నిరుద్యోగంతో..ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో..
దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం.‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలోతొక్కింది.ఉపాధి దొరక్క, తిండి లభించక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం)చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు..ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం.2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది.‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ..చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు…! దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ వంటి ఆర్థిక పరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవ సాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మ హత్య లకు ఉసిగొల్పు తున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికి పోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయా న్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదా యాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చు కుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణం గా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతు న్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార?ండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డు లివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమ టించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతు న్నారు. దీనిని 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంత ర్యామి దాస్‌ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక లో దిగజారిన భారత్‌
పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ ఇండియా
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌,2022లో 121 దేశా లలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌ మినహా దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే వెనుక బడి ఉంది. 29.1స్కోర్‌తో,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలు,యూరోపియన్‌ ఎన్‌జి ఓలు కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ మరియు వెల్తుంగర్‌ హిల్ఫ్‌, ఆకలి స్థాయిని తీవ్రమైనదిగా ట్యాగ్‌ చేశారు.121 దేశాలGనIలో ఎనిమిది స్థానాలు దిగజారి 84వ ర్యాంక్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌, గతేడాది 76వర్యాంక్‌తో పోలిస్తే చాలా మెరుగు పడిరది. దాదాపు అన్ని పొరుగు దేశాలు బాగా మండిపడ్డాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు మయ న్మార్‌ వరుసగా 99, 64,84,81మరియు 71స్థానాల్లో నిలిచాయి. ఐదు కంటే తక్కువ స్కోర్‌తో మొత్తం 17 దేశా లు సమిష్టిగా1మరియు 17మధ్య ర్యాంక్‌ పొందాయి.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రాంతాల వారీగా మరియు దేశం వారీగా ఆకలిని కొలిచే మరియు ట్రాక్‌ చేసే సాధనం. 2022 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేక దేశాలలో భయంకరమైన ఆకలి కుంభకోణాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే ఆకలిని ఎదుర్కోవడంలో దశాబ్దాల పురోగతి క్షీణిస్తున్న దేశాలలో మారుతున్న పథం రెండిరటినీ ప్రతి బింబిస్తుంది. ఆకలిసూచిక స్కోర్‌లు నాలుగు కాంపోనెంట్‌ ఇండికేటర్‌ల విలువలపై ఆధారపడి ఉంటాయి: పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల,పిల్లల వృధా మరియు పిల్లల మరణాలు. పోషకాహార లోపం తగినంత కేలరీల తీసుకోవడంతో జనాభాలో వాటాను సూచిస్తుంది. ఇండెక్స్‌లో ఎక్కువ స్కోర్‌ అంటే ఆకలి పరిస్థితి మరింత దిగజారడం. సున్నా అనేది ఉత్తమ స్కోర్‌..ఆకలి లేదని సూచిస్తుంది.
ప్రతిపక్షాల విమర్శలు ఆకలిసూచీలో భారత్‌ ర్యాంక్‌ పడిపోవడంపై తెలంగాణ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. ఇంకో రోజు చీూA ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను ఇప్పుడు భారత వ్యతిరేక నివేదిక గా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుం టున్నాను.
కరోనాతో సమస్య..
ఈ సూచీలో భారత్‌ స్థానం 101కాగా, పాకి స్తాన్‌ 92వ స్థానంలో, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76వ స్థానంలో, మయన్మార్‌ 71వ స్థానంలో నిలిచాయి. ఇవి భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్ప టికీ.. ఇవి కూడా తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడంలో ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా కారణంగా చాలా దేశాల హంగర్‌ ఇండెక్స్‌ దిగజారిందని వెల్ల డిరచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలిపై పోరాటం సరైన మార్గంలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల విషయంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. కరోనా సంబంధిత ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు,వాతావరణ మార్పు, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు.. ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. దేశాలు,ప్రాంతాలు,వర్గాల మధ్య అసమానతలు తొలగనంతవరకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేసింది.
ఆకలి సూచికలపై కాషాయ దళాల మండిపాటు
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగ జారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే ఇలాంటి వాదన లను ప్రభుత్వం కూడా చేస్తున్నది,ఖండి స్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వక పోతే తల తీసేదేమీ ఉండదు.ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీక రించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే. ఆకలి సూచికలను రూపొందిం చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశా లకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొం దించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ).అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌, కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’ తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకు న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు.-సైమన్‌ గునపర్తి