ఆర్ధిక నిఘా దాడులు అమానుషం

నా చిన్నప్పుడు, అంటే గత 50సంవత్సరాల క్రితం పలురకాల సామాజిక సమస్యలపై ప్రజాఉద్యమాలు నడిచేవి.తాగు,సాగునీరు,ప్రజల జీవనోపాధి,ప్రజావసరాలు,మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు ధర్నాలు,ర్యాలీలు,నిరసనప్రదర్శనలు చేసేవారు. ఇలా సమాజంలో ప్రజాజీవన విధానాలపైనే సామాజిక పోరాటాలు సాగేవి.సరళీకరణ,మిశ్రమ ఆర్ధిక విధానాలు పుణ్యమా అని ప్రస్తుతం ఆ ఉద్యమాలు దారిమళ్ళాయి. దళిత,గిరిజనుల భూములు కోల్పోవడం,స్థానిక వనరులు దోపిడి,పర్యావరణసమతుల్యం దెబ్బతినడం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను నిత్యం ప్రచార మాధ్యమాలు ద్వారా తెలుస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ,గిరిజన తెగలు నివాసించే అటవీప్రాంతాల్లో పెద్దపెద్ద పరిశ్రమలు,ప్రాజెక్టులు స్థాపన కోసం స్థానిక గిరిజనుల భూములు, వనరులు దోపిడికి గురికావడం వంటి తీవ్రమైనఅంశాల ఉద్యమాలు జరుగుతున్నాయి.నూతనఆర్ధిక విధానాలు తర్వాత ప్రైవేటీకీకరణ పెత్తనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి ప్రజల సామాజిక ఉద్యమాలు కాస్త పక్కదారి పట్టాయి.ప్రపంచీకరణనేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టినప్రాజెక్టులు,పరిశ్రమలవల్ల నిర్వాసితులైనప్రజలు,దెబ్బతింటున్న పర్యావరణసమతుల్యతపై పోరాటాలు నడుస్తున్నాయి.మిగతా ప్రజామౌళికావసరాలపై చేపట్టే సామాజికఉద్యమాలు తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో1991వరకు సామ్యవాద తరహా అక్కడ అక్కడా పరిశ్రమలు నెలకొల్పారు. కానీ ప్రైవేటీకరణ పెరగడంవల్ల వనరులు,పర్యావరణ సమస్యలతో ప్రజల పడుతున్న వెతలు వర్ణీతీతంగా మారాయి.మిశ్రమఆర్ధిక విధానం,సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడంవల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంలో పడిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసేవేయడం వంటి విధానాలవల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులురోడ్డున పడుతున్నారు. దీనికి తోడుగా గత రెండేళ్ళక్రితం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌`19 ఆంక్షలు స్థానిక ప్రభుత్వాలకు జతకట్టాయి.దీని ఆసరాగా తీసుకొని స్థానిక వనరులు,పర్యావరణ సమతుల్యతలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. పెట్టుబడులు ఉపసంహరణవల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థల(స్టీల్‌ ప్లాంట్‌ వంటి కంపెనీలు) పనితీరు మెరుగైన లాభాల బాట పట్టినప్పటికీ,శ్రామికులకు ఏమాత్రం మేలు చేకూరలేదు.ఫలితంగా బాధితుల ఒత్తిడి మేరకు సామాజిక, పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది.
ఈనేపథ్యంలో ఈఅంశాలపై పోరాటంచేసే వారిపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం ప్రయోగిస్తోంది. వారి నిరసన గళాన్ని అణిచివేసేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. వారిపై ఆర్ధిక నేర ఆరోపణ నెపంతో ఆర్ధిక నిఘా విభాగాలను ప్రయోగిస్తూ సరికొత్త తరహాలో దాడులు ప్రారంభించాయి. ఇలా ఇప్పటి వరకు దేశంలో సుమారుగా 300 మంది సామాజిక,పర్యావరణవేత్తలు,స్వచ్చంధ సంస్థలపై సోదాలు పేరుతో దాడులు చేపట్టాయి. టెర్రరిస్టులు తరహాలో వారిపై దాడులు చేసి భయాంబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంలో సామాజిక,పర్యావరణ పరిరక్షణ,మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలైన 1700మందిని హత్యలకు గురి చేసినట్లు నివేదకలు చెబుతున్నాయి.
ఇదింతా బడాపారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త లను భయాందోళనలకు గురిచేసి అడ్డుతొలగించుకోవడానికి స్థానికప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పెద్ద కుట్రలోని ఒక భాగమేనని ప్రజలు,పర్యావరణ,సామాజిక వేత్తలు భావిస్తున్నారు.-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

జీవనదులు..విలవిల!

భూమి వేడేక్కుతోంది.పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.ప్రకృతి విఫత్తులు పేట్రేగి పోతున్నాయి.హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతుంది. కర్ణాటక,పాకిస్తాన్‌లో వరద భీభత్సం, అడుగుంటితున్నజీవనదులు,చైనాలో కరువకాటకాలు. దీనికి కారణం వాతావరణంలో కనీవినీ ఎరుగని మార్పులు.ఇదికేవలం ఒక్క దేశానికే పరిమితం అయన అంశం కాదు.విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రధమ కారణం.ఈపెనుమార్పులుపై ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తున్నా..దేశంలో అనేకప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతులు యధేచ్ఛగా మంజూరు చేసేస్తోంది.
మరోపక్క హిమాలయాల్లో మంచుపర్వాతాలు కరిగిపోయి సముద్రమట్టం పెరిగిపోతుంది.ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పోనది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.యూరఫ్‌ పరిధి పది దేశాల గుండాపారే అతిపొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతుంది. జర్మనీ,నెదర్లాండ్‌,స్విట్జర్లాండ్‌ దేశాలకు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌నది పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా కోట్లాది మందినీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి. ఇక ప్రపంచ ప్రసిద్ద ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయోర్‌ నదిలో కూడా నీరు అతివేగంగా అడుగంటుతోంది.చైనా,అమెరికా,ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతోవాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడాగుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగాకోట్లాది మంది తాగు,సాగునీటికి అల్లాడుతున్నారు.నిత్యంఉధృతంగా ప్రవహించే చైనాలోనియాంగ్జీనది మరింత దుస్థితిలో ఉంది. ఇదిప్రపంచంలోనే అతిపెద్దనదిగా గుర్తింపు ఉంది. ఇదిలాంటే..స్పెయిన్‌,పోర్చుగల్‌ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల అక్కడ దట్టమైన అడవులు కాలిపోతున్నాయి.అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లక పోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్భన్‌ఉద్గారాలు పేరుకు పోంతోంది. ఫలితంగా ప్రకృతి సహజసిద్దమైనగుణాన్నికోల్పోయి భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది.ఇదింతా పర్యా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్రాజిల్లాల్లో నిక్షేపమైన నదీజలాలు ఇదేపరిస్థితి దాపురిం చనున్నట్లు సాంకేతాలుచవిచూస్తున్నాయి. దీనికికారణం ఇబ్బుడిముబ్బుడిగా ఇక్క పరిశ్రమలకు అను మతులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ప్రవహించే జీవనదులపై హైడ్రల్‌ ప్రాజెక్టులనిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.దీని నిర్మాణమంటూ జరిగితే భవిష్యుత్తులో ఇటు గిరిజనలు,అటు మైదాన ప్రాంతానికి తాగు,సాగునీటికి తీవ్రమైన విఘాతం ఏర్పడనుంది. పర్యావరణ పరిరక్షణ..నీటివనరుల సంరక్షణఅనే అంశంపై2005లో సమత ఉత్త రాంధ్రజిల్లాలో(శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం,తూర్పుగోదావరి)ల్లో ‘కొండల ఆరోగ్యమే.. పల్లపుప్రాంతాల సౌభాగ్యం’’అనే నినాదంతో చైతన్యయాత్ర చేపట్టాం.చెట్లు నరికేయడం,వెసులబాటు లేకుండాఖనిజాలు వెలికితీ స్తూపోతుంటే, భవిష్యత్‌ తరాలకు మన సంపదలు మిగలవని,పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదనుకోల్పోతే,వాటిని తిరిగి రాబట్టేందుకు కొన్ని సంవత్సరాలుతరబడి ఎదురుచూడాల్సి ఉంటుందనిఅనే ఈ యాత్ర ద్వారా ఆనాడే అవగాహన కల్పించాం. ఇది తెలిసినా స్వార్ధచింతనతో అటవీవృక్షాలను తెగనరికి ధ్వంసం రచనకు పూనుకుంటున్నారు.
ఇప్పటికైనా అడవులుఆరోగ్యంగా ఉంటేనేగిరిజన,మైదానప్రాంత రైతాంగానికి,ప్రజలకి సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తోంది. ఈవాస్తవాలు గ్రహించి సహజవనరుల పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌-

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక హర్షనీయం

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం.జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను,పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ,విశేషాధి కారాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలివ్యక్తిగా,తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..అణగారిన ఆదివాసీతెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగలు ప్రజలు, సామాన్యలు అనేక ఆశలు,ఆకాంక్షలు పెట్టుకున్నారు.ఇప్పటికైన తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు,వనరులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆదివాసీగిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే,ఈమధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తర్వాత మార్పులు వస్తున్నాయి. వాటిలో కొన్ని మంచిని కలిగించే మార్పులయితే,మరికొన్ని వారి ప్రాంతాలను,జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించుకోవడానికి నియమించబడిన భారత జాతీయ ఎస్టీ కమిషన్‌ పూర్తిస్థాయిలో నేటికీ భర్తీ కాలేదు.సగానికిపైగా ఖాళీలున్నాయి. ఆదివాసీ ప్రజ లను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి వారి గిరిజన ప్రజలసంపద, భూమి, అడవులు, సహజవనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఆదివాసీలను బలిపీఠం ఎక్కించేలా కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలతో అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సర్కార్‌ కొన్ని కొత్త నిబంధ నలను తెరపైకి తెచ్చింది. దేశంలోని ఖనిజ తవ్వకాలు,పునరుత్పాదక విద్యుత్‌,పర్యాటకం,వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవిబిడ్డలను అడవికి దూరం చేయడంతో వారంతా దోపిడికి గురవుతున్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా ఐదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసముండే గ్రామాలను నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 552 గ్రామాలు ఉన్నాయి.నాన్‌ షెడ్యూల్‌ ఏరియాను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలనే ఈ సమస్యతో గతకొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు.భూరియా కమిటీ సిఫార్సుల అనంతరం షెడ్యూల్‌ ప్రాంతాలను స్థానిక పాలనా కోసం కేంద్రప్రభుత్వం పంచాయితీ విస్తరణ చట్టం (పెసా)`1996 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సిపార్సుల్లో మెసా (మున్సిపల్‌ ప్రాంతాలవిస్తీరణ చట్టం)చట్టం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు మెసా చట్టం లేకుండానే కొన్ని గిరిజన ప్రాంతాలను మున్సిఫల్‌ పరిధిలోకి విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది. వాస్తవానికి గ్రామసభల ద్వారానే కొత్తవాటిని విలీనం చేసే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను గాలికి వదిలేసి ప్రభుత్వాలు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లా సరుగుడు పంచాయితీలోని కొన్ని గ్రామాలను విశాఖమెట్రో పాలిటిన్‌ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో విలీనం చేస్తున్నారు.దీనవల్ల గిరిజనుల మనుగడ ప్రశాన్నర్ధంగామారే ప్రమాదంఉంది.వారిసంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగే అవకాశాలు న్నాయి.ఈ విధంగా దేశంలోని పది రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల కొత్త రాష్ట్రపతి ముర్ము ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారనేదే ప్రస్తుతం కీలక ముఖ్యఅంశంగా మారింది. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిపీఠమెక్కిస్తున్న కేంద్రప్రభుత్వం తమ విశేషాధి కారాలను వినియోగించుకొని అడవిబిడ్డలను,ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ పునాదులను పరిరక్షిస్తారని ఆదివాసీ సమాజం ఎదురు చూస్తోంది.ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార’ని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి‍,ఎడిటర్

Read more

122 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండలు..!

మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ప్రపంచవ్యాప్తంగాపక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడిరచింది.
ఈఏడాది భానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు.దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు,ఉక్కుపోత. దీనికి తోడు కరెంటు కోతలు తోడుకావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి ఎండలు పెరుగుతున్నాయి. మార్చిలో దేశ వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది.భారత వాతావరణశాఖ అందించిన వివరాల ప్రకారం..ఈ సంవత్సరం మార్చినెలలో ఉష్ణోగ్రతలు 122ఏళ్లలో నమోదైన వాటికంటే అత్యంత ఎక్కువైనవిగా పేర్కొంది. దీన్నిబట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి.
ఢల్లీి మార్చినెలలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రెండు హీట్‌వేవ్స్‌ను చూసింది. సగటు గరిష్ట,కనిష్ట ఉష్ణోగ్రతలు వరసగా 32.9సెల్సియస్‌(సాధారణ సగటుకంటే 3.3సీ),17.6సీ(సాధారణ సగటు కంటే 2సీ)వద్ద సాధారణం కంటే ఎక్కువగా నమోద య్యాయి. భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకి హీట్‌వేవ్‌ రోజుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత గణాంకాలను చూసినట్లయితే 198190లో 413 రోజుల నుంచి 200110లో 575 రోజులకు,201120 మధ్యలో ఇది 600రోజులకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ అని నిపుణులు అంటున్నారు. వాతావరణమార్పులు,పెరుగుతున్న నగరీకరణ,అడవుల నరికివేత వంటి కూడా మారుతున్న వాతావరణ తీవ్రతలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. వీటికి తోడు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న తక్కువ వర్షపాతం మరోకారణంగా తెలుస్తోంది. వర్షపాతం లోపం భారత్‌లో 72శాతం ఉండగా..దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో అది అత్యధికంగా 89శాతానికి పెరిగింది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన స్థాయికంటే ఎక్కువగా ఉంటున్నాయి. పొడి, వేడిగాలులు, వాయువ్య,మధ్య భారతదేశంలోకి వీస్తున్నాయి. 19602009మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5సెల్సియస్‌ పెరగడం కారణంగా వడగాల్పుల వల్ల సంభవించిన మరణాలు 146శాతం వరకు పెరిగాయి. దేశంలోని 13శాతం జిల్లాలు,15శాతం ప్రజలు ఈహీట్‌వేవ్‌లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.దీనివల్ల పేదలు,అట్టడుగు వర్గాలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దేశంలోని శ్రామికవయస్సు జనాభాలో అధికశాతం మంది వ్యవసాయం,నిర్మాణం,రిక్షాలాగడం వంటి బహిరంగ ఉద్యోగాల్లో ఉండటంవల్ల వారిపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినటంతోపాటు,జీవనోపాధికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దక్షణధృవం,ఉత్తర ధృవంలో వాతావరణం మార్పులవల్ల ఐసుగెడ్డలు కరిగిపోతుంది. దీని కారణంగా వాతావరణంలో వేడి పెరిగి సముద్ర నీటిమట్టం పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలోని దీవులతోపాటు,భూమి మునిగిపోతుంది. ఈ పర్యావరణ మార్పులు వల్ల(క్లైమేట్‌ ఛెంజ్‌)లో పక్షలు వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రదేశానికి వలసలు వస్తున్నాయి. దీనివల్ల కోవిడ్‌19 వంటి ఇంకా భయంకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ! ఈనేపథ్యంలో పర్యావరణంలో సంభవిస్తున్న మార్పుల పట్ల ప్రపంచ దేశాలన్నీ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములై గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

దేశంలో మొబైల్‌ లేని గ్రామాలెన్నో..?

దేశం డిజిటల్‌ ఇండియా అంటూ టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో మొబైల్‌ సౌక ర్యాలు లేవంటే ఎవరైనా నమ్మగలరా..ఇది నిజం. దాదాపు దేశంలోని 60వేలకు అటుఇటుగా గ్రామాల్లో ఫోన్‌ అంటేనే తెలియదని కేంద్రప్రభుత్వం వెల్లడిరచింది. లోక్‌సభలో ప్రశ్నోతర్తాల సమయంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఓప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చి23న పార్లమెంట్‌లో అందించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,ఆంధ్రప్రదేశ్‌లోని1,787గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీ లేదు. గతకొన్ని దశాబ్దాలుగా డిజిటల్‌విప్లవంలో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నప్పటికీ,ఇలాంటి గ్రామాలకు సాంకేతిక రంగం దూరంగా ఉండటంతో అక్కడ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యరంగాలకు దూరవమతుండటం శోచనీయం.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విశాఖ జిల్లాలో అరకు,చింతపల్లి,డుంబ్రిగూడ,జీకేవీధి,ముంచింగిపుట్టు,పెదబయలు,అనంతగిరి తదితర గిరిజన మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు సామాజికంగా,భౌగోళికంగా బయటి ప్రపంచానికి దూరమంగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.మొబైల్‌ మరియు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడం ఈ కుగ్రామాలలో ఆర్థిక మరియు సామాజిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇవిరోడ్లు,ఆరోగ్య సౌకర్యాల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం కూడా చాలా కాలంగా పోరాడుతున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉన్న గ్రామాలలో కూడా సిగ్నల్‌ నాణ్యత తక్కువగా ఉంటుంది. మరో విచిత్రమేమిటంటే..ఎక్కడో మారుమూల ప్రాంతాలకు మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేదంటే కాస్తా ఆలోచించ వచ్చు.కానీ విశాఖ మహానగరానికి అతిచేరవలో ఉన్న సింహాచలం దేవస్థానానికి సమీపంలో గల దబ్బంద పరిసర గ్రామాలకు మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడం విచారకరం.ఈ చుట్టుపక్కల సుమారు ఎనిమిది గ్రామాలకు సాంకేతికత దూరమైంది.వీరంతా నెట్‌వర్క్‌ కవరేజీకోసం వారిఇళ్ల నుండి సుదూర ప్రాంతాలకు కాల్‌ చేయడానికి/స్వీకరించడానికి పరుగులు తీస్తున్నారు.
ఇటీవలి కోవిడ్‌-19మహమ్మారి,తదుపరి లాక్‌డౌన్‌ కూడా కోవిడ్‌-19పరీక్ష,చికిత్స,టీకాలను యాక్సెస్‌ చేయడంలో గిరిజన ప్రాంతాలలోఈ డిజిటల్‌ విభజనను హైలైట్‌ చేసింది.కోవిడ్‌-19 మొదటి ఒకసంవత్సరంలో రిమోట్‌ టీచింగ్‌ లెర్నింగ్‌పై దాని ప్రభావం చూపించింది.విశాఖపట్నం గిరిజనప్రాంతంలో దాదాపు3వేలగ్రామాలు ఉన్నాయి.డోర్‌-టు డోర్‌ సర్వీస్‌ డెలివరీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను మెరుగ్గా అందజేయడం కోసం ప్రవేశపెట్టబడిన అనేక గ్రామ సచివాలయాలు కూడా మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడంవల్ల వాటి లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడిరచిన వివరాలు మేరకు దేశంలోని ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర,ఒడిశాల్లోని దాదాపు 44జిల్లాల్లో ఇప్పటివరకూ సెల్‌సౌకర్యం అందుబాటులోలేని గ్రామాలను గుర్తించారు.ఏపీ విశాఖజిల్లాలో1,054, విజయ నగరంలో154, కడప జిల్లాలో10 గ్రామాల్లో మొబ్కెల్‌ సేవలవిస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. మొత్తంగా18నెలల్లో పనులుపూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్‌ పవర్‌ బ్యాటరీలుద్వారా టెలికాం టవర్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడుజిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44ఆకాంక్ష (యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టు కోసం యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌)నిధులతో మొత్తం రూ.6,466కోట్ల అంచనావ్యయంతో ప్రతిపాదించారు. ఇప్పటికైనా మారుమూల గ్రామాలకు మొబైల్‌,ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సేవలు తక్షణమే విస్తరించి ప్రజలందరికి రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందేల చర్యలు తీసుకోవాల్సిన ఆశ్యకత ఉంది! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

కొత్త జిల్లాల ఏర్పాటు సుపరిపాలనకు దారితీస్తుందా?

రాజ్యాంగంలో పొందుపరిచిన వారిహక్కులను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. అన్నిరంగాల్లో అన్ని రకాలుగా ఆదివాసీలు ఏడుశతాబ్దాలుగా అస్తిత్వం,ఆత్మగౌరవం,స్వయంప్రతిపత్తి కోసం మనుగడ కోసం నిరంతరంవారుపోరాటంచేస్తున్నారు. ఈనాటికి వారికి న్యాయం దొరకడం లేదు. ప్రజలముంగిటికిపాలన అనేమాట1984లో మొదట వినిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈనినాదంతోనే ఒక శతాబ్దానికిపైగా చరిత్రఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాలూకాల నుంచి మండలాలు విభజనలో నేపథ్యంలో ఉమ్మిడి ఏపీలో సుమారు 800 గిరిజన గ్రామాలకు చాలా అన్యా యానికి గురయ్యఆరు. దాంట్లో తూర్పుగోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏరియా పెదమల్లాపురానికి ఆనుకొని ఉన్న 56 గిరిజన గ్రామాల గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు దూరమయ్యారు. అలాగే విశాఖజిల్లా కొయ్యూరు తాలూక పరిదిలో ఉండే సరుగుడు, కేవీశరభవరం,చమ్మచింత తదితర నాలుగు పంచాయితీలను మైదానప్రాంతమైన నాతవరం మండలంలో విలీనం చేయడంవల్ల ఆప్రాంతగిరిజనులంతా అభివృద్ధికి నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,1984లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న 800కుపైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన చేసినా దాన్ని రాష్ట్రప్రభుత్వం సక్రమంగా అమలు పర్చలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజవర్గ పునర్విభజనలో భాగంగా అరకు లోక్‌సభనియోజకవర్గం అన్యాయానికి గురైంది. 25లోక్‌సభ నియోజక వర్గంలో 7అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దానిస్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిరది. ఈనియోజకవర్గం 4జిల్లాలలో విస్తరించి ఉంది.విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోని భాగాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈలోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇదిచాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది. పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్త రించి ఉన్న ఈనియోజకవర్గం ఆచివరి నుండి ఈచివరికి 250కిలోమీటర్ల పైగానే దూరం ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకుగాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1సెగ్మెంట్‌ ఎస్సీలకీ రిజర్వ్‌ చేయబడ్డాయి.
2014`2015మధ్య రాష్ట్ర విభజనలో రాష్ట్ర విభజన జరిగింది. ఈసమయంలో కూడా ఆదివాసీలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంస్కృతి,సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరోకసారి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్రపటం మారిపోతోంది. అంతే కాకుండా ఇటీవల నగరీకరణలో భాగంగా విశాఖపట్నం మెట్రోపాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధార్టీ(వీఎంఆర్‌డీఏ) సరుగుడు ఏరియా గిరిజన పంచాయితీలను విలీనం చేసి ఆ ప్రాంత గిరిజనులకు చారిత్రీక అన్యాయానికి గురిచేశారు.అదే విధంగా విజయనగరం జిల్లా గిరిజనాభివృద్ధికి చేరువలో ఉన్న పార్వతీపురం ఐటిడీఏను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇది కూడా తీరని అన్యాయమే అవుతుంది. ప్రభుత్వ అనాలోచిత విధానాలు కారణంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రాదాయలు కనుమరుగయ్యే అవకాశం అధికంగా కన్పిస్తోంది. షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం మధ్యలో నుంచి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 516వ జాతీయ రహదారిని406కిలోమీటర్ల పొడవునా నిర్మాణపనులు వేగంగా జరుగు తున్నాయి. దీనివల్ల గిరిజనుల భూములు,వారి జీవన విధానం దెబ్బతింటోంది. ఆదివాసుల కల్చరల్‌ దెబ్బతింటోంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన అనంతరం దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, ఎప్పుడో బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరిపేసి చిన్నజిల్లాలను సృష్టిస్తున్నారు. ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీనంచేసి పాలనా యంత్రాంగాన్ని ఇంకా శక్తివంతులను చేస్తుందా అనేది ప్రశ్న. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగితీరాలి. స్థానిక గిరిసజనుల మనోభవాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగావారి సాంస్కృతి,సాంప్రదాయాలు,కట్టుబాట్లు దెబ్బతినకుండా గిరిజనులకు ప్రయోజకరకంగా ఉండేలా విభజన వ్యవహారాన్ని కొనసాగించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

ఆదివాసీ సుపరిపాలన గ్రామసభల ద్వారానే సాధ్యం!

ఆదివాసీలు అధికంగా జీవిస్తున్న చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో పీసాచట్టం((పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) పారదర్శకంగా అమలు పరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆ ప్రభుత్వం అడుగులేస్తోంది. పీసాచట్టం రాజ్యాంగం అంతర్భాగంగా వచ్చిన ఈచట్టం ద్వారా గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెట్టేందుకు కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తుండటం ప్రశంసనీయం. ఆదివాసుల ఆత్మబంధువులైన ఐఏఎస్‌ అధికారులు బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా స్పూర్తితో ఆ రాష్ట్రప్రభుత్వం గ్రామసభ సంపూర్ణ అధికారాలను అందించి ప్రజలకు మంచిపాలన అందించడానికి కృషి చేస్తోంది. ‘‘ మావూళ్లో..మారాజ్యాం..,హైదరాబాద్‌..ఢల్లీిలో మన రాజ్యాం’’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఆనాటి ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ఆశయాన్ని నేడు రాష్ట్రంప్రభుత్వం గ్రామసభకు ప్రాముఖ్యత ఇస్తోంది.బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి ఆదివాసుల సుపరిపాలన కోసం పాటు పడ్డారు. 75వ రాజ్యాంగ సవరణ ద్వారావచ్చిన పీసాచట్టాన్ని 25ఏళ్లక్రితం పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు,రాజ్యసభ,అసెంబ్లీ,జిల్లా, బ్లాక్‌,పంచాయితీల స్థాయిలో గ్రామసభకు అధికారం ఇవ్వాలి.ఇది సమత జడ్జెమెంటు కూడా స్ఫస్టం చేసింది.
ఇటీవల కాలంలో ఛత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు. స్టేట్‌ ప్లానింగ్‌ తరుపున వివిధ అంశాలపై టాస్క్‌పోర్సు నియమించింది. పీసా చట్టం,పరిపాలన విధానం,పునరావాసం,సాంకేతిక పరిజ్ఞానం ఆదివాసులకు అందించడానికి కమిటీని సిపార్సులు చేసింది. ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువకావడం,అలాగే పరిపాలన అధికార యంత్రాంగం కూడా అధికశాతం గిరిజనతెగలకు చెందిన ఉద్యోగులు ఉండటంతో ఈరాష్ట్రంలో గ్రామసభకు ప్రాధాన్యత సంతరించుకుంది.వీరంతా కలసి సర్వ ఆదివాసీ సమాజ్‌ కింద ఒకసమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. దానిద్వారా వారి సంస్కృతి సంప్రదాయాలు,కట్టుబాట్లును పరిరక్షించుకుంటూ వస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఆచార సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే గ్రామసభ మూలాధారమని భావించారు. ఈ దశగా రెండేళ్ల నుంచి పీసా చట్టానికి అనుగుణంగా పాలన సాగాలని ఆకాంక్షస్తున్నారు. ఈనేపథ్యంలోనే ్ద రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ ద్వారా రాష్ట్ర,జిల్లా,బ్లాక్‌ల స్థాయిలో పీసా చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచి గ్రామసభకు విశిష్ట అధికారాలను కట్టబెట్టడానికి కృషిచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఆదివాసీ సమూహానికి అనుగుణంగా గ్రామసభకు విలువనిస్తోంది.
పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలలో లబ్ధిదారులను గుర్తించే అధికారం ఉంది. పంచాయతీ పరిధిలోగల పాఠశాలలు,హెల్త్‌ సబ్‌ సెంటర్లు, మంచినీటి పథకాలు,ప్రభుత్వసంస్థల పనితీరును సమీక్షించి,తగు సూచనలు, సిఫారసులు చేసే అధికారం గ్రామసభలకు ఇచ్చింది. పీసా గ్రామసభలు చేసిన తీర్మానాలను ప్రభుత్వ అధికారులుగుర్తించి,తగిన చర్యలు తీసుకోవాల్సిఉంది. దాంట్లో భాగంగా గ్రామాల్లో మహిళా సార్ధకతకోసం మహిళలసభ, బాలల పరిరక్షణ కోసం బాలలసభ, గ్రామంలోఉన్న వనరుల పరిరక్షణ (అడవి,నీరు,భూమి) వంటి వాటిని పర్యవేక్షించే కమిటీలు,గ్రామాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నియంత్రించేందుకు శాంతియుత`న్యాయ కమిటీలు,గ్రామానికి నిధులు సమీకరణ,సంస్కృతి,సంప్రాదాయాలు పరిరక్షించే పద్దతులపైగ్రామసభల ద్వారా కమిటీలను నియమించి పర్యవేక్షించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి గ్రామంలో గ్రామసభకు పరిపాలనాధికారం,నియంత్రణపట్ల ఆజమాయిషీ అధికారం కలిగి ఉంటాయి.చిన్నచిన్నఖనిజాలపై గ్రామసభ పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది.
ఇలాంటి శుభపరిణంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,పీసాచట్టం గ్రామసభ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆనాడు ఐఏఎస్‌ అధికారులు బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీఫ్‌సింగ్‌ భూరియా స్పూర్తి,వారి ఆశయాలు,లక్ష్యాలను నేడు ఛత్తీషఘఢ్‌ ప్రభుత్వం నెరవేర్చడానికి కృషి చేయడం అభినందనీయం. పీసాచట్టంగ్రామసభలకు విశేషాధికారాలు అప్పగించడం ద్వారానే ఆదివాసీలకు సుపరిపాలన అందివ్వగలమనే వారి ఆశయం నిజం కాబోతుంది. చత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన నిర్ణయాలతో క్షేత్రస్థాయి ఆదివాసీ సమాజంలో గ్రామస్వరాజ్యం సాధించబడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

పీసా చట్టానికి 25 ఏళ్లు

మహోన్నత లక్ష్యఆలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం (పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల,అటవీ హక్కుల కల్పన,మౌళిక వసతుల అభివృద్ధి తద తర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టంస్పూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్ధం చేసు కోలేకపాయాయనే చెప్పాలి.పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతోపాటు,వారి మద్దతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవ రణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని(పంచాయితీరాజ్‌ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం)ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు.

Read more

పర్యావరణానికి ప్రాణాధారం కాప్‌-26

భూమిపై జీవజాలం ఉనికికి ప్రమాదకారిగా మారిన వాతావరణమార్పులపై ప్రపంచదేశాలు మరోసారి దృష్టి సారించాయి. స్కాట్‌లాండ్‌ గ్లాస్గో నగరంలో కాన్ఫిరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌26) సదస్సు ఈ ఏడాది నవంబరులో జరిగింది. పన్నెండు రోజుల (నవంబర్‌ 1నుంచి 12తేదీల మధ్య ) పాటు జరిగిన సదస్సులో 197 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిఏటా197దేశాల నుంచి 25వేల మంది ప్రతినిధులు హజరయ్యారు.వాతావరణమార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవకార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమేలక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా,ఈ ఏడాది జరిగింది26వది.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ పెరుగుతున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈసమ్మిట్‌లో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలుసరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు. పెట్రోలు,డీజిల్‌,బొగ్గు వంటి శిలాజఇంధనాలను మండిరచడంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది.వాతావరణ మార్పులతో ముడిపడిన తీవ్ర వడగాల్పులు,వరదలు,కార్చిచ్చు వంటి విఫత్తుల తీవ్రత పెరుగుతోంది.గడిచిన దశాబ్దం..అత్యంత ఉష్ణమయంగా రికార్డులకెక్కింది.ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్న నిపుణుల అభిప్రాయానికి ప్రపంచ నేతలు హజరయ్యారు. కాఫ్‌26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేకమైనది.సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది.

Read more

అటవీ చట్టం సవరణల వెనక మర్మమేమిటీ?

గత ముప్పై సంవత్సరాలక్రితం దేశంలో నూతనఆర్ధిక విధానాన్ని ప్రవేశ పెట్టారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోషలిస్టు విధానం అమలు పర్చారు. అటు కమ్యూనిస్టులు కాదు..ఇటు కాపిలిస్టులు కాదు..మిశ్రమ ఆర్ధిక విధానాన్ని మన దేశం ఎంచుకోవడం జరిగింది.రాజకీయ విధానంలో బహుళజాతి ప్రాజెక్టులు అనగా స్టీల్‌ ప్లాంట్‌,పవర్‌ ప్రాజెక్టులు,వంతెనల నిర్మాణాలు వంటి దేశంలో ఉన్న ప్రభుత్వరంగసంస్థలపై ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతోంది. వీటిపై లాభం రావడం సమయం పడుతోంది. ఈలోగా లాభంవచ్చేటప్పటికీ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. 2001లోప్రభుత్వ రంగ సంస్థ బాల్కో,వేదాంత వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడ నుంచి పరిశీలిస్తే అన్నీ ప్రైవేటీకీకరణ అయిపోతూనే ఉన్నాయి. ఆఖరికి విశాఖ స్టీల్‌ఫ్లాంట్‌,ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ అన్నీ అమ్ముడైపోతున్నాయి. గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో అటవీ అభి వృద్ధిపేరుతో రకరకాల పథకాలు,కార్యాచరణ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇవన్నీ నూతన ఆర్థిక విధానాలతో ముడిపడి ఉన్నాయి.ప్రజా ప్రయోజనాల పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగకంపెనీల మైన్లను,భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. Read more

1 2 3 4