విఫత్తుల సమయం అప్ర‌మ‌త్తం అవశ్యం


ఈనేపథ్యంలో ఇటీవల సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లలో భారీ నష్టానికి గురిచేసింది.నాటి1990తుఫాన్లు మాదిరిగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. తెలుగు రాష్ట్రాలకు ఎప్పఉడు తుఫాన్లు వచ్చినా కేంద్రప్రభుత్వం సకాలంలో ఆదుకోవడం ప్రశంసనీయం. దేశంలో అధిక విపత్తుకు గుర య్యే ప్రాంతలు హిమాలయ ప్రాంతాలు,ఒండ్రుమైదానాలు,తీరప్రాంతాలు,ఎడారి ప్రాంతం.ప్రస్తుతం తీరప్రాంతాల్లో సంభవించే తుఫాన్లు,గాలివానలు ఎక్కవగా ఉన్నాయి. దక్షిణ ఒడిశా,ఉత్తర ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో తుఫాన్లు పరిస్థితులు పరిశీలిస్తే 19902021వరకు ప్రమాదకరమైన14తుఫాన్లు సంభవించాయి.20112021 మధ్యలో మూడు భయం కరమైన తుఫాన్లు ప్రజలు ఎదుర్కొన్నారు. ఇవీ పర్యావరణం,సమాజం,సామాన్యప్రజలకు ఆర్ధికంగా అధిక నష్టం కలిగించాయి.సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి ఏర్పడిరది. ఈప్రకృతి వైపరీత్యాలవల్ల అధిక మొత్తంలో ఆస్తి,ప్రాణ నష్టాలు జరిగాయి. గతనెలాఖరున సంభవించిన గులాబ్‌ తుఫాను బీభత్సం తెలిసిందే. ప్రజలకు హానికలిగే పరిస్థితి ఉన్నప్పుడు,వైపరీత్యాలను ఎదుర్కొనే ముందుస్తు సమర్ధచర్యలు లేనప్పుడు విఫత్తు తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ గులాబ్‌ తుఫాన్‌ ప్రభుత్వం,ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో ఆదుకోని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం.


ప్రపంచవ్యాప్తంగా వరదలకారణంగా మరణిస్తున్నవారిలో 20శాతం భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముంపునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే.ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదులు సంభవిస్తున్నాయి.తెలుగు రాష్ట్రా ల్లో గోదావరి,కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో నాగావళి,వంశధార నదులు,దక్షిణాంధ్రలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి.2009లో కృష్ణానది వచ్చిన వరదలవల్ల మహాబూబ్‌నగర్‌,కర్నూలు,నల్గోండ, కృష్ణా,గుంటూరుజిల్లాలకు అపారనష్టం వాటిల్లింది. 2005లో ముంబాయిలో ఒకేరోజు10సెంటీమీర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదులు ముంచెత్తాయి. అలాగే2014లో సంభవించిన హూదూద్‌ తుఫాన్‌ కారణంగా విశాఖనగరం అతలాకుతలమైంది. ఆస్తి నష్టం,ప్రాణనష్టం సంభవించింది. దేశంలో వరద ఉధృక్తిని తెలుసుకోవడానికి శాటిలైట్‌,రిమోట్‌ సెన్సఇంగ్‌ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు,వరద నియంత్రణశాఖ లేదా జలవనరులశాఖ జారీచేస్తాయి. సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్దంగాఉండాలి. అప్పుడే అవి విఫత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటానవంబరు,డిశంబరు నెలల్లో తుఫాన్లు,భారీవర్షాలు సంభవిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందుస్తు జాగ్రత్త చర్యలతో ప్రజలకు ప్రాణ,ఆస్తినష్టం కలుగకుండా నియంత్రిస్తోంది. వాతావరణశాఖ సూచన జారీచేసిన నేపథ్యంలో విపత్తుల నియంత్రణ అధికారులు,రక్షణశాఖ,రెవెన్యూ అధికారయంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ముంపునకు గురయ్యే ప్రాంతవాలసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,తుఫాన్లు షెల్టర్లు ఏర్పాటు,పునరావాస కేంద్రాలకుతరలించి వారికి నిత్యావసర వస్తువులు,ఆహారం,వైద్య సదుపాయాలు కల్పించే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ముందుడటం విశేషం.అయితే ఇలాంటి విఫత్తులు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోవడానికి యువతకు శిక్షణలు ఇవ్వాలి.స్వచ్చంధ సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి తోడ్పడాలి. లోతట్టు ప్రాంతవాసులకు కూడా అవగాహన కల్పించి అక్కడ యువతకు శిక్షణ ఇవ్వాలి. పర్యావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి.- ర‌వి రెబ్బా ప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌- థింసా

పగడ్బందీగా పీసా చట్టం

ఐదో షెడ్యూలు ప్రాంత పరిరక్షణకు ప్రాముఖ్యమైన పీసా చట్టం1996(పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా) వచ్చి ఈ ఏడాది డిసెంబరు నాటికి 25 వసంతాలు పూర్తికానున్నాయి. చట్టం రావడానికి ఎంతో మంది మేథావులు,ప్రజల ఉద్యమం ఫలితంగా పీసా చట్టాన్ని సాధించారు. ముఖ్యంగా ఐఏఎస్‌ ఉన్నతాధికారులైన బి.డి.శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌,దిలీఫ్‌ సింగ్‌ భూరియా,ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. దీన్నీ రెండు భాగాలు చేశారు.1) పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా(పీసా)2) మున్సిపల్‌ పీసా విస్తరణ షెడ్యూల్‌ ఏరియా(మీసా) చట్టాలుగా రూపొందించారు.

Read more

మైనింగ్‌ వద్దూ…రాజ్యాంగ చట్టాలే ముద్దు!

దేశానికి స్వాతంత్య్రంవచ్చి 74సంవత్సరాలు అవు తోంది. ఇన్నేళ్లుయినా ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల స్థితిగ తులు మారలేదు. సంస్కృతి,కట్లుబాట్లు,సాంప్రదాయాలు అన్నీ అంతరించి పోతున్నాయి. అభివృద్ధిపేరుతో గిరిజన ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు,డ్యామ్‌లు,రోడ్లువిస్తరణ,మైనింగ్‌ వంటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా గిరిజనులు వారి భూములను కోల్పోతూ మరింత నష్టపోతున్నారు. అభివృద్ధింటే ప్రజల్ని భాగ స్వాములను చేయాలి. కానీఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అది జరగడంలేదు. ప్రభుత్వం వారి మనోభావాలను పక్కన పెట్టి గిరిజనుల వనరులు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది.

Read more

వలస కార్మికులకు సామాజిక వంటశాలలు

నేను చిన్నప్పుడు చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పేవారు. భారత దేశంవ్యవసాయరంగ దేశమని,ఇందులో80శాతం ప్రజలు గ్రామీణులు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అనేవారు. ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడేవారు మాత్రం20శాతం మంది మాత్రమే. కరోనాతొలివేవ్‌ ఉధృతమైన 2020మార్చి,ఏప్రిల్‌ నెలల్లో,2021 ఏప్రిల్‌ నుంచిసెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. ప్రస్తుతం కోవిడ్‌19వచ్చిన తర్వాత దేశమంతా వలస కార్మికులపైనే జీవనం సాగుతోంది. ముఖ్యంగా దేశంలో అభివృద్ధి జరుగుతున్నతీరు, అది అమలవుతున్న పరిస్థితులు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలసకార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందులో పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా సరిjైున విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటులేదు.భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈసమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృతస్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది.ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిమూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం వలస కార్మికులవెతలపై జోక్యం చేసుకోవడం అనివార్యమైంది. వలస కార్మికుల ఆకలి కేకలు,కష్టాలనుదృష్టిలో ఉంచుకొని ఢల్లీికి చెందిన బంధువ్‌ ముక్తి మూర్చ అనే సంస్థ 2020లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గానే జోక్యం చేసుకొని,కేంద్రప్రభుత్వానికి 26.5.2020న మొదటసారి నోటీసులు ఇచ్చింది. తర్వాత రెండువసారి 28.5.2020న మరో నోటీస్‌ పంపింది. వీటికి స్పందించక పోవడంతో ఆఖరిగా 9.6.2020న ఎనిమిది రకాల ఆదేశాలతో ఘాటుగా మూడోవసారి నోటీసు జారీ చేసింది. వలస కార్మికుల చట్టం1979,ఇంటర్‌ స్టేట్‌ మైగ్రేషన్‌ వర్కుమెన్‌ యాక్ట్‌1997, కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యాక్ట్‌1996,ఆర్గనైజడ్‌ వర్కుర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ యాక్ట్‌`2008 వంటి చట్టాలను పరిగణనలోకి వలసకార్మికులకు అను గుణంగా వారి సంరక్షణపై జూన్‌ 29న తీర్పు నిచ్చింది. Read more

వాక్సిన్‌పై అవగాహన

కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే,వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు రాజ్యమేలుతున్నాయి. కొంత మంది ఫేక్‌ప్రచారం వల్ల ప్రజలు వాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో కరోనా కట్టడికి, ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారింది. అందువల్ల, గ్రామీణ ప్రాంతప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. తాజాగా,తమిళనాడుకు చెందిన ఒకయువకుడు తన గ్రామప్రజలకు వాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఒక బహుమతి ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. కల్లకూరిచి జిల్లాలోని ఉలుందూర్పేట గ్రామానికి చెందిన ఆర్‌. తంబిదురై అనే స్టూడియో ఫోటోగ్రాఫర్‌,సామాజిక కార్యకర్త ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు తన గ్రామానికి రాగా.. ప్రజల్లో అవగాహన లేక ఎవరూ వాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన తంబిదురై తన గ్రామ ప్రజలను వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రోత్సహించాలనుకున్నాడు. వెంటనే తంబిదురైకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఫ్రీగిఫ్ట్‌ స్కీమ్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫ్రీ గిఫ్ట్‌లు కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసుకున్న చొరవ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది.

ఈకార్యక్రమంపై తంబిదురై మాట్లాడుతూ‘‘కోవిడ్‌-19సెకండ్‌ వేవ్‌ విజృంభనతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మా గ్రామానికి సమీపంలో టీకా డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కానీ గ్రామస్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల వాక్సిన్‌ తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టీకాలు తీసుకున్న వారికి వంట పాత్రలు వంటి బహుమతులను అందజేస్తున్నా. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నాడు. ఫ్రీగిఫ్ట్‌లు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీకా తీసుకొని నా నుండి బహుమతి వస్తువులను అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

యువకున్ని ప్రశంసిస్తున్న గ్రామస్థులు..
కాగా,మొదటి రోజుటీకా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, రెండో రోజు మాత్రం తంబిదురై చొరవతో 94మందికి టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.తంబిదురై అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున గ్రామస్థులు,వైద్యులు, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌, స్వచ్చంద సంస్థలు ఆయన్ను ప్రశంసించారు.కోవిడ్‌-19పై పోరాటంలో యువతది చాలా కీలక పాత్ర. ప్రజల్లో ఉన్న అపోహలు,అనుమానాలు తొలగించి వారిని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

సెకండ్‌వేవ్‌..పెద్ద పీడకల

తొలిదశ కరోనాలో తీసుకున్నంత ముందుస్తు జాగ్రత్తలు,సెకండ్‌వేవ్‌లో తీసుకోకపోవడంవల్ల ఎందరో కుటుంబాల్లో ఆత్మీ యులు,బంధువులు,అభాగ్యుల ప్రాణాలు విడిచారు. నిజానికి ఒక యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం.ఆస్పత్రికి వచ్చే కేసులన్నీ సీరియస్‌ కేటగిరీలే…అంతా ఆక్సిజన్‌తో అంబులెన్సుల్లో వచ్చేవారే. పడకలన్నీ ఫుల్‌.. బయట అంబులెన్సుల వరస..ఎన్నో ఒత్తిళ్లు.. మరెన్నో నిద్రలేని రాత్రులు ప్రజలు గడిపారు. ఇలా కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఒక పెద్ద పీడకల లాంటిది. ఫస్ట్‌వేవ్‌లో కేసులు తగ్గిపోవడంతో.. దేశ ప్రజలంతా తప్పట్లు కొట్టి పంపిస్తూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్‌వేవ్‌ పంజా విసిరింది.ఫస్ట్‌వేవ్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ అవసరం ఉండే రోగుల సంఖ్య తక్కువ. మైల్డ్‌,మోడరేట్‌ కేసులే ఎక్కువగా వచ్చేవి. అలాంటి వారికి నిర్ణీత సమయంలో చికిత్స అందిస్తే కోలుకునేవారు. సెకండ్‌వేవ్‌లో వచ్చేవారంతా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ రోగులే అధికమయ్యారు. విశాలమైన భారత దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచాలి. సెకెండ్‌ వేవ్‌లో ప్రభుత్వాలు ముందుస్తు ప్రణాళికలు, హెచ్చరికలు చేయక పోవడం వల్ల కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది.

మన దేశంలో ప్రజా ఆరోగ్యవ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఆరోగ్య సంరక్షణ అనేది దేశంలో ముఖ్య విభాగం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చందుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కేవలం వ్యాధి నివారణ,పరీక్షలు,చికిత్సలకే కాదు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలి.కానీ సెకెండ్‌వేవ్‌ కరోనా వ్యవహారంలో ప్రభుత్వాలు తగిన సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించలేక పోవడం వల్లే అధికంగా ప్రాణనష్టానకి గురయ్యాం. భారత దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లు విదేశాలకు ధారదత్తం చేశాం. ప్రమాదఘటికలు మన దేశానికి సంబంధించినప్పడు వాక్సిన్లు పూర్తిస్థాయిలో దేశ ప్రజలకు వేయించలేని దుస్థితి దాపురించింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో తీసుకున్న డబ్బునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఖర్చు చేస్తుంది. ముందుస్తు ప్రణాళికలు లేక పోవడం,వ్యాక్సినేషన్‌ క్షేత్రస్థాయిలో వేయక పోవడం వల్ల కరోనా సెకెండ్‌ వేవ్‌ విస్తరించింది. పైకి మాత్రం ప్రభుత్వాలు కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్రమే చెబుతోంది. కానీ,విధాన నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో వినడంగానీ,తెలుసుకోవడంగానీ చేయక పోవడం బాధాకరం.కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తాత్కాలికంగా, రోజువారీ పోరాటం కుదరదని.. స్పష్టమైన విధానం ఉండాలని స్పష్టం చేసింది. గ్రామీణ భారతంలో పరిస్థితి డిజిటల్‌ ఇండియా నినాదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జార్ఖండ్‌లో నిరక్షరాస్యుడైన ఓ కూలీ.. రాజస్థాన్‌లో టీకా వేయించుకోవడానికి ఎలా రిజిస్టర్‌ చేయించుకోగలడు? దేశంలో ఏం జరుగుతోందో, క్షేత్ర స్థాయి పరిస్థితేంటో ప్రభుత్వం తెలుసుకోవాలి. తదనుగుణంగా విధానం మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించింది.’

అజాగ్రత్త వద్దు

కరోనాపై ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగాలి. వ్యాక్సిన్లు వచ్చాయన్న ధైర్యం కావొచ్చు.. మన దాకా వైరస్‌? రాదన్న ఓవర్‌? కాన్ఫిడెన్స్‌? కావొచ్చు..చాలా మంది మాస్కులే పెట్టుకోవట్లేదు. భూతిక దూరాన్ని పాటించట్లేదు. కరోనా వ్యాక్సిన్లు వచ్చినా ఇప్పుడే అందరికీ అందవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరిదాకా అది చేరాలంటే ఇంకో ఏడాదైనా పట్టొచ్చు. అప్పటిదాకా కరోనాను ఎదుర్కొనే మందు, ఆయుధాలు మాస్క్‌?, సోషల్‌? డిస్టెన్స్‌?లే. ఈ బేసిక్‌? కరోనా రూల్స్‌?పై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్‌? వేవ్‌? జోరుమీదుంది. కాబట్టి అంతా మాస్క్‌? పెట్టుకుంటూ, కనీస దూరం పాటిస్తేనే మనల్ని మనం కాపాడుకోగలమని నిపుణులు చెప్తున్నారు. చివరిగా..శానిటైజర్‌? లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం కూడా మరచిపోవద్దు! ప్రభుత్వాలు కూడా కేవలం వీటిపైనే కాకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలపై దృష్టి సారించాలి. వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులపట్ల రైతులకు అవగాహన కల్పించాలి. అదే విధంగా నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

విలీనం చట్ట విరుద్దం..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవకాంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీస్‌ (వీఎంఆర్‌డీఏ)పరిధిని విస్తరించి విశాఖ జిల్లాలోని13మండలాను విలీనం చేసుకుంది. దీంట్లో షెడ్యూల్డ్ ప్రాంతం నాతవరం మండంలోని చమ్మచింత, ధర్మవరం అగ్రహరం,కవవోడ్డు శరభవరం(కె.విశరభవరం,కురువాడ,పొట్టి నాగన్నదొరపాలెం(పీఎన్‌డీ పాలెం),సరుగుడు వంటి ఆరు షెడ్యూల్డ్‌ గ్రామాను వీఎంఆర్‌డీఏలో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామాను మినహాయించాన్నది ప్రభుత్వ ఉద్దేశం అనిపించినప్పటికీ, ఈ ఆరుగ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోవడం చట్టబద్దత కాదు. వీఎంఆర్‌డీఏలో విలీనమైన ఈగ్రామాకు గిరిజనుల‌కు వరమైన షెడ్యూల్‌ ప్రాంత పంచాయితీరాజ్‌ విస్తరణ చట్టం(పీసా),గిరిజనుకు అండగా నిలిచి సుస్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్న అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)వంటి రెండు చట్టాు వర్తిస్తాయి.
పీసా చట్టం గిరిజన ప్రాంత ప్రజ ఆచారసాంప్రదాయాలు,సంస్కృతి,ఉనికి,వనరుల‌ను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడుతూ వారిఅభివృద్ధికి బాట వేస్తోంది. గ్రామస్థాయిలోజరిగే సామాజిక,ఆర్ధికాభివృద్ధి పథకాు,ప్రణాళిక అముకు ఈచట్టం గ్రామసభ ముందస్తు అనుమతులిస్తూ ప్రత్యేక అధికారాలు ఇస్తోంది. తరతరాల‌గా అటవీభూము సేద్యంచేసుకుంటూజీవిస్తున్నా, వాటిపై వారికి హక్కు కల్పిస్తూ వారికి సామాజిక హోదాపెరిగేందుకు,జీవవైవిధ్యం,అటవీసంరక్షణకు సంబంధించిన హక్కు అటవీ హక్కు చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)ద్వారా ల‌భిస్తోంది. గిరిజనుకు ఆహార భద్రతను కూడా ఈచట్టం కల్పిస్తోంది. అందువ్ల షెడ్యూల్డ్‌ ఏరియాలోఉన్న ఆరు గ్రామాను వీఎంఆర్‌డీఏ పరిధిలోకి విలీనం చేయడం చట్టవిరుద్దం.అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్ఈ ఉల్లంఘ‌న‌. పీసా చట్టా ప్రకారం గిరిజిన ప్రాంతాల్లో గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహిస్తారు.మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మందిఎస్టీ సభ్యుహాజరైతేనే కోరంగాపరిగణిస్తారు.గ్రామసభల్లో వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికు,ఉమ్మడి భూముజాబితా,ఇంటి స్థిరాస్తు యాజమాన్యా బదలాయింపు,పంచాయతీ లెక్క ఆడిట్‌ నివేధికు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకొని తీర్మాణాు చేసుకుంటారు.షెడ్యూల్డ్‌ ప్రాంత గ్రామసభఅధికారాన్ని విఎంఆర్‌డీఏ వంటిసంస్థ జోక్యం చేసుకునే విధానం రాజ్యాంగానికే విరుద్దం.ఇది గిరిజనల‌కు రాజ్యాంగహక్కు కోల్పోయే ప్రమాదంఉంది.గిరిజన గ్రామసభకు, వీఎంఆర్‌డీఏ నిర్ణయాకు చాలా తేడాలుంటాయి. అందువ‌ల్ల‌ ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన చట్టాల‌కు పూర్తి విరుద్దం.పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243జెడ్ఈ యొక్క వర్తమానానికి సంబంధించినంతవరకు, ఏపీ హైకోర్టు తీర్పు మరియు ఇతర హైకోర్టు తీర్పు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో, పైనపేర్కొన్న ఆరు గ్రామాను మరియు తప్పుగా చేర్చబడిన ఇతర షెడ్యూల్డ్‌ గ్రామాను మినహాయించటానికి 23-3-2021నాటి జీవోల‌ సంఖ్య 20ను వెంటనే ఉపసంహరించుకోవాని ఆదివాసీలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గిరిజను ఎక్కువగా నివసించే అనేక ఇతర గ్రామాు ఉన్నాయి.
జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాతో సమానంగాఉన్న 800గ్రామాను ప్రతిపాదించింది. ఐదవ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీచేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1986లో చాలా కాలం క్రితం కేంద్రానికి ప్రతిపాదను సమర్పించింది. ఆ ప్రతిపాదను ప్రాసెసింగ్‌ అధునాతన దశలో ఉన్నాయి. 23-3-2021నాటి జీవోల‌సంఖ్య 20కిందికు షెడ్యూల్డ్‌ ప్రాంతాకు సమానంగా ఉండే చీడికాడ మండలం (ఒకగ్రామం),గోలుగొండ మండలం(8గ్రామాలు),మాడుగుల‌ మండలం (21గ్రామాలు),నాతవరం మండలం (2గ్రామాలు)రావికమతంమండలం (3గ్రామాు),రోలుగుంట మండలం (8గ్రామాలు),దేవరపల్లి మండలం (12గ్రామాలు),అనంతగిరి మండంలో (36 గ్రామాలు) ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భాగంగా ఇటువంటి గ్రామాల‌ను తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉన్నందున,విఎంఆర్‌డీఏ పరిధిలో కూడా వీటిని చేర్చడం అవివేకం అని ఆదివాసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో గ్రామసభ అధికారంపై తాజా జీవోల‌20న చేర్చినవాటిని పరిగణనలోకి తీసుకుంటే,పెసా మరియు ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనను ఉ్లంఘించినట్లు అవుతుంది.దీనిపై ప్రభుత్వం పుణరాలోచన చేయాల్సిన అవశ్యకత ఉంది!. వీఎంఆర్‌డీఏలో విలీనం చేసిన జాబితాలో షెడ్యూల్డ్‌ ప్రాంతానికి చెందిన ఆరుగ్రామాను తొల‌గించాని గిరిజను డిమాండ్‌ చేస్తున్నారు. గిరిజన సమూహం నుంచి ప్రభుత్వానికి గిరిజన ఉద్యమేసెగ తగకముందే నాటి జీవో సంఖ్య20ను ఉపసంహరించుకోవాలి!
-ఎడిటర్‌ రెబ్బాప్రగడ రవి

దేశాన్ని కదలించిన ‘టూల్‌కిట్స్‌’

సాధారణంగా టూల్‌కిట్స్‌ అంటే పరిభాషలో పనిముట్లు,పరికరాల‌ అంటారు. సాంకేతిక విద్యారంగంలో విద్యను నేర్చుకోవడానికి పరికరాల‌ను ఉపయోగిస్తారు.ఈ టూల్‌కిట్స్‌ అనే పదం ప్రస్తుతం దేశాన్ని గత కొద్దిరోజుగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత ఉద్యమానికి సంబంధించిన టూల్‌కిట్‌ను పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటాథన్‌బర్గ్‌కు దిశరవి పంపించారనే అభియోగంపై ఓయువపర్యావరణ కార్యకర్త దిశ రవిని దేశద్రోహిగా, అంతర్జాతీయ కుట్రదారుగా పరిగణించి ఢల్లీిపోలీసు వచ్చి అకస్మా త్తుగా అరెస్టుచేయడాన్ని యావత్‌ప్రపంచం విస్తుపోయేట్టు చేస్తున్నది. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. అరెస్టుచేసే ముందు సమగ్రమైన సమాచారంగానీ, విచారణగానీ చేయకుండా అతిఉత్సహంతో ఎందుకు అరెస్టు చేశారనేది ప్రధానాంశం. గ్రేటామద్దతుతో నడిచే ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఇండియా’కు దిశ బెంగుళూరులో వ్యవస్థాపక సభ్యురాలు. వృక్షజాతుతో పాఉత్పత్తు తయారుచేసే స్టార్టప్‌ కంపెనీలో ఈమె పనిచేస్తున్నది. ఒకవేళ ఏదైనాతప్పు చేశారనిపిస్తే ఆమెను ముందు పోలీస్‌ స్టేషన్‌లో విచారించాలి. నేరుగా దిల్లీకోర్టులో హాజరు పరచడానికి ఎందుకు తీసుకెళ్లారు? టెక్నాజీ గురించి సరైన అవగాహన లేక పోవడంవన ఈవిషయంలో గందరగోళం తలెత్తిందనిపిస్తోంది. సామాజిక కార్యకర్త నోరును ఎందుకు నొక్కేయాని ప్రయత్నిస్తున్నారో ఒకసారి భారత ప్రభుత్వం ఆలోచించాలి. ఇదిచాలావిచారకరం.నిరాశ నిస్పృహను కలిగిస్తోంది. చెట్లను,పర్యావరణాన్ని కాపాడానుకునే ప్లిను దేశద్రోహలుగా చిత్రీకరించి భయపెట్టించడం సరికాదు. ఇందుకోసం ‘టూల్‌కిట్‌’ కుట్ర సిద్ధాంతాన్ని కేంద్రం రంగంలోకి తెచ్చింది. ఉద్యమ కార్యకర్తను భయబ్రాంతుకు గురిచేసేందుకే కేంద్రం ఇలాంటి దుశ్చర్యకు ప్పాడుతున్నట్టు దిశరవి ఘటనే తార్కాణం. చట్టాన్ని అముపరిచేవారు చట్టబద్దంగా వ్యవహరిస్తున్నారా?లేదా అనేది పునరాలోచనుచేసుకోవాలి. నిజాయితీపరులైన ఉద్యమకారుపై అభాండాు వేయడం,వేదించడం,శిక్షించడం,పూర్వ కాం నుంచీ జరుగుతున్నదే. ఈచీకటి కోణాు తొసుకున్నకొద్దీ మెగు ప్రస్థానంవైపుకే మానవుడు ప్రయాణిస్తాడు. ఉద్యమంకూడా ఆ‘దిశ’గానే ప్రవహిస్తుంది.అదే దశలో దిశరవి ఘటనలో న్యాయమే గెలిచింది అనడంలో అతిశయోక్తికాదు.
దిశ రవికి బెయిల్‌ మంజూరు చేసిన ఢల్లీి కోర్టు :
టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశరవికి ఢల్లీి కోర్టులో ఊరటభించింది. ఢల్లీి అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా ఫిబ్రవరి 23న ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.క్షవ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరోఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల‌ చేయాల‌ని ఆదేశించారు. ఆమెకుబెయిల్‌ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతనసాగు చట్టాపై ఆందోళను నిర్వహిస్తోన్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాద్వారా టూల్‌కిట్‌ను షేర్‌ చేసినట్టు దశరవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్థాన్‌ అనుకూ సంస్థ ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ఆమెకు ప్రత్యక్ష సంబం ధాలు ఉన్నట్టు నిరూపించే ఆధారాను పోలీసు సమర్పించలేకపోయారనికోర్టు పేర్కొంది. వేర్పాటువాద ఆలోచనతో ఆమెకు సంబంధంఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని తెలిపింది. గతంలోఎటువంటి నేరచరిత్రలేని యువతికి అరకొర ఆధారాను పరిగణనలో తీసుకుని బెయిల్‌ నిరాక రించడానికి ఎటువంటి ప్రాతిపదిక కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. సమాజంలోబమైనమూలాలున్న ఆమెను నిర్బంధించి జైల్లో పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది. టూల్‌కిట్‌ గురించి పోలీసు చెబుతున్నాదానిని ఉపయోగించి ఆమెహింసను ప్రోత్సహించినట్టు ఎక్కడా కనిపించలేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వతీరుపై పౌరు నిరంతర పరిశీన ఉంటుందనేది నానిశ్చిత అభిప్రాయమని, కేవలం విధానాతో విభేదించాన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని జైల్లో ఉంచడం తగదని హితవు పలికారు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంతమాత్రానదానికి మందుగా దేశద్రోహి అభియోగం మోపడం సమంజసంకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభేదించడం,భిన్నాభిప్రాయంఉండడం,అసమ్మతి తెప డం,ఆక్షేపించడం అనేవి రాజ్యవిధానాల్లో వాస్తవికతను తెలియచేసే చట్టబద్ధసాధనాని వ్యాఖ్యానించారు. వివేకవంతులైన, విడమరిచి చెప్పగ పౌయి ఉండడం ఆరోగ్యకర,దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేదినిర్వివాదాంశమని పేర్కొ న్నారు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులోఉన్న ఉత్తమసాధానాను వినియోగించుకునే హక్కుపౌరుకు ఉందనిస్పష్టంచేశారు. వాట్సప్‌గ్రూపును ఏర్పాటు చేయడం, అపాయకరంకాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గాఉండడం తప్పేమీకాదని కుండబద్దు కొట్టారు. విచారణకు దిశ సహకరించాల‌ని,దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరు కావాని సూచించిన కోర్టు..తమఅనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. బెయిల్‌మంజూరు కావడంతో దిశరవి తిహార్‌జైలు నుంచి విడుదయ్యారు. విభేదించేహక్కును రాజ్యాంగంలోని 19వఆర్టికల్‌ బంగా చాటుతోందని, కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవని జడ్జ్‌ తెలియజేయడం హర్షణీయం!

దేశ రైతును ఆదుకోవాలి!

కేంద్రం తీసుకొచ్చిన నూతనవ్యవసాయచట్టాకు వ్యతిరేకంగా రైతు కొన్నిరోజుగా పోరాటంచేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హార్యానా,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాకుచెందిన రైతుతీవ్ర ఆందోళను చేస్తున్నారు. ఢల్లీిశివార్లలో రహదారును దిగ్భంధనంచేశారు. కొన్ని రోజుగా రోడ్లపైనేతిష్ట వేశారు. అక్కడేతిండి,అక్కడేనిద్ర. కొంతమంది తమ కుటుంబాతోపాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గోంటున్నారు. నిరసన తొతున్న వారిలో రైతు కుటుంబానికి చెందిన చిన్నాయి,మహిళు,వృద్ధుకూడా ఉన్నారు. కొత్త చట్టాు రైతుకు మేు చేస్తాయని కేంద్రప్రభుత్వం చెబుతుంది. ఈచట్టాతో రైతు ఆదాయం పెరిగి ఆర్ధికంగా బపడుతారని హామి ఇస్తున్నారు. అన్నదాతకు ఎలాంటి హాని జరగదన భరోసా ఇస్తున్నారు. అయినారైతు తమఆందోళన విరమించడంలేదు. వారితోజరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. మూడు వ్యవసాయ చట్టాను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఈనేపథ్యంలో అసు ఆవ్యవసాయ చట్టాల్లో ఏముంది?రైతు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?అన్నదాతు చెబుతున్న అభ్యంతరాలేమిటి? తదితర అంశాు పరిశీలిద్దాం!
నూతన సంవత్సరం`2021లోకి ప్రవేశించినప్పటినుంచి దేశరాజధానిఢల్లీిలో తీవ్రమైన వ్యతిరేక వాతావరణం ఏర్పడిరది. మూడు వ్యవసాయ బ్లిుుపై రైతుల్లో ఎందుకు కోపం వచ్చిందంది..?వారికి జరిగేఅన్యాయాపై ఇప్పిటికే చర్చు జరుగుతున్నాయి. సామాజిక పరిశోధుకునిగా కాకుండా రైతు పండిరచే ఆహారం తింటున్న ఒకసామాన్యవ్యక్తిగా నాఅభిప్రాయం. దేశరాజధానిలో ఆందోళను చేపట్టే రైతుంంతా పనిలేకగాని,సోమరితనంతోగానిఆందోళను చేయడంలేదు. ఈచట్టాుద్వారా ఒప్పందసేద్యం బపడే ప్రమాదంఉంది. కార్పొరేట్‌ కంపెనీు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటసాగు చేయాని రైతుపై ఒత్తిడితీసుకొస్తాయి. అదే జరిగితే దేశంలోపంట వైవిధ్యం దెబ్బ తింటుంది. ఇప్పటికేపత్తి,సోయా లాంటి పంటు కార్పొరేట్‌సంస్థ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. రసాయనాు,యంత్రాు,శుద్ధి, కమొడిటీ ట్రేడిరగ్‌,సూపర్‌మార్కెట్ల నిర్వహణను బడాసంస్థలేనిర్వహిస్తున్నాయి. వీటినిజవాబుదారీ చేయడంకష్టం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాు కూడా వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యత ఇస్తాయి. వ్యవసాయానికి ప్రపంచ దేశ ప్రభుత్వాు అధికంగా నిధు సమకూరుస్తాయి. ఉదాహరణకు పారిస్‌ ఆధారిత ఇంటర్‌గవర్నమెంటల్‌ థింక్‌-ట్యాంక్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవప్‌మెంట్‌ (ఓఇసిడి) స్థూవ్యవసాయరంగంలో ఒకశాతం ఉత్పత్తిదారు మద్దతు కల్పిస్తోంది. జపాన్‌,దక్షిణ కొరియా,నార్వేమరియు ఐస్లాండ్‌ వంటి ధనికదేశాలోఉత్పత్తిదారు మద్దతుకు స్థూవ్యవసాయరంగానికి 40నుండి 60శాతం మధ్య రాయితీు ఇచ్చి రైతును ప్రొత్సాహిస్తోంది. యునైటెడ్‌ స్టేట్స్లో ఇదిసుమారు 12 శాతం మరియు యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)ఇది20శాతం రైతాంగానికి అందజేస్తున్నాయి.
మనదేశం వచ్చేసరికి ఉత్పత్తిదారు మద్దతు ధర,వ్యవసాయ పెట్టుబడు, ప్రభుత్వం చెల్లించేరాయితీు వాస్తవానికి ప్రతికూంగా ఉంటున్నాయి. అంటే మైనస్‌ ఐదు శాతం మాత్రమే రైతుకు ఇస్తోంది. మనం తినేతిండిగింజకు సబ్సిడీ ఇస్తుంది. అకాంగా సంభవించే వాతావరణమార్పు సమయంలో వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి ధనిక దేశాు సైతంముందుకు వస్తున్నాయి. ఈవిధంగా దాదాపు అన్ని పెద్ద ఆహారఉత్పత్తి దేశాు వారి సామాజిక మరియు పర్యావరణ సంక్షేమ చర్యలో భాగంగా రాయితీను కలిగి ఉన్నాయి. కానీ భారత రైతాంగ సబ్సిడీను విదేశాతో పోల్చితే చాలా తక్కువనేది గ్రహించాలి. రైతుకు ప్రత్యక్ష చెల్లింపుద్వారా లేదా కొన్ని పంటకు మద్దతు ధర ద్వారా అంటే నీరు,ఎరువు మరియు విత్తనాువంటికీకమైన వ్యవసాయ ఇన్పుట్లలో పెట్టుబడిద్వారా సబ్సిడీ ఇవ్వవచ్చు. కాని ఇవ్వడంలేదు.దేశంలో అధికశాతం రైతుతమ పంటగిట్టుబాటు, సాగునీటి వనయి రైతులే సొంతంగా సమకూర్చుకుంటున్నారు. అత్యాధిక రైతాంగరాష్ట్రాలైన పంజాబ,హర్యానావంటి రైతు తమ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందనందున వారువెనుకబడి ఉన్నారు. ఇక్కడ పంటకురాయితీు,పంటఉత్పత్తు తక్కువే. వాతావరణంలో తీవ్రమైన మార్పు చోటు చేసుకోవడం, విత్తనాుకొరత. అంతేకాకుండా ఒక్కో ఏడాది పంట ఉత్పుత్తు తగ్గినప్పుడు ధరు పెరుగుతున్నాయి. ఆసమయంలో రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం,ఇతర ప్రాంతానుంచి దిగుమతు చేసి ప్రభుత్వమే నేరుగా వినియోగదారు గుప్పెట్లో పెట్టేస్తోంది. ఫలితంగా రైతు వేకుమే పెట్టుబడిపెట్టి పండిరచిన ఉత్పత్తుకు ధర కోల్పోయి నష్టాల్లో కూరికిపోతున్నారు. దీంతో వ్యవసాయరంగానికి రైతు అప్పుచేసి వేలాదిరూపాయు పెట్టుబడుపెట్టినా పండిరచిన పంటకు గిట్టుబాటు ధరరాక,అప్పు తీరక ఆత్మహత్యకు ప్పాుడుతున్నారు. రైతు ఆత్మహత్యు ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే మనదేశంలోనే అధికం.ఈ పరిణామా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాను ఉపసం హరించుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

-ఎడిట‌ర్.రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

పర్యావరణానికి పెను సవాల్‌ మారుతున్న ప్లాస్టిక్‌

జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారిపోయింది. రోజూ అన్నిఅవసరా కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజువిపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. మన అవసరాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మర్చిపోతున్నా పరిస్థితి. ఒక ప్లాస్టిక్‌సంచి భూమిలోకవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. నేనుమొదట ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు శంకరగిరి మన్యంలో ఫ్లాస్టిక్‌ అనేదికన్పించేది కాదు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హాయంలో వారనీవాహినీ సారాఫ్యాకెట్లు ఉండేవి. గిరిజనగ్రామాకు వెళ్ళడానికి అడవిలో తిరిగే సమయంలో కాలిబాట తప్పితే…ఆ ఫ్యాకెట్లే దారిచూపించేవి. వీటిద్వారా గిరిజన గ్రామాకు వెళ్ళే దారిగుర్తిపట్టేవాళ్ళం. అనుమర్తి,ఓండ్రేగు,ఆవేల్తి వంటి అమాయక గిరిజన గ్రామస్థుకు తమభూమి రికార్డు,రేషన్‌కార్డు వంటిమివైన పత్రాు దాచుకోవడం తెలిసేదికాదు. ఆసమయంలో ఏదైనా ఫ్లాస్టిక్‌ కవరులో పెట్టిజాగ్రత్తగా దాచుకొండని సహా ఇచ్చేవాణ్ణి. ఆకాంలో కూడా ఫ్లాస్టిక్‌ అటవీ ప్రాంతాల్లో అంతగా కన్పించేది కాదు. కేవం వారనీవాహినీసారా ఫ్యాకెట్లు మాత్రమేకన్పించేవి. ఈ సారాఫ్యాకెట్లు ద్వారా గిరిజన ప్రాంతాకు ఫ్లాస్టిక్‌ ప్రవేశించింది. నేడు ఏగ్రామానికి వెళ్లిన బస్తాకు…బస్తాుగా కుప్పుకొది పడిఉంటున్నాయి. మంచినీటి వాడకాన్నితగ్గించి వాటర్‌ఫ్యాకెట్ల నీళ్లకుప్రాధాన్యమిస్తున్నారు.ఎక్కడ శుభకార్యాు జరిగినా బస్తాు ముఖ్యంగా ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకు ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది.
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకరంగం విస్తరించేకొద్దీ పర్యాటకు తీసుకొచ్చే ప్లాస్టిక్‌ విఫరీతంగా పెరిగిపోతుంది. వారపు సంతల్లో కూడా ఈ ప్లాస్టిక్‌ భూతం భయపెడుతోంది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతివల్లే భూవాతావరణం ధ్వంసమౌతోంది. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించేదృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాల్సిన అవశ్యకత ఉంది. మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెనుఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. ఈనేపధ్యంలో 2001లో సమత కొండ ఆరోగ్యమే ప్లపు ప్రాంతా సౌభాగ్యం! అనే నినాదంతో పాదయాత్ర చేపట్టింది. ప్లాస్టిక్‌ జీవజలాు,నదు,రిజర్వాయర్లులో తిష్టవేయడంవ్ల త్రాగు,సాగునీరంతా కుషితమతోందని అవగాహన చేపట్టడం జరిగింది.


ఏజెన్సీ ప్రాంతాకే కాకుండా కొండ దిగువన జీవిస్తున్న మైదాన ప్రాంతవాసు జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సముద్ర జలాు,ఉప్పు కుషితమవుతున్నాయి. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌గా అవతరించి పుట్టబోయే బిడ్డ కడుపులో ప్లాస్టిక్‌ పుట్టికొస్తోందని ఇటీవ ఆంగ్ల పత్రికు మెవరించాయి. మనంపీల్చే గాలి,తాగేనీరు,తినే ఆహారం ప్లాస్టిక్‌మయంగా మారిపోతుంది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీరాత్రి పడుకునే వరకు ఇంటా,బయటాఎన్నో అవసరాకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు,గ్లాసు, షాంపు, పాు, వంటనూనె ప్యాకెట్లు,తనూనె,ఔషధాడబ్బాు,ప్లి పాసీ సాు ఇలాప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమేమంటే ప్రజ ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచేసంచు,ఇంజక్షన్‌సీసాు,సిరంజిు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌సంచుల్లో ఆహారపదార్థాు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం,సీసంవంటి ధాతువు ఆహారంలో చేరి ప్రజ ఆనారోగ్యానికి కారణమవుతాయి. ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలాపర్యావరణ సమస్యు తలెత్తుతున్నాయి. ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహానికుగుతుంది. వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్యసమస్యలొస్తాయి. భారత్‌లోఏడాదికి 65క్షటన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత50ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5శాతం మాత్రమేరీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్షటన్ను ప్లాస్టిక్‌వ్యర్థాు సముద్రంలోకిచేరుతున్నాయి. 2030నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి 2050 నాటికి నాుగింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’సర్వే నివేదికుచెబుతున్నాయి. 2025నాటికి 1టన్ను సముద్రచేపకు 3టన్ను ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈసర్వే చెబుతున్నది. సముద్రజీవరాశుపై, మానవుశ్వాసకోశంపై, చర్మంపై ప్రతికూ ప్రభావాు చూపుతాయి. నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర మురుగు కామంటాయి. ఈకాువ చుట్టుపక్క నివాసంఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాను దీంట్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచు భారీస్థాయిలో పేరుకు పోయి కాుమ మూసుకుపోతున్నాయి.
మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడుతున్నారు. ఈ పద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు, పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాు, పెరుగును ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చుకుని పా ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత న్విచేసుకోవాలి.శాస్త్రీయ పద్దతిలో ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేయాలి.పర్యాటక రంగంగా విస్తరిస్తున్న ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు,పోవరంతదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయా గిరిజన పంచాయితీు పర్యాటకు ద్వారా విస్తరిస్తున్న ప్లాస్టిక్‌ నివారణకు తగు జాగ్రత్తు తీసుకోవాలి. ప్రతీ టూరిస్టు స్థలాల్లోను ప్లాస్టిక్‌ నివారణపైన, పర్యావరణ పరిరక్షణ కాపాడాంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి పర్యాటకును చైతన్యపరచాలి. ఇది నిరంతర ప్రక్రియగా తీసుకొంటే ప్లాస్టిక్‌ నివారణకే కాకుండా గిరిజన పల్లేు ఆకర్షణీయంతో ఆహ్లాదకరంగా అందంగా కన్పిస్తాయి. భవిష్యత్తు తరాకు స్పూర్తివంతంగా ఉంటుంది.-

1 2 3 4