దేశ రక్షణ పోరాటంలో ఆదివాసీలు భాగం కావాలి

స్వాతంత్య్రానంతరం భారతదేశం నిర్మించుకున్న పరిశ్రమలు,ఆర్థిక సంస్థలైన ఇన్సూ రెన్స్‌, బ్యాంకులు, కోట్ల మంది ప్రయాణ సాధనమైన భారతీయ రైల్వేలు,పెట్రోలియం,గ్యాస్‌,విద్యుత్‌ ఇంధన సంస్థలు,విద్య,వైద్యంతో సహా సర్వమూ మోడీ ప్రభుత్వం దేశ,విదేశీ కార్పొరేట్లపరం చేస్తు న్నది. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన స్వదేశీ రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వరంగాల్ని అప్పగిస్తున్నది.వ్యవసాయ రంగా న్ని దేశ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టేం దుకు మూడు వ్యవసాయచట్టాలు చేసింది. కార్మి కులు, రైతులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు చేసింది. నిరసన తెలియజేసే హక్కు లేకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కంటే ప్రమాదకర‘ఉపా’ చట్టాలు చేసింది. ప్రజాస్వా మిక పునాదులపై దాడికి దిగింది. అమా యకులైన ఆదివాసీల పక్షాన నిస్వార్ధంగా నిలుస్తున్న హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తోంది. జీవిత మంతా గిరిజన హక్కుల కోసం పోరాడిన 80 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌స్వామిని జైల్లో పెట్టి చంపేసింది. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడంతో ‘భారత దేశాన్ని రక్షించండి’ అంటూ కార్మికులు, రైతులు ఆగస్టు 9న ప్రభుత్వ ఆఫీసుల దిగ్భ్రందించారు. ఏజెన్సీ లోని విలువైన గనులు, ఖనిజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేయని కుట్రల్లేవు. ఆ కుట్రలకు కళ్లెం వేసేందుకు, కార్పొరేట్‌ శక్తులు అడవిలో అడుగు మోపకుండా అడ్డుకొనేందుకు ఆదివాసీలూ దేశ రక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలి.
అటవీ సంపద కార్పొరేట్‌ పరం
ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్‌ రాని భయంకరమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతోంది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌, అస్సాం,హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజను లను జైల్లో నిర్బంధించాయి. జార్ఖండ్‌లో 10 వేల మంది గిరిజనులపై గతంలో రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేసింది. ఆదివాసీలను ఉద్దరిస్తామని గద్దెనెక్కి ద్రోహానికి పాల్పడుతున్న పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాలి. ఆది వాసీల హక్కులు దెబ్బ తీయబోమని, అటవీ సంప దను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ప్రకటించేలా ఆదివాసీలు గొంతు విన్పించాలి.
రిజర్వేషన్లు గల్లంతు
ఆదివాసీలకు, దళితులకు ఉద్యోగ భర్తీలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. మోడీ ప్రభు త్వం వారికిప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది. జింక్‌, బాల్కో పరిశ్రమలను వాజ్‌పేయి ప్రభుత్వం దెబ్బ తీసింది. విశాఖ స్టీలుప్లాంట్‌ సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మి తీరుతా మని మోడీ శపథం చేస్తున్నారు. 42 రక్షణ పరిశ్ర మలు అమ్మకానికి పెట్టారు. జీవిత బీమా(ఎల్‌ఐసి), జనరల్‌ ఇన్సూరెన్స్‌ రెండిరటినీ అంతం చేయ డానికి లోక్‌సభలో బిల్లుపెట్టారు. బ్యాంకులు కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తామని నిర్ణయం చేశారు. విద్యుత్‌ పంపిణీ కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చే చట్టం చేసింది. రైల్వేలో కొన్నిరూట్లు, కొన్ని స్టేషన్లు, రైల్‌ ఇంజన్లు, బోగీల నిర్మాణం ప్రైవేటుకు ఇచ్చే సింది. రైల్వేలో 3లక్షల ఉద్యోగులను తీసివేస్తామని ప్రకటిం చింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కానప్పుడు రిజర్వే షన్లకు విలువేం వుంటుంది? రిజర్వేషన్లు రాజ్యాం గంలో చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఆచరణలో ఉండవు.
ప్రపంచబ్యాంకు బాటలో జగన్‌ ప్రభుత్వం
పాదయాత్ర, ఎన్నికల సందర్భంలో అధి కారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.80లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యా యం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట తప్పరు, మడమ తిప్పరని యువత నమ్మా రు. జాబ్‌ కేలండర్‌ విడుదలతో జగన్‌ ప్రభుత్వం అసలు నైజం బయటపడిరది. యువతలో ఆగ్రహం కల్గించింది. రాష్ట్రంలో 2.35లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ నివేదిక ఇస్తే జగన్‌ 10వేలు ప్రకటించి యువత విశ్వాసంపై నీళ్లుజల్లారు. గ్రామ సచివాలయాల పోలీసు కానిస్టే బుళ్లతో లెక్క సరిపెట్టేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఊసెత్తలేదు. టీచర్లు లేక జివికే స్కూళ్లు మూతపడ్డాయి.స్పెషల్‌ డిఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తుంటే డిఎస్సీనే జగన్‌ లేపేశారు. మోడీ వలె ఉద్యోగులను తగ్గించే పనిలో జగన్‌ ఉన్నారు. ప్రపం చ బ్యాంకు చెప్పినట్లు రెగ్యులర్‌ ఉద్యోగులను తగ్గించి తక్కువ వేతనాలు, హక్కుల్లేని వారితో పనిచేయించు కోవాలని జగన్‌ ప్రభుత్వం చూస్తున్నది.
జీవో3రద్దు ఆదివాసీ రాజ్యాంగ హక్కును కాల రాయడమే
జీవో3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతిన్నది. ఏజన్సీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ హక్కు పోయింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ స్పందించలేదు. ఆ ప్రయత్నం చేయకపోగా ఒక పైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆదేశాలు ఇవ్వడం గిరిజనులను మోసం చేయడమే. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు డిఎస్సీలో సెలెక్ట్‌ అయిన వారికి టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే బిజెపి వైఖరికి జగన్‌ ప్రభుత్వం బాసటగా నిలబడిరది.
షెడ్యూల్‌ ఏరియాలో అర్హత గల గ్రామాలను కలపాలి
యాభై శాతం పైన గిరిజనులు వుండి, 5వషెడ్యూల్డ్‌ ఏరియాకు ఆనుకొని వున్న గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపే ప్రయత్నం జగన్‌ ప్రభు త్వం చేయడంలేదు. రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అర్హత వున్న గ్రామాలన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని డిమాండ్‌ చేయడంతో,సమగ్ర సర్వే జరిపి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పష్ప శ్రీవాణి ప్రకటించారు. నిజంగానే చేస్తారని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. భూమి, జనాభా రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన సర్వేను ఏళ్లు గడుస్తున్నా చేయడంలేదంటే వైసిపి ప్రభుత్వంపై భూస్వాములు, గిరిజనేతర పెత్తందార్ల ఒత్తిడి వుందని అర్ధమ వుతుంది.
పోలవరం నిర్వాసితులనునిలువునా ముంచేశారు
గనులు తవ్వినా, ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నిర్మించినా నిర్వాసితులు నిలువ నీడ లేకుండా పోతున్నారు. పోలవరంలో ముంచే యడం ఖాయమని తెలిసి, గ్రామ సభల్లో ప్రాజెక్టు వద్దని గిరిజనులు తీర్మానాలు చేశారు. గిరిజన గ్రామ సభలు ప్రాజెక్టు అంగీకరించినట్లు తీర్మానా లు తారుమారు చేసి రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. రోజూ పోలవరంపై సమీక్ష చేసిన చంద్రబాబు లక్ష గిరిజన కుటుంబాల పునరావాసం గురించి 5ఏళ్లలో ఒక్క రోజూ సమీ క్షించలేదు. మొత్తం పునరావాసానికి అయ్యే ఖర్చు రూ. 33 వేల కోట్లు ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయం అని వాగ్దానం చేసిన జగన్‌ గిరిజనులను ప్రాజెక్టులో నిలువునా ముంచేశారు. పోలవరం నిర్వాసితులను బిజెపి, టిడిపి, వైసిపి దారుణంగా మోసం చేశాయి. గిరిజనుల బతుకులు, వారి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు.
కార్మిక, కర్షక ఉద్యమంలో భాగం కావాలి
మోసపు మాటలతో గిరిజనులకు నష్టం,కష్టం కలిగించడమే గాక దేశ, విదేశీ కార్పొ రేట్లకు ఆదివాసీలను బలిచ్చే చర్యలు మానుకోవాలి. ఆదివాసీల భూమిని కార్పొరేట్లుకు ఇవ్వరాదు. విద్య,వైద్యం,పరిశ్రమలు,రైలు,బ్యాంకులు,ఇన్సూరెన్స్‌, విద్యుత్‌,వ్యవసాయం కార్పొరేట్లకు ఇవ్వొద్దు … అని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నినదిం చాలి. పోలవరం నిర్వాసితులకు పునరావాసం యుద్ధప్రాతిపదికన కల్పించాలి. జీవో 3పై రాష్ట్ర పతి ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజ నుల రాజ్యాంగ హక్కును కాపాడాలి. 50 శాతానికి పైగా జనాభా వున్న గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి.స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయా లి …అని దేశ రక్షణ కోసం ఆగస్టు 9న మండ లాఫీసు వద్ద జరిగే ధర్నాలో గిరిజనులంతా భాగస్వాములు కావాలి.
-ఎం.కృష్ణ మూర్తి

భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా?

భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు హన్సా మెహతా, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌ కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహ మాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ లోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతా లకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి. వారి జీవిత భాగస్వా ములపైన కిడ్నాప్‌, అత్యాచారం,‘లవ్‌ జిహాద్‌’ కేసులు మోపి జైలుపాలు చేస్త్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే…స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనో లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడు లలోనో హత్యకు గురవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌ కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతం లోకి మారాలనుకోవడంతో కాశ్మీర్‌ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ సిక్కు నాయకులు ఇవన్నీ ‘’లవ్‌ జిహాద్‌’’ నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయక హిందూ, సిక్కు బాలికలను వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌ లో సంపాదించిన డబ్బుతో క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతం లోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ మొదట ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ భావావేశ ద్వేషభావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి నదురుగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్‌ జిహాద్‌ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఇటీవల సిక్కు మహిళలను (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత) లవ్‌ జిహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మత ప్రచారంలోకి లాగారు. ‘లవ్‌ జిహాదీ’ల బాధితులుగా గుర్తించిన సిక్కు మహిళలలో, పద్దెనిమిది సంవత్సరాల మన్‌మీత్‌ కౌర్‌ కూడా వుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి,29 సంవత్సరాల ముస్లిం యువకుడు షాహీద్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకు న్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ…పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకెళ్ళారు. పోలీసు చర్యలు మన్‌మీత్‌ కౌర్‌ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతం లోకి మారడం, షాహీద్‌ ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్‌ లు షాహీద్‌ కుటుంబం దగ్గర వున్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను షాహీద్‌ కుటుంబంతో వెళ్ళనివ్వలేదు. ఆమెను లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, షాహీద్‌ ను పోలీసు కస్టడీ లోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురికొల్పింది ఢల్లీి సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌ కు చెందిన మంజీందర్‌ సింగ్‌ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. మన్‌మీత్‌ కౌర్‌ వ్యవహారం లవ్‌ జిహాద్‌ కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్‌ చేసి అరవయ్యేళ్ళ ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని గతంలో బిజెపి లో ఉన్న సిర్షా ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్‌మీత్‌ కౌర్‌ తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. సిర్షా ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి హైకోర్టులో మన్‌మీత్‌ కౌర్‌ ఏం చెప్పిందనేది అధికారికంగా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ, మరో మహిళ దన్‌మీత్‌ కౌర్‌ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. 30 ఏళ్ళ తన భర్త ముజఫర్‌ తనను బెదిరించి కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలు చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని ఆమె వీడియోలో తెలిపింది. ‘నా హక్కులు నాకు తెలుసు. మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుస’ంది. ఆమె జూన్‌ 6న ఇల్లు వదిలి, తన కోసం వెతకొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పెట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతం లోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి ముజఫర్‌ ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నాడు.
తన ‘’సిక్కు బిడ్డలను’’ కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురిచేసిందని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లో మాదిరిగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బిజెపి అభిప్రాయపడిరది. కానీ, సిక్కు మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే క్రమంలో… వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల…జమ్మూ, కాశ్మీర్‌ లో అనేక మంది మహిళలు బహిరంగంగా విచారాన్ని వ్యక్తం చేశారు.
మహిళ మతానికి చెందిన ఆస్తి కాదు
‘మహిళలను ఒక ‘’మతానికి చెందిన ఆస్తిగా’’ పరిగణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు అండగా నిలిచే సంస్థలేమీ లేవు. పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారు’ అని జమ్మూ, కాశ్మీర్‌ కు చెందిన ఇఫ్రా జాన్‌ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే స్థితిలో లేవు. మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక వ్యక్తితో స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి. ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే ‘లవ్‌ జిహాద్‌’ లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు. ‘వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే. ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని’ వారు అన్నారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వారికి తమ సంఫీుభావాన్ని ప్రకటించి, మత పెద్దల బాధితులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.-(‘ది హిందూ’ సౌజన్యంతో),హర్ష మందిర్‌

భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌

సాతంత్య్ర దినం..అమరుల త్యాగఫలం

‘‘ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలు స్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమా లనన్నిటినీ కలిపి‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరా టాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాల కుల పాలనను అంత మొందం చటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి ’’
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చా యి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహ కారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటా లను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధ ృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయక త్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది.1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన మహిళల స్పూర్తి !
బ్రిటీష్‌ వారి బానిన సంకెళ్లను తెంచి భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయ కంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవి తలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్య్ర సమరయోధు రాలు దుర్గాభాయి దేశ్‌ ముఖ్‌. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రభోస్‌ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితు రాలిగా మెలిగిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ రaాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్‌ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని రaాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్‌ అలీ స్వాతంత్రో ద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతం త్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయ పోరాట కూడా చరిత్రకు సంబంధిం చిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్‌ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..
రాణి వేలు నచియార్‌
బ్రిటిష్‌ వారిపై మొదటి పోరాటంగా మనం చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే అయిదు దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వారిని ధిక్కరించి నిలబడిన ధీర వనితలున్నారు. 1760-1796 మధ్య కాలంలో మొట్ట మొదటగా బ్రిటిష్‌అ ధికారాన్ని ఎదిరించి పోరాడిన మహిళ, బ్రిటిష్‌ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్ది మంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన మహిళ రాణి వేలు నచియార్‌. తమిళనాడు లోని రామ్‌ నాడ్‌ రాజ్యంలో జనవరి 3, 1730లో మన్నార్‌ సెల్లముత్తు సేతుపతి రాజుకు జన్మించింది వేలు నచియార్‌. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవటం వల్ల రాకుమారుడిలా పెరిగింది. చిన్నతనం నుంచే అనేక రకాల ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు అనేక యుద్ధవిద్యల్ని నేటర్చుకుంది. అంతేకాక ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ధారా ళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదిం చింది. వేలు నచియార్‌ భర్త శివగంగై రాజు. వారికి ఒక కూతురు. 1772లో ఆర్కోట్‌ నవాబుతో కలిసి బ్రిటిష్‌ దళాలు శివగంగైను ఆక్రమించటానికి చేసిన కళైయార్‌ కోయిల్‌ యుద్ధంలో వేలు నచియార్‌ భర్తను హత్య చేశారు. విధి లేని పరిస్థితుల్లో వేలు నచియార్‌ తన కూతురుతో కలిసి రాజ్యాన్ని వదలి పారిపోవాల్సి వచ్చింది. శివగంగైకు చెందిన మరుధు సోదరులు, మరికొంత మంది శక్తివం తమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌ లో నివసించింది. ఆ సమయంలో బ్రిటిష్‌ వారిపై పగ తీర్చుకోవాలనే ధృఢ సంకల్పంతో అనేక మందితో కలిసి సంకీర్ణ సేనలు తయారు చేసింది. 1780 లో మైసూర్‌ సుల్తాన్‌ హైదర్‌ అలీ సాయం తీసుకుని, తాను తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన సైన్యంతో కలిసి శత ృవులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన (తమను తాము నూనెతోనో నెయ్యితోనో ముంచుకుని శత ృ ఆయుధాగారంలోకి జొరబడి తమకు తామే నిప్పంటించుకుని ప్రాణాలర్పించే) మానవ బాంబు, కుయిలీ అనే ఆమె ఉండేది. ఆయుద్ధంలో వేలు నచియార్‌ విజయం సాధించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంది. ఆ రోజుల్లోనే ఆమె తన సైన్యంలో ‘‘ఉదయాళ్‌’’ అనే పేరుతో మహిళలు మాత్రమే గల బృందాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్‌ జన్మదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.31 డిశంబర్‌, 2008 న భారత ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
కిట్టూర్‌ చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో సెప్టెంబర్‌ 11, 2007 లో మన దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గారి చేతుల మీదుగా ఒక వీర వనిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె పేరు రాణి చెన్నమ్మ. కర్నాటక రాష్ట్రంలోని కిట్టూర్‌ రాజ్యానికి రాణి. అందుకే ఆమెను కిట్టూర్‌ చెన్నమ్మ అని కూడా అంటారు. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుల్లో మొదటిగా చెప్పుకోదగ్గ మహిళ. అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ప్రవేశ పెట్టిన ‘‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ లాప్స్‌’’ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడిరది. బ్రిటిష్‌ సైన్యానికి ధీటుగా గొప్ప విప్లవ దళాన్ని తయారు చేసుకుని సారధ్యం వహించిన మహిళ. బ్రిటిష్‌ వారు భారత పాలకులపై బలవంతంగా విధించే అనేక చట్టాలను పాటించలేమని బలంగా వ్యతిరేకించి అనేక పోరాటాలు చేసింది. చివరకు తన విప్లవ దళంతో కలిసి బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. చివరకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడిరది రాణి చెన్నమ్మ. కానీ, ఆమె చూపిన తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతంత్య్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. రాణి కిట్టూర్‌ చెన్నమ్మ వీరోచిత శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేటికీ కర్నాటక రాష్ట్రంలో అక్టోబర్‌ నెలలో బ్రిటిష్‌ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘కిట్టూరు ఉత్సవం’’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవ దళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిమంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేయబడుతోంది. ఇండియన్‌ రైల్వేస్‌ రోజూ బెంగుళూరు నుండి కొల్హాపూర్‌ ప్రయాణించే ఒక రైలుకు ఏకంగా ‘‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ ప్రెస్‌’’ అని పేరు పెట్టి ఆమెకు నీరాజనాలు అర్పించారు.
రాజ్‌ కుమారి గుప్త
రాజ్‌ కుమారి గుప్త చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యం లోని తిరుగుబాటు యోధుల బృందా నికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందే శాలను, మారణాయుధాలను చేరవేసేది. అప్పట్లో విప్లవ దళాల మనుగడకై దోపిడీలు చేసేవారు. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘‘కాకోరీ కాన్‌ స్పైరసీ’’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్ర శేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన ఒక రైలు దోపిడీలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌ కుమారి గుప్త. ఒకసారి తన దుస్తులలోదాచు కుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుం డగా బ్రిటిష్‌ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడిరది.
లిబేగం హజ్రత్‌ మహల్‌
లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్‌ ని ఏలిన రాణి బేగం హజ్రత్‌ మహల్‌. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాస వంతంగా జీవితం గడిపిన ఆమె, బ్రిటిష్‌ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తాను ప్రత్యక్ష్యంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడిరది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిరది బేగం హజ్రత్‌ మహల్‌. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ఒకరైన నానా సాహెబ్‌ వంటి వారితో కలిసి పని చేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో, నేపాల్‌ ప్రధాని పిలుపునందుకుని నేపాల్‌ చేరుకుని మనుగడ సాగించాల్సి వచ్చింది. చివరకు ఊరూ పేరూ లేకుండా 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాట పటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 10, 1984లో బేగం హజ్రత్‌ మహల్‌ ఫోటో ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ ను విడుదల చేసింది.
రాణి అవంతి బాయి
1831-1858 మధ్య కాలంలోని మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతి బాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో విధించిన చట్టాలకు అనుగుణంగా, వాటికి తలవంచే అందరు రాజుల్లాగే, తాను కూడా ‘‘వారసులు లేని వారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’’ ను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి, వారిచ్చే భరణంతో బ్రతకాల్సి వచ్చింది. అది నచ్చని ఆమె రహస్యంగా బృందాలను తయారు చేసి, బ్రిటిష్‌ వారి అరాచకాలను, ఆక ృత్యాలను వారి ద్వారా బహిరంగ పరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ దళాలకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తరువాత తన అధికారాన్ని కోల్పోయింది. ఐనా ధైర్యం కోల్పోక, సర్వశక్తులూ ఒడ్డి, మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణ త్యాగం చేసిన ధీరోదాత్త రాణి అవంతీ బాయి.ఇక రaాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథ చాలావరకు ప్రజలందరికీ చేరువయ్యిందే.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్‌ థెరెస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. 16 ఏళ్ళ చిన్న వయస్సు లోనే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాలలో ముందుండి నడిచింది. ప్రత్యేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకామె రెండేళ్ళ జైలు జీవితం కూడా గడిపింది. స్వాతంత్య్రం తదుపరి తన జీవితాన్నంతా ప్రజా సేవకు అంకితం చేసిన మహోన్నత మహిళ పార్వతి గిరి.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అస్సాం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని 60 ఏళ్ళ వయస్సులో ప్రాణాలను ఫణంగా పెట్టి అమరత్వం పొందిన సాహస మహిళగా ప్రసిద్ధి చెందిన వ ృద్ధ యోధురాలు. ఒక సాధారణ గృహిణి ఐన భోగేశ్వరి స్వాతం త్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై తాను స్వయం గా ఉద్యమంలో పాల్గొనటమే కాక తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. ‘‘భర్భుజ్‌ ’’ అనే పేరుతో చేపట్టిన తిరుగుబాటు కార్యక్రమంలో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయ రీతిలో కాల్చి చంపింది బ్రిటిష్‌ సైన్యం.
కనకలత బారువా
అస్సాంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. ఆమెను బీర్బల అని కూడా పిలిచే వారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ‘‘మ ృత్యు వాహిని’’ అనే సేనలో ప్రాణాలను ఫణంగా పెట్టే దళంలో పని చేసింది. సెప్టెం బర్‌ 20, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన, జాతీయ జెండా ధరించి సాగే మార్చ్‌ లో ముందుండి సాగి బ్రిటిష్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టు కుంది కనకలత బారువా.
మాతంగిని హజ్రా
అంతగా ప్రాచుర్యం పొందని వీర వనిత. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలలో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమ కాంక్షను రగిలించింది. ఇది గ్రహించిన బ్రిటిష్‌ ప్రభు త్వం ఆమెను ఐంతమొందించాలని ఎదురు చూసాయి. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను షూట్‌ చేసారు. తూటా తగిలినా, ధైర్యం కోల్పోక, జెండా విడు వక.. ముందుకు నడుస్తూనే, ‘‘వందే మాతరం’’ అంటూనే నేలకొరిగింది మాతంగిని హజ్రా.
అరుణ అసఫ్‌ అలీ
భారత దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అందుకున్న అరుదైన స్వాతంత్య్ర సమర యోధురాలు అరుణ అసఫ్‌ అలీ. ఉన్నత విద్యా వంతురాలు. 1942 క్విట్‌ ఇండియాఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్‌ మైదానంలో బ్రిటిష్‌ సైన్యం చూస్తుం డగా జాతీ య జెండా ఎగుర వేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్‌ జైల్లో బంధించి నపుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌
చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు గల మరో తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. గాంధీ బోధనలకు ఆకర్షితురాలై ఆభరాణాలు విడిచి ఖాదీ ధరించింది. సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుపాలైంది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టా పొం దింది. స్వాతంత్య్రానంతరం ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పలు కీలక పద వులు నిర్వహించిన తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగా లు చేసిన వారు, తెగువ, ధైర్య సాహసాలు చూపిన మహిళలు. చరిత్రలో నిలిచిన వారు, వెలుగులోకి రాని వారు అనేక మంది. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మనం వారందరినీ తలచుకుందాం. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భావి తరాలకు తెలియ జేసే ప్రయత్నం చేద్దాం. Saiman Gunaparthi

నిర్వాసితుల నిర్వేదం

‘మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా.మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మాతరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం’’ భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు ఆవేదన.
పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

‘‘అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం. ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్‌ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే’’ అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి రోదన.

‘‘అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం.అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక’’ అని చెదల పార్వతి నిర్వేదన
పోలవరంలో ముంపు శాపం…18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా? చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ గిరిజనులు అంటు న్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలుఉత్పన్నమవు తాయోనన్న ఆందో ళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిం దని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
నీళ్ల నడుమ నిర్వాసితులు-చోద్యం చూస్తున్నపాలకులు
ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా..లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంబి óస్తున్నారు. మాట తప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాస ప్యాకేజీ ఇస్తే ఖాళీ చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనుకుంటున్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశిం చింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేస్తామని చెబుతోంది. దానికి అవసరమైన నిధుల సంగతి తమకు సంబంధం లేదని కేంద్రం అంటోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహస నంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు.
వరద బాధితులతో ఆటలు…
దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హామీగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. స్పిల్‌ వే పూర్తయిన నేపథ్యంలో జూన్‌ నెల మొదటి వారంలోనే నదీ ప్రవాహాన్ని మళ్లించారు. అందుకోసం కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసే శారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగడంతోనే పోలవరం నిర్వాసిత గ్రామాలకు వరద బెడద ఏర్పడిరది. మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తు కుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడిరచారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించ కుండా అమానుషంగా ప్రవర్తించారు.
మాట తప్పిన ప్రభుత్వాలు
కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరా వాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చిచెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా.. లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా ?
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు చిగురించాయి. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయల సీమలో నీటి కొరతను అధిగమిస్తామని ముఖ్య మంత్రులు భారీ ఆశలే కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ.6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ.20వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05లక్షల కుటుంబాలకు గానూ రూ.27వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవుతున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5వేల కోట్లు కావాల్సి ఉం టుంది. ఇక ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను మార్చడం వల్ల ఖర్చు పెరిగిందని కేంద్రమే పార్లమెంట్‌ లో చెప్పింది. దాని ప్రకారం రూ. 5535కోట్ల నుంచి రూ. 7192 కోట్లకు పెరిగింది. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందు బాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించ బోనంటోంది. రాజ్యసభలో జలశక్తి మంత్రి ప్రకటన తాజా తార్కాణం. మరో 9వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది. కేంద్రం నుంచి రూ. 2300కోట్లు రావాల్సి ఉందని జులై 19న సి.ఎం ప్రకటిస్తే, తాము ఇంకా ఇవ్వాల్సింది రూ.1900 కోట్ల లోపు మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. దానిని ప్రశ్నించి, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసిపి నీళ్లునములుతోంది. కనీసం విపక్ష టిడిపి కూడా ప్రశ్నించ లేకపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఉంది. పోలవరం తామే పూర్తి చేస్తున్నామని ఎ.పి లో బిజెపి నేతలు ప్రకటన లు గుప్పిస్తుంటే కేంద్రంలో అదే పార్టీ మంత్రు లు తాము ఎనిమిదేళ్ల క్రితం నాటి అంచనాలకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.
వరదలు పెరిగితే వాళ్లంతా ఏం కావాలి ?
సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వ కంగానే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాంగం కదలాలి. డి.ఆర్‌ డిపోల ద్వారా నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదు పాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.-వెన్నెల / జిఎన్‌వి సతీష్‌

కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌

గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్‌ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్‌ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్‌ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్‌ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్‌ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్‌ సింఫ్న్‌ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్‌.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్‌ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్‌’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్‌ అయిన శ్రీ హట్టన్‌, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్‌ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్‌ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్‌ అనిపిలిస్తే, హైదరాబాద్‌ ప్రభుత్వం నోటిఫైడ్‌ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్‌ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్‌ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్‌ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

గమ్యం తెలియని బాలల ప్రయాణం

బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్‌ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్‌ అంధకారంగా మారింది. ..`

కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్‌ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్‌ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్‌లైన్‌ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్‌-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్‌ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండే షన్‌ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్‌ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్‌ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్‌ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్‌ పెంట కృష్ణ

ఆహారం దక్కక ఆకలి కేక

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంపూర్ణ పోషణ పథకం నిర్విర్యమౌతోంది. రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండ లాల పరిధిలోని 8ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో25రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు,కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రి షన్‌ కిట్‌ కింద నెలకు 2కిలోల మల్టీ గ్రెయి న్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకి లో రాగిపిండి,అరకిలో బెల్లం,అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తంరూ.87.12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఈ పథకం77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47, 287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తు న్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం అరకొరగా కొనసాగుతోంది. పథకానికి సంబంధించిన పోషకాలు అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు. కనీసం ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనైనా లబ్దిదారులకు సక్రమంగా అమలు చేసే నాధుడు కరవయ్యారు.

మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల అభివృద్ధిని ఆనాటి ఆంధ్రపాలకుల నుంచి నేటి తెలంగాణ పాలకుల వరకు పట్టించు కునే వారు లేక వారి బతుకులు మారడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని అధికారులు ప్రగల్భాలు పలుకుతూ లెక్కల్లో చెపుతున్నా, ఆచరణలో మాత్రం శూన్యంగానే ఉన్నది. కాసిపేట మండలంలో ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు , రవాణా సౌకర్యాల్లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. గిరి పుత్రులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. పారిశుధ్యం అధ్వానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి. గిరిజన గ్రామాలకు కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు పోషకాహారం అందని ద్రాక్షగానే ఉంది. గిరిజనుల పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆదివాసీల పిల్లలు పోషకాహార లోపంతో రోగాల భారిన పడుతున్నారు. మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ నామమాత్రంగానే కొనసాగుతోంది. కొలాంగూడ , లక్ష్మిపూర్‌, తిరుమలాపూర్‌ గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు పోషకాహారానికి దూరమై అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో అధికారింగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పనిచేసిన దాఖలాలు లేవు. దీంతో గిరిజనుల పిల్లలు గంజి, గట్కలతో కడుపు నింపుకుంటున్నారు.
మౌలిక సదుపాయలు శూన్యం
ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యంలేదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే వాగు లు, వంకలు దాటు కుంటూ వెళ్లాల్సిందే. సమస్యలతో సతమతమౌతున్న గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పిం చడంలో ప్రభు త్వం ఏనాడు శ్రద్ధ వహిం చలేదని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకా లంలో వాగులు పొంగి పోర్లుతుంటే ప్రమాదపు టంచున వాగులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక అనారోగ్యంతో ఉన్నవారికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి.
పౌష్టికాహారం అందని ద్రాక్షే..
సంపూర్ణ పౌష్ఠికాహారం అందించి మాతా, శిశు మరణాలు రేటు తగ్గించాలన్నది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) లక్ష్యం. కానీ కరోనా కష్టకాలంలో లబ్ధిదారులకు నిర్దేశిత ప్రకారం సంపూర్ణ ఆహారం అంద డం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలు స్తోంది. గుడ్లు తప్ప, నూనె, పప్పు రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు అరకొర గుడ్లు, పాలు నేరుగా అందించి చేతులు దులుపుకొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు భోజనం చేసి పెట్టాల్సి ఉండగా గత రెండు నెలలుగా కరోనా నేపథ్యంలో నేరుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. కానీ నూనె, పప్పులు ఇవ్వట్లేదు. పాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు. అవి కూడా ఒక రకమైన వాసన వస్తోండటంతో తాగలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
గర్భిణుల్లో రక్తహీనత
జిల్లాలోని గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులు పౌష్ఠికాహారానికి నోచుకోక పచ్చళ్లు, చారుతో భోజనం చేయాల్సి వస్తోంది. ప్రధానంగా విశాఖ జిల్లా షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన 11 మండలాల్లోని గిరిజన గ్రామాల పిల్లలు బలవర్ధక ఆహారానికి నోచక, వ్యాధినిరోధక శక్తి లేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారానికి ఒకసారి సమీపం సంతలకు వెళ్లి కూరగాయలు తెచ్చుకునే కుటుంబాలే అధికం. గర్భిణులు,బాలింతలు నడిచి వెళ్లలేక పచ్చడి,గంజి మెతుకులతో రోజులు గడుపుతున్నారు. ఫలితంగా నెలలు నిండుతున్న వారిలోనూ పిండం సరిగా ఎదగడం లేదు. రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొందరికి హిమోగ్లోబిన్‌ శాతం 6-7 శాతం మాత్రమే ఉంటోంది. బాలింతల్లోనూ పట్టణా లబ్ధిదారుల్లో పరిస్థితి కాస్త పర్వాలేకున్నా.. గిరిజనుల్లో మాత్రం సుమారు 70 శాతం మంది సరైన తిండికి నోచక పిల్లలకూ సరిపడినన్ని పాలివ్వలేని పరిస్థితి దాపురించింది.
గర్భిణులు: 8,430
బాలింతలు: 9,259
0-6 ఏళ్ల పిల్లల సంఖ్య: 69,183
మినీ అంగన్‌వాడీలు: 636
జిల్లాలో అంగన్‌వాడీలు: 1,424
బాధితులు ఇలా..
అతి తీవ్ర పోషణ లోపం ఉన్నవారు (ఎస్‌ఏఎం) 2139,తీవ్ర పోషణ లోపం (ఎంఏఎం) 4,299,అతి తక్కువ బరువు (ఎస్‌యూడబ్ల్యూ) 1,334,పోషకాహార లోపం (ఎంయూడబ్ల్యూ) 6,376 వయసుకు తగిన ఎత్తులేని వారు 696
గిరిజనుల పిల్లల్లో వయసు పెరుగు తున్నప్పటికీ తగిన బరువు ఉండటం లేదు. జిల్లాలోని అన్నీప్రాజెక్టుల పరిధిలో తీవ్ర పౌష్ఠికాహారం లోపంతో బాధపడే వారు వేలాది మంది ఉన్నారు. వీళ్లకు సంపూర్ణ పౌష్ఠికాహారం అందితేనే శరీరం ఎదుగుదల ఉంటుంది. వ్యాధులు దరిచేరవు. ఉన్నతాధికారులు అవసరమైతే పౌష్ఠికాహార కేంద్రాలకు (ఎన్‌ఆర్‌సీ) తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ఉంది.
నెలాఖరుకల్లా సమస్య పరిష్కారం

  • సీతామహాలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ
    గత నెలన్నర నుంచి పప్పు, నూనెలు రాష్ట్రస్థాయి నుంచే సరఫరా కాలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. మొన్న నూనె సరఫరా చేశారు. వెంటనే ప్రాజెక్టులకు అందజేశాం. వారు కేంద్రాలకు అందజేస్త్నేన్నారు. పప్పు కూడా ఈ నెల చివరి కల్లా వచ్చే అవకాశం ఉంది.
    పారిశుధ్యం అధ్వానం
    గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. ప్రతి వర్షకాలం పారిశుధ్యలోపంతో రోగా లు ప్రబలి ప్రజలు మృతిచెందుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో పాటు కాలువలో పూడికలు తీయకపోవడంతో కాలువల్లో మురికినీరు నిలిచి, దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా అనేక సమస్యలతో గిరిజన గ్రామాలు సతమతమ వుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
    జి.ఎన్‌.వి.సతీష్‌

లాక్‌డౌన్‌ రోజుల్లో…ఈ రాష్ట్రాల్లో మహిళలే ఆశ,శ్వాష

భారతదేశంలో లాక్‌ డౌన్‌ సమస్య తీవ్రతను తగ్గించడంలో, వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే, దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత, గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి.
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు. అందరికీ అన్నీ అందించడానికి చాలా పెద్ద యంత్రాంగం కావాలి. దానికి బలమైన, వ్యవస్థీకృత పద్ధతులుండాలి.
సరిగ్గా ఆ ఖాళీనే పూరించాయి మహిళా స్వయం సహాయక బృందాలు. ఇవే కోవిడ్‌-19 కాలంలో దక్షిణ భారతంలో వెలుగు రేఖల్లా మారాయి. దాదాపు మొత్తం జనాభాకు వివిధ అవసరాలు ఒకేసారి పెద్ద ఎత్తున తీర్చాల్సి రావడం, వైద్యపరంగా దాదాపు ప్రతి కుటుంబాన్నీ సర్వే చేయాల్సిన అవసరం రావడం – ఈ రెండిటినీ సమన్వయం చేయడం సాధారణ విషయం కాదు.
కానీ, మహిళా సంఘాలు, ఆ బాధ్యతను సమర్థంగా, సత్వరంగా చేపడుతున్నాయి. భోజనం పెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా వారు తమ వంతు సాయం అందిస్తున్నారు.దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళల పాత్ర కనిపిస్తోంది. కేరళ మహిళలు ఈ విషయంలో ముందున్నారు. అక్కడ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు సమాంతరంగా పనిచేస్తోంది కుదుంబ శ్రీ. (మలయాళంలో కుటుంబాన్ని కుదుంబ అని అంటారు).
కేరళను కాపాడుతున్న కుదుంబశ్రీ
కుదుంబశ్రీ.. ఇది అక్కడి మహిళా స్వయం సహాయక బృందాల సంస్థ. లాక్‌ డౌన్‌ తరవాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుదుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్‌ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది.
అక్కడి స్థానిక సంస్థలతో కలపి కుదుంబ శ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనం అందజేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్స్‌లో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంస్థలే నడుపుతున్నాయి.
ఆహారం ఉచితం
కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం, వీటిలో 238 కిచెన్లను హోటళ్లుగా కేటాయించారు. అక్కడ 20 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇక సరిహద్దుల్లో, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారి కోసం 15 టేక్‌ అవే పాయింట్లు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పాటూ గుర్తించిన 1,57,691 అనాథ కుటుంబాలకి కూడా ఆహారం అందుతోంది.
కేరళ సివిల్‌ సప్లైస్‌ శాఖ, 87 లక్షల కుటుం బాలకు ఇవ్వాల్సిన నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం అడిగింది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు.
ఇక అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్‌ డౌన్‌లో కూడా ఆగకుండా వీరు చూస్తున్నారు.
ఇప్పటికే ఏప్రిల్‌ నెలకి సరిపడా అమృతం నూట్రిమిక్స్‌ నిల్వ పెట్టుకున్నారు. పంపిణీ కూడా జరుగుతోంది. గిరిజన ప్రాంతాలకూ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
కొన్ని చోట్ల పడవల్లో సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు.
విస్తృత నెట్‌వర్క్‌, సమర్థులైన సభ్యులు, వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఈ లక్షణాలే ఇక్కడ స్వయం సహాయక బృందాలపై ప్రభుత్వాలే ఆధారపడేలా చేయగలిగాయి.
కౌన్సిలింగ్‌ కోసం స్నేహిత
కేవలం భోజనం పెట్టడమే కాదు, ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలూ చూస్తున్నారీ మహిళలు. ఇందుకోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. దిక్కులేని (డెస్టిట్యూట్‌) కుటుంబాల్లో 1,22,920 మంది వృద్ధులే ఉన్నారు. లాక్డౌన్‌ సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుదుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారైంటన్లో ఉన్నవారినీ పలకరిస్తారు. క్వారంటైన్లో ఉన్న వారందరూ మానసికంగా ధైర్యంగా ఉండేందుకు పలకరించాలనే నియమం పెట్టుకున్నారు.
ఈ పలకరింపుల పని కోసమే 2,500 మంది ఉన్నారు. ఇంతేకాదు, ఇంట్లోనే అందరూ ఉండిపోవడంతో, బయటకు వెళ్లకపోవడంతో వచ్చే మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికీ, మహిళలు గృహహింస ఎదుర్కొంటుంటే గుర్తించడానికీ కూడా స్నేహిత కౌన్సిలింగ్‌ కార్యక్రమం పనిచేస్తోంది.
1,90,000 వాట్సాప్‌ గ్రూపులు
కుదుంబ శ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్‌ ఒకటి. బ్రేక్‌ ద చైన్‌ కాంపైన్‌ ద్వారా చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, శుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్‌ ద్వారా, అది లేని చోట ప్రత్యక్షంగా ప్రచారం, అవగాహన కల్పించారు.
ఇంతకీ కుదుంబశ్రీ కింద ఎన్ని వాట్సప్‌ గ్రూపులున్నాయో తెలుసా? అక్షరాలా లక్షా 90 వేలు. అవును. వాటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కోవిడ్‌ గురించి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతూ వచ్చింది. ఇంగ్లీషు, మలయాళ భాషలో రూపొందించిన పోస్టర్లను వ్యాప్తి చేశారు.
ఎలా సాధ్యపడిరది?
నిజానికి మహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం దేశమంతా ఉంది. కానీ కొన్ని చోట్లే బాగా విజయవంతమయ్యింది. కొన్ని చోట్లే సామాజికంగా -ఆర్థికంగా ప్రభావం చూపగలిగింది. దక్షిణ భారతంలో ఈ సంఘాల ప్రభావం గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో స్పష్టంగా కనిపించిందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు మరింత శక్తివంతంగా, సంపన్నంగా ఎదిగాయి. ఈ కుదుంబశ్రీలను తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రాతో దీన్ని పోల్చవచ్చు.
కేరళలో 90లలో ఈ ఉద్యమం మొదలైంది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక బృందాలున్నాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివృద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివృద్ధి సంఘాలు ఉన్నాయి.
వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నవారు. ఏ మహిళ అయినా ఇందులో చేరవచ్చు, కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి.
సమగ్ర ఆర్థిక,సామాజిక,మహిళా సాధికారిత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్‌ అభివృద్ధి, వాల్యూ చైన్‌ ఆధారిత వ్యవహారాలు వంటివన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయి.
ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం),బడ్స్‌ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం కార్యక్రమాల గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ కుటుంబశ్రీలు చేస్తున్నాయి.
వీళ్లు చేస్తున్న ప్రతీ కార్యక్రమమూ ప్రత్యేకమే. పదుల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు వీరు చేపడతున్నారు. వీటి వల్ల ఎందరో మహిళలు తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. వ్యాపారవేత్తలుగా కొందరు ఎదిగారు. స్వయం ఉపాధి కొందరు పొందారు.
కేరళ తరువాత స్థానంలో మిగిలన దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగానే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుల్లో ఈ సంఘాలు ఎందరో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. స్వయం ఉపాధి పొందడానికి సహాయపడ్డాయి. వారి ఉత్పత్తు లను అమ్ముకోవడానికి వేదిక కల్పించాయి. అలాగే కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేశాయి. పరోక్షంగా పేదరిక నిర్మూలనకు సహాయ పడ్డాయి.(బీబీసీ సౌజన్యంతో…)
బళ్ల సతీశ్బీ

1 3 4 5 6 7