ఆ గాలిలోనే గ‌ర‌ళం

దేశ రాజధాని నగరంఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే.. దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా.. మళ్లీ గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచించింది. పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగల బెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దు లోని హర్యానా, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగు తుంటుంది. ఆ పొగంతాఢిల్లీను కమ్మేస్తుం టుంది. ఒక్కసారిగా 14శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడ మేనని తెలిసింది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢల్లీిలో వాయు కాలుష్యం(ణవశ్రీష్ట్రఱ Aఱతీ ూశీశ్రీశ్రీబ్‌ఱశీఅ) పెరుగు తోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్‌(ణవశ్రీష్ట్రఱ చీజR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్‌ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం..’’ గత రెండు వారాల్లో డాక్టర్‌ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండిరతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ప్రపంచంలోనే టాప్‌ పొల్యూటెడ్‌ సిటీ ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూట గట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IూA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజ ధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలోగాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్‌ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండా లంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ప్రాణవాయువే… ప్రాణాంతకం
ప్రాణవాయువే…ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడి పోయిందనే కారణంతో ఏకంగా దేశరాజ ధానిలో కొద్ది రోజులు లాక్డౌన్‌ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం… యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం…గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు…ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌ కేసులు -ఇలా ఢల్లీిలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్‌ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటి కాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్‌ చివర నుంచి నవంబర్‌ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యా లు కలగలిసి ఢల్లీిలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీ యాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ,నవంబర్‌ మొదట్లో దీపావళి టపాసులు,పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై,ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థా యికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్‌ 13న సుప్రీమ్‌ కోర్టు కొరడా జుళిపిం చింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమా వేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యక లాపాలకు బ్రేక్‌ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢల్లీిలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢల్లీిలో దుమ్ము ధూళి,పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా,ఢిల్లీలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా,పంజాబ్‌ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్‌ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నా రనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్‌, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్‌ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్‌’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్‌-26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్‌)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభ వాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్‌ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే…మొదటికే మోసం!
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్‌ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిరదని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని వెల్లడిరచింది. సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్‌,నోయిడా,ఘజియాబాద్‌,ఫరీదాబాద్‌ లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండిరటితో బాధపడు తున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమత మవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్య తో బాధపడు తున్నామని చెప్పారు.కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ ఉపయో గించాలనుకుంటున్నారని,61శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్‌ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.

-జి.ఎన్‌.వి.సతీష్‌

ఆదివాసీల ఆత్మగానం

త్తరాంధ్ర కథకులు,రచయిత,కవి మల్లిపురం జగదీశ్‌ రాసిన కొత్త పుస్తకం‘‘దుర్ల’’ కవితా సంపుటి. ఈకవితా సంపుటిని పరిచయం చేస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి సారిపల్లి నాగరాజు గారు రాసిన సమీక్ష వ్యాసం – ఎడిటర్‌

మల్లిపురం జగదీశ్‌ మాష్టారు దాదాపుగా రెండు దశాబ్దాలు పాటు రాసిన కవితలన్నింటినీ సమూ హంగా చేసి ‘‘దుర్ల’’ పేరుతో ప్రచురిం చారు. తమ జాతి సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ కథలు, కవిత్వం, గేయాలు రాయడమే కాకుండా వారి రచనలకు కూడా ఆ సంప్రదాయాలకు తగినట్టుగానే శీర్షికలు పెట్టారు. గాయం మనిషికి తగిలినా మనసుకు తగిలినా గాయం తాలూకా జ్ఞాపకాలు అలాగే నిలిచిపోతాయి. బాధల ప్రవాహాన్ని అక్షరాలతో వెతికి హృదయాన్ని హత్తుకునేలా అల్లి నప్పుడు ఆ భాధలు గాథలవుతాయి, గీతాల వుతా యి. కవితల వెల్లువవుతాయి. గిరిజనుల బాధలను, కష్టాలను, ఇబ్బందులను అక్షరీకరిస్తున్న కవి మల్లిపు రం జగదీశ్‌. తమ జాతి మూలాలను అలాగే ఒడిసి పట్టుకొని వారి సంస్కృతి, సంప్రదాయాలను, పండగ లను, ఆచార వ్యవహారాలను తమ కవిత్వంలో చూపిస్తూ, తమ జాతికి జరిగే అన్యాయాలపై కవిత్వపు చైతన్య బావుటాను ఎగరవేస్తున్న గిరిపుత్రుడు మల్లిపురం జగదీశ్‌.
తెలుగు కథాసాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఆపాదించుకున్న కథకులు మల్లిపురం జగదీశ్‌. ఈయన కలం నుంచి ‘‘గాయం’’, ‘‘శిలకోల’’, ‘‘గురి’’ అను కథా సంపుటిలు ఇదివరకే తెలుగు పాఠకలోకం ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు ‘‘దుర్ల’’ కవితా సంపుటితో ఆదివాసీ జన జీవితాన్ని, సంప్రదాయాలను, బాధలను, ఇబ్బందులను, వారికి జరుగుతున్న అన్యాయాలను చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు. కథకుడిగా చేయి తిరిగిన జగదీశ్‌గారు ఇప్పుడు కవిత్వంలో కూడా తనదైన ప్రతిభను చూపించారు. ఆదివాసీ సమూహాల మీద జరుగున్న అన్యాయాలకి, ప్రభుత్వం వారి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణికి స్పందించి సందర్భానుసారంగా కవితలు రాసి ‘‘దుర్ల’’గా మన ముందుంచారు. ఆదివాసీ జనుల కష్టాలు,పథకాల పేర జరు గుతున్న మోసం,గిరిజనులకు అందని విద్య, ఆమడ దూరంలో ఉన్న వైద్యం, నరకయాతన పెట్టే రహదారులు మొదలైన గిరిజన సమస్యలు కళ్ళకు కట్టినట్లుగా ఈ కవితా సంపుటి నిండా జగదీశ్‌ గారు ఎత్తి చూపారు. ‘‘దుర్ల’’ కవితా సంపుటి 52 కవితల సమాహారం. ఇందులో ప్రతి కవితా పాఠకుల హృదయాన్ని ద్రవింప జేసి, చదివింపజేస్తుంది. ‘‘దుర్ల’’ సంపుటి కవిత్వంలోనే కాదు, కవితా శీర్షికల్లోనూ ఆ నూతనత్వం పాఠకుడిని పలకరిస్తుంది. శీర్షిక నుండే కవితా వస్తువుకు చెందిన ఆలోచనల్లోకి, సందిగ్ధావస్థల్లోకి, పరిశీలనాతత్వంలోకి, ఉత్సుకతలోకి పాఠకుడు అడుగులు వేస్తాడు. ‘‘పోరు ఎప్పటికీ ఆగదు,మాట్లాడుతాం,తూకం, పాట దారి,కొండ భాష,సృష్టి’’ వంటి శీర్షికల్లో కవి ఏ వస్తువును కవిత్వంగా మలచబోతున్నాడు అన్న ఉద్రిక్తత, సందిగ్ధత పాఠకుడిని సంఘర్షణ లోకి దించుతుంది. కవి తొలి విజయం కవితా శీర్షికల్లోనే పాఠకుడి నాడిని పట్టుకుని కవితలోకి వారి మనసును అంతర్లీనం కావించడం. ఈకవితా సంపుటికి శీర్షికగా నిలిచిన ‘‘దుర్ల’’. కవిత నిండా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, అడవి సౌందర్యం,ఆదివాసీ ఆడపడుచుల థింసా నృత్య సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తా యి. రచయిత తన మూలాలను,జీవితాన్ని ఈ కవిత నిండా చూపించే ప్రయత్నం చేసారు.‘‘పసుపు నీళ్ళ స్నానమాడి గుగ్గిలం ధూపంలోఎజ్జోడి మంత్రాలతో కొత్త కలల బొట్టుపెట్టుకొని కోడిపిల్లను ధరిస్తుంది గొడ్డలమ్మ’’ అని గిరిజన సంస్కృతిని,వారి ఆరాధ్య దైవాన్ని కొనియాడిన పద్ధతిని ఈకవితలోచిత్రీకరించారు. గిరిజను లంతా బృందంగా వెళ్ళి గొడ్డలమ్మ తల్లికి నీరాజనాలు పలికి,థింసా నృత్యాన్ని ఆ తల్లి ఎదుట ప్రదర్శిస్తారు. ఆ సన్నివేశాల న్నింటిని జగదీశ్‌ గారు చాలా చక్కగా‘‘దుర్ల’’ కవితలో చూపించారు.‘‘దుర్ల’’ అంటే అర్థం కంది కొత్తల పండుగలో.. పూజలందుకున్న గొడ్డలమ్మను చుట్టు ప్రక్కల ఊర్లకు ఊరేగిం పుగా తీసుకు పోవడమే ‘‘దుర్ల’’. ఇది ఉత్సవం జరుగుతున్న గ్రామాలన్నీ ఒకేసారి జరుపు కుంటారు. ఒక గ్రామ దుర్ల సమూహం మరొక గ్రామ దుర్ల సమూహానికి ఎదురైనప్పుడు గానీ, కలిసి నపుడుగానీ అక్కడ కలిసి రెండు గొడ్డల మ్మలూ నృత్యం చేస్తాయి. ఒక గ్రామం మరొక గ్రామం తో నేస్తరికం చేయడం దీనిలో ఆం తర్యం. ‘‘దుర్ల’’ ఆదివాసీ సమూహాలలో స్నేహంకి, సౌభ్రాతృత్వంకి,బంధంకి… ప్రతీక. నేటి ప్రపంచీకరణ యుగంలో అడవి,కొండ స్థానాలు ఎలాఉన్నాయో ‘‘తూకం’’ కవితలో చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు.‘‘సంతదారిలో బరువెంతైనా బతుకు తూకంలో కొండెప్పుడూ తేలికే’’ అనే మాటలు పాఠకుల హృదయాన్ని ఆలోచింపజేస్తాయి. ఇది జగదీశ్‌ మాష్టారి దుఃఖం మాత్రమే కాదు యావత్తు ఆదివాసీ సమూహ దుఃఖం.పచ్చని చీరతో నిండుగా ఉన్న అడివితల్లిని విద్వంసం చేస్తున్న ప్పుడు ఉబికిన కన్నీటి దుఃఖం ఇది. కొండపై అంతటి అవ్యా జమైన ప్రేమను కలిగిన కవి మల్లిపురం. అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను తలచుకొని ‘‘ఏవితల్లీ!’’ అనే కవితలో తన మనసులోంచి తన్నుకొస్తున్న బాధను అక్షరాల్లో పొందుపర్చారు.‘‘ఏవి తల్లీ…నాఅడవితల్లీ!! నిన్న మోగిన తుడుం డప్పులూ…? ఏవి తల్లీ…నాకొండ తల్లీ!! నిన్న పాడిన నాసవర గీతాలూ…?ఏవి తల్లీ… నాపోడు తల్లీ!! నిన్న నాటిన నా కలల విత్తు లు…? ఏవి తల్లీ…నాకొండ మల్లీ…!! నిన్న వేసిన ధింసా అడుగులు…?ఏవి తల్లీ… నాజా కర తల్లీ…!! నిన్ను కొలిచే నావారేరి తల్లీ?’’ అంటూ అడివిలోని అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి,సంప్రదాయాలపట్ల ఆవేదనను వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇల్లులు కోల్పోయి, నిర్వాసితులైన ఆదిమ జాతి కన్నీళ్ళును ‘‘ముంపు కన్నీళ్ళు’’ పేరుతో చెప్పుకొచ్చారు..‘‘కట్టండి ప్రాజెక్టులు మా సమా ధుల మీద…మా చితి మంటల మీద… మా గుడిసెల మీద..మునిగిపోతున్న మా బతుకులమీద.. పోలవరం అంటే ప్రోజేక్టుడు కన్నీళ్ళు పోలవరం అంటే ములిగిపోయిన వెల జీవాలు పోలవరం అంటే చెరిగిపోయిన ఆదిమ ఆనవాళ్ళు పోలవరం అంటే మాయమైపోయిన ఒకానొక అరణ్యం’’ అంటూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని గురించి వారికి జరుగుతున్న నష్టాన్ని జగదీశ్‌ మాష్టారు చెప్పారు. తమ రచనలు, గేయాలు ఎప్పుడూ తమ జాతికి దిక్సూచి కావాలనే మనస్తత్వం కలిగిన వారు జగదీశ్‌ మాష్టారు. ఆ క్రమంలోనే ‘‘పాట దారి’’ అనే కవితను రాశారు. ‘‘పాటంటే ఒక ఆయుధం ఒక జీవన నాదం ఒక నిప్పుకణం నా దృష్టంతా రేపటి మీదే పల్లవి పదునైనదైతే చరణాలు వాటంతటవే వేడెక్కుతాయ్‌ పాట దానంతటదే రగులుకుంటుంది..పది మందికి దారి చూపు తుంది’’ అని వారి భవిష్యత్తు ఆలోచన క్రమాన్ని ఈ కవితలో చెప్పారు. మౌనంగా ఉంటే తమ జాతి ప్రజలకి ఎప్పటికైనా రాజ్యం ఏలే సమయం వస్తుంది అది ఎప్పుడో కాదు అతి త్వరలోనే వస్తుంది. తమ హక్కులు తాము అనుభవించే రోజులు దగ్గరగానే ఉన్నాయి అని ‘‘ఎదురు చూపు’’ కవితలో తన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
‘‘ఏదో ఒక రోజు…నీను కోరిన నా రాజ్జిము ఒస్తాది…నీనుండగానే ఒస్తాది ఆ నా రాజ్జిము సూసె ఎల్తాను అందాకా… ఎంత కష్టమైనా పడతాను గానీ పట్టొగ్గను… ఒగ్గనంతే… ఒగ్గను’’ అని తన ధృడ సంకల్పాన్ని ఈ కవితలో తెలియజెప్పారు. జగదీశ్‌ తన కథలు, కవిత్వం, గేయాల ద్వారా నిరంతరం గిరిజన యువతను చైతన్యపరుస్తునే ఉన్నారు. నిద్రాణమై ఉన్న తమ జాతి జనులను తన రచనల ద్వారా మేల్కొపుతూనే ఉన్నారు. తమ జాతి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ‘‘జాగో… ఆదివాసీ! జాగో!!’’ కవితలో తన వేదనని, ఆవేదాన్ని వ్యక్తం చేసారు. ‘‘పీక తెగి పడుతున్నా కొండలు తరగనీకు జాగో… ఆదివాసీ! జాగో!! అంటూ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చిన పడినా కొండను ఎవరినీ తాకనివ్వొద్దని గిరిజనులను తన గళంతో,కలంతో మల్లిపురం జగదీశ్‌ గారు హెచ్చరిస్తూ, చైతన్యపరుస్తున్నారు. ‘‘రంగులు మార్చే రాజకీయాల్ని గమనిస్తూ వుండు కొండలు వెనుక పులులూ సింహాలు తిరుగుతున్నాయ్‌ నిన్ను ఉద్దరిస్తాయని రంగుబట్టలేసుకొని నీ భుజమ్మీద చెయ్యేసి నీతోనే అడుగులెస్తుంటాయ్‌ సంక్షేమ పథకాల ప్లకార్డులు పట్టుకుని నీ వెనకే గోతులు తవ్వుతుంటాయ్‌ జాగో.. ఆదివాసీ! జాగో!!’’ అంటూ ఆదివాసీ జనులను తన కవిత్వంతో జాగృతపరుస్తున్నారు. గిరిజనులను అభివృద్ధి పేరట నాగరికులు చేసే మోసాన్ని, రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలను ఈ కవితలో జగదీశ్‌ గారు ఎండగట్టారు. గిరిజనులపై అటవీ అధికార్ల దాష్టీకాలు, పోలీసుల బెదిరింపులు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. వాళ్ళ చేతిల్లో ఆదివాసీలు ఎల్లవేళలా నలిగి పోతూనే ఉన్నారని మల్లిపురం జగదీశ్‌ ‘‘పోరు ఎప్పటికీ ఆగదు’’ అనే కవితలో ఎలుగెత్తి చెప్పారు. ‘‘యుద్ధం తప్పనిసరైనప్పుడు ఆయుధం అనివార్యమవుతుంది..అది ఎండు గడ్డి పరక వ్వచ్చు అక్షరమైనా కావచ్చు’’ అని తన అక్షరాన్ని ఆయుధంగా ప్రకటించి, తన ధిక్కార స్వరాన్ని నాగరిక ప్రపంచానికి వినిపించారు. ఆదివాసీ లపైన జరిగిన దాడులు ఇప్పటివి కాదు అని అవి తరతరాలుగా సాగుతూనే ఉన్నాయని ఈ కవితలో స్పష్టం చేసారు.‘‘వనాలనే కాదు వాసు లనూ నరకడమే ఒకానొక సంస్కృతి నేటిదా? తెగిపడ్డ ఏకలవ్యుని బొటనవేలు చెబుతుంది ఏనాటిదో! రాలిపడ్డ శూర్పనఖ ముక్కు చెవులు చెబుతాయి ఈ దమన కాండ ఎప్పటిదో!’’ అంటూ ఆదివాసీ సముహంపై అనాది నుండి జరుగుతున్న దాడులను కవి ఇప్పటికీ ఖండి స్తూనే ఉన్నారు. ప్రపంచమంతా దినదినాభివృద్ధి చెందుతూ సాంకేతిక పరిజ్ఞానంతో తేజరిల్లు తున్న కాలంలో కూడా కొండాకోనల్లో నివసిస్తూ అడివికే పరిమితమైన తమ జాతి స్థితికి, వారి బతుకుకి అద్దంపట్టే కవిత ‘‘మేము’’… ‘‘ఇప్పటికే నెట్టివేయబడ్డవాళ్ళం..అడుగు తీసి అడుగెయ్యని వాళ్ళం..అడవి నుంచి బయటకు రానివాళ్ళం..కొండాకోనల్లో ఇరికిపోయినవాళ్ళం ఊష్టమొస్తేలి ఎజ్జోడివైపే ఆశగా చూస్తున్న వాళ్ళం..డోలీల్లోనే రాళ్ళదారులు సాగుతూ ఆసుపత్రికి తరతరాల దూరంలో నిలిచిపోయిన వాళ్ళం’’ అని తమ జాతి వారికి ఇంకా సమృ ద్ధిగా చేరువలో వైద్యం అందక చనిపోతున్న గిరిజనులను చూసి చలించిపోతూ ‘‘శిలాక్షరాల దారిలో బిగించిన పిడికిలితో సిద్ధమయ్యాం ఒక వేకువ కోసం!!!’’ అంటూ తన ఆగ్రహాన్నిజగదీశ్‌ వ్యక్తం చేసారు. ఇన్నేళ్ళు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండి అడవికే పరిమితమైన మేము ఇప్పుడు మాట్లాడుతాం..ఎవరికీ భయపడేదే లేదని, ఇప్పుడు మాకు మాట్లాడే సమయం వచ్చిందని మల్లిపురం ‘‘మాట్లాడుతాం’’ కవితలో తన మాటలను తూటాల్లా ఈ కవితలో పొందు పర్చారు.‘‘మౌనం ఇప్పుడు నిషేధం మాట్లాడ్డం తప్పనిసరి ఇప్పుడు మాట్లాడ్డం అంటే ఆయు ధాల్ని సిద్ధం చేయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే నిశ్శబ్ధంగా మాటుకాయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే కొండను మింగేబోతున్నోడి పీకమీద అడుగెయ్యడమే’’ అని తమ జాతి ఆవేదనను తన గళం ద్వారా వినిపిస్తూ.. ‘‘మాట్లాడుతాం! మాట్లాడుతాం! కొండ మీద దీపాలు వెలిగేదాక మాట్లాడుతాం!! మా దీపా లు ఆర్పినోడి దీపం ఆరేదాకా మాట్లాడుతాం!!! అని ఇప్పుడు మీరు కాదు. మేము మాత్రమే మాట్లాడే సమయం. మేమే మాట్లాడుతాం అని తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఈ కవితలో వెల బుచ్చారు.మల్లిపురం జగదీశ్‌ మాష్టారులో ఉత్తరాంధ్ర యాస,వెటకారం,వ్యంగ్యం కలగ లసిన క్రియాశీల కవి. ఆయన వ్యంగ్యానికి నిదర్శనంగా ‘‘తేడా’’ కవిత నిలుస్తుంది.‘‘నీ అక్ష రాలు ఆకలిని చూడ్డానికి వెనకడుగేస్తాయి! నా అక్షరాలు ఆకలి తీర్చడానికి అంబలిని వుడకేస్తుంటాయ్‌!! నీ అక్షరాలు అధికారపు అహంకారాలు నా అక్షరాలు ఆకలి కేకల హాహాకారాలు’’ అంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు అని అన్నవాళ్ళకు ఈ కవిత గొప్ప కనువిప్పు.జగదీశ్‌ గారి భవిష్యత్తు ప్రణాళికకు,వ్యూహాత్మక రచనకు ప్రతీక ‘‘దుర్ల’’ కవితా సంపుటి. కవిగా తాను భవిష్యత్తులో చేయవలసిన పనులు, రచనలు మొదలైన విషయాలు అన్నీ ఇందులో సంపూ ర్ణంగా దర్శనమిస్తాయి.‘‘కలం’’ కవితలో ఆయన తాత్త్వికత కనిపిస్తుంది.‘‘గతం చీకటి వర్తమానం నెత్తురు భవిష్యత్‌ దహనం జ్వలనం నా కర్తవ్యం’’అని తాను నిరంతరం తమ జాతి కోసం వెలిగే దీపమై ఉంటానని, తమ జాతి నిర్మాణానికి నడుం బిగిస్తానని తన రచనల ద్వారా వ్యక్తంచేసారు. ఆదివాసీ సమూహాన్ని తన అక్షరాలతో నిరంతరం ఉత్తేజపరుస్తూనే ఉన్నారు జగదీశ్‌ మాష్టారు. ఆయన లక్ష్యం, గురి ఎప్పుడూ తమ జాతి ప్రజలకు జాగృత పరచడమే. ఆనేపథ్యం లోంచే పుట్టుకు వచ్చిన కవితా సంపుటి ఈ‘‘దుర్ల’’.ఈ సంపుటిలో‘‘సృష్టి’’ కవిత పాఠకుల్ని మరింత ఆకర్షిస్తుంది. ‘‘నా అక్ష రాలు వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు నాఅక్ష రాలు రాత్రికి రంగులద్దే డప్పు వరసలు నా అక్ష రాలు కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు నా అక్షరాలు కొండ దొంగ లపై ఎక్కుపెట్టిన శిలకోల మొనలు నా అక్షరాలు రేపటికి పదును పెట్టే నేటి కవితా పాద పద్యాలు నాకు కవిత్వమంటేఅరణ్యాలను సృష్టించడమే!’’ అంటూ తన కవిత్వం ఎప్పుడూ తమ జాతి జనులను చైతన్య పరచడం కోసమే నిర్మించబడుతుంది అని ఎలుగెత్తి చాటి చెప్పారు. అడవులలో, కొండలలో నివసించే గిరిజనుల బతుకు చిత్రాలను తన కవితలలో జగదీశ్‌ మాష్టారు చూపించారు. గిరిజనుల సంస్కృతిని, అడవి సౌందర్యాన్ని ఒకవైపు చూపిస్తూ, పెత్తందార్లు, పెట్టుబడిదార్లు, షావుకార్లు, నాగరికులు, రాజకీయ నాయకులు వచ్చి గిరిజనుల సంపదను దోచుకుని, కొండను ఆక్రమించుకొని, ఆ కొండకు వాళ్ళని దూరం చేసే దుర్మార్గ సన్నివేశాల్ని మరో వైపు బలంగా చూపించారు. ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని వ్యతిరేకిస్తూ తమ జాతికి జరుగుతున్న అన్యాయాలను అక్షరీకృతం చేస్తున్న పదునైన కలం జగదీష్‌ మాష్టారిది.కవిగా జగదీష్‌ మాష్టారు మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగా మాట్లాడి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. తమ జాతి హక్కుల కోసం, ప్రగతి కోసం తన రచనలు సాగిస్తాడు.‘‘దుర్ల’’ కవితా సంకల నంలో ప్రతి కవితా సభ్య సమాజానికి ఒక ప్రశ్నే. ప్రతి కవితా చైతన్య గీతమై సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఇంత మంచి కవితా సంక లనాన్ని తను పుట్టి, పెరిగిన‘‘పి.ఆమిటి’’ గ్రామా నికి అంకితం ఇవ్వడం ఆయనలోని కృతజ్ఞతకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అదే గ్రామంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో జాకరమ్మ తల్లి ఎదుట ఎజ్జోడు(పూజారి) మంత్రాల నడుమ గ్రామ ప్రజలందరి మధ్య ఆవిష్కరణ జరిపి తన భక్తిని, విశ్వాసాన్ని నిరుపించుకుని మరో అడుగు ముందుకేసారు. ఈ ‘‘దుర్ల’’ కవితా సంపుటి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినదే అయినా దాని వెనుక గిరిజనుల అవస్థలు, వారిపై పెత్తందార్లు, షావుకార్ల, రాజకీయ నాయకులు దోపిడిని ఇతర వర్గాలు కూడా గమనించాల్సిన అవసరాన్ని కవి చెప్పకనే చెప్పారు. జగదీశ్‌ కేవలం గిరిజన కవి మాత్రమే కాదు. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వాటిపై ప్రతిస్పందించడమే గాక, వాటికీ అక్షర రూపమిచ్చి సమాజంలోని రుగ్మతులను రూపుమాపాలని తపనపడే కవి మల్లిపురం.- సారిపల్లి నాగరాజు ,8008370326

కొమరం భీమ్‌

అయనో అగ్గిబరాట … ఆదివాసీల అగ్గిరవ్వ..గెరిల్లా పోరాటంలో మడమతిప్పని యోధుడు..జంగ్‌ సైరన్‌తో నిజాం సర్కారు గుండెల్లో ధడ పుట్టించిన గోండు బిడ్డడు జల్‌,జంగల్‌,జమీన్‌ నినాదంతో గిరిజన హక్కుల కోసం తన చివరి శ్వాస వరకూ పోరాడిన మహనీయుడుకొమరం భీం నిజాం పాలకుల నిరంకుశత్వానికి..అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను.జల్‌,జంగిల్‌,జమీన్‌ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను.గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడతను. ఇప్పటికీ అడవిబిడ్డల గుండెల్లో కొలువైన ఆవ్యక్తే కొమరంభీమ్‌.ఆమహా నీయునిపై ఎస్‌.ఎం.ప్రాణ్‌రావు రచించినకొమరంభీమ్‌నవల.ఇది పక్క పరిశోధక నవల కావడంతో ప్రముఖ సాహిత్యవేత్త, గిరిజన కథావిశ్లేషకులు..డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు గారు రాసిన అత్యాంత విలువైన సమీక్షా వ్యాసం ఇది.వారివిలువైన సమయాన్నికేటాయించి..శ్రమించి మన థింసా పాఠకులకోసం ఈసమీక్ష వ్యాసాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు- ఎడిటర్‌
దక్షిణ భారతదేశ గిరిజన పోరాటయోధుడు, దమ్మున్న ఆదివాసి అమరుడు, కొమురం భీం.. సుమారు 1901లో జన్మించి 1940లో వీర మరణం చెందిన ఈఅడవి బిడ్డ జీవించిన కాలం నాలుగు పదులే అయిన తరతరాలకు స్ఫూర్తిని పోరాట విలువలను అందించడమే కాక తమ గోండు జాతి వికాసానికి కారకుడ య్యాడు.తాను చేసిన భూపోరాటం తన కాలం లో కాకపోయినా తదనంతర కాలంలో విజ యం సాధించి లక్ష్యాన్ని చేరుకుంది. తను ఏనైజాం రాజ్యపాలకుల అరాచక పాలనపై తిరుగుబాటు చేశాడో ఆ నైజాం ప్రభువులు కొమరం భీం చేసిన సంఘటిత పోరాటానికి తన జాతి కష్టార్జిత సంపద అడవులు, భూముల,రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగానికి పశ్చాత్తాపం చెంది ఆప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రముఖ మానవ శాస్త్రవేత్త ‘‘హైమన్‌ డార్ప్‌’’ నేతృత్వంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. అది అంతటితో ఆగకుండా తదనంతర పాలకులు కూడా ఆగిరిజన అభివృద్ధి పథకాలు కొనసాగిస్తూ గిరిజన హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో వారి అభివృద్ధికి పాటు పడుతున్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో గల అధిక సంఖ్యాకులైన ఆదివాసీ తెగ ‘‘రాజ్‌ గోండు’’ స్వాతంత్రానికి పూర్వం నైజాం పాలనలో గోండుజాతి గిరిజనులు అనుభ వించిన శ్రమదోపిడి,జీవన అస్తిత్వం,మొదలైన పీడనలు,పాలకులు ప్రజల మధ్య వారదులైన అధికారులు,గుత్తేదారులు,నిత్యం అక్కడ గిరిజ నులపై చేసే దౌర్జన్యాలు,విద్రోహాలు,కారణంగా రాజుకుందే ఆ‘‘గోండు పోరాట జ్వాల’’.దానికి ముందుండి నడుం బిగించి తనజాతి అభివృద్ధి కోసం ఆహుతైన అగ్నికణమే ‘‘కొమరం భీమ్‌’’. అక్కడ జరిగింది భారీపోరాటం..కానీ నాటి పాలకుల దృష్టిలో అదిఒకస్థానిక పోరాటం గానే మిగిలిపోయింది.
స్వాతంత్య్రానంతరం జరిగిన గిరిజన వికాసంలో భాగంగా, అభివృద్ధి చెందిన సాహిత్యం సాక్షిగా,అల్లం రాజయ్య,సాహు , వంటి సామాజిక స్పృహగల రచయితల సాయంగా ..‘‘కొమురం భీం’’ చేసిన పోరాట పటిమ సభ్యసమాజానికి చేరడమేకాక,స్థానిక పోరాట యోధుడి,చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా జాతీయ చరిత్రలో భాగమైంది.
ఆంధ్రదేశ గిరిజన పోరాటాల్లో అగ్రభాగంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పోరాటం, దానిలో సీతారామరాజు బ్రిటిష్‌ పాలకుల చేతుల్లో అమరుడైన ఆయన నింపిన పోరాట స్ఫూర్తి గిరిజనుల్లో చక్కని చైతన్యంకలిగించింది. కొమరంభీమ్‌,అల్లూరి సీతారామరాజుల,జీవిత కాలాలు,ప్రాంతాలు,ఒకటి కాకపోయినా,వారి లక్ష్యాలు మాత్రం ఒకటే! వారు జీవించింది కొద్ది కాలమే అయినా అనంతకాల స్ఫూర్తిని ఖ్యాతిని సొంతం చేసుకున్న త్యాగమూర్తులు వారు. కొమరంభీం త్యాగ చరిత్ర వెలుగు చూడటానికి ఆలస్యమైనా అతనిదే అసలైన పోరాటం,రన్‌ గేమ్స్‌ కం తన అమరత్వానికి ప్రతిఫలంగా తన జాతి హక్కులు,స్వేచ్ఛ,పొంది ఆర్థికవిద్య అభి వృద్ధి సాధించి తద్వారా సామాజిక గౌరవం పొందుతుంది. గిరిజనజాతి సంస్కృతిపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగడానికి కారణం అయింది. ప్రారంభంలో కేవలం మౌఖిక సాహిత్యంగా మాత్రమే ఉండి ఆదిలాబాద్‌ గోండల గుండె గదుల్లో గుడి కట్టు కుని ఉన్న ‘‘భీమ్‌ పోరాట గాథ’’ పత్రికల పరంగా సభ్య సమాజంలో పాదం మోపిన, తెలియాల్సినంతగా తెలియలేదు.
1990లో విస్తృత ప్రచార సాధనమైన సినిమాగా కొమరం భీమ్‌ కథ సినిమాగ చిత్రీకరించబడ్డ అది విడుదల కావడానికి మరో 20 సంవత్సరాలు పట్టి విడుదలైన చిన్న చిత్రాల జాబితాలో చేరి, ఆచిత్ర లక్ష్యం అందరికీ చేరకుండానే తెరమరుగైంది. అయినా ఆ సినిమాకు కథ మాటలు రాసిన ప్రముఖ చారిత్రక నవలా రచయిత, నల్లగొండ వాసి ఎస్‌.ఎం.ప్రాణ్‌ రావుటసర బాద ముఖ్య ప్రాణ్‌ రావుఊ కలం నుండి పరిశోధనాత్మక నవల ‘‘కొమరంభీమ్‌’’ వెలువడిరది. తెలుగు సాహిత్యానికి ఒక ప్రామాణిక నవల దక్కింది. సినిమా చిత్రీకరణలో భాగంగా భీం నివాస ప్రాంతం, నైజాం పోలీసులతో పోరాటం జరిగిన వీర భూమి,జోడేఘాట్‌, కొమరం భీమ్‌ భార్య సోంబాయి నివాస ప్రాంతం ‘‘దో బె’’ తదితర గిరిజన గ్రామాలు స్వయంగా సందర్శించి భీమ్‌ సమకాలికులతో ముఖ్యంగా భీమ్‌ భార్యతో ముచ్చటించి ఆనాటి పరిస్థితులు, భీమ్‌ వ్యక్తిత్వం,తదితర అంశాలు ప్రత్యక్షంగా చెప్పగా విని రచయిత ఈనవల రాశారు. ‘‘అవ్వల్‌’’ తాలూక్దారు… అబ్దుల్‌ సత్తార్‌… జోడేఘాట్‌లో భీం నాయకత్వంలో జరిగిన గోండు పోరాటానికి సంబంధించిన కాల్పుల గురించి పై అధికారులకు రాసిన నివేదిక పత్రాల ఆధారాలు,‘‘ముషిర్‌- ఎ- డక్కన్‌’’ పత్రికలో 05 అక్టోబరు 1940 తేదీన ప్రచురించబడ్డ వార్తాకథనాలు ఈ నవలకు అధికార ధ్రువపత్రాలు గా చెప్పవచ్చు. ఇక నవల శైలి చారిత్రక కథనంకు అద్దం పడుతుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌ అడవుల్లో నియంత నిజాం సర్కారు,అతని గుత్తేదారులు,ప్రభుత్వ ఉద్యో గులు,అమాయకత్వానికి చిరునామాలైన అక్కడి గిరిజనులపై చేసిన మోసాలకు ప్రతిరూపంగా ఈ నవల ఆద్యంతం కొనసాగుతుంది. ఒకవైపు నవల కథనం కొనసాగుతూనే,మరోవైపు అంతర్భాగంగా సందర్భోచితంగా గోండు జాతి గిరిజనుల సాంప్రదాయ పండుగలు,జాతరలు, వారాంతపు సంతలు, మొదలైన వారి వారి సాంఘిక జీవన చిత్రాలు సంక్షిప్త రూపంగ అందించడంలో రచయిత సామాజిక దృష్టి స్పష్టమవుతుంది. ఈ నవలలో మరో ప్రాముఖ్యత….కొమురం భీం గురించిన గత విశ్వాసాలు నిరాధార విషయాలను తేటతెల్లం చేయడం. ఇందులో భీమ్‌ వ్యక్తిత్వం, పోరాటపటిమ,వాక్‌ చతురత,అతను మాతృభాష గోండుతో పాటు తెలుగు భాష నేర్చుకోవడం, ముఖ్యంగా తమ జాతి జనావళిలో తన పోరాటంపట్ల, తనపట్ల,నమ్మకం కలిగించ డంలో చేసిన నాయకత్వకృషి,మొదలైన విషయాల నూతన కోణాలు దీనిలో ఆవిష్కృతం అవుతాయి,నూతన నాయకత్వందారులకు ఈ నవల ఆదర్శంగా నిలుస్తుంది.ఈ నవలలో ప్రధాన పాత్ర కొమరంభీం. అతని చిన్నతనంలో తమ వంశస్థులు రాజులుగా ఉండి పాలన చేసిన వారు, ప్రస్తుతం పాలితులుగా ఉండి బాధలు అనుభవిస్తున్న తీరు..బ్రిటిష్‌ పాలకుల ఆదేశాల ప్రకారం నిర్మల్‌ తాలూకా దార్‌, రాంజీగోండును 1860లో నిర్మల్‌లో ఉరి తీసిన ధీనగాథలు,తన కులగురువులైన’’ప్రధాన్‌’’ల గేయాల ద్వారా విన్న యువ భీమ్‌..లో..తమ జాతి స్వేచ్ఛకై పోరాట బీజాలు నాటు కుంటాయి. భీమ్‌ ప్రధాన నాయకత్వానికి సహాయకులుగా,కురంగ రాము, కురిసెంగ సాము, కుమార లింగు, ఆత్రంరఘు, మడవి సోము, రాజు పటేల్‌, తదితరులు ఉండగా ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు రెండు రెండు ఉన్నాయి. ఒకటి భార్య సొంబాయి, ముఖ్య అను చరుడు రాము భార్య జంగుబాయి,నిజాం పాలకుల పక్ష అధికారులైన అబ్బాస్‌ అలీబేగ్‌, సిద్దఖి, హజర్‌ హాసన్‌, పట్వారీ దేశ్‌ పాండే, లు.. గోండు ప్రజలను చిత్రహింసలకు గురి చేసిన క్రూర పాత్రలుకాగా, పైకాజి, మహ్మద్‌ ఆలీ, లు భీమ్‌ పోరాటంలోని న్యాయ, ధర్మం గురించి ఆలోచించిన సౌమ్య పాత్రలు. తిర్మాజి అనే పత్రికా సంపాదకుడు భీమ్‌ పోరాటానికి చేయుత నిచ్చిన అక్షర సేనాని. ఇక గోండు జాతికి చెందిన ‘‘కుర్దూ’’ దురాశతో స్వార్థంతో పటేల్‌ పదవికి ఆశపడి భీమ్‌ పోరాట వ్యూహాలు, నైజాం పోలీసులకు చేరవేసే వెన్నుపోటు దారుడుగ చిత్రించబడ్డాడు. ఈ నవలలో అత్యంత ప్రధాన ఘట్టం ‘‘జోడేఘాట్‌’’ కేంద్రంగా గోండులకు నైజం సైన్యానికి జరిగిన యుద్ధం, కొమరం భీం సంఘటిత నేతృత్వానికి భయపడిన నిజాం అధికారులు కుట్రలో భాగంగా భీమ్‌ కు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడానికి ఆశ చూపిన, నిస్వార్ధంగా దాన్ని తృణప్రాయంగా తిరస్కరించి తన యావత్‌ జాతి సముద్దరణ ప్రధాన ధ్యేయంగా.. పోరాటానికి సిద్ధం అవుతాడు. ప్రతి ఘట్టంలో భీమ్‌ పాత్రను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చిత్రించడంలో రచయిత నేర్పు అక్షర అక్షరాన అగుపిస్తుంది, తన అనుచర వర్గంలో ఆత్మస్థైర్యం నింపడంలో భీమ్‌ కృషి, మాటల తీరు, రచయిత దృశ్యిక రించిన వైనం అద్భుతంగా సాగుతుంది. ఆధునిక ఆయుధాలు కలిగిన నైజాం సైనికులతో ఆత్మస్థైర్యంమే ప్రధాన ఆయుధంగా సాధారణ ఆయుధాలతో అసాధారణమైన పోరాటం చేసిన భీమ్‌ యుద్ధ నైపుణ్యంను కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించిన తీరు కూడా ఆచరణీయం, కథ చారిత్రాత్మకమైన వాస్తవ చిత్రాలతో పాఠకులను ఆనాటి కాలానికి నడిపించుకుంటూ వెళుతుంది ప్రత్యక్షంగా ఎదిరించలేక నిజాం సైన్యం కుట్రదారుడు అయినా కుర్దూ సహకారంతో భీమ్‌ స్థావరాలపై అర్ధరాత్రి దాడి చేసినిప్పు పెట్టి, భీంను అతని అనుచర గణాన్ని అంతం చేసిన నైజాం పోలీసు మూక విజయగర్వంతో వెనుతిరుగగా, ఏడాది కొడుకును ఎత్తుకొని వచ్చి ఆరని మంటల వెలుగుతున్న భర్త మృతదేహం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని, భర్త మొహాన్ని కడసారి చూసుకుని, వెలుగుతున్న దివిటీని ఒక చేత, ఏడాది కొడుకుని చంకలో ఎత్తుకుని భీమ్‌ భార్య ‘‘సొమ్‌ బాయ్‌’’ అడవిలోకి వెళ్ళి పోవడంతో నవల ముగుస్తుంది. ఒక వీరుడి మరణం తో పోరాటం ఆగదనే అక్షర సత్యాన్ని భీమ్‌ జీవన చిత్రం ద్వారా అనితర సాధ్యంగా చెప్పడంలో రచయిత కృషి విశేషంగా ఉంది, మనకున్న అనేక చారిత్రక నవలల్లో ఒక భిన్నమైన, నిజమైన, చారిత్రక నవల ఈ ‘‘భీం నవల’’ అక్షరీకరించిన రచయిత కృషి ఎన్నటికీ వన్నె తగ్గదు. డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు

ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేక అమ్మివేసే (దీనినే -వ్యూహా త్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రి యను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలు విధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భార తీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిం చడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంత వాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేం దుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు,ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించ కూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా,బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కార ణంగా విద్యుదుత్పత్తి,ట్రాన్స్‌మిషన్‌,రైల్వేలు, జాతీయ రహదారులు,పెట్రోలియం,ఫార్మాస్యూటికల్‌, నౌకా శ్రయాలు,ఎయిర్‌పోర్టులు,వంటి వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం,బ్యాంకుల నుంచి రుణా లు,కార్మికులు,ఉద్యోగుల శ్రమవగైరాలతో ఈ సంస్థ లు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబం ధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాట య్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపి ఎల్‌ ఏర్పాటు కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్నను సరించి ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. మోదీ సర్కార్‌ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్య తను అప్పగించింది. 38సంస్థలను ప్రైవేటీకరిం చాలని,26సంస్థలను మూసివేయాలని,10 సంస్థ లను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు,ఆసంస్థకు ఉన్నభూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడిరచాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్‌ 2016 మార్చి4నచేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజ మాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈసూత్రాన్ని విస్మరించడం పలు అను మానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండిరటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌ పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వ హించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాలవల్ల ఆ రెండు సంస్థ లను గౌతమ్‌అదానీ,ముఖేష్‌అంబానీ,అనిల్‌ అంబా నీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, ఎంఎల్‌ఎల రాజీనామాలు,32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 30వేలఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కిందఉంది. ఆభూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది.మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమా చారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షలకోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేలకోట్ల రూపాయలకే అమ్మి వేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందు కు, విద్యా,వైద్యరంగాలలో ఖర్చుచేయడానికి విని యోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం,‘మానిటైజేషన్‌ పై ప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013-14నాటికి బ్యాం కులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తంరూ.2.05 లక్షల కోట్లు ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018-19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న10కోట్ల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీపరిశ్రమల రంగం లో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ 1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూ జన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్ల లో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్‌ కేవలం ఐదేళ్లలో రూ 3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ 88లక్షల కోట్లు ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.బ్రిటీష్‌ హయాంలో పలు రూపా లలో భారతీయ సంపదను తరలించుకు పోయిన కారణంగానే, కొద్దిశతాబ్దాల క్రితం ప్రపం చంలోనే అత్యధిక జిడిపిగల భారత్‌, స్వాతంత్య్రం పొందే నాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించు కున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త:మాజీ వ్యవ సాయశాఖ మంత్రి, మాజీ లోక్‌ సభ సభ్యులు)
‘సామాన్యులపై ప్రభావం ఏమిటో చెప్పడం లేదు’
` ప్రొ.బిశ్వజిత్‌ ధర్‌
విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటినితమ లాభాల కోసం నడుపు తారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మో శారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభు త్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
‘’పని చేస్తున్న’’ (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బద లాయించడం ద్వారా ‘’నిరర్ధకంగా’’ (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ‘’అదనపు ప్రయోజనా లను పొందుతాం’’- ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ. ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకం గా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండిరట్లో ఏదో ఒకటే సాధ్యం. రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ‘’పని చేస్తున్న’’, ‘’నిరర్ధక’’ ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?
రెండో సందేహం : ఈ ‘’అదనపు ప్రయోజనాలు’’ సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా? మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమ కూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ? మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘’పని చేస్తున్న’’ ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు,400 రైల్వే స్టేషన్లు, 90పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమా లయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఇవన్నీ ‘’నిరర్ధక ఆస్తులు’’ కానే కావు.
ఇటువంటి విలువైన ఆస్తులను మానిటై జ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండ బోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియ జేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజ నాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజ లకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముం దు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాలకోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటిధరలను నియంత్రించే అధి కారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రిం చాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
ఢల్లీి అనుభవం ఏమిటి ?
దేశ రాజధాని ఢల్లీి లో విద్యుత్‌ పంపి ణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరిం చారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండివసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢల్లీి ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో,కాకుంటే అదనపు పన్నుల రూపం లోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?
మన దేశ జిడిపికి,వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20లో17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు. అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి?కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో40శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటు వంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏలాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అదికాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించ కుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది.ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ? అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతిఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు.బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా?లేకనష్టాలా?ఈమాత్రం ఆలోచించ లేకపోతోందా ఈ ప్రభుత్వం?
( వ్యాసకర్త – జెఎన్‌ యు ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌’ లో ప్రొఫెసర్‌)/ ‘ది హిందూ’ సౌజన్యంతో
వడ్డే శోభనాద్రీశ్వరరావు

దేశ రక్షణ పోరాటంలో ఆదివాసీలు భాగం కావాలి

స్వాతంత్య్రానంతరం భారతదేశం నిర్మించుకున్న పరిశ్రమలు,ఆర్థిక సంస్థలైన ఇన్సూ రెన్స్‌, బ్యాంకులు, కోట్ల మంది ప్రయాణ సాధనమైన భారతీయ రైల్వేలు,పెట్రోలియం,గ్యాస్‌,విద్యుత్‌ ఇంధన సంస్థలు,విద్య,వైద్యంతో సహా సర్వమూ మోడీ ప్రభుత్వం దేశ,విదేశీ కార్పొరేట్లపరం చేస్తు న్నది. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన స్వదేశీ రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వరంగాల్ని అప్పగిస్తున్నది.వ్యవసాయ రంగా న్ని దేశ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టేం దుకు మూడు వ్యవసాయచట్టాలు చేసింది. కార్మి కులు, రైతులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు చేసింది. నిరసన తెలియజేసే హక్కు లేకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కంటే ప్రమాదకర‘ఉపా’ చట్టాలు చేసింది. ప్రజాస్వా మిక పునాదులపై దాడికి దిగింది. అమా యకులైన ఆదివాసీల పక్షాన నిస్వార్ధంగా నిలుస్తున్న హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తోంది. జీవిత మంతా గిరిజన హక్కుల కోసం పోరాడిన 80 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌స్వామిని జైల్లో పెట్టి చంపేసింది. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడంతో ‘భారత దేశాన్ని రక్షించండి’ అంటూ కార్మికులు, రైతులు ఆగస్టు 9న ప్రభుత్వ ఆఫీసుల దిగ్భ్రందించారు. ఏజెన్సీ లోని విలువైన గనులు, ఖనిజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేయని కుట్రల్లేవు. ఆ కుట్రలకు కళ్లెం వేసేందుకు, కార్పొరేట్‌ శక్తులు అడవిలో అడుగు మోపకుండా అడ్డుకొనేందుకు ఆదివాసీలూ దేశ రక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలి.
అటవీ సంపద కార్పొరేట్‌ పరం
ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్‌ రాని భయంకరమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతోంది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌, అస్సాం,హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజను లను జైల్లో నిర్బంధించాయి. జార్ఖండ్‌లో 10 వేల మంది గిరిజనులపై గతంలో రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేసింది. ఆదివాసీలను ఉద్దరిస్తామని గద్దెనెక్కి ద్రోహానికి పాల్పడుతున్న పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాలి. ఆది వాసీల హక్కులు దెబ్బ తీయబోమని, అటవీ సంప దను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ప్రకటించేలా ఆదివాసీలు గొంతు విన్పించాలి.
రిజర్వేషన్లు గల్లంతు
ఆదివాసీలకు, దళితులకు ఉద్యోగ భర్తీలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. మోడీ ప్రభు త్వం వారికిప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది. జింక్‌, బాల్కో పరిశ్రమలను వాజ్‌పేయి ప్రభుత్వం దెబ్బ తీసింది. విశాఖ స్టీలుప్లాంట్‌ సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మి తీరుతా మని మోడీ శపథం చేస్తున్నారు. 42 రక్షణ పరిశ్ర మలు అమ్మకానికి పెట్టారు. జీవిత బీమా(ఎల్‌ఐసి), జనరల్‌ ఇన్సూరెన్స్‌ రెండిరటినీ అంతం చేయ డానికి లోక్‌సభలో బిల్లుపెట్టారు. బ్యాంకులు కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తామని నిర్ణయం చేశారు. విద్యుత్‌ పంపిణీ కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చే చట్టం చేసింది. రైల్వేలో కొన్నిరూట్లు, కొన్ని స్టేషన్లు, రైల్‌ ఇంజన్లు, బోగీల నిర్మాణం ప్రైవేటుకు ఇచ్చే సింది. రైల్వేలో 3లక్షల ఉద్యోగులను తీసివేస్తామని ప్రకటిం చింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కానప్పుడు రిజర్వే షన్లకు విలువేం వుంటుంది? రిజర్వేషన్లు రాజ్యాం గంలో చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఆచరణలో ఉండవు.
ప్రపంచబ్యాంకు బాటలో జగన్‌ ప్రభుత్వం
పాదయాత్ర, ఎన్నికల సందర్భంలో అధి కారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.80లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యా యం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట తప్పరు, మడమ తిప్పరని యువత నమ్మా రు. జాబ్‌ కేలండర్‌ విడుదలతో జగన్‌ ప్రభుత్వం అసలు నైజం బయటపడిరది. యువతలో ఆగ్రహం కల్గించింది. రాష్ట్రంలో 2.35లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ నివేదిక ఇస్తే జగన్‌ 10వేలు ప్రకటించి యువత విశ్వాసంపై నీళ్లుజల్లారు. గ్రామ సచివాలయాల పోలీసు కానిస్టే బుళ్లతో లెక్క సరిపెట్టేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఊసెత్తలేదు. టీచర్లు లేక జివికే స్కూళ్లు మూతపడ్డాయి.స్పెషల్‌ డిఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తుంటే డిఎస్సీనే జగన్‌ లేపేశారు. మోడీ వలె ఉద్యోగులను తగ్గించే పనిలో జగన్‌ ఉన్నారు. ప్రపం చ బ్యాంకు చెప్పినట్లు రెగ్యులర్‌ ఉద్యోగులను తగ్గించి తక్కువ వేతనాలు, హక్కుల్లేని వారితో పనిచేయించు కోవాలని జగన్‌ ప్రభుత్వం చూస్తున్నది.
జీవో3రద్దు ఆదివాసీ రాజ్యాంగ హక్కును కాల రాయడమే
జీవో3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతిన్నది. ఏజన్సీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ హక్కు పోయింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ స్పందించలేదు. ఆ ప్రయత్నం చేయకపోగా ఒక పైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆదేశాలు ఇవ్వడం గిరిజనులను మోసం చేయడమే. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు డిఎస్సీలో సెలెక్ట్‌ అయిన వారికి టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే బిజెపి వైఖరికి జగన్‌ ప్రభుత్వం బాసటగా నిలబడిరది.
షెడ్యూల్‌ ఏరియాలో అర్హత గల గ్రామాలను కలపాలి
యాభై శాతం పైన గిరిజనులు వుండి, 5వషెడ్యూల్డ్‌ ఏరియాకు ఆనుకొని వున్న గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపే ప్రయత్నం జగన్‌ ప్రభు త్వం చేయడంలేదు. రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అర్హత వున్న గ్రామాలన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని డిమాండ్‌ చేయడంతో,సమగ్ర సర్వే జరిపి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పష్ప శ్రీవాణి ప్రకటించారు. నిజంగానే చేస్తారని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. భూమి, జనాభా రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన సర్వేను ఏళ్లు గడుస్తున్నా చేయడంలేదంటే వైసిపి ప్రభుత్వంపై భూస్వాములు, గిరిజనేతర పెత్తందార్ల ఒత్తిడి వుందని అర్ధమ వుతుంది.
పోలవరం నిర్వాసితులనునిలువునా ముంచేశారు
గనులు తవ్వినా, ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నిర్మించినా నిర్వాసితులు నిలువ నీడ లేకుండా పోతున్నారు. పోలవరంలో ముంచే యడం ఖాయమని తెలిసి, గ్రామ సభల్లో ప్రాజెక్టు వద్దని గిరిజనులు తీర్మానాలు చేశారు. గిరిజన గ్రామ సభలు ప్రాజెక్టు అంగీకరించినట్లు తీర్మానా లు తారుమారు చేసి రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. రోజూ పోలవరంపై సమీక్ష చేసిన చంద్రబాబు లక్ష గిరిజన కుటుంబాల పునరావాసం గురించి 5ఏళ్లలో ఒక్క రోజూ సమీ క్షించలేదు. మొత్తం పునరావాసానికి అయ్యే ఖర్చు రూ. 33 వేల కోట్లు ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయం అని వాగ్దానం చేసిన జగన్‌ గిరిజనులను ప్రాజెక్టులో నిలువునా ముంచేశారు. పోలవరం నిర్వాసితులను బిజెపి, టిడిపి, వైసిపి దారుణంగా మోసం చేశాయి. గిరిజనుల బతుకులు, వారి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు.
కార్మిక, కర్షక ఉద్యమంలో భాగం కావాలి
మోసపు మాటలతో గిరిజనులకు నష్టం,కష్టం కలిగించడమే గాక దేశ, విదేశీ కార్పొ రేట్లకు ఆదివాసీలను బలిచ్చే చర్యలు మానుకోవాలి. ఆదివాసీల భూమిని కార్పొరేట్లుకు ఇవ్వరాదు. విద్య,వైద్యం,పరిశ్రమలు,రైలు,బ్యాంకులు,ఇన్సూరెన్స్‌, విద్యుత్‌,వ్యవసాయం కార్పొరేట్లకు ఇవ్వొద్దు … అని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నినదిం చాలి. పోలవరం నిర్వాసితులకు పునరావాసం యుద్ధప్రాతిపదికన కల్పించాలి. జీవో 3పై రాష్ట్ర పతి ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజ నుల రాజ్యాంగ హక్కును కాపాడాలి. 50 శాతానికి పైగా జనాభా వున్న గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి.స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయా లి …అని దేశ రక్షణ కోసం ఆగస్టు 9న మండ లాఫీసు వద్ద జరిగే ధర్నాలో గిరిజనులంతా భాగస్వాములు కావాలి.
-ఎం.కృష్ణ మూర్తి

భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా?

భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు హన్సా మెహతా, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌ కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహ మాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ లోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతా లకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి. వారి జీవిత భాగస్వా ములపైన కిడ్నాప్‌, అత్యాచారం,‘లవ్‌ జిహాద్‌’ కేసులు మోపి జైలుపాలు చేస్త్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే…స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనో లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడు లలోనో హత్యకు గురవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌ కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతం లోకి మారాలనుకోవడంతో కాశ్మీర్‌ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ సిక్కు నాయకులు ఇవన్నీ ‘’లవ్‌ జిహాద్‌’’ నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయక హిందూ, సిక్కు బాలికలను వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌ లో సంపాదించిన డబ్బుతో క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతం లోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ మొదట ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ భావావేశ ద్వేషభావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి నదురుగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్‌ జిహాద్‌ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఇటీవల సిక్కు మహిళలను (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత) లవ్‌ జిహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మత ప్రచారంలోకి లాగారు. ‘లవ్‌ జిహాదీ’ల బాధితులుగా గుర్తించిన సిక్కు మహిళలలో, పద్దెనిమిది సంవత్సరాల మన్‌మీత్‌ కౌర్‌ కూడా వుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి,29 సంవత్సరాల ముస్లిం యువకుడు షాహీద్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకు న్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ…పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకెళ్ళారు. పోలీసు చర్యలు మన్‌మీత్‌ కౌర్‌ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతం లోకి మారడం, షాహీద్‌ ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్‌ లు షాహీద్‌ కుటుంబం దగ్గర వున్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను షాహీద్‌ కుటుంబంతో వెళ్ళనివ్వలేదు. ఆమెను లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, షాహీద్‌ ను పోలీసు కస్టడీ లోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురికొల్పింది ఢల్లీి సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌ కు చెందిన మంజీందర్‌ సింగ్‌ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. మన్‌మీత్‌ కౌర్‌ వ్యవహారం లవ్‌ జిహాద్‌ కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్‌ చేసి అరవయ్యేళ్ళ ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని గతంలో బిజెపి లో ఉన్న సిర్షా ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్‌మీత్‌ కౌర్‌ తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. సిర్షా ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి హైకోర్టులో మన్‌మీత్‌ కౌర్‌ ఏం చెప్పిందనేది అధికారికంగా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ, మరో మహిళ దన్‌మీత్‌ కౌర్‌ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. 30 ఏళ్ళ తన భర్త ముజఫర్‌ తనను బెదిరించి కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలు చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని ఆమె వీడియోలో తెలిపింది. ‘నా హక్కులు నాకు తెలుసు. మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుస’ంది. ఆమె జూన్‌ 6న ఇల్లు వదిలి, తన కోసం వెతకొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పెట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతం లోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి ముజఫర్‌ ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నాడు.
తన ‘’సిక్కు బిడ్డలను’’ కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురిచేసిందని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లో మాదిరిగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బిజెపి అభిప్రాయపడిరది. కానీ, సిక్కు మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే క్రమంలో… వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల…జమ్మూ, కాశ్మీర్‌ లో అనేక మంది మహిళలు బహిరంగంగా విచారాన్ని వ్యక్తం చేశారు.
మహిళ మతానికి చెందిన ఆస్తి కాదు
‘మహిళలను ఒక ‘’మతానికి చెందిన ఆస్తిగా’’ పరిగణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు అండగా నిలిచే సంస్థలేమీ లేవు. పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారు’ అని జమ్మూ, కాశ్మీర్‌ కు చెందిన ఇఫ్రా జాన్‌ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే స్థితిలో లేవు. మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక వ్యక్తితో స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి. ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే ‘లవ్‌ జిహాద్‌’ లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు. ‘వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే. ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని’ వారు అన్నారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వారికి తమ సంఫీుభావాన్ని ప్రకటించి, మత పెద్దల బాధితులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.-(‘ది హిందూ’ సౌజన్యంతో),హర్ష మందిర్‌

భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌

సాతంత్య్ర దినం..అమరుల త్యాగఫలం

‘‘ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలు స్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమా లనన్నిటినీ కలిపి‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరా టాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాల కుల పాలనను అంత మొందం చటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి ’’
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చా యి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహ కారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటా లను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధ ృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయక త్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది.1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన మహిళల స్పూర్తి !
బ్రిటీష్‌ వారి బానిన సంకెళ్లను తెంచి భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయ కంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవి తలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్య్ర సమరయోధు రాలు దుర్గాభాయి దేశ్‌ ముఖ్‌. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రభోస్‌ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితు రాలిగా మెలిగిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ రaాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్‌ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని రaాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్‌ అలీ స్వాతంత్రో ద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతం త్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయ పోరాట కూడా చరిత్రకు సంబంధిం చిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్‌ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..
రాణి వేలు నచియార్‌
బ్రిటిష్‌ వారిపై మొదటి పోరాటంగా మనం చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే అయిదు దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వారిని ధిక్కరించి నిలబడిన ధీర వనితలున్నారు. 1760-1796 మధ్య కాలంలో మొట్ట మొదటగా బ్రిటిష్‌అ ధికారాన్ని ఎదిరించి పోరాడిన మహిళ, బ్రిటిష్‌ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్ది మంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన మహిళ రాణి వేలు నచియార్‌. తమిళనాడు లోని రామ్‌ నాడ్‌ రాజ్యంలో జనవరి 3, 1730లో మన్నార్‌ సెల్లముత్తు సేతుపతి రాజుకు జన్మించింది వేలు నచియార్‌. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవటం వల్ల రాకుమారుడిలా పెరిగింది. చిన్నతనం నుంచే అనేక రకాల ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు అనేక యుద్ధవిద్యల్ని నేటర్చుకుంది. అంతేకాక ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ధారా ళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదిం చింది. వేలు నచియార్‌ భర్త శివగంగై రాజు. వారికి ఒక కూతురు. 1772లో ఆర్కోట్‌ నవాబుతో కలిసి బ్రిటిష్‌ దళాలు శివగంగైను ఆక్రమించటానికి చేసిన కళైయార్‌ కోయిల్‌ యుద్ధంలో వేలు నచియార్‌ భర్తను హత్య చేశారు. విధి లేని పరిస్థితుల్లో వేలు నచియార్‌ తన కూతురుతో కలిసి రాజ్యాన్ని వదలి పారిపోవాల్సి వచ్చింది. శివగంగైకు చెందిన మరుధు సోదరులు, మరికొంత మంది శక్తివం తమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌ లో నివసించింది. ఆ సమయంలో బ్రిటిష్‌ వారిపై పగ తీర్చుకోవాలనే ధృఢ సంకల్పంతో అనేక మందితో కలిసి సంకీర్ణ సేనలు తయారు చేసింది. 1780 లో మైసూర్‌ సుల్తాన్‌ హైదర్‌ అలీ సాయం తీసుకుని, తాను తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన సైన్యంతో కలిసి శత ృవులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన (తమను తాము నూనెతోనో నెయ్యితోనో ముంచుకుని శత ృ ఆయుధాగారంలోకి జొరబడి తమకు తామే నిప్పంటించుకుని ప్రాణాలర్పించే) మానవ బాంబు, కుయిలీ అనే ఆమె ఉండేది. ఆయుద్ధంలో వేలు నచియార్‌ విజయం సాధించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంది. ఆ రోజుల్లోనే ఆమె తన సైన్యంలో ‘‘ఉదయాళ్‌’’ అనే పేరుతో మహిళలు మాత్రమే గల బృందాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్‌ జన్మదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.31 డిశంబర్‌, 2008 న భారత ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
కిట్టూర్‌ చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో సెప్టెంబర్‌ 11, 2007 లో మన దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గారి చేతుల మీదుగా ఒక వీర వనిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె పేరు రాణి చెన్నమ్మ. కర్నాటక రాష్ట్రంలోని కిట్టూర్‌ రాజ్యానికి రాణి. అందుకే ఆమెను కిట్టూర్‌ చెన్నమ్మ అని కూడా అంటారు. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుల్లో మొదటిగా చెప్పుకోదగ్గ మహిళ. అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ప్రవేశ పెట్టిన ‘‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ లాప్స్‌’’ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడిరది. బ్రిటిష్‌ సైన్యానికి ధీటుగా గొప్ప విప్లవ దళాన్ని తయారు చేసుకుని సారధ్యం వహించిన మహిళ. బ్రిటిష్‌ వారు భారత పాలకులపై బలవంతంగా విధించే అనేక చట్టాలను పాటించలేమని బలంగా వ్యతిరేకించి అనేక పోరాటాలు చేసింది. చివరకు తన విప్లవ దళంతో కలిసి బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. చివరకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడిరది రాణి చెన్నమ్మ. కానీ, ఆమె చూపిన తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతంత్య్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. రాణి కిట్టూర్‌ చెన్నమ్మ వీరోచిత శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేటికీ కర్నాటక రాష్ట్రంలో అక్టోబర్‌ నెలలో బ్రిటిష్‌ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘కిట్టూరు ఉత్సవం’’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవ దళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిమంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేయబడుతోంది. ఇండియన్‌ రైల్వేస్‌ రోజూ బెంగుళూరు నుండి కొల్హాపూర్‌ ప్రయాణించే ఒక రైలుకు ఏకంగా ‘‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ ప్రెస్‌’’ అని పేరు పెట్టి ఆమెకు నీరాజనాలు అర్పించారు.
రాజ్‌ కుమారి గుప్త
రాజ్‌ కుమారి గుప్త చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యం లోని తిరుగుబాటు యోధుల బృందా నికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందే శాలను, మారణాయుధాలను చేరవేసేది. అప్పట్లో విప్లవ దళాల మనుగడకై దోపిడీలు చేసేవారు. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘‘కాకోరీ కాన్‌ స్పైరసీ’’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్ర శేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన ఒక రైలు దోపిడీలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌ కుమారి గుప్త. ఒకసారి తన దుస్తులలోదాచు కుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుం డగా బ్రిటిష్‌ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడిరది.
లిబేగం హజ్రత్‌ మహల్‌
లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్‌ ని ఏలిన రాణి బేగం హజ్రత్‌ మహల్‌. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాస వంతంగా జీవితం గడిపిన ఆమె, బ్రిటిష్‌ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తాను ప్రత్యక్ష్యంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడిరది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిరది బేగం హజ్రత్‌ మహల్‌. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ఒకరైన నానా సాహెబ్‌ వంటి వారితో కలిసి పని చేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో, నేపాల్‌ ప్రధాని పిలుపునందుకుని నేపాల్‌ చేరుకుని మనుగడ సాగించాల్సి వచ్చింది. చివరకు ఊరూ పేరూ లేకుండా 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాట పటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 10, 1984లో బేగం హజ్రత్‌ మహల్‌ ఫోటో ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ ను విడుదల చేసింది.
రాణి అవంతి బాయి
1831-1858 మధ్య కాలంలోని మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతి బాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో విధించిన చట్టాలకు అనుగుణంగా, వాటికి తలవంచే అందరు రాజుల్లాగే, తాను కూడా ‘‘వారసులు లేని వారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’’ ను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి, వారిచ్చే భరణంతో బ్రతకాల్సి వచ్చింది. అది నచ్చని ఆమె రహస్యంగా బృందాలను తయారు చేసి, బ్రిటిష్‌ వారి అరాచకాలను, ఆక ృత్యాలను వారి ద్వారా బహిరంగ పరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ దళాలకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తరువాత తన అధికారాన్ని కోల్పోయింది. ఐనా ధైర్యం కోల్పోక, సర్వశక్తులూ ఒడ్డి, మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణ త్యాగం చేసిన ధీరోదాత్త రాణి అవంతీ బాయి.ఇక రaాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథ చాలావరకు ప్రజలందరికీ చేరువయ్యిందే.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్‌ థెరెస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. 16 ఏళ్ళ చిన్న వయస్సు లోనే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాలలో ముందుండి నడిచింది. ప్రత్యేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకామె రెండేళ్ళ జైలు జీవితం కూడా గడిపింది. స్వాతంత్య్రం తదుపరి తన జీవితాన్నంతా ప్రజా సేవకు అంకితం చేసిన మహోన్నత మహిళ పార్వతి గిరి.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అస్సాం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని 60 ఏళ్ళ వయస్సులో ప్రాణాలను ఫణంగా పెట్టి అమరత్వం పొందిన సాహస మహిళగా ప్రసిద్ధి చెందిన వ ృద్ధ యోధురాలు. ఒక సాధారణ గృహిణి ఐన భోగేశ్వరి స్వాతం త్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై తాను స్వయం గా ఉద్యమంలో పాల్గొనటమే కాక తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. ‘‘భర్భుజ్‌ ’’ అనే పేరుతో చేపట్టిన తిరుగుబాటు కార్యక్రమంలో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయ రీతిలో కాల్చి చంపింది బ్రిటిష్‌ సైన్యం.
కనకలత బారువా
అస్సాంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. ఆమెను బీర్బల అని కూడా పిలిచే వారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ‘‘మ ృత్యు వాహిని’’ అనే సేనలో ప్రాణాలను ఫణంగా పెట్టే దళంలో పని చేసింది. సెప్టెం బర్‌ 20, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన, జాతీయ జెండా ధరించి సాగే మార్చ్‌ లో ముందుండి సాగి బ్రిటిష్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టు కుంది కనకలత బారువా.
మాతంగిని హజ్రా
అంతగా ప్రాచుర్యం పొందని వీర వనిత. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలలో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమ కాంక్షను రగిలించింది. ఇది గ్రహించిన బ్రిటిష్‌ ప్రభు త్వం ఆమెను ఐంతమొందించాలని ఎదురు చూసాయి. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను షూట్‌ చేసారు. తూటా తగిలినా, ధైర్యం కోల్పోక, జెండా విడు వక.. ముందుకు నడుస్తూనే, ‘‘వందే మాతరం’’ అంటూనే నేలకొరిగింది మాతంగిని హజ్రా.
అరుణ అసఫ్‌ అలీ
భారత దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అందుకున్న అరుదైన స్వాతంత్య్ర సమర యోధురాలు అరుణ అసఫ్‌ అలీ. ఉన్నత విద్యా వంతురాలు. 1942 క్విట్‌ ఇండియాఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్‌ మైదానంలో బ్రిటిష్‌ సైన్యం చూస్తుం డగా జాతీ య జెండా ఎగుర వేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్‌ జైల్లో బంధించి నపుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌
చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు గల మరో తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. గాంధీ బోధనలకు ఆకర్షితురాలై ఆభరాణాలు విడిచి ఖాదీ ధరించింది. సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుపాలైంది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టా పొం దింది. స్వాతంత్య్రానంతరం ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పలు కీలక పద వులు నిర్వహించిన తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగా లు చేసిన వారు, తెగువ, ధైర్య సాహసాలు చూపిన మహిళలు. చరిత్రలో నిలిచిన వారు, వెలుగులోకి రాని వారు అనేక మంది. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మనం వారందరినీ తలచుకుందాం. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భావి తరాలకు తెలియ జేసే ప్రయత్నం చేద్దాం. Saiman Gunaparthi

నిర్వాసితుల నిర్వేదం

‘మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా.మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మాతరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం’’ భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు ఆవేదన.
పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

‘‘అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం. ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్‌ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే’’ అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి రోదన.

‘‘అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం.అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక’’ అని చెదల పార్వతి నిర్వేదన
పోలవరంలో ముంపు శాపం…18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా? చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ గిరిజనులు అంటు న్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలుఉత్పన్నమవు తాయోనన్న ఆందో ళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిం దని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
నీళ్ల నడుమ నిర్వాసితులు-చోద్యం చూస్తున్నపాలకులు
ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా..లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంబి óస్తున్నారు. మాట తప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాస ప్యాకేజీ ఇస్తే ఖాళీ చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనుకుంటున్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశిం చింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేస్తామని చెబుతోంది. దానికి అవసరమైన నిధుల సంగతి తమకు సంబంధం లేదని కేంద్రం అంటోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహస నంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు.
వరద బాధితులతో ఆటలు…
దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హామీగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. స్పిల్‌ వే పూర్తయిన నేపథ్యంలో జూన్‌ నెల మొదటి వారంలోనే నదీ ప్రవాహాన్ని మళ్లించారు. అందుకోసం కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసే శారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగడంతోనే పోలవరం నిర్వాసిత గ్రామాలకు వరద బెడద ఏర్పడిరది. మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తు కుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడిరచారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించ కుండా అమానుషంగా ప్రవర్తించారు.
మాట తప్పిన ప్రభుత్వాలు
కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరా వాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చిచెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా.. లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా ?
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు చిగురించాయి. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయల సీమలో నీటి కొరతను అధిగమిస్తామని ముఖ్య మంత్రులు భారీ ఆశలే కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ.6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ.20వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05లక్షల కుటుంబాలకు గానూ రూ.27వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవుతున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5వేల కోట్లు కావాల్సి ఉం టుంది. ఇక ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను మార్చడం వల్ల ఖర్చు పెరిగిందని కేంద్రమే పార్లమెంట్‌ లో చెప్పింది. దాని ప్రకారం రూ. 5535కోట్ల నుంచి రూ. 7192 కోట్లకు పెరిగింది. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందు బాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించ బోనంటోంది. రాజ్యసభలో జలశక్తి మంత్రి ప్రకటన తాజా తార్కాణం. మరో 9వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది. కేంద్రం నుంచి రూ. 2300కోట్లు రావాల్సి ఉందని జులై 19న సి.ఎం ప్రకటిస్తే, తాము ఇంకా ఇవ్వాల్సింది రూ.1900 కోట్ల లోపు మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. దానిని ప్రశ్నించి, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసిపి నీళ్లునములుతోంది. కనీసం విపక్ష టిడిపి కూడా ప్రశ్నించ లేకపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఉంది. పోలవరం తామే పూర్తి చేస్తున్నామని ఎ.పి లో బిజెపి నేతలు ప్రకటన లు గుప్పిస్తుంటే కేంద్రంలో అదే పార్టీ మంత్రు లు తాము ఎనిమిదేళ్ల క్రితం నాటి అంచనాలకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.
వరదలు పెరిగితే వాళ్లంతా ఏం కావాలి ?
సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వ కంగానే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాంగం కదలాలి. డి.ఆర్‌ డిపోల ద్వారా నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదు పాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.-వెన్నెల / జిఎన్‌వి సతీష్‌

కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌

1 2 3 4 5 6 7