వాతావరణానికి ఏమైంది?

వాతావరణం మారిపోయింది. ప్రతి నోటా ఇప్పుడు ఇదేమాట. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలికాలంలో రోళ్లు పగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏక మవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచు కొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమం డలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొనితెచ్చు కున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించు కోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్ప వంటూ … ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణో గ్రతలను1.5సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవా వరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద,వర్ధమాన దేశాలు చేసే దేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూ లకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగంవల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతా వరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయు వులు43శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొన డం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియ జేస్తోంది.శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగి పోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడే స్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ‘ద లాన్సెట్‌’ మెడిక ల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈజిప్టులో నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫ రెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్ద తు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యా వరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎందుకీ అధిక వర్షాలు.. అసలు కారణాలేంటి?
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఒకటేవర్షాలు. అదికూడా రోజుల తరబడి. గతం లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నా యి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతు న్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి.రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ?కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమి తమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్‌ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.
ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం..సైన్స్‌ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్‌ వార్మింగ్‌. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమిచల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజం గా ఏర్పడే ఈగ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం,కాలుష్యంవల్ల మరిన్ని ఉద్ఘారాలు విడు దలై వాతావరణంలో వేడిని మరింత ఎక్కువ చేస్తు న్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు.కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డ యాక్సైడ్‌ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ,సల్ఫర్‌ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి.పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు 30 శాతం,వాయువులు 140శాతంపెరిగాయని పర్యా వరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషిదాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టాను సారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యా వరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్‌ అవసరా లకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరా లకు,గృహఅవసరాలకు అడవులను ఇష్టాను సారం గా కొట్టేయడం,సముద్రాలను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చడంవల్ల జరగాల్సిన నష్టంజరిగి పోతోంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచు తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్‌ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. అదే జరిగితే మాల్దీవులు,సీ షెల్స్‌ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతా యి. లండన్‌, వియత్నాం నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవు తుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశం లోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై,ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.-జిఎన్‌వి సతీష్‌

నిరుద్యోగంతో..ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో..
దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం.‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలోతొక్కింది.ఉపాధి దొరక్క, తిండి లభించక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం)చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు..ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం.2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది.‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ..చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు…! దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ వంటి ఆర్థిక పరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవ సాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మ హత్య లకు ఉసిగొల్పు తున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికి పోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయా న్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదా యాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చు కుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణం గా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతు న్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార?ండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డు లివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమ టించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతు న్నారు. దీనిని 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంత ర్యామి దాస్‌ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక లో దిగజారిన భారత్‌
పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ ఇండియా
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌,2022లో 121 దేశా లలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌ మినహా దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే వెనుక బడి ఉంది. 29.1స్కోర్‌తో,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలు,యూరోపియన్‌ ఎన్‌జి ఓలు కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ మరియు వెల్తుంగర్‌ హిల్ఫ్‌, ఆకలి స్థాయిని తీవ్రమైనదిగా ట్యాగ్‌ చేశారు.121 దేశాలGనIలో ఎనిమిది స్థానాలు దిగజారి 84వ ర్యాంక్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌, గతేడాది 76వర్యాంక్‌తో పోలిస్తే చాలా మెరుగు పడిరది. దాదాపు అన్ని పొరుగు దేశాలు బాగా మండిపడ్డాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు మయ న్మార్‌ వరుసగా 99, 64,84,81మరియు 71స్థానాల్లో నిలిచాయి. ఐదు కంటే తక్కువ స్కోర్‌తో మొత్తం 17 దేశా లు సమిష్టిగా1మరియు 17మధ్య ర్యాంక్‌ పొందాయి.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రాంతాల వారీగా మరియు దేశం వారీగా ఆకలిని కొలిచే మరియు ట్రాక్‌ చేసే సాధనం. 2022 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేక దేశాలలో భయంకరమైన ఆకలి కుంభకోణాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే ఆకలిని ఎదుర్కోవడంలో దశాబ్దాల పురోగతి క్షీణిస్తున్న దేశాలలో మారుతున్న పథం రెండిరటినీ ప్రతి బింబిస్తుంది. ఆకలిసూచిక స్కోర్‌లు నాలుగు కాంపోనెంట్‌ ఇండికేటర్‌ల విలువలపై ఆధారపడి ఉంటాయి: పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల,పిల్లల వృధా మరియు పిల్లల మరణాలు. పోషకాహార లోపం తగినంత కేలరీల తీసుకోవడంతో జనాభాలో వాటాను సూచిస్తుంది. ఇండెక్స్‌లో ఎక్కువ స్కోర్‌ అంటే ఆకలి పరిస్థితి మరింత దిగజారడం. సున్నా అనేది ఉత్తమ స్కోర్‌..ఆకలి లేదని సూచిస్తుంది.
ప్రతిపక్షాల విమర్శలు ఆకలిసూచీలో భారత్‌ ర్యాంక్‌ పడిపోవడంపై తెలంగాణ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. ఇంకో రోజు చీూA ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను ఇప్పుడు భారత వ్యతిరేక నివేదిక గా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుం టున్నాను.
కరోనాతో సమస్య..
ఈ సూచీలో భారత్‌ స్థానం 101కాగా, పాకి స్తాన్‌ 92వ స్థానంలో, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76వ స్థానంలో, మయన్మార్‌ 71వ స్థానంలో నిలిచాయి. ఇవి భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్ప టికీ.. ఇవి కూడా తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడంలో ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా కారణంగా చాలా దేశాల హంగర్‌ ఇండెక్స్‌ దిగజారిందని వెల్ల డిరచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలిపై పోరాటం సరైన మార్గంలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల విషయంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. కరోనా సంబంధిత ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు,వాతావరణ మార్పు, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు.. ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. దేశాలు,ప్రాంతాలు,వర్గాల మధ్య అసమానతలు తొలగనంతవరకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేసింది.
ఆకలి సూచికలపై కాషాయ దళాల మండిపాటు
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగ జారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే ఇలాంటి వాదన లను ప్రభుత్వం కూడా చేస్తున్నది,ఖండి స్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వక పోతే తల తీసేదేమీ ఉండదు.ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీక రించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే. ఆకలి సూచికలను రూపొందిం చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశా లకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొం దించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ).అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌, కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’ తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకు న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు.-సైమన్‌ గునపర్తి

రుణ యాప్‌ల కారకులెవరు?

పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు. అనేక ఆధారాలు చూపాలి. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే ‘విలువైన విని యోగదారుల’ సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించ కుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
‘అప్పు అంటే ముప్పే’అన్న మాట రుణ యాప్‌ల దారుణాలు చూస్తుంటే అక్షర సత్యమని పిస్తుంది. పేద,మధ్యతరగతి ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని ఫోన్లద్వారా అప్పులు ఇచ్చేం దుకు నెట్‌లో వందలసంఖ్యలో రుణయాప్‌లు వున్నా యి.ఈయాప్‌లు అప్పుతీసుకునే వారికోసం మొదట వేట ప్రారంభిస్తాయి.ఆవేటలో చిక్కిన రుణగ్రహీత లను దారుణంగా వేధించి వసూళ్ళు చేస్తాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేనివారు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. మన రాష్ట్రంలో గత రెండు నెలల్లో పది మందికిపైగా రుణయాప్‌ బాధితులు ఆత్మహ త్యలు చేసుకున్నారు.ఈరుణయాప్‌ల గురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు గతనెల లోనే మూడు,నాలుగుసార్లు హెచ్చరికలు,విధాన నిర్ణయాలు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
నిత్యావసరాలు,అత్యవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు మానసిక, శారీరక శ్రమలు చేయడం ద్వారానైనా రావాలి. లేదా ఆ శ్రమలు చేసిన వారిని దోచుకోవడం ద్వారానైనా రావాలి.ఈ వ్యవస్థలో అత్యధికులు శ్రమ చేయడం, అతి కొద్దిమంది శ్రమను దోచుకోవడం జరుగు తుంది. అందువల్ల ఉత్పత్తి, అందుకు అవసరమైన శ్రమఈవ్యవస్థను నడపడంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. యంత్రవిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో విని యోగించడంవల్ల శ్రమతేలిక కావాలి. శ్రమ జీవికి విశ్రాంతి కలగాలి.కాని పని చేయగలిగిన వారంద రికి పనులు దొరకని పరిస్థితి ఏర్పడడమే ఈ వ్య వస్థ బలహీనతలన్నింటికీ మూలం. ఉన్న కొద్దిపాటి పనులకు పోటీ పెరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యజమానులు వేతనాలు తగ్గిస్తారు. ఇది చివరకు నిత్యావసరమైన వాటిని కూడా కొనలేని స్థితికి ప్రజలను దిగజారుస్తుంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో చేసిన అప్పుల భారం, పనులు తగ్గడం శ్రమజీవుల జీవనాన్ని మరింత వేగంగా దిగజా ర్చింది.ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పేదలందరికీ నెలకు రూ.7,500ఇవ్వాలనే కనీస డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల గతంలో చేసే అప్పులకు తోడు కోవిడ్‌ తర్వాత పేద,దిగువ మధ్యతరగతి ప్రజలు రోజువారీ అవస రాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది.వీటికి తోడు బిజెపి పాలనా కాలంలో వేగంగా అమలవు తున్న సరళీకరణ విధానాలు ఒకవైపు ఉపాధిని తగ్గించి,మరోవైపు ధరల భారాన్ని పెంచాయి. వీటికితోడు వస్తు వ్యామోహాన్ని విపరీతంగా పెం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితితో సంబంధంలేని జీవనాన్ని ఈఆర్థిక విధానాలు అలవాటు చేస్తు న్నాయి. అత్యధిక మందిని ఆధునిక జీవన ఆశల ఊహల్లో పోటీ పడేటట్లు,భౌతికజీవనాన్ని మధ్య యుగాల నాటి మూఢనమ్మకాలు, విశ్వాసాల్లో నిలి చేటట్లు పాలకవర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తు న్నాయి. ఈసరళీకరణ విధానాల కత్తికి రెండు పక్కలా పదును వుంది. ఒకవైపు కార్పొరేట్‌ కంపె నీల సరుకులను ఎగబడి కొనేటట్లు చేయడం, మరోవైపు మతతత్వ శక్తుల భావజాలాన్ని ఆచరించే టట్లు చూడడం. అందుకే ఈ విధానాలను అన్ని వైపుల నుండి పాలక పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఎవరైతే ఉపాధి తగ్గించి, వేత నాలు తగ్గించి ప్రజల కష్టాలకు కారణమవు తున్నా రో వారే తమ సరుకులను అమ్ముకోవడానికి, కొను గోలుదార్లను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడు తున్నారు. సీరియళ్లు,సినిమాలు,మీడియా ప్రకట నలు,హోర్డింగులు,అందమైన షాపింగ్‌ మాల్స్‌, ఆకర్షణీయమైన రాయితీలతో పాటు రుణ సదుపా యాలు ఇచ్చి కృత్రిమ కొనుగోలు పెంచి సరుకులు అమ్ముకోవాలని చూస్తున్నారు.-(వి.రాంభూపాల్‌)

పోలవరం అగమ్యగోచరం

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల జరిగిన శాసనసభలో ఆవిష్కృతమైన చర్చ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న వారిని మరింత అయో మయానికి,భూములు,ఊళ్లు,ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన లక్షల మంది గిరిజన నిర్వాసి తులను తీవ్ర వేదనకు గురి చేసింది. ప్రాజెక్టు పనులు మొదలయ్యాక, మరీ ముఖ్యంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతున్న తరుణంలో గోదావరికి కొద్దిపాటి వరదలొచ్చినా ముంపు గ్రామాలు మునుగు తున్నాయి. నిర్వా సితులు ఉన్నపళంగా కట్టుబట్టలతో ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. మొన్న వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి. నేటికీ కొండలపై, గుడారాల్లో ముంపు బాధితులు బతుకీడుస్తున్నారు. ఈ సమయాన అసెంబ్లీలో చర్చ అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను ఏకరువు పెట్టడానికే సమయాన్నంతా వెచ్చించింది. పోలవరం జాప్యానికి మీరు కారణం అంటే కాదు మీరు అన్న నిందారోపణలే తప్ప నిర్వాసితుల వెతలు పట్టించు కోలేదు. పైపెచ్చు కాంటూరు లెక్కలతో నిర్వాసితుల పరిహారం వాయిదా వేస్తున్నట్లు సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి ప్రకటించారు.
పోలవరం నిర్మాణాల్లో గతటిడిపి ప్రభు త్వ లోపాలను కనుక్కో గలిగిన వైసిపి ప్రభు త్వం, నిర్వాసితుల లెక్కల దగ్గరకొచ్చేసరికి ఆ ప్రభుత్వ గణాంకాలనే పొల్లు పోకుండా ఒప్పజెప్పడం విడ్డూరం. ప్రాజెక్టును ప్రతిపాదిత 45.72 మీటర్ల (కాంటూర్‌) ఎత్తులో నిర్మిస్తే లక్షా పది వేల మంది మునుగుతారు. 41.15 మీటర్లవద్ద నీరు నిలిపితే 20వేల మందే మునుగుతారన్నది గత ప్రభుత్వ లెక్క. ఇటీవలి వరదల్లో 38 మీటర్ల ఎత్తుకే 45.72 కాంటూ రు లోని 373 గ్రామాలూ మునిగాయి. అంతే కాదు,ఆపైన వంద గ్రామాల చుట్టూరా నీరు చేరింది. దీన్నిబట్టి కాంటూరు లెక్కలు కాకి లెక్కలనేగా? వాటిని పట్టుకొని ఈ ప్రభుత్వం వేలాడుతోంది. ప్రాజెక్టు కింద లక్ష మంది మునుగుతుంటే 41.15 కాంటూరు వద్ద 20 వేల మంది మునుగుతారు, ముందు వారికే పునరావాసం అంటే తతిమ్మా 90వేల మంది గతేంటి? చెప్పిన కాంటూర్‌ వరకు ఇస్తామన్న ఆర్‌ అండ్‌ ఆర్‌ చెల్లింపులకు జిఓ ఇచ్చేశా మన్నారు సిఎం. ఏడాదైనా రూ.6.5లక్షల నుంచి పది లక్షలకు పెంచి చెల్లింపులు చేయ నేలేదు. భూములు కోల్పోయిన వారికి ఎకరానికి రూ.10 లక్షలకు పెంచుతామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో తూచ్‌..అలా అనలేదు, రూ.5 లక్షలేననడం మాట తప్పడం కాదా? పోలవరంలో2013-భూ సేకరణ చట్టం ఎందుకు అమలు కాదు?ఈ ప్రాజెక్టు నిర్వాసితులేమన్నా వేరే దేశంలో ఉన్నారా? విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజె క్టుగా పేర్కొన్నారు. అంటే కేంద్రమే ప్రాజెక్టు కయ్యే నిధులన్నింటినీ పెట్టుకోవాలి. ఏప్రాజెక్టూ గాలిలో కట్టరు. భూమి కావాల్సిందే.కనుక భూ ములు కోల్పోయే నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు వ్యయంలో కలిసే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడుగా మాట్లాడు తోంది. నిర్వాసితుల వ్యవహారం తమది కాదంటోంది. కేంద్రాన్ని నిలదీసి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దాటవేస్తోంది. చేసిన పనులకు రావాల్సిన నిధులనూ గట్టిగా అడగలేకపోతోంది. 2013-14 అంచనాల ప్రకారం రూ.20వేల కోట్లే ఇస్తామని కేంద్రం ఒకటికి పదిసార్లు వల్లెవేస్తున్నా మౌనమే. పోల వరం తాజా అంచనా రూ.55 వేలకోట్లు. అందులో రూ.33వేల కోట్లు నిర్వాసితుల పున రావాసానికే. పోలవరం ప్రాజెక్టును ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణిస్తారు. అటువంటి జీవనాడికి ఊపిరులూదుతూ తమ సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు అందించే పునరా వాసంపై కేంద్ర సర్కార్‌ దోబూచులాడు తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. నిర్వాసితుల పట్ల మానవతతో ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా వ్యవహ రించడం దారుణం. జాతి అభివృద్ధి కోసం భూములను,ఊళ్లను,ఇళ్లను అర్పించిన త్యాగధ నులను గౌరవించి ఇతోధికంగా ఆదుకోవాలి. చట్టప్రకారం అది వారి బాధ్యత. నిర్వాసితులు ఉద్యమాలతో పాలకుల మెడలు వంచాలి. ‘‘నిరుడు చాలా కష్టాలు పడ్డాం.ఈసారి జూన్‌ నుంచే మాకు వరద ముప్పు మొదలైంది. దారులు మూసుకుపోతున్నాయి. ఊళ్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. పోనీ పరిహారం ఇచ్చేస్తే పోదామని చూస్తుంటే మీరు ఖాళీ చేయండి, ఆ తర్వాత మేం చూస్తామంటున్నారు’’ అంటూ ఆవేదన చెందారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తురాలు మాడే చినపోశమ్మ. ‘‘మా ఇల్లు, పొలం,చెట్టూ,పుట్టా తీసేసుకుంటే మేం ఇక్కడి నుంచి పోయి ఏం చేయాలి? ఏం తినాలి. ఎలా బతకాలి. ఇప్పటికే ఖాళీ చేసిన వెళ్లిన వాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ అన్నారామె. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవా హానికే వరద తాకిడి మొదలైంది.గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు. దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్న మవుతాయోనన్న ఆందోళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది. విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రక టించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆసమయంలో 18ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వా సితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటిం చారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎక రాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచ నాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది.దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఇప్పటి వరకూ ఇచ్చిందెంత?
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితం అవుతాయని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ నిర్ధరించింది. వాటిలో ఇప్పటి వరకు 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు.వారంతా ప్రస్తుతం స్పిల్‌ వే,కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి సమీ పంలో నివసించిన వారు.పునరావాసం కోసం ఇప్పటివరకు రూ. 6,371 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మరో రూ.26, 796 కోట్లు అవసరం అవుతాయని తాజాగా రూపొందించిన డీపీఆర్‌-2లో పేర్కొన్నారు. అంటే పునరావాసం పొందిన వారి సంఖ్య 4శాతం లోపు ఉండగా,చేసిన వ్యయం కూడా దాదాపు 20 శాతమే.ప్రస్తుతం 41.5 అడుగుల వద్ద పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం లెక్కలేస్తు న్నారు. దాని ప్రకారం 18, 622 కుటుంబా లకు తక్షణమే పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ నేటికీ అందులో నాలుగో వంతు మందికే పునరావాస ప్యాకేజీ దక్కింది.
అమానవీయ ధోరణిలో ప్రభుత్వం
‘‘పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం తగదు. ప్యాకేజీ ఇచ్చేస్తే ఖాళీ చేస్తామని వారు చెబు తున్నారు. కానీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతూ పునరావాసం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లు ఏం కావాలి. నిరుడు నెల రోజులు పైగా వరద నీటిలోనే ఉన్నారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ మూసేశారు. కాబట్టి మూడు నెలల పాటు వరదలు వచ్చేలా ఉన్నాయి.1986 నాటి వరదలను మించి వస్తాయని అధికారులే చెబు తున్నారు. నిరుడు కూడా నిర్వాసితులకు వరద సహాయం అందించకుండా వేధించారు.ఈసారి అదే పద్ధతిలో కనిపిస్తున్నారు. ఇది తగదు. తక్షణమే పరిహారం చెల్లించాలి.వరదల సమ యంలో వారిని ఆదుకోవాలి’’అని ఏపీ గిరిజన సంఘం నేత ఎం కృష్ణమూర్తి అన్నారు. జిఓ ఇచ్చేశాం… : పోలవరం పరిహారంపై సభలో సిఎం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం పెంపునకు సంబంధించిన జిఓను ఎప్పుడో ఇచ్చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి అన్నారు. గతనెలలో జరిగిన శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విష యం ప్రస్తావనకు వచ్చింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,డాక్టర్‌ నిమ్మల రామా నాయుడు, చిన రాజప్ప, అచ్చెన్నా యుడులు పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ 10లక్షల ఇస్తామను హామీ ఏమైందని, గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబునాయుడు 6.86 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతామంటూ హామీ ఇచ్చామని, ఆ మేరకు2021 జూన్‌30 వ తేదీన జిఓ కూడా జారీ చేశామని చెప్పారు. జిఓ ఇచ్చిన విషయాన్ని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి దాని అమలు తీరుమాత్రం దాటవేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల సాధనకోసం ఏం చేయనున్నారను విషయాన్ని కూడా ఆయన వివరించలేదు. అదే సమయంలో 41.15 కాంటూరు పరిధిలోని వారికే పరిహారం ఇస్తామని మరోచెప్పారు. పరిహారం జారీకి సంబంధించి జారీ చేసిన జిఓను చూపిస్తూ ‘కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం’ అని టిడిపి సభ్యులనుద్దేశించి అన్నారు. పోలవరం డ్యామ్‌ 45.76 మీటర్లకు పూర్తిఅయినా భద్రత దృష్ట్యా మొదట నీటిని 41.15 మీటర్ల ఎత్తులో నిల్వ చేస్తామని అన్నారు. ఆ పరిధిలో ఉన్న వారికే పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టుకింద 1,06,006 మంది నిర్వాసితులుండగా, 41.15 మీటర్ల పరిధిలోకి 20,946 మంది వస్తారనిచెప్పారు. వీరిలో 14,110 మందికి పునరావాసం పూర్తయ్యిందని, దీనికి గానూ రూ 1,960.95 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుం బాలకు ఈ ఏడాది అక్టోబర్‌లోపు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ‘ మొత్తం 41.15 కాంటూర్‌ వరకు చెల్లించాల్సిన పరిహారం రూ 6.86 లక్షలకు బదులు రూ10లక్షలు పెంచాం. దీని ద్వారి అదనంగా అయిన ఖర్చు 500 కోట్ల రూపాయలే. బటన్‌ నొక్కి రూ 6,500 కోట్లు, రూ 6,700 కోట్లు ఇచ్చే మా ప్రభుత్వానికి ఇది పెద్ద మొత్తం కాదు.’ అనిఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,900 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. గతంలో రూ 1.50లక్షలు నష్టపరి హారంగా తీసుకును వారికి కూడా రూ 5లక్ష లకు పెంచి ఇస్తామని చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని అన్నారు. స్పిల్‌వేను పూర్తి చేసి నీటినిడైవర్ట్‌ చేయకుండా కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ నిర్మాణాలు చేపట్టి, సగం సగం పనులు చేయడం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని అన్నారు. అక్టోబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలు పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
హామీ ఇవ్వలేదన్న అంబటి
అంతకుముందు టిడిపి సభ్యుల ప్రశుకు లిఖితపూర్వకంగా జవాబిచ్చిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిహారం పెంపునకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదని రాతపూర్వకంగా జవాబిచ్చారు. దీనిపై టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు వక్రీకరించి చెబుతున్నారని మంత్రిచెప్పారు. ఈ దశలో టిడిపి సభ్యులకు, మంత్రికి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో సభలోకి వచ్చిన సిఎం హామీ ఇచ్చామని, అమలుకు జిఓ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
వైఫల్యాలివీ….
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ను రాష్ట్ర పభుత్వం ఆమెదింపజేసుకోలేకపోయింది.2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లుకు సాంకే తిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమెదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటికీ అప్పజెప్పింది. ఆ కమిటీ రూ.47, 725.74కోట్లకు అంచనాలు ఆమోదిం చింది. ఇంతవరకు కేంద్ర మంత్రి మండలి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలియజేయ లేదు. కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా పరిష్కరించు కోలేకపోతున్నాం. నాడు డీపీఆర్‌ ఆమోదించు కోలేకపోయారని విమర్శలు గుప్పించిన జగన్‌ ఇప్పుడు..పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు..మనం కిందా మీద పడుతున్నాం.. రూ.1000 కోట్లో,రూ.2000కోట్ల అయితే నేనే ఇచ్చేవాణ్ణి..రూ.వేల కోట్లు కేంద్రం ఇవ్వాలి.. నేనేం చేయగలను అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 25ఎంపీ స్థానాలిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా.. కేంద్రం నుంచి అన్నీ తెస్తా.. అని ఎన్నికల్లో ఓట్లడిగిన జగన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ,అనేక కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి భేషరతుగా ఎందుకు మద్దతు పలికారు. రాజ్యసభలో,లోక్‌సభలో ఎందుకు మద్దతినిస్తున్నారు?పోలవరం డీపీఆర్‌`2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు..అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన స్పందించడం లేదు. పునరావాసం ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలు నానా అవస్థలు పడుతు న్నాయి.ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరద నీరు వెనక్కి ఎగుదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవి ల్లాడుతున్నారు. 2019వరదల్లో నిర్వాసితుల కష్టాలు అందరూ చూశాం. 2020వరదల్లోనూ వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.2021 వరదల సమయానికి కూడా కనీసం తొలిదశ పునరావాసం ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేక పోయింది.2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడేనాటికి తొలిదశ పునరావాసం పూర్తి చేసేందుకు రూ.2,728 కోట్లు అవసరమని లెక్కించారు. ఏదో రూ.వెయ్యి కోట్లో, రూ.2000కోట్లో అయితే నేనే ఇచ్చేస్తా అని ప్రకటించిన జగన్‌ ఈ మూడేళ్ళలో ఆ సొమ్ము లు ఎందుకు ఇవ్వలేకపోయారు? తొలిదశలో 20,946 కుటుంబాలకు పునరా వాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 8,272 కుటుంబాలకే పూర్తియింది. పునరా వాసం కోకవరం,జంగారెడ్డిగూడెం,చర్ల వంటి ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. నెలకు రూ.6,000 నుంచి రూ.8000 వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.55, 548కోట్లు కావాలి.భూసేకరణ, పునరా వాసానికి ఇంకా రూ.26,585కోట్లు అవసరం. ఇతర సివిల్‌ పనులన్నీ కలిపి రూ.7,174 కోట్లు,విద్యుత్కేంద్రం నిర్మాణానికి రూ.4,124 కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తి యితే ఉత్తరాం ధ్ర సుజల సవ్రంతికి నీళ్లు ఇవ్వచ్చు.- జిఎన్‌వి సతీష్‌

లౌకిక సౌభ్రాతృత్వ విలువలు తిరిగి వికసించాలి

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు.
వ్యాసకర్త : సిపిఎం ప్రధాన కార్యదర్శి (ప్రజాశక్తి సౌజన్యంతో)- (అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

మ‌న్యం వీరుడు…స్వ‌రాజ్య భానుడు-అల్లూరి తొలి దాడుకు వందేళ్లు! 1922-2022

‘ ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాప నల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహిం చారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారా మరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి 1922`2022 ఆగష్టు 22తో నూరు వసంతాలు పూర్తియ్యింది ’’ -గునపర్తి సైమన్‌
సీతారామరాజు విప్లవం విజయవంతం కాక పోయినా.. ఆయన ధైర్యసాహసాలు, ప్రాణ త్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ,దేశభక్తినీ పురి గొల్పాయి.సన్యాసి జీవితం గడిపిన రాజు,తన స్వీయ ముక్తి కంటే,అణగారిన ప్రజలసాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు.భారతదేశ చరిత్రలో సన్యసించి,విప్లవకారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ఘోష్‌,అల్లూరి సీతారామ రాజు మాత్రమే మనకు కనిపిస్తారు…27ఏళ్ళ వయసులో విప్లవజ్వాలలు,అల్లూరి సీతారామ రాజు జీవితం ఎం దరికో ఆదర్శనీయం,మన్యం వీరుడి పోరాటానికి వందేళ్లు పూర్తియిన సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం! భారత స్వాతంత్య్ర చరిత్రలో(1897జూలై 4-1924 మే7) ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యా యం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాల ర్పించిన యోధుడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలా డిరచిన అల్లూరి సీతారామరాజు అమాయకులు, విద్యా విహీనులైన గిరిజన జాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి,వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన,వేదనలే.స్థానిక సమస్యల మీద తలెత్తి నట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ,సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. శ్రీరామరాజు ఉద్యమకారు నిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం,గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు,ఉపసం హరణ ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామ రాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్ర లోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్‌ బెనర్జీని కలుసు కున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమ లలోని కృష్ణ్ణదేవిపేటకు 1917జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1920లో గాంధీజీ సహాయ నిరాకర ణోద్యమానికి పిలుపూ,‘ఒక్క ఏడాదిలోనే స్వాతం త్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్ల పల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్‌ కార్య కర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణో ద్యమ ప్రచారం చేశారు.1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్‌ భారత్‌’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడిరది. అప్పటికే రామ రాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్య క్రమమంతటిలోను మద్యపాన నిషేధం,కోర్టుల బహిష్కారం…ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగిం చాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈరోడ్ల నిర్మాణం ఓ అమా నుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్‌ బాస్టియన్‌. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు),బట్టి పనుకుల మునసబు గాము గంతన్నదొర,అతని తమ్ముడు గాంము మల్లుదొర,గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవ రిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించు కున్నారు. బాస్టియన్‌ మీదపై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రక టించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసం హరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మో పారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు… ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్‌ స్టేషన్లను దోచు కోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్‌ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం… మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నిన దించింది. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి జరిగింది. ఆగస్ట్‌ 24న రాజ వొమ్మంగి స్టేషన్‌ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈదాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఏ గ్రాహవ్న్‌కు టెలిగ్రావ్న్‌లు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్‌ సాండర్స్‌, కలెక్టర్‌ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రం గా మన్యం ఖాకీవనమైంది.అలాంటి వాతా వరణంలోనే జైపూర్‌ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్‌ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్‌ 24న గాలింపు జరుపుతున్న స్కాట్‌ కవర్ట్‌, నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీ సు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్‌ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల,చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్‌ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్‌ 23న మలబార్‌ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. 1922 డిసెంబర్‌ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరం గులతో మలబార్‌ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్‌ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్‌ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాం గాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు రామరాజు మారు వేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్య మమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్య మాన్ని గమనిస్తూనే ఉన్నారు. 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచయుద్ధంలో అనుభవం ఉంది.అస్సాం రైఫిల్స్‌ అధిపతే మేజర్‌ గుడాల్‌. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ జార్జ్‌ రూథర్‌ ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్‌ కమిష నర్‌గా నియమించారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓకుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన కంచుమేనన్‌, ఇంటెలిజెన్స్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజు ను ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్‌గుడాల్‌… రాజుతో మాట్లాడా లని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్‌ 7న గాము గంతన్నను కాల్చి చంపారు. దాదాపు రెండేళ్ల ఉద్యమం,పోలీస్‌ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసులకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్‌.12 మందిని అండమాన్‌ పంపారు. చివరిగా…దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు.. భారత ప్రజ లకు లభించింది. స్వంతంత్ర భారతావని జయ కతనంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారు.

నా విజయం వ్యక్తిగతం కాదు..

‘‘ నేను రాష్ట్రపతిగా
ఎన్నిక కావటం
ఆదివాసీల విజయం…’’

‘ఒడిశాలోని ఓమారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా..ఇది నావ్యక్తిగత విజయం మాత్రమే కాదు…దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామి నేషనే ఓరుజువు. నాకు ప్రాధమిక విద్య చదువుకోవడమే ఓకలగా ఉండేది. అలాంటిస్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను…50ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీ య జీవితం ప్రారంభమైంది.

Read more

నూతన మంత్రివర్గం..సరికొత్త సవాళ్లు

విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రి వర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్తమాత్రులుగా మార్చబడిన స్థితి.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు ఎడతెగని చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవుల చుట్టూ రాజకీయాలు, మీడియా కథనాలు పరిభ్రమించే ప్రస్తుత కాలంలో ఇది అనూహ్యమేమీ కాదు. తన మంత్రివర్గాన్ని సగం పదవీ కాలం తర్వాత మారుస్తానని జగన్‌ తమ మొదటి లెజిస్లేటివ్‌ సమావేశంలోనే ప్రకటించారు. కనుక మంత్రులుగా చేరిన వారంతా ఆ షరతుకు లోబడే చేరారన్నది స్పష్టం. నూటయాభై స్థానాలతో ప్రభంజనం సృష్టించిన ఆరంభ ఘట్టం అది. నాయకుడూ శాసనసభ్యులూ కూడా పాలనా పగ్గాలు చేపట్టాలనే ఉత్సుకతతో వున్న దశ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పరి స్థితి ఎలాగూ వుండదు. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర విధానాల కారణంగా ధరల మంటలు, అప్పుల ఊబి, అమరావతి ప్రతిష్టంభన ఒకటేమిటి అనేకానేక సవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న స్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హుకుంలు వాటిని ప్రశ్నించకపోగా అత్యుత్సాహంగా సమర్థిస్తూ తనూ ఒక వేటు వేసే జగన్‌ ప్రభుత్వ విధానాలు ఇందుకు మూల కారణంగా వున్నాయి. అందుకే ముంచుకొచ్చిన కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేసినా అనివార్యంగా ఇప్పుడు ఆ పునర్యవస్థీకరణ ముందుకొచ్చి కూచుంది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి స్వీయకల్పితం. ఒక ముఖ్యమంత్రి సగం కాలానికే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తర్వాత మారుస్తానని చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కనుక దీనికి ఇంతకు ముందు నమూనా ఏదీ దేశంలో లేదు. దాని ప్రభావాన్ని చెప్పడానికీ ఉదాహరణ లేదు.
మూడు దొంతరలు, విధాన ప్రశ్నలు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా బడ్జెట్‌ లీకైందంటూ మొత్తం మంత్రివర్గాన్ని సామూహికంగా బర్తరఫ్‌ చేసి అందరి రాజీనామాలు తీసుకున్న ఉదంతంతో కొన్ని పోలికలున్నా అది వేరే తరహా సందర్భం. దాని ఫలితంగా ఆ పార్టీలో చీలిక వచ్చింది, అప్పటికే ఆ ప్రభుత్వంపై వున్న అసంతృప్తి మరింత పెరిగి ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఓటమితో సహా ఆ పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల తర్వాత రెండు మాసాల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయనేలేదు. కేవలం తనూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ మాత్రమే ప్రభుత్వంగా నడిపించారు. కేంద్రంలో ప్రధానిమోడీ తన మంత్రివర్గ సహచరులలో దాదాపు 70శాతం మందిని దశలవారిగా తప్పించారు. అంతేగాక గతంలో కాంగ్రెస్‌ చేసినట్టే రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రులను వరుసగా మార్చేశారు. ఏతావాతా జాతీయ పాలకవర్గ పార్టీలలో ముఖ్యమంత్రులకూ ప్రాంతీయ పార్టీలలో మంత్రులకు పదవులు ఎప్పుడైనా ఊడిపో వచ్చనే భావం బలపడిరది. అయితే జగన్‌ నేరుగా అందరినీ మార్చేస్తానని ముందే ప్రకటించి మరీ పాలన ప్రారంభించడం కొత్త వ్యూహం. దాని అమలు ఎలా వుంటుంది, అనంతర ప్రభావాలు ఏమిటి అన్నదే ఇప్పుడు కీలక చర్చగా తయారైంది. ఏప్రిల్‌ 7న జరిగిన క్యాబినెట్‌లో పాత మంత్రులందరూ రాజీనామా చేయడం,వాటిని గవర్నర్‌ ఆమోదించడం జరిగిపోయింది. అయితే వారిలో కొనసాగే వారెవరు,ఎందరు అనే రసవత్తర కథనాలు మాత్రం నడుస్తూనే వున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగించడం తప్ప అత్యధికులను మార్చవలసి వుంటుందని ఆయన మొదట అన్నారు. అనుభవం కోసం కొందరు కొనసాగుతారన్నారు. చివరి సమావేశంలోనూ సంఖ్య చెప్పకపోయినా ఇలాంటి మాటలే మాట్లాడినట్టు మంత్రులు చెబుతున్నారు. అయిదారుగురు పాతవారు వుండొచ్చన్న లెక్క కాస్త పెరిగి పది పైన ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు ఆలస్యంగా చేరిన వారు కాగా ఒకరిద్దరు ఆ వర్గాలకు ఏకైక ప్రతినిధులుగా వున్నవారు. ఇవి కూడా ఊహాగానాలు తప్ప ఆధారం లేదు. పదిమందికి పైగా కొనసాగిస్తే అప్పుడు తప్పించబడే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం మరింత అధికమని అధినేతకూ సలహాదారులకు తెలుసు. తప్పించిన మంత్రు లను జిల్లాలకు లేదా ప్రాంతాలకు సమన్వ యకర్తలుగా పంపి వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యత అప్పగిస్తామన్నారు. మరి వారికి సంస్థాగత నాయకత్వం అప్పగిస్తే కొత్తమంత్రుల కాళ్లకు పగ్గాలు వేసినట్టు కాదా. ఈ రెండు తరహాలలో దేనికీ చెందకుండా ఏపదవీ బాధ్యతలు దక్కని మూడో తరహా నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా వైఎస్‌ఆర్‌సిపి లోనూ ప్రభుత్వంలోనూ మూడు దొంతరలు ఏర్పడే సూచనలున్నాయి. ఈ వైరుధ్యాలను సర్దుబాటు, సమన్వయం చేయడం తేలికేమీ కాదు. ఎన్నికల సన్నాహాలు, సమరం మొద లైనట్టే మాట్టాడుతున్న ముఖ్యమంత్రి తీరు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నది.తాము వచ్చేసినట్టే మాట్టాడుతున్నారు. కనుక కొత్త మంత్రులు లేదా మంత్రివర్గం ఆది నుంచి ఎన్నికల వేడిలోనే పని చేయవలసి వుంటుంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నా ప్రజలూ ప్రతిపక్షాలూ సమస్యల తీవ్రతపై ఉద్యమిస్తున్న నేపథ్యం. ఈ సమస్యలకు కారణమైన విధానాలు, పని విధానాలు మారకుండా కేవలం కొన్ని శాఖల మంత్రుల మొహాలు, విగ్రహాలు మార్చినంత మాత్రాన కలిగే ప్రయోజనం వుండదు. ప్రభావమూ వుండదు.
అసహనం, అవకాశవాదం
విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రివర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్త మాత్రులుగా మార్చబడిన స్థితి. నూటయాభై స్థానాలు గెలిచిన జగన్‌ ప్రభుత్వం వంటి వాటిలో ఇది మరింత ఎక్కువ. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి గురించి విమర్శించినవారే ఇప్పుడు ఆయన బలహీనపడ్డారనీ, ఆ విధంగా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా తనపై విమర్శల గురించి కొన్ని ఆరోపణలు గురించి అసహనంతో విరుచుకు పడుతున్నారు.గత రెండు రోజులలో టిడిపి పైన దాన్ని బలపర్చే మీడియా పైన ఆయన వ్యాఖ్యలు ఇందుకు పరాకాష్టగా వున్నాయి. దీనికి ముందు ఢల్లీి వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలసి వచ్చిన జగన్‌ బిజెపిని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడం లేదు. బిజెపి మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను కూడా టిడిపి దత్తపుత్రుడుగా విమర్శిస్తున్నారు! వామపక్షాలు మినహాయిస్తే ఈ ప్రాంతీయ పార్టీలేవీ మోడీ సర్కారు రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించలేకపోవడం నష్టదాయకం. పైగా ఆ బిజెపినే ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వాధినేత మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని భావించే జగన్‌… ఆయన, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌…కేంద్రంపై పోరాడుతున్న తీరును గమనించడం లేదా?
దిద్దుబాటుకు ఒక అవకాశం
మళ్లీ పునర్వవస్థీకరణకు వస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, ఎప్పుడూ తమ మాటే చెల్లుతుందనుకోవడం పొరబాటని ఈ మంత్రివర్గ వ్యవహారమే స్పష్టం చేస్తున్నది. లేకపోతే ఇంత కసరత్తు, ఇన్ని మల్లగుల్లాలు అవసరమై వుండేవి కావు. సామాజిక లెక్కలతో పాటు మంత్రులలో కొందరు అనుభవజ్ఞులు, బలాఢ్య ధనాఢ్య వ్యక్తులు, విశ్వసనీయత గలవారు కొనసాగడం సహజం. కేవలం నోరు జోరు బట్టి కొందరు వుంటారని, కొందరు వస్తారని వేసే లెక్కలు నిలవకపోవచ్చు. ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్న పేర్లు కూడా వున్నాయి. ఈ దెబ్బతో వైసిపి లో ముసలం పుడుతుందని, ముక్కలైపోతుందని ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్థులూ వున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంత భారీ నాటకీయ మార్పులు వుండకపోవచ్చు. పాలకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తారు. వారిలో ఒకరు మూరు?లనీ మరొకరు దార్శనికులనీ చెప్పడం అనవసరం. వ్యక్తులను బట్టి తరతమ తేడాలున్నా రాజకీయాలలో వర్గ ప్రయోజనాలే శాసిస్తుంటాయి. నాలుగు వందల మంది ఎంపిలను తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి ఫిరాయింపుల నిరోధకచట్టం కావలసి వచ్చింది. నూట యాభై మంది ఎంఎల్‌ఎలు వున్న జగన్‌ మధ్యలో మార్పు ద్వారా ఎక్కువమందిని సంతృప్తిపర్చాలని తలపెట్టారు. వాస్తవంలో ఇది అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చు. తనే కీలకం, మిగిలిన వారు నిమిత్తమాత్రులనే సంకేతం కూడా ఇందులో వుండొచ్చు. తమ పార్టీలోనూ బయిటివారిలోనూ స్పందనలను తెలుసుకోవడం కోసం గత వారం రోజులూ రకరకాల లీకులతో ఊహాగానాలు నడిపిం చారు. దీన్ని కేవలం వ్యూహాత్మక చర్యగానూ ఎన్నికల ఎత్తుగానూ హడావుడి పెంచితే ఉప యోగం వుండదు. ఈ అవకా శాన్ని తమ తప్పు లు దిద్దుకోవడానికి ఉపయో గించుకుంటే ఈ కసరత్తుకు కాస్తయినా ప్రయోజనం వుంటుంది. ప్రజల స్పందనా దాన్ని బట్టే వుంటుంది. ఇక ఆశావహులు, నిరాశోపహతుల తదుపరి అడుగులు ఎలా వుండేది ఆచరణలో చూడ వలసిందే. ముందే ప్రకటించిన ఈతతంగం నుంచి అంత కన్నా ఆశించవలసిందీ అభిశం సించవలసిందీ మరేమీ వుండదు. ఎప్పుడైనా సరే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వా మిక పునాది కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు (ప్రజాశక్తి సౌజన్యంతో…)

జిల్లాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌- ప‌రిపాల‌న సౌల‌భ్యం

‘‘ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కార మయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్ర లైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా …!’’ – ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
జగన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికినాంది పలికింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతర్వాత ఉన్న13 జిల్లాలకుతోడు కొత్తగామరో13జిల్లాలు ఏర్పాట య్యాయి. మొత్తం26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 4నుంచి కొత్త రూపు దిద్దుకుంది. వై.ఎస్‌.జగన్‌ 2019ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాలన సామాన్య ప్రజలకు,బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని నవశకానికినాంది పలికారు. ఇప్పుడు మొత్తం26జిల్లాలకుకాగా..72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాట య్యాయి.కొత్త జిల్లాల ఏర్పాటుతో..వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌,జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు..వారి క్యాంపు కార్యాలయాలు..అలాగే అన్ని ప్రభుత్వ శాఖల
కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిజిల్లాలో కనీసం ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా విష యానికి వస్తే..ఒక్కో జిల్లాకు 18నుంచి23లక్షల వరకు ఉన్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి నాలుగు వరకు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కసరత్తు చేశారు. అంతేకాదు కొత్త డివిజన్లతోకలిపి మొత్తం72 రెవె న్యూ డివిజన్లు ఏర్పాట య్యాయి.ప్రభుత్వం శాస్త్రీ యంగా అధ్యయనం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను చేసింది. జనవరి26న రిపబ్లిక్‌ డే రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యం తరాలు,సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదా పుగా17,500సలహాలు,సూచనలు వచ్చాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలించారు.. అనంతరం అధ్యయనంచేసి జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది.
కొత్త కళ..గడప వద్దకే పాలన-సిఎం జగన్‌
సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందు లో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరి పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.కొత్తజిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథ కాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13జిల్లాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాల యం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు.26జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగు తుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌,పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి…ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవ సరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజ న అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.
కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాలపేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం,రాజమహేంద్రవరం గత జిల్లా
లకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరు తున్నాయి. 1970మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భ విస్తే చివరిగా 1979జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్తజిల్లాలు ఏర్పాటు కాక పోవడంతో పరిపాలనసంస్కరణలు,వికేంద్రీ కరణ విషయంలోబాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలి పోయాం.జిల్లాలసంఖ్య,రెవెన్యూ డివిజన్లు పెరగ డంవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో727జిల్లాలు ఉండగా యూపీ లో అత్యధికంగా75,అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమై న ఏపీలోమాత్రంనిన్నటివరకు13జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి.2011 లెక్కలప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38లక్షల మంది ఉన్నారు. దేశం లో ఏరాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభాలేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6లక్షల మందికి ఒకజిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు.

భానుడు ప్ర‌తాపం..మండుతున్న ఎండ‌లు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. – సైమన్‌ గునపర్తి
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌, పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు.పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి,కానీ మీరు కాటన్‌ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.

1 5 6 7 8 9 11