ప్లాస్టిక్‌ రహితం..ఇంకెంత దూరం.?

దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నా మంటూ ప్రభుత్వాలు ప్రకటించటం..ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది.అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పుపొంచి ఉంటోంది. ఇలా నిత్య జీవన విధానం ఫాస్టిక్‌ మయంగా మారింది.రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.
మొన్నటి వరకు సముద్రాలు,నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడు కున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులువచ్చాయి. మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పాలల్లో దీని అవశేషాలున్నట్లు గుర్తించడం విశేషం. ప్లాస్టిక్‌,కాలుష్యం అధికమై వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మంచుకొండలు కరిగిపోయి సముద్రంనీటిమట్టం పెరిగిపోతుంది. అకాలతుఫాన్లు ప్రభావంతో యావత్తు ప్రపంచ దేశాలు అతాలకుతలమై పోతున్నాయి.
జశీఅటవతీవఅషవ శీట ్‌ష్ట్రవ ూaత్‌ీఱవం (కాన్ఫెరెన్స్‌ఆఫ్‌ ద పార్టీస్‌)దీనినే షార్ట్‌గా (కాఫ్‌) జూఅని పిలుస్తారు. ప్రతిఏటా197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది.వాతావరణ మార్పులు,దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.ఇలాంటి సదస్సలు ఇప్పటి వరకు 26 జరిగాయి. కాఫ్‌సదస్సుల్లో ఎన్నినిర్ణయాలు తీసుకున్నా ఏదేశం కూడా అమలు పర్చడంలో నిర్లక్ష్యవైఖరి అవలంబించడం శోచనీయం.
అంతర్జాతీయంగా మానవజాతిని అవహిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో బాన్‌ చేయాల్సిన అవసశ్యకత ఎంతైనా ఉంది.ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నమని ప్రగాల్బలు పలికే దేశాలు,రాష్ట్రాలు కేవలం ముక్కుబడిగానే అమలు చేస్తున్నాయి తప్పా కఠినమైన వైఖరిని అవలంబించడం లేదనే అందరికీ తెలిసిన విషయమే.ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంతో ప్లాస్టిక్‌ ముడిపిడి ఉంది.దీని నియంత్రణకు చట్టాలు,ప్రభుత్వాలున్నాయి.ఐక్య రాజ్య సమితి సైతం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.అయినా మానవ జాతిలో మార్పులురావడం లేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి,చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ,సముద్రాలు,చెరువులు,నదులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపో తున్నాయి. ఫలితంగా యావత్తు మానవ శిశువులతోపాటుగా,జంతువులు,పక్షులు,జలచరాలు,కీటకాలు అన్ని చనిపోతున్నాయి.ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం తూర్పు కనుమల్లో గిరిజన ప్రాంతాలు ప్రకృతి అందాలో ఆహ్లాదక రంగా ఉండేది. ప్రస్తుతం నేడుకొండకోనల్లోను ప్లాస్టిక్‌భూతం అవహించింది.రోజువారీ వాడి పారేసిన వస్తువులు,భూమిలో పూర్తిగా కరిగిపోవడం,పచ్చని పొలాలపై దీని ప్రభావం పడుతోంది. రైతులు పండిరచే పంటలు దిగుబడి తగ్గిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణపై పరిపాలనలో మార్పులు రావాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గాలంటే దీని తయారి పరిశ్రమలను శాశ్వతంగా నియంత్రించాలి. అందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన,కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పర్చాలి.అలాగే పంచాయితీ స్థాయిలో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపుదిద్దేలాచర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి మార్పును ప్రజలు సైతం స్వాగతించకపోతే,కాలుష్యం,ప్లాస్టిక్‌ మానవ జీవితాన్ని మరింతగా కృంగదీసి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్.