హరి వెంకట్‌కి అరుదైన అవకాశం

తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్‌ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్‌ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్‌ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్‌,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్‌ రూమ్‌ లోవున్న మాకజిన్స్‌ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్‌ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్‌ గైడన్స్‌ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్‌ టచ్‌ బాడ్‌ టచ్‌ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్‌, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్‌ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్‌ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్‌ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్‌ డకోటా(మైనాట్‌, బిస్మార్క్‌ నగ రాలు)సియాటల్‌(వ్వాషింగ్టన్‌ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్‌ సీస్‌ ఎడ్యుకేషన్‌ డిపా ర్ట్మెంట్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్‌ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్‌ అసోసియేషన్‌, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్‌జీవోలతో వ్వాషింగ్టన్‌ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్‌ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఆ రాష్ట్ర సెనేటర్‌ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్‌ వర్కర్స్‌) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్‌ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్‌.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్‌ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్‌ వంటి వాటికి అడిక్ట్‌ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్‌ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్‌ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్‌ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్‌ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్‌ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్‌ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్‌ సర్వైవర్స్‌ నడుపుతున్న ఒక ఎన్‌జీఓను కలవడం జరిగింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద ఇంటర్లో గాట్‌,డంకెల్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్‌ అఫైర్స్‌ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్‌ కౌంటీ కౌన్సిల్‌ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్‌ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్‌ సెన్స్‌ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్‌ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్‌ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్‌, ఫెడరల్‌ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్‌ పాయింట్‌ ప్రెసెం టేషన్‌,యానిమేషన్‌ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్స్‌ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)

పర్యావరణ వినాశనం..

విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవ డానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌,సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలు ష్యం,అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తు లు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతి పాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ణaవ టశీతీ ణఱంaర్‌వతీ Rఱంస Rవసబష్‌ఱశీఅఅధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినో త్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓరెజల్యూషన్‌ పాస్‌ చేసింది.విపత్తులు సంభ వించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా. ఈదిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆదశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి.లోపాలను అధిగ మించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’..ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గిం చాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ,చట్టం వచ్చింది మాత్రం 2005లో.విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం,రాష్ట్రం,జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్‌ ఎఫ్‌ (సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరో వైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.
విపత్తు నిర్వహణ
జీలం,చీనాబ్‌,రావి,సట్లెజ్‌,బియాస్‌,ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీపరివాహక ప్రాంతం,తపతి,నర్మద,మహానది,వైతరణి, గోదా వరి,కృష్ణా,పెన్నా,కావేరి నదులతో కూడిన ద్వీప కల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ,తమిళనాడు, ఒడిశా,కేరళ తీరప్రాంతాలు,అసోం,ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు,స్మాల్‌ఫాక్స్‌వంటివి వేగంగా సోకే కార కాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్‌ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.ఉదా: 1346 కఫా సంఘటన. 14 22 కరోల్‌స్టీన్‌ సంఘటన. విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణా లు,ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (ణIూAూుజుR) అంటారు.ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా,సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణ నష్టం,ఆస్తినష్టం,పర్యావరణ వనరులను విలు ప్తం చేసి,మౌలిక సౌకర్యాలకు,నిత్యావసర సేవలకు,జీవనోపాధికి,మానవ దైనందిన జీవి తానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మా త్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది. సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసా ధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉప ద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలు కోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్ను కోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన,ప్రాణ,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం, ప్రజల జీవనోపాధి దెబ్బతినడం,విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహా యం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉం డటం,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై,అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.ముఖ్యంగా 1. వైపరీత్యం,2.దుర్బలత్వం,3 సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభ విస్తే దానిని వైపరీత్యం అంటారు.
వైపరీత్యాలను – జిఎన్‌వి సతీష్‌

కారడవులూ కార్పొరేట్లకేనా..?

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశ నానికి శ్రీకారంచుట్టింది.2022 జూన్‌ 28న ‘ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ నిబంధనలు-2022’ను తీసుకు వచ్చిం ది.‘కన్సర్వేషన్‌’ (పరిరక్షణ)పేరుతో వచ్చిన ఈనిబం ధనలు అంతులేని విధ్వంసం చేయబోతు న్నాయి. ఆదివాసీలను,అడవులను,వన్యప్రాణులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈనిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవి నైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యా పారఅవసరాలు,లాభాల కోసం బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు. రాష్ట్రంలో స్క్రీనిం గ్‌ కమిటీ, కేంద్రంలో రీజినల్‌ ఎంపవరింగ్‌ కమిటీ, ఎడ్వైజరీకమిటీలు,మొత్తం మూడు కమిటీలు ఏర్పాట వుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు.కొత్త నిబంధనల కింద ఎంత అడవిని,ఎంతకాలపరి మితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం.5 నుంచి 40హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం, మైనిం గ్‌ అవసరాల కోసం75రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం,మైనింగ్‌ అవసరాలకోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాల కోసం, మైనింగ్‌ అవసరాల కోసం 150రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.ఎలాధ్వంసం చేయాలి?మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తు లకు,బడాకార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతులద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడాఈనిబంధనల్లో పేర్కొ న్నారు.1.క్లియర్‌ ఫెల్లింగ్‌ (పూర్తిగా నరికివేయడం), 2.అప్‌ రూటింగ్‌ (కూకటివేళ్ళతో పెకలించడం), 3.బర్నింగ్‌(అడవినితగలబెట్టడం).ఇలాంటి విధ్వం సకర చర్యలద్వారాఅటవీభూమిని,అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడంకోసం వన్యప్రాణులను, ఆదివాసులను,ఇతర పేదలను నిరాశ్రయు లను చేస్తారు.తద్వారా అటవీయేతర భూమిగా మార్చు కొని వారి అవసరాల కోసం వాడుకుంటారు. రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన
రాజ్యాంగంలో5,6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధి కారాలను కలగజేస్తున్న పెసా చట్టం,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్‌తో నేలమట్టం చేయబడ్డాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నా యంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామ మాత్రమే. రాష్ట్రాల మీదికి ఆబాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటి వేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరా వాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని,ఆయజమాని లబ్ధిని పొందడం ప్రారం భమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రి యపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభు త్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవుతుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని,అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమా జానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్‌ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టు బడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహత హలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్‌, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిం దాల్‌, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్యాం గ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆదివాసీల అభివృ ద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను అమలు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
అడవుల పెంపకం కోసం నయా ప్లాన్‌.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే..అది జస్ట్‌ సగం కూడా లేవట! అందుకే..అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అటవీశాఖ అధికారులు ముందుకు వచ్చారు. అటవీశాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్క లుగా మొలిచేలా చేయడమే తమటార్గెట్‌ అనివాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలుదానికోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖర్చూ ఎక్కువే.అందుకే వాళ్లు డ్రోన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్‌? చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్‌ కలిపిన ఒక ముద్దలో పెడతారు.ఆముద్దలను ఉండలుగా చుట్టి సీడ్‌ బాల్స్‌గా మారుస్తారు. ఈ సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌లద్వారా పైనుంచి జార విడు స్తారు. దీంతో వానలు పడగానే సీడ్‌ బాల్స్‌ మొల కెత్తుతాయి.వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్‌ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్‌ చేశారు.ఫ్లాష్‌ ఫారెస్ట్‌ ప్రాజె క్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీశాఖ అధి కారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బాల్స్‌ వేశారు. గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామా రెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడిరచారు.
పర్యావరణంలో కలిగే దుష్పరి ణామా లను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధ నలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాయి. 2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తు న్నాయి. కానీసైంటిస్టులు మాత్రం మొక్కలు నాట డానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి1974 నుంచి 20 12వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలిం చారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అనిఅర్ధం చేసుకో వచ్చు. కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి.వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవు లలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు చిలే లోని అడవులు పెద్దమొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకంవల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈఅధ్యయనం నిర్వహించిన పరి శోధకులు అంటున్నారు. ‘’మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటా యి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది’’ అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి ‘ొఅని ఆయన అన్నారు. ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీ లించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారు తుందని తేల్చింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీ లించారు. ఈఅడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాం తంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తిం చారు. కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశ యంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. ‘’కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి’’అని ఈ పరిశోధనకు నాయ కత్వం వహించిన కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ‘’అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలిం చవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు’’ అన్నారు .- (నాదెండ్ల శ్రీనివాస్‌)

ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!

ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.

Read more

ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా 

భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్‌ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్‌ పాండే,భగత్‌ సింగ్‌,సుభాష్‌ చంద్రబోస్‌ అస్ఫకు ల్లా ఖాన్‌,రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ మరియు ఉద్ధం సింగ్‌ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.

Read more

ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ జి.ఏ.ఎస్‌.కుమార్‌
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-

ధరలు పెంపుపై ప్రజాగ్రహం

ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ‘’ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండుకోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు.
చాలా కాలం నుండీ శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయి వుంది.అయితే సకా లంలో తగు చర్యలు తీసుకోకుండా బాధ్యతారహి తంగా గొటబాయ రాజపక్స ప్రభుత్వం వ్యవహరిం చింది. ఆర్నెల్ల క్రితం అప్పుడే మేలుకున్నట్టు హడావుడిగా విదేశీ దిగుమ తులపై ఆంక్షలు ప్రకటించింది. తన వద్దనున్న విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోవడం దీనికి కారణం. ఐతే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల పర్యవసానాలు ఎంత వినాశకరంగా పరిణ మిస్తాయో, ప్రజలు ఎటువంటి కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుందో ఆ ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనలను అత్యంత నిరంకుశంగా అణచివేయడానికి పూనుకుంది. అత్య వసర పరిస్థితి ప్రకటించింది.
ఒకవైపు సంపన్నులపై విధించిన పన్నులను బాగా తగ్గించినందువలన ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇంకోవైపు చర్చిల్లో వివిధ ప్రాంతాల్లో 2019లో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించాక పర్యాటకులు బాగా తగ్గిపోయారు. శ్రీలంకకు వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా దానితో పడిపోయింది. పులి మీద పుట్రలా కోవిడ్‌ వచ్చిపడిరది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇవి తక్షణ కారణాలు. ఆ దేశానికి కావలసిన ఇంధన అవసరాలన్నీ దిగుమతుల ద్వారా మాత్రమే తీరతాయి. అంతే కాక ఎరువులు, ఆహారధాన్యాలు. పప్పులు, ఖాద్యతైలాలు వంటివి కూడా దిగుమతుల ద్వారానే ఆ దేశం పొందు తుంది. ఎప్పుడైతే ఆ దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయిందో ఒక్కసారి ఆ దేశ జనజీవనం ఛిన్నాభిన్నం అయిపోయింది. పెట్రోలు, గ్యాస్‌ తగినంత లేవు కనుక పని ప్రదేశాలకు ప్రయా ణించడం అసాధ్యం అయిపోయింది. ఇంధనం లేనం దున విద్యుత్తు కొరత తీవ్రం అయింది. రోజుకు 13 గంటల విద్యుత్తు కోత అమలవుతోంది. వంట గ్యాస్‌ కొరత వలన ఇళ్ళలో వంటలు వండుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణం గా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది.‘ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండు కోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు. ‘ఇంట్లో డబ్బు పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకుందామంటే ఈ అల్లక ల్లోలంలో దానిని ఎవరు లాక్కుని పోతారో అన్న భయం ఉంది. పోనీ ఎప్పటికప్పుడు బ్యాంక్‌ ఎటిఎం నుంచి తీసుకుందామంటే పవర్‌ కట్‌ తో ఆ ఎటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో తెలియకుండా ఉంది.’’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు గోల పెడుతున్నాడు. శ్రీలంకలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు బాగా పాపులర్‌. కాని ఇప్పుడు పవర్‌ కట్‌ కారణంగా ఆ సెంటర్ల లోని ఓవెన్లు,హీటర్లు,పని చేయడం లేదు.మరీ పెద్ద సెంటర్ల లోనైతే జనరేటర్లు ఉన్నాయి. కాని వాటికి సరిపడా చమురు లభించడం లేదు. ఇక చిన్న సెంటర్లయితే ఎప్పుడు నడపాలో, ఎప్పుడు మూసేయాలో తెలియని స్థితి ఉంది.‘’పోర్టులో మా కంపెనీ ఆర్డరు చేసిన మెటీరి యల్‌ దిగింది. అక్కడే ఉంటే ఎక్కువ చార్జీలు చెల్లిం చాల్సి వస్తుంది అని ఆ సరుకుని మా గోడౌన్‌ లోకి తెచ్చి దింపాం. కాని ఇక్కడి నుంచి మా వర్క్‌ సైట్‌ కి దీని ని రవాణా చేయడానికి డీజిల్‌ దొరకడం లేదు. మా పని అంతా ఆగిపోయింది.’’ ఓ బడా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బాధ ఇది.‘’మా పౌల్ట్రీ లోని కోళ్ళు పూర్తిగా పెరిగిపోయాయి. వాటిని కోసి అమ్మేయకుండా వుంచి మేపాలంటే తడిసి మోపెడౌతోంది. పవర్‌ కట్‌ వలన ఫ్రీజర్లు పని చేయడం లేదు. అందుకే అన్నిం టినీ చంపి పూడ్చిపెట్టేశాం’’ అన్నాడో కోళ్ళఫారం యజమాని. ఇంకోవైపు మార్కెట్‌ లో కోడిమాంసం ధర మాత్రం ఒక్క నెలలోనే రెట్టింపు అయిపోయింది. శ్రీలంకలో మత్స్యకారుల సంఖ్య చాలా ఎక్కువ. కాని వాళ్ళు చేపల వేటకు పోవాలంటే బోట్లు నడవడానికి డీజిల్‌ గాని, కిరోసిన్‌ గాని కావాలి. అవి దొరకడం లేదు. ఒకవేళ అతి కష్టం మీద సంపాదించి చేపలు పట్టి తెచ్చినా,వాటిని అమ్మడానికి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. దానికి రవాణా లేదు.అందుచేత చాలామంది మత్స్య కారులు చేపల వేట మానుకున్నారు. దీంతో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపనీ లేక పోయినా సెల్‌ ఫోన్‌ పట్టుకుని కాలక్షేపం చేసేయ వచ్చునను కునేవారి పరిస్థితీ ఏమాత్రం బాగులేదు. 13 గంటల పవర్‌ కట్‌ వలన ఆ సెల్‌ ఫోన్లు, సెల్‌ టవర్లు పని చేయడం లేదు. టీవీల్లో దూరి సమయం గడిపేయవచ్చుననుకునేవారి పరిస్థితీ అలాగే ఉంది. ‘మాకు రాజకీయాలు అనవసరం. దేశం ఏమౌతోందో నాకెందుకు? నా పరిస్థితి బ్రహ్మాండంగా సాగిపోతోంది. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చల్లగా ఉంటే చాలు’’ అనుకునే మధ్యతరగతి ప్రబుద్ధులంతా ఇప్పుడు అందరికన్నా ముందు రోడ్ల మీదకి వస్తున్నారు. అధ్యక్షుడి ఇంటి ఎదురుగా వేలాదిమంది నిరసన తెలపడానికి నిల బడితే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారు. వారిలో ఓ 50 మంది మీద కేసులు పెట్టి కోర్టుకి తెచ్చారు. ఆ 50 మంది కోసం వాదించడానికి 300మంది లాయర్లు తయారైపోయారు. అయినా గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరుచుకున్నట్టు లేదు. ‘’ఇదంతా కొంతమంది అరాచక మూకలు విదేశీ శక్తుల ప్రోద్బలంలో సాగిస్తున్న కుట్ర. దేశంలో అరబ్‌ వసంతం తీసుకొద్దాం అంటూ వాళ్ళు సోషల్‌ మీడియాలో మెసేజ్‌ లు పెడుతున్నారు.’’ అంటూ అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి ప్రకటించాడు. కాని ఈ ప్రభుత్వాన్ని శ్రీలంకలో ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలు ఎంత విసిగిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయం గురించీ ఆలోచించడమే లేదు. ఈ గొటబాయ రాజపక్స కుటుంబం. ఈ ప్రభు త్వం దిగిపోతే చాలునని వాళ్ళు ముక్తకంఠంతో డిమాం డ్‌ చేస్తున్నారు. ప్రజలు అక్కడ ప్రతిపక్షాలనూ నమ్మడం లేదు. ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగించడం వలన ఏప్రయోజనమూ ఉండదని వారు భావిస్తున్నారు. ‘’ఒక చేతకాని ప్రభుత్వం బదులు మరో చేతకాని ప్రభుత్వం వస్తే ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. ఆదేశానికి సహాయం కోసం భారత ప్రభుత్వం పంపు తున్న వస్తువులను అక్కడి ప్రభుత్వ అధికారులకు అప్పగించడం బదులు భారత ప్రభుత్వమే నేరుగా మాకు అందించడం మంచిది అని ఆ ప్రజలు అనుకుం టున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో బాటు శ్రీలంక సైన్యం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది. ఐతే ఒకవేళ ఈ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేకుండా పోతే ఏంజరుగుతుందో చెప్పలే మంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో తమిళుల ఉద్యమానికి భారత దేశం అండదండలివ్వడం వలన శ్రీలంకలో సింహళీ యులలో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం నుండి వచ్చి శ్రీలంకలో భూముల్ని, ఆస్తుల్ని చౌకగా కొనేసి పెత్తనం చేస్తారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలు వేటితోనూ సత్సంబంధాలను నెలకొల్పు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ రకమైన అపనమ్మకాలు కలగడానికి దోహదం చేసింది. అయితే చైనా గురించి వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ‘’చైనాని ఎందుకు నిందించాలి? ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులకి మా ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ని చైనా యే నిర్మించింది. కొలంబోలోకి ప్రవేశించే దగ్గర బ్రహ్మాండమైన జంక్షన్‌ (ఇంటర్‌ఛేంజ్‌) నిర్మించింది కూడా చైనా వారే. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన లోటస్‌ టవర్‌ కూడా వాళ్ళు నిర్మించినదే. నగరంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నింటినో వాళ్ళు కట్టారు’’ అని చైనా గురించి అనుకూలంగానే అక్కడ ప్రజలు మాట్లా డుతున్నారు. 2009 వరకూ శ్రీలంకలో తమిళ ఉద్యమమే అన్ని ఇబ్బందులకూ కారణమని పాలకులు సాకు చూపించు కున్నారు. ఆతర్వాత కూడా కొంత కాలం అదే సాకుని చూపారు. 2019లో చర్చిల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఇప్పుడు ముస్లింల నుండి ప్రమాదం అని చెప్తున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో పాలకులు ఎన్ని సాకులు చెప్పినా, ఎవరిమీద నెపం మోపాలని చూసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. నిరంకుశంగా అణచివేయాలనను కుంటున్నరాజపక్సప్రభుత్వానికి…రాజపక్స కుటుంబ మూ, ఆ ప్రభుత్వం మాత్రమే సంక్షోభానికి కారణం అంటున్న ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
సామాన్యులే సమిధలా…!
రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్‌టిసి బస్‌ చార్జీలను పెంచడం దారుణం. నిరుపేదల, సాధారణ ప్రజల ప్రయాణ సాధనాలుగావున్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనీస చార్జీలతోపాటు అన్ని స్టేజిలకూ భారం పెంచడం ద్వారా సర్కారు సామాన్యులను సమిధల్ని చేస్తోంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ ప్రయాణికులపై టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌, సిటీమెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5, సూపర్‌ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో రూ.10 చొప్పున ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10గా చేయడంతో పాటు సేఫ్టీ సెస్‌ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకుతో, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి చిల్లర కొరత నివారించ వలసిందిపోయి కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రౌండప్‌ చార్జీలను వసూలు చేస్తామనడం మోస పూరితం. తాజా పెరుగుదల వల్ల ఆర్‌టిసికి అదనంగా రోజుకు రెండు కోట్లు, లేదా ఏడాదికి రూ.720 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నా అది వాస్తవంలో పన్నెండు వందల కోట్లు దాటుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆర్‌టిసి ఛార్జీలు పెంచి జనానికి గోరుచుట్టుపై రోకటి పోటు వేసినట్టయింది. 2019లో చార్జీలు పెరిగాయని, అప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67గా ఉండగా ప్రస్తుతంరూ.107కి పెరిగాయని అధికారులు చెబు తున్న మాట నిజం. అయితే, ఈ పెరుగుదలకు కేవలం మోడీ ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేమీ కాదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతోతలపడి, ప్రజా రవాణా వాహనాలకైనా తక్కువ ధరకు డీజిల్‌ సాధిం చుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఆ భారాన్ని ప్రజలపైకి మళ్లించడం సబబు కాదు. కనీసం కేంద్రంతో పోరాడి, సాధించలేని స్థితిలో దాన్ని ప్రజలముందు దోషిగా నిలిపినా కొంతవరకు సబబుగా వుండేది. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగావున్న ఆర్‌టిసి ఖాళీ స్థలాలను బిఓటి పద్ధతిలో ప్రైవేటువారికి అప్పగించాలనడం మోసపూ రిత ఆలోచన. వివిధ నగరాలు, పట్టణాల నడిబొడ్డు నవున్న ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు దఖలుపర్చడం ప్రజల సంపదను అస్మదీయులకు కట్టబెట్టే దుష్ట తలంపే! కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకానికి ఇది ప్రతిరూపమే. ఆర్‌టిసి స్థలాలను సంస్థ విస్తరణకు, ప్రయాణికుల సౌకర్యాలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ ప్రైవేటుకు అప్పగించడానికి వీల్లేదు. ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తే ప్రజలు, ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమించి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పటికే ధరలు పెరిగి పన్నుల భారంతో సతమ త మవుతున్న ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ. పేద, మధ్యతరగతి, నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు ప్రయా ణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున పెంచిన బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలి. సంస్థ నష్టాలకు కారణాలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బల్క్‌ డీజిల్‌ ధర పెంచినపుడు ఆర్‌టిసి బస్సులకు తక్కువ ధరకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ ఫిల్లింగ్‌ చేయించి ఎంతో కొంత పొదుపు చేయగలిగారు. సరుకు రవాణా (కార్గో)పై మరింత కేంద్రీకరిస్తే ఆదా యం పెరచుకో వచ్చు.
ముఖ్యంగా స్టేజి క్యారేజిలు గా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అదుపు చేస్తే ఆర్‌టిసి ఆక్యుపెన్సీ పెరగడంతోపాటు ఆదాయ మూ వృద్ధి చెందుతుంది. అలాగే లాభసాటిగా వుండే అంతర్రాష్ట్ర సర్వీసుల విస్తరణకు కృషి చెయ్యాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగు ఒప్పందాలు చేసు కోవాలి. అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, సంస్థ ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించడానికి సకల చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి, లీకేజిలను అరికట్టడంపై సర్కారు కేంద్రీకరిస్తే ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరమే లేదన్న నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం.-(వ్యాసకర్త : పాత్రికేయుడు ఇటీవల శ్రీలంక పర్యటించిన ప్రత్యక్ష కథనం ఆధారంగా) (ఆర్‌.కె.రాధాకృష్ణన్‌ )

తెరపైకి మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర అణువిద్యుత్ కుంప‌టి

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గుర య్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి…ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియా క్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయం గా ఆమోదించిందని…పిఎంఓ కార్యాల యం సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామ ర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్‌ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతరరాష్ట్రాలు నిరా కరించిన అణు విద్యుత్‌ ప్లాంట్‌ పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌ లోని మితివిర్ధిలో అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ,అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద2016 జూన్‌4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్‌ కేం ద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంజిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ? ప్రపంచంలోనే అణువిద్యుత్‌ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మనరాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగినప్రశ్నకు వెస్టింగ్‌హౌస్‌ అనే అమెరికా కంపెనీతో ఒప్పందంఖరారు చివరి దశలోఉందని ప్రభుత్వం తనసమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళాతీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడుమోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలాఅర్థం చేసు కోవాలి? ఈఒప్పందంలో మరో ప్రమాదక రమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే,ఆకంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక,మన ప్రభుత్వాలూ పట్టించుకోక పోవ డంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్‌,రష్యాలోని చెర్నో బిల్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆరాష్ట్రమంతా తీవ్రంగా నష్ట పోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్‌వల్ల గాలి,భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈవిస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికేవున్న అణు విద్యుత్‌ కేంద్రా లను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4విద్యుత్‌ కేంద్రాలు మూసివేసింది. జపా న్‌లో 2 అణు విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ,ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్‌ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాం తాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్‌ హౌస్‌ ఉత్పత్తి చేసే ఎ.పి1000అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపం చంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. పైగా1208 మెగావాట్ల సామ ర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈఅణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో 8వేల మందికి ఉపాధి దొరుకు తుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి,పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖస్టీల్‌ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమా దకరమైన అణువిద్యుత్‌ కేంద్రంతో 8వేల మందికి ఉపాధి కల్పిస్తామనడంపూర్తిగా అసంబద్ధం కాదా? అణువిద్యుత్‌ కేంద్రాలకు పెట్టుబడి బాగాఅధికం. ఒక మెగావాట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒకమెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్‌ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యా వరణ సమస్య వుండదు. విండ్‌ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్‌ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు,మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి.ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్‌ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
‘‘రేపు అణు విద్యుత్‌ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరి పోతుంది…ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?’’
మీగ్రామం భవిష్యత్తులో మాయమై పో తుంది. అలాంటి గ్రామానికిరోడ్లు,కాలువలు వేయ డం ఎందుకు దండగ.ఇదేమాట గత ఐదేళ్లుగా అధికారుల నోటవింటున్నాం.కానీ,మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు’’- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ)ఒకమత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండ లంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.‘‘మాఊరిలో కరెంట్‌ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు,ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే… అం దుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొం దరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకునివెళ్లి మరోచోట పెడతామని చెప్పా రు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది.కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ… అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మాగ్రామం ఎప్పుడు మాయమ వుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.మాపరిస్థితి ఏంటోఅర్థం కావడం లేదు’’ అని 52ఏళ్ల కొవ్వాడ వాసి రాము ఎదుట వాపోయారు.
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్‌ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈఒప్పందంలో భాగం గా అణు విద్యుత్‌ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరురియాక్టర్లతో అణు విద్యు త్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వా డ,కోటపాలెం,రామచంద్రపురం,గూడెం,టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. ఇక్కడే అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి,2017 నాటికి ఈ గ్రామా లను ఖాళీచేయించి,పునరావాస కాలనీలకు తరలిం చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తేదీ దాటి ఐదేళ్లయినా…
అణు విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి…వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్‌ తేదీ2017 ఏప్రిల్‌ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి. ‘‘మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీ లు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్‌ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆతేదీకి 18ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో…గ్రామంలో చాలా మందికి 18ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వా లని డిమాండ్‌ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో,లేదా మాగ్రామాల్ని అభివృద్ధి చేయ డమో చేయాలి’’అని పెదకొవ్వాడ నివాసి మంగ రాజు చెప్పారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ సాకుతో అభివృద్ధి చేయడం లేదు’’
అణు విద్యుత్‌ ప్లాంట్‌ పరిధిలో సుమారు 8వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు సరిపోక పోయినా,కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.‘‘ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలుపడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోనిరోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్‌, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏఅధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపోమాయమైపోయే గ్రామం,దీనికి సౌకర్యా లేందుకు,డబ్బులువృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు’’ అని మత్స్యకార నాయకుడు బి.రాంబాబు చెప్పారు.‘‘అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్‌ డేట్‌ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆతేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరా వాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవు తున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడంలేదు,మరోగదో,చిన్న ఇల్లో కట్టుకుందా మంటే…అది వృథాఅయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అం శాన్ని క్లియర్‌ చేసి తరలించక పోతే… ఆందోళ న చేస్తాం’’ అని రాంబాబు అన్నారు.
భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేశారని అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.‘‘ప్లాంట్‌ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసితగ్రామాల్లో ఎక్కడోఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ…మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించ నైనా,తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం’’ అని అప్పన్న తెలిపారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ వద్దే వద్దు’’
కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ వద్దం టూ వామపక్షాలు,ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.‘‘అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణువిద్యుత్‌ను వదలి…ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం’’ అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు చెప్పారు. బొగ్గు, గ్యాస్‌, జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఐదోపెద్ద వనరు అణు విద్యుత్‌. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం.దానిసామర్థ్యం రెండు వేల మెగావాట్లు.కొవ్వాడలో రూ.61వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరుఅణువిద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఇదే. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.బొగ్గు,గ్యాస్‌,జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్‌.ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం(ఒక్కొక్కటి1208 వీఔ చొప్పున్న 6రియాక్టర్లు)7,248 మెగావాట్లు. ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేం ద్రసింగ్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03. 22 తేదీన తెలిపినది)
శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయి నట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అణు విద్యుత్‌ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత తెలిపారు. కోర్టుకేసులు,పునరావాస ప్యాకే జీల క్లియరెన్స్‌ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్‌ ప్లాంట్‌ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు. ‘‘కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్‌ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు… తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరి తగతిన ఈ ప్రాజెక్టుపూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మా వరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం’’ అని విజయ సునీత చెప్పారు.-(అల్లు రాజు)

ప్రజల భాగస్వామ్యంతోనే వికేంద్రీకరణ

జగన్‌గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ సం దర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. ప్రజల్లో మరింత గందరగోళం పెంచుతోంది. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి? పాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటి? రాజధాని వికేంద్రీకరణ అంటే ఏమిటి? ఇలాంటి అనేక అంశాలు ఈరోజు చర్చనీయాంశాలుగా మన ముందుకు వచ్చాయి. – (వి.శ్రీనివాసరావు)
అభివృద్ధి అంటే పెద్దపెద్ద రోడ్లు, విమానా శ్రయాలు, పోర్టులు మాత్రమే కాదు. ఈరోజు యువతకు ఉపాధి కల్పించగలిగిన పరిశ్రమల స్థాపన, ప్రజలందరికీ తిండి పెట్టగలిగిన వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల ఈ రెండు లేకుండా అభివృద్ధి జరగదు. అలాంటి అభివృద్ధి జరిగినా అది గాలిబుడగలా ఏదో ఒకరోజు పేలిపోతుంది తప్ప ప్రజలకు ఫలితాలు ఇవ్వదు. ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాలు, మండలాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వెనుకబాటుకు ప్రధానమైన కొలబద్ద అక్కడ సహజ వనరులను ఉపయోగించుకుని పరిశ్ర మలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా, వ్యవసా యానికి నీటి వనరులు ఉన్నాయా లేదా, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం జరుగు తున్నదా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి దారీ అభివృద్ధినే మనం ఈ రోజుఅభివృద్ధిగా భావిస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందున్న భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు, అలాగే అత్యంత పురాతనమైన ఆదిమ వ్యవస్థ అవశేషాలు కూడా నేడు రాష్ట్రంలో కొనసాగు తున్నాయి. అటు ఆదిమ వ్యవస్థ, ఇటు కాలం చెల్లిన భూస్వామ్య వ్యవస్థ, మరొక వైపు ముందు కు పోలేక సంక్షోభంలో కొట్టుమిట్టా డుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ,ఈ మూడు మిశ్రమ రూపాలు మన రాష్ట్రంలో కనిపిస్తుం టాయి. కాబట్టి వెనుకబడినటువంటి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలున్న ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, పరిశ్ర మలు అభివృద్ధి అయితే దాన్ని మిగతా ప్రాంతాలతో ముందుకు పోవడంగా మనం భావిస్తాం.కానీ పెట్టుబడి దారీ అభివృధ్ధి కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. అందులో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల మూలంగా సంపద కేంద్రీకరణ పెరిగి ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్ర రూపంలో ముందుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి మాంద్యం ఏర్పడుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రాంతీయ, సామాజిక వ్యత్యాసాలు కూడా పెరుగు తున్నాయి. ఈ వ్యత్యాసాల ఫలితమే ఆర్ధిక సంక్షోభం రూపంలో మనకు కనిసిస్తున్నది. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు పోవాలనుకున్నా సాంకేతిక, యాంత్రిక విస్తరణకు అవకాశాలున్నా వాటిని ఉపయో గించుకోలేని స్థితికి ఈరోజు వ్యవస్థ చేరింది. మనం ప్రపంచంలో ఒక సూపర్‌ పవర్‌ కావాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. మన జిడిపి మైనస్‌ల్లో నడుస్తున్నది. కనీసం ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో పోటీ పడుతున్నామా అంటే 5జి టెక్నాలజీ మొదలుకొని మిషన్‌ లెర్నింగ్‌ల్లో కానీ, ఇంటర్నె ట్‌ ఐఒటి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో గానీ ఎందులో కూడా మనం ముందుకు పోలేకపో తున్నాం. అన్నింటికీ మించి ఈరోజు టెక్నాలజీ లో కీలక స్థానం వహిస్తున్న సెమీ కండెక్టర్లను తయారు చేసుకోలేకపోతున్నాం. ఒక చిప్‌ను కూడా స్వతంత్రంగా తయారు చేసుకోలేని స్థితిలో మన దేశం ఈ రోజు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలున్నా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడి అమెరికా లాంటి దేశాల పెత్తనానికి తలొగ్గాల్సిన స్థితి వస్తున్నది. అందు వల్ల ఒక సమగ్రమైన రూపంలో అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. ఆర్ధిక అసమానతలూ తగ్గాలి. ఈ అవగాహన పాలకులలో లోపించింది. కేవలం కంటికి కనబడే రోడ్లు, ఫ్లైఓవర్లను మాత్రమే అభివృద్ధిగా చూస్తే అది భ్రమ అవుతుంది. రెండవ అంశం అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు అబివృద్ధి వికేంద్రీకరణ ఎంత అవసరముందో మన రాష్ట్రం వెనుక బాటును చూస్తేనే అర్ధమవుతుంది. రాష్ట్ర విభజనకు కూడా ఇదొక ముఖ్యమైన కారణం. ఒకప్పుడు తెలంగాణ బాగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగం పెద్దయెత్తున పరిశ్రమలు పెట్టిన తరువాత దానికి అనుబంధంగా చాలా ప్రైవేటురంగ పరిశ్రమలు వచ్చాయి. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి కావడంలో ప్రభుత్వ రంగం పునాదిగా పని చేసింది. ఆ తరువాత 90వ దశకం నుండి ఐటి అభివృద్ధి కావడంతో కొత్త రూపం ధరించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న దేశీయ,విదేశీ పెట్టుబడులన్నింటికీ కేంద్రంగా హైదరాబాద్‌ రూపుదాల్చింది. ఈ క్రమంలో మొత్తం అబివృద్థి అంతా హైదరాబాద్‌, దాని చుట్టూ కేంద్రీకరించడం వల్ల తెలంగాణాలోని మిగతా ప్రాంతాలతో సహా ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాలు కూడా వెనుకబడ్డాయి. ఈ అభివృ ద్ధిలో వచ్చిన వ్యత్యాసాల్లో నుండే తెలంగాణా ఉద్యమం కూడా వచ్చింది.ఈ అభివృద్ధిలో వచ్చిన కేంద్రీకరణ ఫలితంగానే కోస్తా, రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒక సమగ్రమైనటువంటి వికేంద్రీకరణ పద్ధతిలో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం చీలిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్‌లాగే విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ రంగం అబివృద్ధి అయ్యింది. కానీ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి దాని అభివృ ద్ధిని దెబ్బకొడుతున్నారు. తాజాగా మోడీ ప్రధాన మంత్రి అయ్యాక విశాఖ నగరానికి జీవనాడిగా, అభివృద్ధికి పునాదిగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడమో, మూసే యడమో చేస్తామంటున్నారు. అంతకుముందు హిందుస్థాన్‌ జింక్స్‌, ఇంకా కొన్ని పరిశ్రమలను మూసేశారు. అక్కడ ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున రావడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగమూ పోయింది. అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం, అత్యంత అభివృధ్ధి అయిన విశాఖ నగరం ఒకే జిల్లాలో పక్కపపక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధా నిగా నిర్ణయించిన తరువాత 33 వేల ఎకరాలను తీసుకుని విద్య, వైద్యం తదితర అనేక రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి రాజధాని లక్ష కోట్ల వ్యయంతో అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకరించే మాస్టర్‌ప్లాన్‌ను ఆరోజే సిపియం వ్యతిరేకించింది. అమరావతిలో శాసన, పరిపాలన రాజధాని ఉండాలి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అన్ని వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ రాష్ట్ర మంతా విస్తరింపజేయాలని కోరాము. ఆరకం గా అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా వెనుక బడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుం డా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కూడా ఒక మార్గంగా ఉంటుంది. లేనియెడల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లాగా మరొక చీలికకు పునాది ఏర్పడినట్లుంటుందని ఆరోజే హెచ్చరించాము. ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలన్న అంశంలో సిపిఎం ఆనాడే కచ్చితమైన వైఖరి ప్రకటించింది. అదే సందర్భంలో వైఎస్సార్‌ సిపితోపాటు అన్ని పార్టీలు దానిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ రీత్యా ఈరోజు అమరావతి రాజధాని అనేది తెలుగు ప్రజల ఉమ్మడి భావంగా ఉన్నది అనడంలో సందేహంలేదు. ఇక మూడవ అంశం పరిపాలన వికేంద్రీకరణ. జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ,పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, తద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. స్వాతంత్య్రోద్యమంలో గ్రామస్వరాజ్యం అనే భావన ఏర్పడిరది. కానీ దానికి భిన్నంగా స్వాతంత్య్రానంతరం దీర్ఘకాలం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా అభివృధ్ధి కూడా కేంద్రీకరించబడిరది. కేంద్రంలో, రాష్ట్రాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడానికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదంగా పరిణమించిన విషయం మనకు తెలుసు. స్థానిక సంస్థలకు అధికారాలు, దానితోపాటు చట్టబద్ధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ల ద్వారా నిధుల విడుదల జరిగితే గ్రామ, వార్డు స్థాయిల్లో జనసభలు జరిపి ప్రజలకు ఏది అవసరమో అక్కడ ఆ రకమైన అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిపాలనలో ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములవుతారు. ఇదే వికేంద్రీక రణకు అసలైన అర్ధం. స్థానిక సంస్థల ద్వారా పాలనా వికేంద్రీకరణ అనే నమూనా కేరళలో అత్యంత జయప్రదంగా అమలైంది. ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దాన్ని ఒక ఆదర్శంగా అంగీకరి స్తున్నాయి. మన రాష్ట్రంలో పాలనా వికేంద్రీ కరణ అనే పేరుతో రాజధానిని ముక్కలు చేయడాన్ని సమర్ధించు కుంటున్నారు. నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈరోజు కూడా గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టారు. వలంటీర్ల వ్యవస్థను పెట్టారు. వాళ్ళద్వారా నేరుగా రాష్ట్ర రాజధాని నుండి ప్రభుత్వమే వారికి ఆదేశాలు ఇచ్చి నడుపుతున్నది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్‌లు,ఆ డిపార్ట్‌మెంట్‌ లకు సంబంధించిన వ్యక్తులు గ్రామ,వార్డు సచివాలయాల్లో వారికి అనుబంధంగాఉంటారు. వీరు క్రింది వారికి ఆదేశాలిచ్చి పనులు చేయిం చే పద్ధతి నడుస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే కాకుండా పౌరుల మీద నిఘా పెట్టడానికి, ఆందోళన కారులను ఆపడానికి, నిరోధిం చడానికి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పేరిట పాలక వర్గాలకు అనుగుణంగా ప్రజలను మలచడానికి, రాజకీయంగా ప్రభావితం చేయడానికి ఈ వ్యవస్థలు ఉపయోగపడు తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న పంచాయితీలు, మున్సిపాలిటీలు నామమాత్రంగా మారాయి. కనీసం రోడ్లు వేసుకోగలిగిన పరిస్థితిగాని, కుళాయిలు పెట్టుకోగలిగిన పరిస్థితి గాని లేదు. దీనికి ‘మీరు పన్నులు వసూలు చేసుకోండి, ఆదాయాలు పెంచుకోండి’ అని వారికి సల హాలు ఇస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ షరతులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఎక్కడికక్కడ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచారు. నీళ్ళపన్ను పెంచుతున్నారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు ఇప్పుడు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. కన్వర్షన్‌ పేరుతో అదనపు భారం మోపుతున్నారు. అలాగే వివిధ రకాలైన భారాలను ప్రజలపై వేస్తున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ప్రజలనుండి బలవంతంగా వసూలు చేసుకోమనడం వల్ల అవి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అభివృద్ధికి తగిన నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడం కోసం స్థానిక సంస్థలు ఉండాలి తప్ప ప్రజల మీద భారాలు వేయడానికి ఒక సాధనంగా స్థానిక సంస్థలను మలిస్తే అప్పుడు కూడా వికేంద్రీకరణకు అర్ధం లేకుండా పోతుంది. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కేటాయించడం ద్వారా మాత్రమే పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చుకుని తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయట పడ వచ్చు. రాజధానిని ముక్కలు చేయకుండానే అమరావతిలోనే శాసన, పరిపాలన రాజధానిని ఉంచి దాని చుట్టూ మొత్తం వికేందీక్రకరణ చేయడం సహేతుకంగా ఉంటుంది. అదే సమయంలో శాసన, పరిపాలన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. రాజధానిలో అంతర్భాగంగా ఉండాలన్న నియమం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, హైకోర్టు బెంచ్‌లు మరొక చోట వివిధ ప్రాంతాలలో ఉండి ప్రజలకు హైకోర్టును అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రజల వాంఛకు అనుగుణంగా హైకోర్టును కర్నూలులో పెట్టి మిగతా ప్రాంతాలలో అవసరమైన చోట్ల బెంచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా హైకోర్టును అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆ రకంగా న్యాయవ్యవస్థను విడిగా చూసి శాసన పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధిని, పాలనను వికేంద్రీకరించి అమలు చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.

ముస్లీం మ‌హిళ‌లు బాధితుల‌వుతున్న వేళ‌…

మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణ యించుకుంటే,వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించు కోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచు కున్నారు.
భారతదేశంలో…హిందూ మహిళల్లో కుల,మత,వర్గ బేధాలు ఉన్నట్లే…ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి అంశమే మంటే, రాజకీయ చదరంగంలో సంఘ పరివార్‌ వారిని పావులుగా వాడుకుంటున్నది. 2019లో బిజెపి ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కొత్తచట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్ణాటక విద్యాసంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన మహి ళలను అనుమతించని వివాదం వరకు సంఘ పరివార్‌,ముస్లిం మహిళలను లక్ష్యంచేస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకున్నారు. తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాలేజీలకు వెళ్లే దారిలో ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బం దులను ఎదుర్కొనేవారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిరదని చెప్పారు. చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా, 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహోమానికి, దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వారిపై సామూహిక అత్యా చారాలకు పాల్పడి, వారి ఇళ్లను లూటీ చేసి, ధ్వం సం చేశారు. అహమ్మదాబాద్‌ లోని నరోదా పాటియా ఊచకోతలో గర్భవతి కౌసర్‌ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు,సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవ త్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించి వీరికెవరికీ తెలియనప్పటికీ,దాని ప్రభావంతో ఇప్పటికీ బాధపడుతున్నారు.
2014 తరువాత బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంకేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత,మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాం గ యంత్రాంగం,సంఘ పరివార్‌ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచుతున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో,దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాల నలో 2020 ఢల్లీి అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లిం లకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృ త్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యా ర్థులు, కార్యకర్తలను మూకు మ్మడిగా అరెస్ట్‌ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీక రణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కు ను మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.
హిజాబ్‌ సమస్య దుష్ఫలితాలు
ఆన్‌లైన్‌ వేలం కేసుల విషయంలో అధి కారులు చర్యలు తీసుకుంటున్నా, కర్ణాటక లోని పాఠశాలల్లో హిజాబ్‌ చుట్టూ నడుస్తున్న వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాం శమైంది. కొన్ని రోజుల్లోనే హిజాబ్‌ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాలఅర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహ రణకు,బెంగాల్‌ ముస్లిం జనాభా ఎక్కువ గా నివసించే ఢల్లీి మురికివాడల్లో ‘హిజాబ్‌’ అనే పదం విదేశీపదం.ఇళ్ళలోపని చేసే,నిర్మాణ రంగం లో పనిచేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరి స్తారు. దానిని వారు ‘ఇస్కబ్‌’ అంటారు. ఇంటిపని చేసే తబస్సుమ్‌,అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు…దాన్నిచున్నీ,దుపట్టా,పర్దా లేక పల్లూ (చీరకట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళిన ప్పుడు తలను కప్పుకుంటారు.కానీపని చేసే సమ యంలో,ఇంట్లోఉన్నప్పుడు,సైకిల్‌ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితో పాటు పెళ్లికాని అమ్మాయిలు కూడా వాటిని ధరిం చరు. పది సంవత్సరాల వయసు నుంచి తబస్సుమ్‌ ఇస్కబ్‌ ను ధరించడంవల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది. కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కాధరించలేదు. బుర్కా ధరిస్తే పని చెయ్యడం సాధ్యం కాదని,ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్‌ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయ త్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడితే ఎలా సంపాదించి,ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది. భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్‌ లాంటి శ్రామిక వర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడిరచే కొద్దిపాటి స్థలమే ఉం టుంది. అదే నిజమైన విషాదం.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు : మౌలికంగానే లోపభూయిష్టం
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు సహేతుకమైన సర్దుబాటు ఆవశ్యకతను గుర్తించడంలో విఫల మైంది. విద్యాసంస్థల్లో విద్యార్థులు తలకు కండు వాలు ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాలా తప్పు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడంపై తలెత్తిన వివా దంపై ప్రశ్నలు లేవనెత్తిన తీరు రాజ్యాంగ సూత్రా లను దెబ్బతీసేదిగా ఉంది. నిర్దేశిత యూనిఫామ్‌కు అదనంగా ధరిస్తున్నారా? యూనిఫామ్‌ రంగుకు ఎలాంటి తేడా లేని హిజాబ్‌ ధరించడం వల్ల పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడం సరైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించడంలో కోర్టు విఫలమైంది. ఇస్లాంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ఆచారమని, అందువల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రసాదించబడిన మత స్వేచ్ఛలో భాగంగా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉందని విద్యార్థులు చేసే వాదనతో విభేదిస్తూ ఖురాన్‌లోని చరణాలను బెంచ్‌ ఉటంకించింది. ఇదా అసలు సమస్య? విద్యార్థుల మధ్య సమానత్వ భావనను దెబ్బతీయకుండా సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా తరగతి గదిని బహుళత్వంతో కూడిన సమాజం అనుమతించే ‘సహేతుకమైన సర్దుబాటుకు అనుకూలమైన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పాఠశాలల వంటి ‘’ బహిరంగ స్థలాల్లో ‘’ దుస్తులకు సంబంధించిన నియమాలు అవసరమే కావచ్చు. కానీ సూచించిన యూనిఫారానికి ఇబ్బంది కలిగించని రీతిలో అదనంగా చిన్న వస్త్రాన్ని ధరించే సర్దుబాటును సైతం తిరస్కరించడంలో హేతుబద్ధత ఏమిటో అర్థం కావడం లేదు. ‘మనస్సాక్షి స్వేచ్ఛ’పై ఆధారపడిన వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు పిటిషన్లలో తగిన వివరణ లేకపోవడాన్ని ఒక సాకుగా చూపింది. యూనిఫామ్‌ ఆవశ్యకతను గురించి కోర్టు నొక్కి చెబుతూ, సమానత్వం, సజాతీయత యొక్క ఉల్లంఘించలేని చిహ్నం అని ఉద్ఘాటించింది. సజాతీయత అంటే సర్దుబాటుకు ఆస్కారమిచ్చే వాదనలను మొత్తంగా తోసిరాజ నడమన్నట్టుగా కోర్టు చూసింది. ఈ కేసులో ‘ఎసెన్షి యల్‌ ప్రాక్టీస్‌’ (మౌలికమైన ఆచరణ)ను పరీక్షకు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పూర్తిగా మతతత్వంతో కూడిన దురాచారమైతే, దానిని కేంపస్‌ వెలుపల ఉంచవచ్చు. ఏకరూపత, వేరుపరిచే భావనను తొలగించడం అనేవి మంచి లక్ష్యాలే. అయితే, ఇటువంటి అంశాలపై తలెత్తే చిక్కులను వేదాంతాల జోలికి పోకుండానే పరిష్కరించవచ్చు. ‘ మౌలికమైన మతపరమైన ఆచారాలు’ ను పరీక్షించడం మొదలు పెడితే దానికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇటువంటి వాటిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తిరుగులేని ప్రమాణాలను నెలకొల్పింది. మౌలికమైన ఆచారాలు అని దేనిని పిలుస్తామంటే, అది లేకపోయినా లేదా తొలగించబడినా మొత్తం మతమే నాశనమయ్యే ప్రభావాన్ని కలిగి ఉండేవాటిని మాత్రమే. .కొన్ని మౌలికమైన ఆచారాలు కాపాడబడితే కాపాడుకోనివ్వండి. అటువంటి వాటివల్ల ఏ మతపరమైన ఆచారమూ మనుగడ సాగించదు. దానికి బదులు సమానత్వం, గౌరవం, గోప్యత, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన వంటి రాజ్యాంగ విలువలకు రక్షణగా ఆర్టికల్‌ 25ని క్లెయిమ్‌ చేయడాన్ని పరీక్షిస్తే ఎక్కువ ప్రయోజనం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిని’ మౌలిక ‘ పరీక్షకు ఎన్నడూ పెట్టకూడదు.. ఎందుకంటే ఇది వేదాంత భావనలను మిగతా వాటిపై స్వారీ చేయడానికి సిద్ధాంతపరంగా అనుమతిస్తుంది. ఆ భావనలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా, కాదా అన్నదాంతో నిమిత్తం లేకుండా ఒక మతానికి ఆవశ్యకంగా పరిగణించబడుతూ ఉంటాయి. స్వేచ్ఛలు ముఖ్యం కాబట్టి మత స్వేచ్ఛ ముఖ్యమే.కానీ మతాలు కాదు ముఖ్యం. – దివ్యా త్రివేది

1 6 7 8 9 10 13