిస్తున్నారు. అంతే కాకుండా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకేచోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థితులు వేరు. వారి ఆహారపు విరామ సమయం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రంగం లోకి దిగుతాయి. కొంత కాలానికి విపరీతంగా ఫీజులు పెంచి ‘నచ్చితే చదవండి. లేకుంటే పోండి’ అని చెప్తాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది విద్దామంటే అవి మూతబడి ఉంటాయి. ఈ విధం గా ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు వారికి నచ్చి నట్టు దోచుకుంటూ విద్యద్వారా వ్యాపారం చేసు కుంటాయి.
విద్య కాషాయీకరణ
ఇప్పటికే బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో… తన ఆర్‌ ఎస్‌ఎస్‌ భావజాలాన్ని చొప్పిస్తూ సిలబస్‌లో మార్పు లు చేస్తున్నది. అయితే సిలబస్‌ రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉండటంతో…ఈ హిందూత్వ భావజా లాన్ని దేశమంతటా వ్యాపింపచేయడానికి ఆటంకం కలుగుతుంది. అందుకే సిబిఎస్‌ఇ సిలబస్‌ ద్వారా ఆ మార్గం సుగుమం చేసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పిన ప్రతీదానికి తల ఊపుతూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం …. రానున్న విద్యా సంవత్సరంలో33 కెజిబివిలు, 16 ఆదర్శ పాఠశాలలు, ఎ.పి రెసిడెన్షియల్స్‌, గురుకు లాలతో పాటు 500పైగా ఉన్నత పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రవేశ పెడతామంటున్నది. విద్య దూరం…తల్లిదండ్రులకు భారం…
ప్రాథమిక పాఠశాలలు మూసి వేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తరగ తులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు తరలించ నుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2 తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్పగించనుంది. అందుబాటులోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చినమేరంగి హైస్కూల్‌లో2.25 కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ,దాసరిపేట,తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠ శాలలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి.ప్రతిపేటలో పిల్లలు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడులు పెట్టారు.వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగు దల,పరివర్తనలో తేడా వుంటుంది.అందువల్ల చిన్న పిల్లలకు చదువుపట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరి లో ప్రైమరీ, హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ, పాడుతూ,ఏడుస్తూ బడికి వెళ్లే ఆరేళ్ల పిల్లడు,13 ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి… అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదుతరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాల నెల కొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభు త్వం ఏకపక్షంగా మూసేస్తోంది. వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి.‘అమ్మ ఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుం బంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి. లేదంటే పిల్లలను బడికి పంపడం ఆపేస్తారు. ‘అమ్మఒడి’ శాశ్వత పథకంకాదు.ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’వుండదు.‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదం డ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు.అందుకని సర్కారు బడులను సంరక్షిం చుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగతుల పిల్లలకు తరగతి గదులున్నాయా?బెంచీలు,కుర్చీలు న్నాయా? ఇతర మౌలికసదుపాయాలున్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట?గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యా శాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
వ్యాసకర్తలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు-(డి. రాము/ ఎం.కృష్ణమూర్తి)

విశాఖ కేంద్రంగా ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్‌

ఎంతోకాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వేజోన్‌ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కు కేంద్ర మంత్రివర్గం మార్చి 25న ఆమోదం తెలిపింది. అలాగే వాల్తేర్‌ డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాధానం ఇచ్చారు. జోన్‌ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి రాజ్యసభ వేదికగా వెల్లడిరచారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించిన తర్వాత కొత్త రైల్వే జోన్‌,రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.దీంతో ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొ న్నారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖ పట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌, వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్టు కూడా ఆయన తెలిపారు.
కమిటీ పని చేస్తోంది
జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసినట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌,రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటు లో భాగంగా పరిధి-ఆదాయ వ్యవహా రాలకు సంబంధించి అనేక విషయాలు తమ దృష్టికి రావటంతో వీటిని మరింతగా అధ్య యనం చేయటం కోసం అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేశామని రైల్వే మంత్రి వెల్లడిరచారు.
భూమి ఎంపిక పూర్తయింది
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ సముదాయం నిర్మాణానికి భూమిని ఎంపిక చేశామని చెప్పారు. పరిపాలన.. నిర్వహణ అవసరాలతో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసా గుతున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే… తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేసి విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు..అదే విధంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పుకొచ్చారు.
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలు
ఇలా దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్‌ ఉద్యోగాలు 34 ఖాళీగా ఉన్నట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414 నాన్‌గెజిటెడ్‌, 2,519 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు. 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. కడప-బెంగుళూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా డిపాజిట్‌ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపేసినట్లు పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా భూసర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లేఅవుట్‌, నివాస సముదాయ కాలనీ, ఇతర ముందస్తు నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది. పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు ఇతరత్రా హేతుబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న దక్షిణమధ్య రైల్వే,తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌, ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది’అని రైల్వేమంత్రి తెలిపారు. కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులు రూ.560 కోట్లకు పెంపు,2013-14లో రూ.110కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయిం పులను, తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.178.35 కోట్లు కేటాయించి రూ.171.2 కోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం7ఎకరాల భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. ఆ భూమిని గత ఏడాది నవంబరులో రైల్వేకి అందించినట్లు వెల్ల డిరచారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్లా పనులు తీవ్రంగా ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఎప్పటికప్పుడు ఇక్కడ ఓవర్‌హాలింగ్‌ చేయనున్నట్లు వెల్లడిరచారు. దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు 16,878, గెజిటెడ్‌ ఉద్యోగాలు34ఖాళీగా ఉన్న ట్లు రైల్వేమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో కలిపి 3,01,414నాన్‌గెజిటెడ్‌, 2,519 గెజిటెడ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిరచారు.
కొత్త జోన్‌తో అభివృద్ధి పరుగు
విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్‌ ప్రకటన..ప్రయాణీకుల అవసరాలను తీర్చడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్‌లో జోన్లవారీగా చేసే కేటాయింపుల వల్ల ఆర్ధిక వెసులబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక కొత్త రైళ్ల మంజూరు,ఉన్నవాటిని పొడిగించడంతో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.విశాఖపట్నం జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుండటంతో పరిపాలనపరంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ ఎంతో లబ్ది కలగనుంది.రైల్వే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి,రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)జోన్‌ కేంద్రంగా విశాఖపట్నంలోనే ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు రైల్వే ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చాలా దోహదం చేస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ దాదాపుగా ఒకే పరిధిలోకి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌,ఇప్పటివరకు వేర్వేరుజోన్ల పరిధిలో ఉంది. విజయవాడ,గుంటూరు,గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్‌లో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా గల తూర్పు కోస్తా,జోన్‌లో అంతర్భాగమై ఉంది. రాష్ట్ర అవసరాలకు,ప్రయాణీకులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆయా డివిజన్ల నుంచి జోన్‌ ప్రధాన కార్యాలయం వెళ్లేవి.కొన్నింటిఇన దక్షణ మధ్య రైల్వేకు,మరికొన్నింటిని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయాలకు పంపాల్సి వచ్చేది. అరకరడ ఆమోదం తర్వాత ఆ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరేవి.ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతిపాదనలను తూర్పుకోస్తా జోన్‌లో తొక్కిపెడుతున్నారని,వివక్ష చూపుతున్నారని,ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఓ బండికి అదనంగా బోగీ కావాలన్నా తిరగాల్సి వచ్చేది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ఠ్‌ రైల్వే ప్రత్యేక జోన్‌ కావాలన్న డిమాండ్‌ నెరవేరడంతో ఇబ్బందులు తొలగిపోతా యంటున్నారు.
వాల్తేరు పేరు ఇక లేనట్లే
విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించినప్పటికీ,విశాఖలో రైల్వే డివిజన్‌ లేకపోవడం ఓ పెద్దలోటుగా మారింది. వాల్తేర్‌ డివిజన్‌ ఆంధప్రదేశ్‌,ఒడిశా,చత్తీషఘడ్‌..మూడు రాష్ట్రాల పరిధిలోనూ ఉంది. ఇందులో ఏపీ పరిధిలోని వాల్తేరు డివిజన్‌ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి,విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణకోస్తా రైల్వే ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాల్తేరు డివిజను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మారుస్తారని వినిపించినా,అలా జరగలేదు. ఏపీలో ఏర్పడుతున్న కొత్త రైల్వేజోన్‌లో వాల్తేర్‌ పేరుతో డివిజన్‌ లేకపోవడంపై విమర్శలు వినిపి స్తున్నాయి. డివిజన్‌ స్థాయిలో జరగాల్సిన పనులు,ప్రతిపాదనల కోసం విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లి రావాల్సి ఉంటుంది. జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్‌ లేకపోవడాన్ని రైల్వే రంగ నిపుణులు తప్పుపడుతున్నారు.
ా గుంటూరు,గంతకల్లు,విజయవాడ డివిజన్లతోపాటు వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతం,కొత్త జోన్‌ పరిధిలోకి వస్తుంది. అది విజయవాడ డివిజన్‌లో కలిసే అవకాశం ఉంది. భౌగోళికంగా కొద్ది ప్రాంతం మినహా ఆంధప్రదేశ్‌ అంతా ఒకే జోన్‌ కిందికి వస్తుంది.
ా జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకానుంది.కొత్తగా జనరల్‌ మేనేజర్‌,అదనపు జనరల్‌ మేనేజర్‌,వివిధ విభాగాల అధిపతులు,వారికి కార్యదర్శులు,సహాయకులు..ఇలా కొత్త ఉన్నతా ధికారులు,అధికారులు వాస్తారు.
ా రద్దీని బట్టీ ఏదైనా రైలుకు అదనపు బోగీలు వేయాలన్నా,పండుగ సమయాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలన్నా,త్వరితగతిని నిర్ణయాలు ఉంటాయి. సంక్రాంతి,ఇతర ప్రధాన పండుగల సమయంలో విశాఖపట్నం వైపు రద్దీ అధికంగా ఉంటుంది. తూర్పుకోస్తా రైల్వే స్పందించి నిర్ణయం తీసుకునేసరికి పండుగ వచ్చేస్తుంది. కొత్త జోన్‌ రావడంవల్ల ఇక్కడే త్వరగా నిర్ణయాలు జరుగుతాయి.
ా అదపు రైళ్ళు బోగీలు తెచ్చుకోవడంవల్ల ఆ మేరకు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
ా కొత్త రైళ్లు ప్రకటించినప్పుడు సాధారణంగా జోన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న చోటకు ప్రాధాన్యం లభిస్తుంది. రిజర్వేషన్‌ కోటా తక్కువగా ఉండేది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్‌తో ఆ సమస్యలు తీసిపోతాయి.
ా ఇచ్ఛాపురం,పలాస వంటి మారుమూల ప్రాంతాలకు రైళ్ల కనెక్టివిటీ పెంచుకోవచ్చు.
ా వడ్లపూడిలో ఉన్న వ్యాగన్‌,వర్క్‌షాపు తదితరాలకు అనుబంధ పరిశ్రమలు వస్తాయి.
ా గంగవరం,విశాఖపట్నం ఆదాయాలు పెరుగుతాయి.
ా ప్రయాణీకుల అవసరాల్ని బట్టి రైళ్లను పొడిగించుకోవచ్చు.
ా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంలో,నిధుల కేటాయింపులోనూ ప్రాధాన్యం పెరుగుతంది.
వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలి ఆర్టికల్‌ 371డి ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలి, రైల్వే విడిభాగాల పరిశ్రమలను కేటాయించి ,కొత్త ఆర్‌ఆర్‌బి సెంటర్ను ప్రారంభించాలి, వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ ప్రారంభించే తేదీని ప్రకటించాలి. కొన్ని సంవత్సరాల నుండి కేంద్ర డిపిఆర్‌ వేశామని కాలయాపన చేసు ్తన్నారూ, గత డిపిఆర్‌ నివేదిక ఏమయింది, మరల ఎందుకు డి పి ఆర్‌ కమిటీ వేస్తున్నారు .2021లో 170 కోట్లు డివిజన్‌ అభివృద్ధి గురించి కేటాయించిన పనులు ఏమయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రాయగడ డివిజన్‌ బదులు వాల్తేరు డివిజన్‌ తో కూడిన విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించాలి. అంతవరకూ రైల్వేజోన్‌ సాధన సమితి తో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత కుమార్‌ స్పష్టం చేశారు.– జిఎన్‌వీ సతీష్‌

భారత రాజ్యాంగం లౌకిక స్వభావం

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసంలౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వా సాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే.లౌకిక రాజ్యమంటే ప్రజలు,ప్రభుత్వానికి మధ్య సంబంధాలు,పరిపా లన..మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతికప్రపంచం గురించి ఆలోచిం చడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించిఊహించి చెప్పేప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతా బ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్‌ హోలియోక్‌ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్‌ భాషలోని ూవషబశ్రీబఎ (సెక్యులమ్‌) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్‌)అని దీనిఅర్థం. ఆ తర్వాత వాడు కలో ప్రభుత్వాన్ని,పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం..పాలనచట్టం, రాజ్యాం గం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించి నప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ.పూర్వ కాలం లో ప్రజల అన్ని విషయాలను మతం,మతాచార్యు లే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు.సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.
భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణా మాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు,విశ్వాసాలు,జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యా లుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం,రెండోది భిన్నమతాల మధ్య సామర స్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు.విశ్వ వ్యాప్త మైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
ా ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
ా అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
ా మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
ా న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
ా మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
ా రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
ా లౌకికతత్వం (సెక్యులర్‌) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.
లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కు లలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమా లలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరు డు కలిగి ఉండాలని కోరడం,లౌకికతత్వానికి మచ్చు తునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.
ప్రవేశిక – లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన,విశ్వాసం,నమ్మకం అనే అం శాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.రాజ్యాంగం మూడో భాగం లో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి.(వ్యాసకర్త:డెరైక్టర్‌, క్లాస్‌-వన్‌ స్టడీ సర్కిల్‌)
లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్గించవద్దూ..
ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబ ల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగు తుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు,కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యా యులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడు తున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణం గా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగలక్ష్యాలను,ఆశయాలను పొందుపరచారు.గిరిజన ప్రాంతాలకు5,6షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులుకల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూని యన్‌లో చేరటంతో370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచి వేతకు గురైన షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, వెనుక బడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతోపాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
భారతీయ ఉమ్మడి సంస్కృతి
భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని51(ఎ)నిబంధనలో పేర్కొ న్నారు.భారతదేశం భిన్నమతాలకు, సాంప్రదా యాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలోహిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం,బౌద్ధం,పార్సీ,సిక్కు మతాలతో కూడిన సం స్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ‘’విభ జించు-పాలించు’’సూత్రంలో భాగంగా హిందు వులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చ గొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌,హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్న్‌ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మత తత్వ ధోరణులకు కొనసాగింపుగానే1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్ట టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదు ర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
రాజ్యాంగంలో లౌకిక విధానాలు
భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఈమేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ‘’స్వీకరించటానికి,ఆచరించటానికి,ప్రచారం చేసు కోవటానికి’’ హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్ర మాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా,సాంస్కృతికహక్కులను29,30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని,విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగనిర్మాతల ప్రధానలక్ష్యం భారతదేశంలోని భిన్నమతాల ప్రజలు లౌకిక విధా నాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావిం చారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
బిజెపి మతతత్వ విధానాలు
దేశంలో హిందూత్వ విధానాలను అమ లు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్ప డాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘ పరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది.2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత8ఏళ్లగా మతోన్మాదాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావ జాలంతోహిందూత్వ శక్తులు విజృంభిస్తు న్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనా రిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసం గాలు చేస్తు న్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడు తున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావర ణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చ గొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి,బెంగాల్‌, తమి ళనాడు,కేరళ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొద లగు రాష్ట్రాల శకటాలను అను మతించక పోవటం వివక్షతలో భాగమే. 2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి గత మూడే ళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మత పరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు).అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఎ.పిలో మతతత్వ శక్తుల కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు,పండగలు,ఉత్సవాల పేరుతో తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టున్నా రు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభిం చారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లా లో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరే కంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకా ణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యా యం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖ పట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు పూను కున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతో న్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ లైన తెలుగుదేశం, జనసేన గాని బి.జె.పిమతోన్మాద విధానాలను ఖండిరచటం లేదు.
ప్రస్తుత బి.జె.పిప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తనరాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు,లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
వ్యాసకర్త :శాసనమండలి సభ్యులు,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌- (బి.కృష్ణారెడ్డి/కె.యస్‌. లక్ష్మణరావు)

అరకులోయలో ఆదివాసీల అంతరంగం

“చూసే కళ్ళకు మనసుంటే-ఆ మనసుకు కూడా కళ్ళుంటే’పనిమట్లు, విత్తనాలు, ధింసా ఆటలు, గిరిజనుల జీవితం చిత్రించే బొమ్మల కొలువులు.. ఇవి అరకులోయ మ్యూజియంలో. చుట్టూ కాఫీ తోటలు, జలపాతాలు, బొర్రా గుహలు,బొంగుచికెన్‌ వంట కాలు కనిపిస్తాయి. కాని తెలుసు కుంటే కాని తెలియనివి,పల్లెలలో ఏడాది పొడుగునా గిరిజనులు చేసుకునే పనిపాట్లు,కట్టుబాట్లు,రాజులు/ప్రభు త్వాలు, ప్రజల మధ్యసంబంధాలు, పండుగలు, మొక్కులు, వంటలు, కష్టసుఖాలు.వాటిలో రాగం,తానం, లయలవలె అల్లుకుపోయిన ఆటపాటలు,కధలు,సామెతలు సాహిత్యం,లెక్కలు,ఆశయాలు ఆదర్శాలు….! అరకు,ఒడియా గిరిజన మాండలికం మాట్లాడే బగతలు, కొటియాలు,కొండదొరలుబీ తమ,తమ భాషలుగల కోదు(సామంత),పోర్జా/జోడియా వగైరా తెగలు నివసించే అరకులోయ బహుభాషల ప్రాంతం.”
అరకులోయలో జీవితకాలం గిరిజనాభివృద్ధికి పనిచేసిన కెనడా దేశీయుడు గుస్తాఫ్‌, ఆదివాసీ ఒడియా,తెలుగు అనువాదంతో తయారుచేసిన ‘ఆదివాసీ పండుగలు’ను 1976 లో పాడేరు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రచురించింది. 76-82 మధ్య శక్తి శివరామకృష్ణ సేకరించిన తెలుగు గిరిజన గీతాలు’ మీద, 1991లో సమత రవి ఏర్పాటుచేసిన ప్రసంగాన్ని విన్న, నాటి ప్రాజెక్ట్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. దాన్ని పరివర్ధిత ముద్రణగా తెచ్చే ప్రయత్నంలో 2002లో పాడేరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు Aష్‌ఱశీఅ ఎయిడ్‌లో, ఇప్పుడు అజిత్‌ ప్రేమ్‌జీ (Ajaఎ ూతీవఎjఱ) ఫౌండేషన్‌లో పని చేస్తున్న మిత్రుడు రఘు దగ్గర ఈగుస్తాఫ్‌ పుస్తకం దొరికింది.
ఇదేకాక తెలుగేతర తెగఅయిన కొంధులమీద ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 1960 లో అధ్యయనం చేసారు. 65లో ఈ తెగలన్నిటిమీద జనగణన,ఎథ్నోగ్రాఫిక్‌ నోట్స్‌ తో పాటు,కొండిబా,లంప్తాపుట్టు, జెర్రిల, అన్నవరం గ్రామాలమీద మోనోగ్రాఫ్‌లు ప్రచు రించింది. కొండదొరలమీద రాఘవరావు 75 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌ పొందారు.1863,1907లో వచ్చిన విశాఖ డిస్త్రిక్‌ గజెటిర్‌లోగల అన్నిరంగాల చరిత్ర వీటన్నిటికి పునాది.నేటి అనంతగిరి,అరకు, డుంబ్రిగూడ,పెదబయలు,ముంచెంగిపుట్‌ మండలాలు,హుకుం పేట మండలంలో పెదగరువుదాకా,కొండదొరలు పాలించిన ఒక నాటి ఒడిశా జేపోర్‌ సంస్థానంలో పాడువా తాలూకాలోనివి. స్వతంత్రం తరువాత ఈ తాలూకాలో ఈమండలాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిపోయాయి. ఆ సంస్థానం ఆఖరి పాల కుడు విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రోచాన్సెలర్‌. వారి బంధువులు కురుపాం, మేరంగి,సాలూరు,ఆంద్ర,పాచిపెంట పాలకులు, తమ రాజ్యాలను ప్రగతి పధంలో నడిపిస్తూ, దిగువనున్న విజయనగరం,బొబ్బిలి సంస్థా నాలకు పోటీగా,విశాఖనగరం అభివృద్ధి చేసారు. ఇక్కడి ఒకనాటి కాశీపట్నం జమిందారీలోది,ఘాటీ ఎక్కుతుంటే వచ్చే, అనంతగిరి మండలంలో పుణ్యగిరి తీర్ధం/ధారల గంగమ్మ. అక్కడ గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లో ‘విరాట పర్వతం’అని ఎవరో నోట్‌ చేసారు. నిజమే. ఈ ప్రాంతం 14శతాబ్దివరకు వడ్డాది రాజధానిగా పాలించిన మత్స్యరాజుల విరాట రాజ్యం. వారూ ,జేపోర్‌ వారు బంధువులు. విరాటరాజ్యంలో అజ్ఞాత వాసం గడుపుతున్న పాండవులుగా గిరిజనులు తమను పోల్చుకుంటూ ‘పంచ పాండవుల పంట-దుర్యోధనుడి వంట’ అంటూ భారతకదను తమకు అనువుగా మార్చుకుని పిప్పలి, పసుపు,చిక్కుళ్ళు,అల్లం,అనాస వగైరా తము ప్రత్యేకంగా పండిరచే పంటల దోపిడిని ‘నందిపదం’లో పాడుకుంటారు.ఆసియా అంతా, పాండవులు, వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్నారు.అలాగే ధారల గంగమ్మ, అటువంటి క్షేత్రమే పాడేరు మండలంలో మత్స్యగుండం. ఈ నీటి వనరులు ప్రపంచ మంతా జలకన్యలవి, (ఙఱతీస్త్రఱఅం, అవఎజూష్ట్రం, ఎవతీఎaఱసం), క్రూరజంతువులతో నిండిన అడవులు కొండ రాజులు/దేవతలవిగా భావించి మొక్కే, మన ఆచారాల మూలాలు,గిరిజన సంస్కృతిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ‘తెలుగు గిరిజన గీతాలు’(91),పరివర్ధిత ముద్రణ ‘కొండకోనల్లో తెలుగు గిరిజ నులు’ (2007) తెలుగు తెగల ఈ వారసత్వాన్ని, నందిపదం వంటి వారిసాహిత్యంలో వ్యవసాయ విజ్ఞానం, సంస్కృతిని సమగ్రంగా తెలియచేస్తూ అరకులోయ సంస్కృతినికూడా అర్ధం చేసుకోటానికి సహకరిస్తుంది. తెలుగు గిరిజనుల నుడికారం తెలిస్తేనే,ఇతర తెగల భాషలు మనకు బాగా తెలుస్తాయి అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి.. ఇక గుస్తాఫ్‌ పుస్తకం గిరిజన జీవితాన్ని నెలలవారీగా వర్ణిస్తూ, మనకు తెలియని గిరిజనుల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. సహజ వ్యవసాయ విధానం అమలు చేస్తున్న మితృలకోసం ఇక్కడి వ్యవసాయ సంస్కృతిని పరిచయం చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గిరిజనులకోసం,ఈ పుస్తకాన్ని ముందు సంక్షిప్తంగా పరిచయం చేసి, క్రమంగా మిగిలిన పరిశోధనలను జోడిరచటం కొన సాగుతుంది..
చైత్రం/ఏప్రిల్‌-మే
‘విరాటరాజు దేశం ఇటికె పండుగలు, కాశివారి దేశం గంగ పండుగలు’ అని నందిపదం’లో పాడుకునే, ఈ నెలలో చేసే ఇటుకల/వేటల పండుగ గిరిజనులకు పెద్ద పండుగ .ఈ నెలలో ఆడవాళ్లదే రాజ్యం.ప్రతి ఇంటి మగ వాడు, తెల్లవారగానే ఆడవాళ్లు ఊగటానికి ఉయ్యాల కడతాడు.మగవారిని వేటకోసం కొండకు తరిమాక,ఆడవారు పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఈ పండుగకుముందు, కొండమామిడికాయలు తినరు.ఫాల్గుణం/పొగు నులో హోలీ కాల్చిన రోజునుండి పాడే సంగడి ఆటపాటలు ఈ నెలతో ముగుస్తాయి.ఆటకు రానివారిదగ్గర ఆడవారు పన్ను(పెజోర్‌) వసూలు చేస్తారు.మఖ,కృత్తిక,చిత్త.స్వాతిు-ఇలా ఎవరికి ఏ నక్షత్రం అనుకూలమో చూసి విత్తనాలు వేసుకుంటారు.
వైశాఖం మే-జూన్‌
ఈ నెల వేసగిలో వర్షాలు వడగండ్లతో పడతాయట.పెళ్ళిళ్ళ కాలం.ప్రకృతి అంతా పెండ్లిలో అయిరేని/బోయ్‌ కుండలలాగా రంగురంగులతో నిండి ఉంటుంది.వేటలు ముగుస్తాయి. గొట్న పండుగ చేసి,తోపహల్వా వండి, గౌడు పశువులకాపు మొదలు పెడ తాడు.గొట్న అంటే భోజనంకుండ. ఈ పండుగ తరువాతే పొలంపనిచేసే వారికి భోజనం తీసుకెళ్లటం మొదలు పెడతారు. పుష్య మాసం లో నియమించుకున్న పని వాళ్ళందరికీ ఆయా పొలాలు కేటాయిస్తారు.ఇటుకల పండుగలో వసూలు చేసిన పన్ను డబ్బులతో ఆడవారు పిట్టు వండుకుంటారు.
లండిజేట్‌/జ్యేష్టం
లండి/సామ పొట్టిజడలు వేస్తుంది.ఈనెలలో పొర్ణమి అయ్యాక సామలుచల్లరు.మెట్టుధాన్యం, చోడిలాంటి కొద్దిరోజుల పంటలు చల్లుతారు. ఆషాఢంబీమేఘాలు కమ్మి వర్షాలు కురుస్తాయి. గింజలు నూర్చేటప్పుడు పంట దిగుబడి ఎక్కువ గా ఉండాలని జన్ని పండుగ చేస్తారు. అడవి జంతువుల బారిన పడకుండా వచ్చిన పశువులకు నైవేద్యం పడతాడు.సామ పంటతో పూజారి నైవేద్యం పెడతాడు.
భాద్రపదం/బందపని
జాకరిమెట్టలో కొర్రపంటకు కొత్తల పండుగ చేసారు. కొత్తకుండ,కొత్తజిబ్బి,కొత్త తెడ్డులతో, తరగాయ్‌ దుంపలు,గుమ్మడికూర,కొత్త చింత కాయజాకరికి పెడతారు.’లోల్లోసే అన్నవారికి లోపలొక పిల్ల,సైలోరే అన్నవారికి చంకనొక పి ల్ల’లోల్లోసి/సైలోరి పాటలు మొదలుపెడతారు.
ఓస/ఆశ్వయుజం
పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి.కొత్తధాన్యం అందుతుంది. పాలకులలో ఇసుకపోసి విత్తనాలు వేసి,పసుపునీళ్ళతో పెంచి మొలకె త్తాక ఆ పువ్వులను బల్లి/లక్ష్మి పువ్వులు అంటారు.ఆ పూలతో నేస్తం కట్టుకుంటారు. బల్లిపాటలు పాడతారు.ఈ నెలనుండి చలి మొదలవుతుంది. పంటలు నేలకొరిగి పరుచు కుని పోతాయి.ఓస అంటే ఒడియాలో పరుచు కొనుట అని అర్ధం .
దసరా
దసరాలో దుర్గ/మెరియా పడుతుందని నమ్మకం.జంతువులు కూడేనెల.నెలపొడిచి పదిరోజులయ్యాక (దశమి)దసరా పండుగ చేస్తారు.
దీపావళి
పంటలన్నీ పచ్చగా పండుతుంటాయి. జల కన్యల ప్రతినిధి కప్పదేవతకు పండుగ చేస్తారు. దీపావళి నాలుగురోజులు అన్నంపప్పు మాత్రమే తింటారు.
మార్గశిర
మంచు ముద్దలు ముద్దలుగా పడుతుంది.ఇళ్ళు, వాకిళ్ళు అలకటం తలంటి పోసుకోటం,లక్ష్మి దిగుతుంది. మూడురోజులు బల్లి పండుగ చేస్తారు.బల్లి నాటకాలు అడతారు.’బంగరాల బల్లి,బాలగొంతెమ్మ’ అంటూ పాండవుల తల్లి కుంతిని పిలుచుకుంటారు తెలుగు గిరిజనులు
పుష్యం/సంక్రాంతి
దీపావళికి తలస్నానం చేసినప్పటినుంచి మొదలైన దిమ్సా ఆటలు,పాల్గుణ పుష్య మాసాలలో ముగుస్తాయి.డప్పు,ఢంకా,కిరిడి, సన్నాయి,పిల్లనగ్రోవి,జోడుకొమ్ములు వాయిద్యాల కనుగుణంగా14 గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే ధింసా ఆట..ఆడ వాళ్ళవి సైలోరిపాటలు,మగవాళ్ళది కోలాటం.
మాఘం
‘మాఘంలో మేఘం ఫాల్గుణంలో వర్షం’. పుట్టమట్టితో ఒకనంది/ఎద్దును, దుంపలతో ఒక నందిని తయారుచేసి వాటికీ పెళ్లి చేస్తారు. బస్కి పూలతో నేస్తాలు కట్టుకుంటారు.
ఫాల్గుణం /పొగును.
దీపావళిలో మొదలైన చలి పొగును మంటలో కాలిపోతుంది.నందిపండుగలో ఇచ్చిన విత్త నాలను హోలీ బూడిదలో వేస్తారు.హోలీ పాటలు పాడతారు.దుక్కులు మొదలు పెడతారు.
వ్యవసాయ వారసత్వం సమత టీంలో, దేవుళ్ళు సంజీవని సంస్థ,1990 నుండి రాష్ట్రమంతటినుండి విత్తనాల జాబితా పోగుచేయిస్తున్న డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ స్పూర్తితో డుంబ్రిగూడ మండలంలో ప్రారం భించిన విత్తనాలసేకరణ, పండుగలు చేయ టం,కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది.ఈ సొసైటీ కృషిలో సహకరించిన కామేశ్వర శర్మ, రవి విశ్వవిద్యాలయాలలో పర్యావరణ,వృక్ష శాస్త్రవేత్తలు. ఇతర శాస్త్రవేత్తలు,సంస్థలు తమ పక్కనే ఉంటూ చేసినకృషిని,అందరు శాస్త్రవేత్త లలాగే వీరుకూడా పట్టించుకోలేదు భద్రిరాజు కృష్ణమూర్తి నాయకత్వంలో 1960లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతులనుండి సేకరించిన పదసంపదతో కూర్చిన వ్యవసాయ మాండలిక వృత్తి పదకోశంలో,427 వడ్లరకాలు,100 రకాల జొన్న,18 రాగి,ఆరికలు 5,కొర్ర 37, ఉలవలు 13,బొబ్బర 8,సెనగలు 8,నువ్వు 19,ఆముదాలు 7,చెరకు 2,పత్తి 12,పొగాకు 15,మిరప 10,కొబ్బరి 51,అరటి 15,నిమ్మ 8 రకాలు పేర్కొన్నారు. అయితే ఈ పదకోశంలో గిరిజనప్రాంతాల వివరాలు లేవు. దేవుళ్ళు వగైరాలు తయారు చేసిన విత్తనాల జాబితా ఈలోటును పూరిస్తుంది.భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు,నేడు వ్యవసాయరంగంలో పనిచేస్తున్న ‘వాసన్‌’ వగైరాల మాతృసంస్థ Aష్‌ఱశీఅ టశీతీ షశీతీశ్రీస ంశీశ్రీఱసaతీఱ్‌వ పక్కనే ఉండేది.కానీ ఆయన వ్యవసాయపదకోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పదకోశాల నిర్మాణంలో పాల్గొన్న చేకూరి రామారావు,బూదరాజు రాధాకృష్ణ పత్రికా రంగంమీద విశేష కృషి చేసారు.కాని వారు ఈ రైతుల పదసంపదను పత్రికలకు గుర్తుచేయ లేదు.Rబతీaశ్రీ సవఙశీశ్రీశీజూఎవఅ్‌,ూబ్‌్‌ఱఅస్త్ర శ్రీaర్‌ ్‌ష్ట్రఱఅస్త్రం టఱతీర్‌(83)బీఖీaతీఎవతీం ఖీఱతీర్‌(89) పుస్తకాలు రాసి, రైతును గూర్చి ముందు తెలుసుకోవాలని ఉద్బోధిస్తూ ూRAవిధానాలను ప్రచారం చేసిన రాబర్ట్‌ చాంబర్స్‌తో పనిచేసిన శాస్త్ర వేత్త సంఘి ( మేనేజ్‌) ఈ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవారు.అప్పట్లో పెర్మా కల్చర్‌ బిల్‌ మోలిసన్‌తో వీరందరూ ఒక కార్య శాల నిర్వహించారు.తూర్పు కనుమలలో చెద పురుగుల సమస్యగూర్చి అడిగినపుడు,చెదలున్న భూముల్లో చింత,పనసలు బాగా వస్తాయి. అవికూడా పంటలే.ప్రకృతికి ఎదురీదవద్దు అని, బిల్‌, హెచ్చరించారు. క్రమంగా ఈ ప్రాధా న్యతలు, పద్ధతులు మారిపోయాయి. అత్యధిక వర్షపాతం పొందే ఈప్రాంతంలో కొండ వాగులు,జోరెలగర్భంలో మళ్ళు కట్టి వరి పండిస్తారు.ఈ జోరెలలోనే నీటిమొక్కలు టవతీఅ, షవషaసలు అనాదిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు, కొండప్రాంతాలలో తీవ్రసమస్య భూమికోతను అరికడుతున్నాయి. వ్యవసాయం పెరిగినకొద్దీ నరికి వేయటంతో ఇవి అంత రించాయి. .హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరత్నం నాయుడు, ఇటువంటి షవషaసలను, అడవులలో దొరికే aతీషష్ట్రఱస పూలను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముతున్నారు. జీలుగుకొమ్మలను పోలిన ఈ టవతీఅను గిరిజనులు ‘కన్నెజీలుగు’ (జలకన్యల),నీటిమీద పరుగెత్తే జూశీఅస ంసa్‌వతీ ను ‘గన్నికల పురుగు’ అంటారు. వారి మనో ప్రపంచంలో కప్ప,చేప,ఎండ్రిక మొదలైన జల చరాలు జలకన్యల ప్రతినిధులు.విశాఖ మన్యం లో అత్యున్నత శిఖరంపేరు ‘ఎండ్రిక’ పర్వతం. విశాఖ గజేటిర్‌, జేపోర్‌ రాజులు వారణాసి నుండి మాలీలను రప్పించిపూలు,పొందరల చేత కూరగాయలు ,వ్యవసాయానికి అవసరమైన ఇతర వృత్తులు ప్రోత్సహించారు అని తెలియ చేస్తుంది.. జేపోర్‌, అత్యధిక వరివంగడాలుగల ప్రాంతంగా శాస్త్రవేత్త రిచారియా 1970 లలోనే ప్రపంచానికి చాటారు. హరితవిప్లవం వ్యాప్తిలో పడి నిర్లక్ష్యం చేసిన,ఈ జన్యు సంప దను, ఆ విప్లవ పితామహుడు స్వామినాథన్‌ ఫౌండేషన్‌, ఇక్కడి 340 వరిరకాలు,వాటిలో 24 సువాసన కలవి,27 వరద,2 నిలవ నీళ్ళను,1 కరువును తట్టుకునేవి.8 రకాలు చిరు ధాన్యాలు,9 రకాల పప్పులు,5 నూనె గింజలు,3 పిచు చెట్లు,7 రకాల కూరగాయలు జాబితా ఇంతవరకు తయారు చేసింది.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఖీAూ), భారతదేశంలోగల మూడుప్రదేశాలలో ఒకటిగా,జేపోర్‌ వ్యవ సాయ వారసత్వాన్నిగుర్తించింది.దశాబ్దాలుగా ఈ అరకులోయలో నేచర్‌,వికాస మొదలైన స్వచ్చంద సంస్థలు నాబార్డ్‌ మొదలైన సంస్థల విధానాలబట్టి వ్యవసాయాభివృద్ధి చేస్తూ , రైతు సంఘాలు నడిపిస్తున్నారు.మారుమూల ఉన్న సొవ్వ పంచాయితీలో పండే కూరగాయలను విశాఖలో అమ్మించటంలో దేవుళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు కాని,రవాణా ఖర్చులు పోగా మిగిలేది తక్కువ అని గిరిజనులు వాపోతు న్నారు. కేరళలో ఈ మాత్రంకూడా భూములు లేని గిరిజనులు ఇంటిచుట్టూ మిరియం పండిర చుకుని గడిస్తున్నారు. ఇక్కడ భూమికంటే అడవి ఎక్కువ.కాబట్టి అటవీ హక్కులగుర్తింపు ద్వారా అడవి కాపాడుతూ లాభం పొందే ప్రయత్నం చేయాలి, ఇందుకోసం గతంలో ధింసా గిరిజన సమాఖ్య 27 పంచాయతిలలోగల 217 అవాసాల సంప్ర దాయ వనరులపటాలు తయారుచేసింది. పోడు భూముల కొలతలు తక్కువగా చూపి నందుకు ఆందోళన జరి గింది.. ఆ కృషిని కొనసాగించాలి.ఆ ప్రయత్నం గ్రామసభలకు ప్రాణం పోస్తుంది. సరిjైున భూమి హక్కుల నమోదు,ఆ పధకాలకు ఇచ్చే రాయితీలను పొందటంలో న్యాయం చేస్తుంది. ‘వాసన్‌’ సొవ్వ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి నిధులకోసం ప్రయత్నిస్తున్నది. గ్రామసభలతో సంబధం లేకుండా తామే లభ్దిదారులను ఎంచుకొని,వారి ఖాతాలో ఇంటర్‌ నెట్‌ ద్వారా పధకాల తాలూకు సొమ్ము జమచేయటం,అవి దక్కించుకోటంలో అవకతవకలు, పడేపాట్లు,లోపాలను ‘నగదు బదిలీ సఫలమా,విఫలమా’ వ్యాసంలో (ఆంధ్రజ్యోతి) లో లిటేక్‌ చక్రధర్‌ ఎత్తిచూపారు. సహజ వ్యవసాయం ప్రకారం పేడపానకం వగైరా తయారుచేయటం గిరిజనులు నేర్చు కుంటుంటే , ఇదే సమయంలో కంపనీలు తయారు చేసిన ఈ పోషకాలనుకూడా అధి కారులు పంచుతున్నారు.సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడులు తగ్గాయి కాబట్టి దిగుబడి తక్కువైనా పరవాలేదు అని గిరిజనులు అనుకుంటున్నారు.. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వకార్యక్రమాలలో తమ అనుభవాలతో అనేక రచనలు చేసారు. కాని వారి రచనలలో గిరిజన సంస్కృతిగూర్చి పొడి మాటలు మించి ఏమీ ఉండదు. అటు వంటి అధికారుల అధ్వర్యంలో నడిచే IుణA పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడైన, సవర రచయిత మల్లిపురం జగదీశ్‌ ‘స్వతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో,నాలుగు దశాబ్దాల గిరిజనాభివృద్ధి సంస్థల పాలనలో గిరిజనుడి పరాయీకరణ ముమ్మరమైంది. చట్టాల అమలు ప్రశ్నార్ధకమైంది.అతడు లబ్దిదారుగా మారి, దరఖాస్తు దారుగా క్యూలో నుంచున్నాడు. గిరిజనసాహిత్యం అంటే ఉద్యమసాహిత్యం అనే పేరు పడిపోయింది. గిరిజన విద్యాలయాలనుండి, తన సంస్కృతి గురించి చెప్పుకోగల గిరిజన రచయిత ఎందుకు రాలేదు? (‘బహుళ’.పెర్స్పెక్టివ్స్‌ ప్రచు రణ 2019) అని నిలదీస్తున్నాడు.ఇలా.. ప్రజల జ్ఞానాన్ని, సంస్కృతిని పట్టించుకోకుండా, శాస్త్ర వేత్తలు,అధికారులు,సంస్థలు, ఎవరిదారిది వారుగా‘అభివృద్ధి’చేస్తూ జనాన్ని ముష్టివాళ్ళుగా మార్చారు. వీరంతా, ఇటువంటి ప్రశ్నలే వేసుకుని, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సహజవ్యవసాయం ప్రచారం చేసే ప్రవక్తలు, సంస్కృతి అధ్యాత్మికతలంటూ పెద్ద పెద్ద ఉపదేశాలిస్తారు. వారిలో ఒకరు, వికారా బాదులో ఈ వ్యవసాయంచేసే విజయ రాంగారు, గత సంచికలో తెలియచేసినట్లు, అక్కడ చిరకాలంగా పనిచేసేణణూవలెనే,అక్కడి ప్రజలు పాడుకునే పాటలు,పండుగలు తెలుసు కునే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రసంగా లలో అక్కడి గ్రామీణులు తలుచుకునే పాండ వులు,పర్వతాల,అనుముల బ్రహ్మారెడ్డివంటి కధలు,కార్తెలు,దుక్కులు,సామెతలేవీ నిపించవు. కొత్త పరిభాషను,పదజాలాన్ని,పండుగలు, యాత్రలను అలవాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి వీరభద్రుడు తన ‘నేను నడిచిన దారులు’లో, అరకులో అభివృద్ధిని అధ్యయనం చేయటానికి వచ్చిన విద్యార్ధి బృందానికి,పైన చెప్పినట్లు, చుట్టూ కనిపించే విషయాలు వివరిస్తారు. గుస్తాఫ్‌ చేసే అభివృద్ధిని స్కేల్‌ అప్‌ చేయాల్సిన అవసరం బోధిస్తారు. కాని గుస్తాఫ్‌ గ్రంధస్తం చేసిన సంస్కృతి ప్రసక్తి తేలేదు..దేవుళ్ళు క్లాస్‌ మేట్‌,నేడు కాకినాడలో పశుసంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణగారు,తన కుమార్తె అభివృద్ధి (ణవఙశీశ్రీశీజూఎవఅ్‌ ూ్‌బసఱవం) విద్యార్ధి వైష్ణవితో, అరకులోయలోని సొవ్వలో, అనకాపల్లి వ్యవసాయశాఖవారు,పోషక సామగ్రి,పనిముట్ల పంపిణికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు వారిద్దరితో సంస్కృతిలో ఈ కనిపించని విషయాలు,చరిత్ర గుర్తు చేసే వీలు దొరికింది.విశాఖలో డుంబ్రి గూడ మండలం సర్పంచ్‌లతో వాసన్‌ నిర్వ హించిన సమావేశాలు,చొరవ తీసుకుని అరకు లోయలో చేసిన పర్యటనలో చూసిన పరిశీల నలు,60ఏళ్ల అభివృద్ధి చరిత్ర నేప ధ్యాన్ని కాగి తం మీద పెట్టటానికి తొందర పెట్టాయి.- (రచయిత : శక్తి స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు,శివ రామకృష్ణ

బడుల్లో కరోనా భయం..తగ్గిన హాజరుశాతం..!

” పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు’ .ఏపీలో తల్లితండ్రులు ‘‘మా పిల్లల్ని స్కూల్‌కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు. కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్‌కు చెందిన సరళ ఈ మాట అన్నారు. ‘‘కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’ అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్‌ రవి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు విషయాలు వెల్లడిరచారు” .
ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ కుదిపే స్తుంది. దీనిప్రభావం అధికంగా పిల్లలపై చూపడం తో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడు తున్నా రు. బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుం డటంతో..ఏపీవైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాద నలు చేసింది. ఏదైనాస్కూల్లో ఒకేరోజు ఐదు పాజి టివ్‌ కేసులు నమోదైతే..ఆస్కూలును మూసి వేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్‌ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వ హించవద్దని…లేదంటే వైరస్‌వ్యాప్తి తీవ్రమవు తుం దని హెచ్చరించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్‌ చేసి ప్రతిఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సర్కార్‌ సూచించింది. అలాగే హాస్టళ్లు,రెసిడెన్షియల్‌ పాఠ శాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీ పంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు,ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచిం చింది. ప్రతిస్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారితప్పని సరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారుల్లో ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టు లకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తా మని ఏపీఆరోగ్య శాఖ తెలిపింది.‘పిల్లల్ని బడికి పంపాలంటే భయం,ఆపేస్తే చదువు ఏమైపోతుం దోనని ఏపీలో తల్లితండ్రులుదిగులు పడుతున్నారు. ‘మాపిల్లల్ని స్కూల్‌కు పంపినా పంప కపోయినా మేం తప్పుచేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా,పంపించక చదువులో వెనుకబడినా తల్లిదం డ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేక పోయా మని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటా యించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాలటీచర్‌ రవి అన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలు స్తోంది.
చదువులో వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్ప లేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్‌ స్కూళ్ల లో చదివే పిల్లలతల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్‌లైన్‌ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించి తరగతులు నిర్వహించాలి అని ఏపీ మున్సి పాల్‌ టీచర్స్‌ఫేడరేషన్‌ (ఎఫ్‌ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్‌ చెప్పారు. ఏ ప్రభుత్వ పాఠ శాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్‌ రిలీజ్‌ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్‌ బిల్లులు చెల్లింపులు,ఇతర అవసరాలకు వాడుతుం టారు. ఈనిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులుకొనడానికి వాడమంటున్నారని…కానీ నాడు-నేడు పథకంప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.‘‘థర్డ్‌ వేవ్‌ నేపథ్యంతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు,థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్‌ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధినిధులు ఇవ్వడం లేదు. ఒకటి రెండు నెలలంటే,టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం.కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్‌ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వెంటనే పూర్తి చేయాలి.మిడ్‌ డే మిల్స్‌ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశ ముంది.అందుకే పిల్లలకు డ్రై రేషన్‌ ఇవ్వడం మంచిదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళంలో 57,విజయనగరం31,విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49,పశ్చిమగోదావరిలో48, కృష్ణాలో36,గుంటూరులో55,ప్రకాశం13, నెల్లూరు 30,చిత్తూరు55,కర్నూలు44,కడప 42, అనంత పురం28…ఇలామొత్తం556మంది ఉపాధ్యా యులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణిం చిన వారిని కూడా కలుపుకుంటే మరో 20శాతం పెరుగుతారు.విద్యార్థుల్లో కూడా కొందరు చనిపో యారు. అయితే ప్రస్తుతం పిల్లలు,ఉపాధ్యాయు లలో ఒకరినుంచి ఒకరికి కరోనాసోకకుండా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది అని ఎఫ్‌ఏపీటీవో ప్రతినిధి రవిసిద్ధార్ధ్‌ చెప్పారు.
కొన్ని స్కూళ్లలో భయాలున్నా…హాజరు పెరిగింది
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలాఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్‌ వేవ్‌ తర్వాత బడులు ప్రారంభిచగానే తమపిల్లలను పంపించడానికి తల్లి దండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయం లోనే కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. బడులు ప్రారం భించినప్పుడు 20శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85శాతానికి చేరుకుంది. మళ్లీఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం మొదలైంది.కోవిడ్‌ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు.అయితే,ప్రభుత్వం కోవిడ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదం డ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు అని విశాఖ జిల్లా విద్యాశాఖా ధికారిణి ఎల్‌.చంద్రకళ చెప్పారు. కరోనా నిబం ధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్‌ మార్గదర్శ కాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్య వేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తే క్వారంటైన్‌ పీరియడ్‌ కింద 14రోజు లు మూసివేస్తున్నామఅని విశాఖ డీఈవో వెల్లడిర చారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పిల్ల లను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపక పోతే పిల్లలు విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం,పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్‌ గేటు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌,మాస్కులు వంటివిచూస్తున్నా…బడి లోపల,తరగతి గదుల్లో ఎలాఉంటుందో…? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం కూడా చూస్తున్నాం అని విశాఖ మురళీనగర్‌ కు చెందిన సరళ చెప్పారు. సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది.ఆన్‌లైన్‌ తరగ తులే మంచిదని సరళ భావిస్తున్నారు. మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో,కాదో అర్థం కావడంలేదు. అన్‌లైన్‌ తరగ తులే బెటరని మాకు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల్లో కరోనా పాజి టివ్‌ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడంకష్టం.పైగా బడిలోకరోనా సోకిం దా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా?అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పెద్దలు,సెకండ్‌ వేవ్‌లో యువత,మధ్యవయస్కులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అవ డంతో,థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకా శం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్‌ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి.ఆడేటా ప్రతిస్కూల్లో ఉం డాలి. రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకోని తల్లిదం డ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు…వారి నుంచి మిగతా పిల్ల లకు కరోనా సోకే అవకాశం ఉంది అని విశాఖ లోని చిన్నపిల్లల వైద్యులు సతీష్‌ చెప్పారు. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్‌ సతీష్‌ భావిస్తున్నారు. ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్‌ డిస్టైన్సింగ్‌, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలు పాటించకపోతే ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని డాక్టర్‌ సతీష్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రొటో కాల్‌ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నా రు. ఏదిఏమైనా కనీసం మరోఏడాది పాటైనా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం మంచిదని ఆయన సూచిం చారు.జిఎన్‌వి సతీష్‌

క‌రోనా మహామ్మారి మార్చినాటికి తగొచ్చు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కోత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడోముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చినాటికి దీని తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్రప్రభావం చూపించొచ్చు.కేసులు ఆకస్మాత్తుగా..భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం,రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం,ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యశాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండువారాల్లో గరిష్ట స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి తొలివారం మధ్యలో కరోనా ఉధృతి గరిష్టస్థాయిలో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్దంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపడటంతోపాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. అయితే కరోనా తీవ్రత మార్చినెలలో తగొచ్చుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుపోతున్నాయి. అత్యధికంగా మహా రాష్ట్ర,ఢల్లీిలో ఒమిక్రాన్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే ఢల్లీిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా..ముంబాయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాక్షికంగా కర్ఫ్యూ అమలువుతంది. ఇదిలా ఉండగా…నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను ఆరికట్ట వచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది అని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడిరచారు.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహమద్‌ పేర్కొన్నారు.ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి,మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే కొన్చిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే 29రాష్ట్రాల్లో గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోకరోనా వైరస్‌ విజృంభణ
థర్డ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువు తున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోసారి వెలుగులోకి బ్లాక్‌ ఫంగస్‌ ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓవ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను,ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు వెల్లడిరచారు.కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్‌ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్‌ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.– గునపర్తి సైమన్‌

ఆకలి కేకలు తప్పడం లేదా..!!

అభివృద్ధింటే అద్దంలా మెరిసే రోడ్డు..ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈభూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం,ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. పోషకాహార లోపం..చిక్కిపోయిన పిల్లలు(ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు),ఎదుగుదలలేని పిల్లలు(వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు),పిల్లల మరణాలు(ఐదేళ్లలోపు పిల్ల మర ణాల రేటు)వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉప యోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకో వచ్చు.తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొం టున్న ఐదేళ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది’’

పెరిగిన ఆదాయాన్ని,సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమా ణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడు తున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యా సాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. బ్రిటీష్‌ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులో కొచ్చాక భారత్‌ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్‌ ఐటీ కేంద్రంగా రూపుదిద్దు కుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగం లోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమా ణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేం దుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు..దాన్ని సక్రమంగా పంపి ణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందు కోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతు న్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.. Read more

1 6 7 8 9 10 11