ముస్లీం మ‌హిళ‌లు బాధితుల‌వుతున్న వేళ‌…

మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణ యించుకుంటే,వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించు కోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచు కున్నారు.
భారతదేశంలో…హిందూ మహిళల్లో కుల,మత,వర్గ బేధాలు ఉన్నట్లే…ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి అంశమే మంటే, రాజకీయ చదరంగంలో సంఘ పరివార్‌ వారిని పావులుగా వాడుకుంటున్నది. 2019లో బిజెపి ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కొత్తచట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్ణాటక విద్యాసంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన మహి ళలను అనుమతించని వివాదం వరకు సంఘ పరివార్‌,ముస్లిం మహిళలను లక్ష్యంచేస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకున్నారు. తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాలేజీలకు వెళ్లే దారిలో ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బం దులను ఎదుర్కొనేవారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిరదని చెప్పారు. చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా, 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహోమానికి, దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వారిపై సామూహిక అత్యా చారాలకు పాల్పడి, వారి ఇళ్లను లూటీ చేసి, ధ్వం సం చేశారు. అహమ్మదాబాద్‌ లోని నరోదా పాటియా ఊచకోతలో గర్భవతి కౌసర్‌ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు,సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవ త్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించి వీరికెవరికీ తెలియనప్పటికీ,దాని ప్రభావంతో ఇప్పటికీ బాధపడుతున్నారు.
2014 తరువాత బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంకేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత,మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాం గ యంత్రాంగం,సంఘ పరివార్‌ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచుతున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో,దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాల నలో 2020 ఢల్లీి అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లిం లకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృ త్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యా ర్థులు, కార్యకర్తలను మూకు మ్మడిగా అరెస్ట్‌ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీక రణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కు ను మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.
హిజాబ్‌ సమస్య దుష్ఫలితాలు
ఆన్‌లైన్‌ వేలం కేసుల విషయంలో అధి కారులు చర్యలు తీసుకుంటున్నా, కర్ణాటక లోని పాఠశాలల్లో హిజాబ్‌ చుట్టూ నడుస్తున్న వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాం శమైంది. కొన్ని రోజుల్లోనే హిజాబ్‌ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాలఅర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహ రణకు,బెంగాల్‌ ముస్లిం జనాభా ఎక్కువ గా నివసించే ఢల్లీి మురికివాడల్లో ‘హిజాబ్‌’ అనే పదం విదేశీపదం.ఇళ్ళలోపని చేసే,నిర్మాణ రంగం లో పనిచేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరి స్తారు. దానిని వారు ‘ఇస్కబ్‌’ అంటారు. ఇంటిపని చేసే తబస్సుమ్‌,అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు…దాన్నిచున్నీ,దుపట్టా,పర్దా లేక పల్లూ (చీరకట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళిన ప్పుడు తలను కప్పుకుంటారు.కానీపని చేసే సమ యంలో,ఇంట్లోఉన్నప్పుడు,సైకిల్‌ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితో పాటు పెళ్లికాని అమ్మాయిలు కూడా వాటిని ధరిం చరు. పది సంవత్సరాల వయసు నుంచి తబస్సుమ్‌ ఇస్కబ్‌ ను ధరించడంవల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది. కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కాధరించలేదు. బుర్కా ధరిస్తే పని చెయ్యడం సాధ్యం కాదని,ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్‌ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయ త్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడితే ఎలా సంపాదించి,ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది. భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్‌ లాంటి శ్రామిక వర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడిరచే కొద్దిపాటి స్థలమే ఉం టుంది. అదే నిజమైన విషాదం.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు : మౌలికంగానే లోపభూయిష్టం
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు సహేతుకమైన సర్దుబాటు ఆవశ్యకతను గుర్తించడంలో విఫల మైంది. విద్యాసంస్థల్లో విద్యార్థులు తలకు కండు వాలు ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాలా తప్పు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడంపై తలెత్తిన వివా దంపై ప్రశ్నలు లేవనెత్తిన తీరు రాజ్యాంగ సూత్రా లను దెబ్బతీసేదిగా ఉంది. నిర్దేశిత యూనిఫామ్‌కు అదనంగా ధరిస్తున్నారా? యూనిఫామ్‌ రంగుకు ఎలాంటి తేడా లేని హిజాబ్‌ ధరించడం వల్ల పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడం సరైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించడంలో కోర్టు విఫలమైంది. ఇస్లాంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ఆచారమని, అందువల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రసాదించబడిన మత స్వేచ్ఛలో భాగంగా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉందని విద్యార్థులు చేసే వాదనతో విభేదిస్తూ ఖురాన్‌లోని చరణాలను బెంచ్‌ ఉటంకించింది. ఇదా అసలు సమస్య? విద్యార్థుల మధ్య సమానత్వ భావనను దెబ్బతీయకుండా సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా తరగతి గదిని బహుళత్వంతో కూడిన సమాజం అనుమతించే ‘సహేతుకమైన సర్దుబాటుకు అనుకూలమైన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పాఠశాలల వంటి ‘’ బహిరంగ స్థలాల్లో ‘’ దుస్తులకు సంబంధించిన నియమాలు అవసరమే కావచ్చు. కానీ సూచించిన యూనిఫారానికి ఇబ్బంది కలిగించని రీతిలో అదనంగా చిన్న వస్త్రాన్ని ధరించే సర్దుబాటును సైతం తిరస్కరించడంలో హేతుబద్ధత ఏమిటో అర్థం కావడం లేదు. ‘మనస్సాక్షి స్వేచ్ఛ’పై ఆధారపడిన వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు పిటిషన్లలో తగిన వివరణ లేకపోవడాన్ని ఒక సాకుగా చూపింది. యూనిఫామ్‌ ఆవశ్యకతను గురించి కోర్టు నొక్కి చెబుతూ, సమానత్వం, సజాతీయత యొక్క ఉల్లంఘించలేని చిహ్నం అని ఉద్ఘాటించింది. సజాతీయత అంటే సర్దుబాటుకు ఆస్కారమిచ్చే వాదనలను మొత్తంగా తోసిరాజ నడమన్నట్టుగా కోర్టు చూసింది. ఈ కేసులో ‘ఎసెన్షి యల్‌ ప్రాక్టీస్‌’ (మౌలికమైన ఆచరణ)ను పరీక్షకు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పూర్తిగా మతతత్వంతో కూడిన దురాచారమైతే, దానిని కేంపస్‌ వెలుపల ఉంచవచ్చు. ఏకరూపత, వేరుపరిచే భావనను తొలగించడం అనేవి మంచి లక్ష్యాలే. అయితే, ఇటువంటి అంశాలపై తలెత్తే చిక్కులను వేదాంతాల జోలికి పోకుండానే పరిష్కరించవచ్చు. ‘ మౌలికమైన మతపరమైన ఆచారాలు’ ను పరీక్షించడం మొదలు పెడితే దానికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇటువంటి వాటిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తిరుగులేని ప్రమాణాలను నెలకొల్పింది. మౌలికమైన ఆచారాలు అని దేనిని పిలుస్తామంటే, అది లేకపోయినా లేదా తొలగించబడినా మొత్తం మతమే నాశనమయ్యే ప్రభావాన్ని కలిగి ఉండేవాటిని మాత్రమే. .కొన్ని మౌలికమైన ఆచారాలు కాపాడబడితే కాపాడుకోనివ్వండి. అటువంటి వాటివల్ల ఏ మతపరమైన ఆచారమూ మనుగడ సాగించదు. దానికి బదులు సమానత్వం, గౌరవం, గోప్యత, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన వంటి రాజ్యాంగ విలువలకు రక్షణగా ఆర్టికల్‌ 25ని క్లెయిమ్‌ చేయడాన్ని పరీక్షిస్తే ఎక్కువ ప్రయోజనం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిని’ మౌలిక ‘ పరీక్షకు ఎన్నడూ పెట్టకూడదు.. ఎందుకంటే ఇది వేదాంత భావనలను మిగతా వాటిపై స్వారీ చేయడానికి సిద్ధాంతపరంగా అనుమతిస్తుంది. ఆ భావనలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా, కాదా అన్నదాంతో నిమిత్తం లేకుండా ఒక మతానికి ఆవశ్యకంగా పరిగణించబడుతూ ఉంటాయి. స్వేచ్ఛలు ముఖ్యం కాబట్టి మత స్వేచ్ఛ ముఖ్యమే.కానీ మతాలు కాదు ముఖ్యం. – దివ్యా త్రివేది