విద్య హక్కు వీడని చిక్కు

-ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ` ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చు. లాటరీ విధానంలో సీట్లను కేటాయి స్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. సెకండ్‌ రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు ఏప్రిల్‌ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితు లకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా?విద్యా హక్కు చట్టం ప్రకారం6నుండి14సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశా లలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటా యించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్‌ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపి టేషన్‌ ఫీజులు ఫీజులు వసూలు చేయడంపిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవు తుంది. డ్రాపౌట్‌ స్టూడెంట్‌లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి,3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమి కోన్నత పాఠశాల ఉండాలి.ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి,ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు..ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళి కను తయారు చేయాలి,ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వ హించ కూడదు,విద్యావిధానం ఆధునిక ధోర ణులులో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందిం చేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవా లని ఈ చట్టం పేర్కొంటోంది. ప్రభుత్వ టీచర్‌ ప్రైవేట్‌ ట్యూషన్లు ప్రైవేట్‌ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్‌ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిం చాల్సిన అటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొద లైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలల హక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవు తుందని ఉపాధ్యాయుడు భావి స్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజే సలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనా భ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక (కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసిం చాలి,విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండ న లేని పాఠశాల వాతా వరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతిగది ఉండాలి.పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యా యుడు నిరంతరం మూల్యాం కన ద్వారా అంచ నా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీససౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడంవల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ ను తగ్గిం చాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ తగ్గించడంతో పాఠశా లల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితం గా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది.విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథ మిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. విద్యా హక్కు చట్టం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తుంది కానీ వ్యంగ్యంగా దీన్ని సాధ్యం చేయగల ప్రైవేట్‌ విద్యా ప్రదాతలను పరిమితం చేస్తుంది. చట్టం ప్రారంభానికి ముందు స్థాపించబడిన పాఠశాలలు మూడు సంవత్సరాలలోపు ఆర్‌టీఐ షెడ్యూల్‌లో పేర్కొ న్న నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని లేదా లేకుంటే మూసి వేయ బడతాయని సెక్షన్‌ 19 పేర్కొంది. చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన పాఠశా లలు ఆర్టీఈ షెడ్యూల్‌లోని నిబంధనలను మాత్రమే పాటించాల్సి ఉండగా,గుర్తింపు లేని పాఠశాలలు అదనంగా రాష్ట్ర నిబంధనలను కూడా పాటించాలి.చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు ప్రణాళిక లేని కాలనీల్లోనే ఉండి ప్రాథమిక స్థాయి వరకు బోధిస్తున్నారు. గుర్తిం పు పొందిన పాఠశాలలను కొనుగోలు చేయలేని మరియు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ పాఠశాలలు చౌకైన ప్రత్యామ్నాయం. ఢల్లీిలో గుర్తింపు పొందని పాఠశాలల సాంప్రదాయిక అంచనా ప్రకారం ఒక్కొక్కటి 200 మంది పిల్లలతో దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రస్తుత ఢల్లీి రాష్ట్ర నిబంధనల ప్రకారం, పాఠశాలలకు 800 చదరపు గజాల స్థలం ఉం డాలి మరియు ఆరవ వేతన సంఘం తర్వాత ప్రవేశ స్థాయిలో రూ.23,000 ప్రభుత్వ జీతంతో సమానంగా ఉపాధ్యాయుల జీతం చెల్లించాలి.అదనంగా,విద్యా హక్కు చట్టం ప్రతి పాఠశాలకు ఆట స్థలం ఉండాలని నిర్దేశి స్తుంది. ఈ స్థలం మరియు ఉపాధ్యాయుల జీతం అవసరాలు గుర్తించబడని పాఠశాలలకు చేరుకోవడం కష్టం.ఈ ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐదు గుర్తింపు పొందిన పాఠశా లలు,తొమ్మిది గుర్తింపు లేని పాఠశా లలను షహదారాలో సందర్శించారు. గుర్తింపు పొందిన ఐదు పాఠశాలల్లో ఏదీ ప్రస్తుత భూమి ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు నిర్ణీత ఉపాధ్యాయుల వేతనాన్ని చెల్లించలేక పోయింది. ఒక గుర్తింపు పొందిన పాఠశాల నిర్వాహకుడు తన పాఠశాల 200 చదరపు గజాల స్థల ప్రమాణానికి అనుగుణంగా ఉన్నం దున గుర్తింపు పొందాడు, అయితే ఆ సమయం లో రూ.80,000లంచం చెల్లించాల్సి వచ్చిం ది. అతను ఒక పిల్లవాడికి నెలకు రూ. 250 రుసుము వసూలు చేస్తున్నప్పుడు, అది రూ. 500గా లెక్కించబడుతుంది, తద్వారా అతను ఉపాధ్యాయుని జీతం వాస్తవానికి చెల్లించే దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.గుర్తింపు లేని పాఠశాలలు ఏవీ భూ ప్రమాణాలకు అను గుణంగా లేవు. కనీసం ప్రణాళిక లేని కాలనీల్లోనైనా భూ నిబంధనలను సడలించా ల్సిన అవసరం ఉంది. పాఠశాలలో తగినంత సంఖ్యలో వెంటిలేషన్‌ మరియు కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే గుర్తింపు ఇవ్వడం ఒక ఎంపిక. అనేక గుర్తింపు లేని పాఠశాలల్లో తరగతికి 15-20 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పిల్లలకి అవసరమైన స్థలం ప్రకారం గది పరిమాణాన్ని లెక్కించడం మరింత సమంజసంగా ఉంటుంది. అలాగే, ఉపాధ్యా యుల జీతాలు పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉండాలని ప్రభుత్వం కోరుకోనప్పటికీ, అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠ శాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయితీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠ శాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్య వేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించ కుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశా లలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు.
వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం
ఆర్టికల్‌ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికం గా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్‌ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వే షన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012 లో ప్రతిమా ఎడ్యుకేషనల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండి యా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలు వరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 15(5) లను ఆమోది స్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ లలో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వే షన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్‌ 13(1) ప్రకారం ఏర్ప డిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్ల మెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి100% అక్షరా స్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాం గం నిర్దేశించి నట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికల కు నాణ్యమైన విద్యను అందించవలసిన అవ సరం ఉంది.-జిఎన్‌వి సతీష్‌