ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్‌జీఓ లకు ఉందని సమత నిరూపిస్తోంది. విశాల మైన సామాజిక దృక్పథంతో కరోనావ్యాప్తి లాక్‌డైన్‌ సమయంలో అన్నార్తులకు అండగా నిలిచింది. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవ లందిస్తున్న సమత సేవలను అటు విశాఖ స్మార్ట్‌ సిటీ మురికివాడ ప్రజలు ఇటు గిరిజ నులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బొర్రా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు అధ్యక్ష తన, జరిగిన పంపిణీ బహిరంగసభకు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రెబ్బప్రగాడ రవి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజలు మహ మ్మారి కరోనావల్ల టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుం బాలు దయ నందన పరిస్థితులను ఎదుర్కొంటు న్నారన్నారు. ఈరకంగా నేను ఈసేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లా డుతూ ఈకరోనా సమయంలో సమత సేవలు మరువలేనిది అంటూ అభినందన తెలిపారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఎంతో మంది ప్రజలు ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో సమత ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిడం వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ పంచాయితీలో సుమారుగా 500 మంది పేద తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల వారికి సుమా రుగా 1800 వందల రూపా యలు విలువ చేసే నిత్యావసర వస్తువులు ఒక్కొకరికి పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగాబొర్రా పంచాయితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు 14 గిరిజనగ్రామాల తరు పున సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బా ప్రగడ రవికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్క రించారు. తర్వాత మైనింగ్‌ పోరాట యోధులుగెమ్మెల దేవకుమర్‌, స్వర్గీయ దోనేరు రాము సతీమణి దొనేరు పోల్లు గార్లను రవిగారి చేతుల మీదగా ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో గ్రామప్రజలు, వార్డ్‌ నెంబర్స్‌ గైడ్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొ న్నారు. విశాఖనగంర మురికివాడ ప్రాంతాలు, జిల్లా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.50లక్షలతో సుమారు మూడు వేల మంది కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సమతకు కృతజ్ఞతలు -జన్ని అప్పారావు, సర్పంచ్‌,బొర్రా పంచాయితీ
గిరిజన పేదప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరకులు ఐదువందల కుటుంబాలకు పంపిణీ చేసిన సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవికి కృతజ్ఞతలు.యావత్‌ భారతదేశ ఆదివాసీ తెగలన్నీ సమతకు రుణపడి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు పరిరక్షణకు సమత తీర్పు మాకు వజ్రాయుధం లాంటి తీర్పుకు రవి చేసిన పోరాటం గిరిజన భావితరాలకు స్పూర్తిదాయకం.
కందుకూరి సతీష్‌ కుమార్‌

సంస్కరణలు ఎవరి కోసం

‘మీరు సంస్కరణలకు అను కూలమా, లేదా ప్రతికూలమా?’ అని నిరంతరం అడుగు తుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. ఏ నిర్దిష్ట సంస్కరణ కైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకిం చాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈసంస్క రణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడ తాయా,వారి జీవనో పాధులు,దేశ ఆర్థిక సార్వభౌమా ధికారం బలోపే తం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది’

మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేప థ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,కనీస మద్దతు ధరకు చట్ట బద్ధమైన హామీ కల్పించాలంటూ మనరైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగి స్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపా రన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తు న్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీపెద్దనోట్లరద్దు),ఆహార కొర తలు…ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
పేదలను పణంగాపెట్టి గరిష్టస్థాయిలో లాభా లు ఆర్జించడం,పెరుగుతున్న దారిద్య్రం,మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు,అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశా బ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం,ప్రజలజీవితంపై దానిప్రభావం వినా శకరమైన రీతిలో వుంది. ఇది,కరోనాతో మరిం తగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసా గుతూనే వుంది. ఇదిమార్క్స్‌ మాటలను గుర్తు చేస్తోంది:‘పెట్టుబడిదారీ విధానం భారీఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆతరువాత వాటి ని అదుపు చేయడంలో ఆమాంత్రికుడు విఫల మవుతాడు.’ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆది óపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తు లను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి…ప్రజలపై యూ జర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జా తీయంగా 79శాతం తగ్గింది.2008లోఆర్థిక మాం ద్యం తర్వాత,మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వ రులు తమసంపదను పునరుద్ధరించు కున్నారు. 2018నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈసంపద అంతాఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్ల ను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది. మరో వైపు,ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది ఆదా యం సంపాదించేవారు 2008ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మిక వర్గ హక్కులపై దాడుల ఫలితంగా1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు… ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యంవహించే స్థాయికి క్షీణించాయి.
భారత్‌ : అసమానతల పెరుగుదల
పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.‘షైనింగ్‌ ఇండియా’ (వెలిగిపో తున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌..కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది. 2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచు కున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒకనైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరా లు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదిం చే మొత్తాన్ని ఈకార్మికుడు మూడేళ్ళకు సంపాది స్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ‘ది ఇనీక్వాలిటీ వైరస్‌’ లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
మరోవైపు,2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70వేల మంది తమ ఉద్యోగాలను కోల్పో యారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు. పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే… నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గదిలోనో లేదా అంతకంటేచిన్న జాగాలోనో బతుకు తున్నారు. ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసి నట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానం లో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా ‘జన్‌ ఔషధి’ పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది.ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి. భారతదేశంలో దశాబ్దాలుగా అమలవు తున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా.. పెట్టుబడి దారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవిం చాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసర ముంది.
దారిద్య్రం : అపార వృద్ధి
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం,స్వాతంత్య్రం సము పార్జించి నప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణభారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచే స్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈశాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి.తిరిగి 2017-18లో మరో సారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడిరచకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియ చేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు గానే గ్రామీణ, పట్టణభారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
కోవిడ్‌ మహమ్మారి విజృంభణ…ప్రజల ప్రాణాలను,వారిఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు…పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాం ద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయి లో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించు కోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధికోసం భారత వ్యవ సాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవ సాయం,ఫలితంగా ఆహార కొరత వంటివి ఈవిషయాన్ని మనకు స్పష్టంగా తెలియ చేస్తు న్నాయి. ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను ‘తీవ్రమైన కేటగిరీ’లో నిలిపింది. పోషకా హార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపో తోందని,మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతు న్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియ చేసింది.
మతోన్మాదం-కార్పొరేట్ల బంధం
2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీ యాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టం గా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అస మ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాం గాన్ని,అటుప్రజలకు ఇచ్చినహామీలను దెబ్బతీసింది.
ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడంఇండెక్స్‌)భారత్‌ను105వ స్థానం లో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వా న్నమైన స్థితి. గతేడాది 79వస్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94నుండి 111కి పడిపో యింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు..అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం…ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం ‘పాలనతో కార్పొరేట్ల కలయికకు’ దగ్గరగా ఉంది. ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటం కం కలిగించి, అసమ ర్ధతను పెంచే స్థాయికి చేరుకు న్నాయి’ అని ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక పేర్కొంది.
నయా ఉదారవాద సంస్కరణల దివాళా
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపం గా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ‘’నేను కమ్యూనిస్టును కాను, కానీ….’’ అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రంరద్దు చేస్తోం ది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజ లపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యో ల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. భారత్‌లో ఈ సంస్కరణల పంథా ను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున: నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలో పేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం,విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టు బడులు పెద్దఎత్తున పెరగాలి.అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి.దేశీయ డిమాండ్‌ పెరుగు తుంది. కేవలం మానవతావాద ఆందోళనల తోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత,అహేతుకత,మన సమా జాన్ని అమానవీయం చేసేలా, మనసామాజిక సామ రస్యతను దెబ్బతీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కర ణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు. ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజాఉద్యమాలు,సమీకరణలు తగి నంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజల పై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలకవర్గాల ప్రస్తుత దిశను మార్చ గలిగేలా ఈఉద్యమాలు వుండాలి. భారత దేశం లోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
(సీతారాం ఏచూరి)(ప్రజాశక్తి సౌజన్యంతో)

కలుపు మొక్కలు

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాలు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆచార వ్యవహా రాలు మొదలైన అనేక అంశములను తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బాల వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటలు, లఘునాటికలు,నాటికలు ఏక పాత్రాభి నయం మొదలగు ప్రక్రియల ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసులు ఆనందంతోపాటు, విజ్ఞా నం, వినోదం కలిగిస్తుందని భావింస్తున్నాం. చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యులుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగా చార్యులు అందిస్తున్నారు. ఈనెల సంచికలో ‘కలుపు మొక్కల కథ’ ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

కోదండపాణి గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారం వారం కాకపోయినా నెలకొకసారైనా వాళ్ల పుస్తకాల బీరువాలు పరిశుభం చేసుకుని పుస్తకాలను ఓ క్రమపద్ధతి లో అమర్చుకుంటారు. ఓఆదివారం తెలుగు ఉపాధ్యాయుడు బుడంకాయ్‌ బీరువా పని పడదామని ఉత్సాహంగా తలుపు తెరవగానే ఉన్న ఎలుక సపరివార సంతాన సమేతంగా దూకి పారిపోయింది. అదృష్టం బాగుండి తెలుగు టీచరు బుడంకాయ్‌ మీదకు దూకలా. బుడంకాయ
అసలు పేరు సంతానం. నిక్‌ నేం బుడంకాయ్‌. బొద్దెంకను చూస్తేనే భయపడే ఆయనకి ఎలుకల సమూహాన్ని చూడగానే ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి.నిశ్చేష్టుడైఎలుకల వైపు వాటితోకల వైపు తదేకంగా కళ్లార్పకుండా చూస్తున్న ఆయన చెవులకు ‘బుడంకాయ గారు’ అన్న కేక వినబడేసరికి ఉలిక్కిపడి గంతేసి చెయ్యెత్తి నిల్చున్న ఆ ఆకారం చూచి ఈ భంగిమలో మీరు ఉవేదాంతం సత్యనారాయణశర్మ గారి భామాకలాపంలో వున్న ‘సత్యభామలా వున్నారండి’ అన్నారు ఆ స్కూలు డాన్సు
మాస్టారు పెంచలయ్య –
పుస్తకాల బీరువా శుభ్రం చేస్తున్నారా?అన్న పెంచెలయ్య మాటలకు లేదు అభ్యంగన స్నానం చేయిద్దామని ఆలోచిస్తున్నాఅన్నాడు నిదానంగా.
ఏంటినిజంగా నీళ్లు పోసికడుగుతారా? అన్నాడు అమాయకంగా..మీరు ప్రతిసారి పిల్లలచేత చేయించే వినాయక స్తోత్రరో వున్న మూషిక వాహనానికి – దానమ్మ కడుపు మాడ నా కబ్బో ర్డులో సంతాన సమేతంగా ఉన్నదికాక మల మూత్ర విసర్జనలతో, పుణ్యాహ వాచనం చేసిందండీ! మరి నన్నేం చేయమంటారు? అని ఓ పశ్న్ర సంధించాడు బుడంకాయ గారు.
నేను మీకు చెప్పేంతటివాడినా? అడిగారు కాబట్టి – నిమ్మకాయ చెక్కతో శుభంగ్రా రుద్ది, యాంటీడాండ్ర షాంపుతో కడిగి, ఎందుకైనా మంచిది కరోనా శానటైజర్‌ కూడా స్ప్రేచేయండి అన్నారు నృత్యాచార్యుడు పెంచెలయ్య.
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగనూనా? నా తలచుండ్రుకే మీరు చెప్పినదేదీ చెయ్యలేదు.చూస్తున్నారుగా! ఎడారిలో ఖర్జూరం మొక్కల్లా నడినెత్తిన నాలుగు వెంట్రుకలు అని దీర్ఘాలోచనలో పడ్డ ఆయనగారితో చమత్కారంగా గుండైతే ఏంటండీ? ఎంత గుండంగ్రా వుందోమీ తల అన్న పెంచెలయ్య మాటలకు యిద్దరూ హాయిగా
నవ్వుకున్నారు. ఎలుక దాని సంతానం కలసిపరీక్ష ఆన్సర్‌ పేపర్లన్నీ కొరికేశాయి పెంచెలయ్య్నా.. అని కాంభోజీ రాగం లాంటి అరుపుకు పక్కనేవున్న సంగీతం సార్‌ దేవలోకం ఉదేశభాషలందు తెలుగు తియ్యందనం ఎక్కువ అని మీరే
అంటారుగా! అందుకే తెలుగు పేపర్లన్నీ కొరికాయ్‌ అన్నాడు కాలర్‌ ఎగరేస్తూ . దేవలోకం చేసిన ఎద్దేవకు ఏం చెప్పాలో అర్థంకాని బుడంకాయ్‌ కొరికి తిన్నందుకు కాదు, అన్నిటి మీద మలమూత్రవిసర్జన చేసి కంపు చేశాయ్‌ నా అలమార అన్నాడు సావధానంగా! ఈసారివిస్తుపోయారు సంగీతం దేవలోకం, డాన్సు పెంచెలయ్య. ప్రక్కనేవున్న హిందీటీచర్‌ విద్వత్‌ ఇదంతా వింటు వుండబట్టలేక పిల్లలు వ్రాసిన స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ పేపర్లు తిన్న తరువాత వాటికి అతి మూత్రవ్యాధి విరోచనాలు పట్టుకు నుంటాయ్‌ మిస్టర్‌ బుడంకాయ్‌ అన్నాడు నవ్వుతు. ఆయనగారి సహేతుక వివరణకు ముగ్గురూ నవ్వుకున్నారు.
ముక్కుకు గుడ్డకట్టుకొని, నోటికిప్లాస్టర్‌ వేసుకుని, చేతివేళ్లకు గ్లౌజ్‌ తొడుక్కుని తలకు కండువ చుట్టుకొని చేసేదిటీచరు ఉద్యోగం. ఎన్ని జాగ్రత్తలు? ఇవన్నీ జాగ్రత్తలు అంటేపొరపాటే. బుడంకాయ్‌ గారికిలేని జబ్బు లేదనటం
సముచితంగా వుంటుంది. ఎలర్జీ,తుమ్మలు, గజ్జి,దురదలు,బి.పి,ఎక్కువ తింటేడయాబిటిక్‌, రెండు మెట్లు ఎక్కితే ఆయాసం, ఎక్కువసేపు కూచుంటే శరీర భాగాలన్నీ తిమ్మిరెక్కుతాయ్‌! ఒకటా రెండా? అన్ని వ్యాధుల సమాహారమే బుడంకాయ్‌ ఆల్‌ డిసీజెస్‌ యిన్‌ వన్‌ బాడీ! మొత్తం మీద రాక్‌ శుభం చేసి ఎలుకలు కొరికిన పరీక్ష పేపర్లు ఆ రూములోనేడస్ట్‌ బిన్‌ లో వేశాడు. వేసివెయ్యకుండానే డస్ట్‌ బిన్‌ ఈ పేపర్లు వేసేందుకు నేను తప్పితే ఇంకేం దొరకలేదా? అని అడిగినట్లనిపించింది బుడం కాయ్‌కి. ఇక్కడ కాకపోతేఎక్కడ వేస్తాను? పైగా పరీక్ష పేపర్లు. వీటన్నిటినీ తగలబెడదామా అంటేకాగితం సాక్షాత్‌ సరస్వతీదేవికి ప్రతి రూపం. ఆం ఏం కాదులే అని అవి తగల పెడితేఅగ్నిదేవుడికిఏం కోపం వస్తుందో? బుడంకాయ గారు ప్రకృతి ప్రేమికుడు కూడాను. ఈ మధ్యనేపక్షుల వీక్షణ గ్రూపులో కూడా చేరాడు. ప్రతి ఆదివారం ఉదయం చెట్లవెంబడి, పుట్టల వెంబడిపడితిరుగుతు పక్షులను గమనిస్తున్నాడు.
ఈ ఎలుకలు కొరికిన చెత్తవదిలించుకోవటం ఎలా? తల వేడెక్కింది బుడంకాయ్‌ కి.
తలపాగా తీసిగోక్కుంటే అపురూపంగా పెంచుకున్న నాలుగు వెంట్రుకల్లో ఓ వెంట్రుక కాస్తా ఊడిపడిరది. ఆ గోకుడుకి గుండు మీద గాయం రక్తం కారటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? డాక్టరు దగ్గరకు వెళితే 56 రకాల పరీక్షలు చేయించమని అంటాడు. దిద్దిపారేసిన పేపర్లు 156 దాకా వున్నాయి కాని జేబులో 6 రూపాయలు కూడా లేవు. పైగా నెలాఖరు.
పోనీ అప్పు చేస్తే? అనుకోగానేశ్రీమతి ఃమంగతాయారుః జ్ఞాపకం వచ్చింది. అప్పిచ్చిన వాడితల, నా తల రోకలిబండతో ముక్కల పచ్చడిచేస్తుంది. డాక్టరూ వద్దు మందూ వద్దు. అప్పు అసలే వద్దు అనుకుంటు చిన్నపిల్లవాడిలా చేతులో వున్న చాక్పీసు అరగతీసి నెత్తురుపై నెత్తికిరాసుకున్నాడు.ఆ మంటకు ఏడుపు ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంట నీరు ఏకధాటిగా కారుతోంది. అటుగా వెళుతున్న విద్యార్థిచూసి ఉఏమైందిఎవరన్నా పోయారండీ? అలా ఏడుస్తున్నా రెందుకండీ?్న అని సావ ధానంగా అడిగాడు. భరించలేని మంట, కోపం, ఏం చెప్పాలో తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఠక్కున ఆ హెడ్‌మాస్టారు పోయాడు అన్నాడు బుడంకాయ. పాపం పిల్లవాడూ వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించాడు. ఒకరికియింకొకరు తోడైఅక్కడ ‘ఓఏడుపుల క్లబ్‌’ తయారైంది.
అటుగా వెళుతున్న లెక్కలసారును చూడగానే నోటికి తాళాలు పడ్డాయ్‌. పిల్లలందరూ మటుమాయమయ్యారు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు బుడంకాయ. ఇప్పుడు ఇలా యింటికి వెళితే తల గాయం గూర్చి శ్రీమతి అడుగుతుంది. విషయం చెప్పీ చెప్ప కుండానే ఏడుపులు,పెడబొబ్బలు మొదలవుతాయి అనుకొని స్టాఫ్‌ రూంలోనే కూర్చున్నాడు. వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు. వారడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి వూరుకుంటున్నాడు బుడంకాయ. మనసు పరిపరివిధాలా వేధిస్తోంది.ఈ పేపర్లను ఏం చేయాలి? ఇంటికివెళ్లేలోపు ఏదో ఒకదారి దొరుకుతుందిలే అని చంకలో పేపర్లు పెట్టుకొని దర్జాగా బయలుదేరాడు.హఠాత్తుగా ఈదురుగాలి విజృంభించింది. దుమ్ము ధూళి పైకిలేచింది.పేపర్లగూర్చే ఆలోచించే ఆయన ఈ హఠాత్పరిణామాన్ని గమనించలేదు. కంట్లో దుమ్ము పడేసరికిచేతులెత్తి కళ్లుమూసు కున్నాడు. చంకలో కాగితాలు గాలిపటాల్లా సందు చివరిదాకా ఎగురుతు చెల్లాచెదురుగా భూమ్మీద కొన్ని, చెట్లకొమ్మల ఆకుల మధ్యలో కొన్ని, వీధిచివర్లో వున్న చెరువులోకి
కొన్ని కొట్టుకుపోయాయి.
ఐదేఐదు నిముషాల్లో వాయుదేవుడు విజృంభించటం, శాంతించటం జరిగి పోయింది.దుమ్ము పడ్డముఖాన్ని చెరువు నీళ్లతో కడుక్కుందామని చెరువు గట్టు దగ్గరకు చేరిచెరువులోకి చూసి మూర్ఛ పేషంటులా వూగిపోతూ కిందపడిగుడ్లు తేలేశాడు. వెంటనేతనను తాను తమాయించుకుంటు చేతులు చాచి ‘మరణ మృదంగం మీద నృత్యం చేస్తున్న’ మీన సుందరినోట్లో కాగితం తీసిచూస్తేతన శిష్యులు వ్రాసిన పరీక్ష పేపరు
ముక్క మీద మీనము అన్నది చూచి ఆ కాగి తాన్ని జేబులో వుంచీ వుంచకుండానేకేరింతలు వేస్తూ చేతిలో వున్న మీన సుందరిమృత్యువుని జయించి ఈదుకుంటు లాహిరిలాహిరి లాహిరిలో జగమేవూగెను అన్నంత ఆనందంలో చెరువు మధ్యకు చేరింది. బుడంకాయ వెళ్లిన దారినే ‘బర్డ్‌ వాచర్స్‌ క్లబ్‌’ సెక్రటరీ ఖగపతి కూడా యింటికి బయలుదేరాడు. ఆయన ధోరణిలో ఆయన కొత్తపిట్టేమైనా వచ్చిందేమో అనుకుంటు ‘బైనాక్యులర్‌’ తీసి ఓచెట్టు కొమ్మలో యిరుక్కుని ‘కీకీ’ అంటున్న పక్షిని గమనించాడు. అదిచావుబతుకుల మధ్య కొట్టుకుంటోందని అర్థమైంది. నిశితంగా గమనిస్తేదాన్నోట్లో కాగితం ముక్క. గొంతు కడ్డు పడిరదనుకొని అటుగా వెళుతున్న ఓచెలాకీవిద్యార్థిని పిలిచి చెట్టుపైవున్న పిట్టను చూపించి దాన్ని జాగ్రత్తగా కిందకు పట్టుకు రమ్మన్నారు. విద్యార్థీశతమర్కట ఉపాధ్యాయుడిమాట పూర్తయీ కాకుండానేవాడు చెట్టు సగం ఎక్కేసిపిట్టని పట్టుకుని కిందకిదిగి గురువుగారిచేతిలో ఆయన కోరుకున్న పక్షీశ్వరు ణ్ణివుంచాడు.పిట్టనోట్లో కాగితం తీసిపిట్టని పిల్లవాడి చేతిలో వుంచాడు. పరలోకానికి వెళ్లాల్సిన పిట్టపిల్లవాడిచేతుల్లో నుండి తుర్రున ఎగిరిపోయింది.చెరువు దగ్గర నుండి బుడంకాయ వీళ్లను వింతగా చూస్తూ ఏమైందండీఅని అడిగాడు. ఖగపతిగారు చేతిలోని కాగితం ముక్కను బుడంకాయ చేతిలో పెట్టాడు. బుడంకాయ కాలరెగరేసాడు ఈ కలుపు మొక్కలు సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం వారు నేర్పిన ఇంగ్లీషులో కూడా ఉన్నాయా అని అనుకున్నాడు.పక్కనేవున్న చెట్టెక్కి దిగిన విద్యార్థిఆ పేపరు నాదేనండి అదినేనే వ్రాశాను. నా ఇంగ్లీషు దస్తూ రినేను గుర్తుపట్టగలనండీ అన్నాడు. వాడి మాటలకు బుడంకాయ మళ్లీ బుర్రగీక్కున్నాడు. మిగిలివున్న మూడు ఎడారి మొక్కల్లో ఒకటి కిందకు పడిరది. నెత్తిన మిగిలి వున్న రెండు మొక్కలు ఈరోజుకు బతిక్రిపోయాం అనుకున్నాయి. పిల్లలు నాటిన యీ కలుపు మొక్కలు ఎప్పుడు వూడిపడతాయో! అనుకుంటు దిగాలుగా యిల్లు చేరాడు. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారినట్లు పరీక్ష పేపర్లు కొరికిన ఎలుకల దగ్గర నుండి చావు బ్రతుకుల మధ్య నరకం అనుభవించి బయటపడ్డమీన సుందరి, పక్షీశ్వరుల కథలు, కథలు కథలుగా స్కూలు మొత్తానికి తెలిశాయి. ఆనోట ఆనోట హెడ్‌ మాస్టరు గజవా హనుడికీ తెలిసింది. గజవాహనుడు చండశాసనుడు. స్కూలు పిల్లల్ని గడగడ లాడిస్తాడేకాని ఆయన పిల్లల్ని చూస్తే ఆయన గడగడలాడుతాడు. స్టాఫ్‌ రూంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటు నవ్వులు విరగబూస్తున్న సమయంలో గజవాహనుడు వచ్చాడు. ఆయన్ను చూడగానేవాతావరణం మారిపోయింది. వాడిపోయిన కుసుమాల్లా ముఖాల్లో మార్పు వచ్చింది. ఇదంతా గమనించ లేనంత అసమర్ధుడు కాదు గజవాహ నుడు.అందర్ని చూస్తూ ఉనా రాక మీకేమైనా ఇబ్బందిగా వుందా అన్నారు.ఉచెట్టెక్కి కిందకు దింపిన పిల్లవాడి పిట్టకథ ప్రాణాపాయం నుండి బయటపడిన ఉమీన సుందరికథఉ తెలుసా? అని గద్దించాడు గజవాహనుడు. అందర్నీ ఉతికిఆరేద్దామని వచ్చి ఏదోమొదలు పెట్టబోయేలోపేబెల్‌ మోగింది. అక్కడున్నవారు అంతా ఎవరిమానాన వారు పుస్తకాలు,డస్టరు, చాక్పీసు తీసుకుని గజవాహనానికి నమస్కరిస్తూ బయటపడ్డారు. కాంపోజిషన్‌ పుస్తకాలు దిద్దుకుంటు అక్కడేకూర్చున్న బుడంకాయను సావకాశంగా ఉఏం చేస్తున్నారండి? అని అడిగిఆయవ పక్కనేకూర్చున్నాడు గజవా హనుడు. దిద్దుతున్న పుస్తకాన్ని చూపిస్తూ తెలుగు కాంపోజిషన్‌ దిద్దుతున్నా సార్‌ అని పుస్తకం పెద్దాయనకు చూపించాడు. పుస్తకంలో ప్రతిపేజీ దిద్ది వ్రాసిన సరిjైున పదాలు, వ్యాసంపైవిద్యార్థికి చేసిన సూచనలు అన్నీ చూశాడు గజవాహనుడు సావకాశంగా. ఏంటిసార్‌ 10ష్ట్రలో యింత ఘోరమా? అన్న ఆయన ప్రశ్నకు ఇదిచూడండి అంటూ యింకో పుస్తకంలో ఓపేజీ చూపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో కాళ్లు, చేతులు,తల కోల్పోయి మొండెం ఏనుగుల కాళ్ల కిందపడి రక్తసిక్తమైన కురుక్షేత్రసంగ్రామాన్ని తలపిస్తుందియీ ఎర్రసిరా గుర్తులు అంటు తన అశక్తను తెలియజేసాడు బుడంకాయ్‌. ఆ పుస్తకంలోని అన్ని పేజీలు తిప్పి అట్టమీద పేరు చూసిదిమ్మెర పోయారు గజవాహనుడు. అదెవరిదో కాదు అక్షరాల తన పుతర్రత్నానిదే. బుడంకాయ మీద కోపం చల్లారలేదు. ఎంత కోపం బాధగా వుంటే మాత్రం ‘హెడ్మాష్టరు చచ్చాడని’ పిల్లలకు చెపుతాడా? కోపాన్ని తమాయించుకుంటున్నాడు గజవాహనుడు. వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో ప్యూన్‌ అప్పలస్వామి ఓ ఫైల్‌ చేతికిచ్చి నిలబడ్డాడు. ‘పద. వస్తున్నా నంటు’ లేచి రూంకి బయలు దేరాడు.ఓ వారం రోజుల తరువాత గజవాహనుడు తన పుత్ర రత్నానికితెలుగు చెప్పే బుడంకాయకి కబురు చేశారు.వీలైతేయీరోజు సాయంత్రం మాఇంటి కిటీకిరాగలరా? ఓ తప్పకుండ వస్తా అంటు తిరుగు సమాధానం కబురు తెచ్చిన వ్యక్తిచేతే కబురు పంపాడు.ఏం ఆలోచించ లేదు. సాయంత్రం గజవాహనుని ఇంటికి వెళ్లాడు బుడంకాయ్‌. సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుని పోయి ఏవేవో పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయానికివచ్చాడు.మీ గూర్చి నాకే అనుమానమూ లేదు. మీరు శక్తివంచన లేకుండా పిల్లల అభివృద్ధికికావలసిన చర్యలన్నీ తీసుకుంటు ఆహ్లాద వాతావరణంలో పాఠం బోర్‌ కొట్టకుండా చెపుతారనీ తెలుసు. పిల్లల అశద్ధ్రను ఏమాత్రం సహించరనీ తెలుసు. కానీ యీ కురుక్షేత్రసంగ్రామంలో రక్తం మరకల్లా యీ ఎర్రసిరా గుర్తులేంటిసార్‌? అన్నాడు. తెలుగు సాహితీ నందనవనంలో మొలకెత్తాల్సిన కల్పవృక్షం విద్యార్థుల చేతుల్లో పడి కలుపు మొక్కలుగా మొలిచిందండీ! కారణం ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమా జం, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వం తీరుతెన్ను-ఏదైనా కావచ్చు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైన ఎంతమందికి ప్రేమా భిమానాలున్నాయి మాతృమూర్తి మీదేఅభిమానం చూపించలేని వీరు మాతృభాష మీదేం అభిమానం చూపిస్తారు? అంటేమనమేం చేయలేమా అన్న గజవాహనం మాటకికాంగ్రెస్‌ మొక్కలు అంటే పార్థీనియంని ఏ ఒక్కడో అంత మొందించలేడు. ఏ ఒక్క సంవత్సరంలోనో ఆ పని కాదు. రైతులందరూ సామూహికంగా కొన్ని సంవత్సరాలు అవి మొలకెత్తిన రోజుల్లోనే పీకేస్తే వాటి ఉత్పత్తి తగ్గి చివరికి అదృశ్యం కావచ్చు.తెల్లకాగితం లాంటివిద్యార్థుల మెదడులో అమోఘమైన జ్ఞాపకశక్తిఉంటుంది. అదిఆ వయసులో ఎట్లా చెపితే అట్లా వింటుంది ఆ సమయంలో సరిjైున ఉపాధ్యాయుని చేతులో విద్యార్థి పడితే సాహితీ నందన వనంలో కల్పవృక్షమే కాదు క్రియేటివిటీ అనే కామధేనువూ ఉదయిస్తుంది. దేశం మొత్తం -అన్ని శాఖల్లో – యీ కలుపుమొక్కలు ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పెరిగాయి. కలుపు మొక్కే గదా అని నాడు వదిలేశాం. అది నేడు మహా వృక్షంగా సిగ్గుసెరం లేకుండ తలెత్తుకుని భుజాలు ఎగరవేస్తోంది-ఇంతకంటే ఏం చెప్ప లేను సార్‌ అన్నాడు బుడంకాయ. గజవాహనం గారిభార్య దేవమ్మ తెచ్చిన టీతీసుకుంటు ఏమ్మా ఎలా వున్నావు? నీ రచనా వ్యాసంగం ఎలా వుంది? అని వాత్సల్యంగా అడిగారు బుడంకా య్‌. నేను మీ శిష్యురాలిని సార్‌. మీరు నా చిన్ననాడు నామీద ఉంచిన ఆశలు నిరాశలు చేయలేదు. మీ దయవల్ల నా రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుందండీ అన్నదిఎంతో వినమ్రతతో. మంచి కబురు చెప్పావు. ఇదిగో యీ చాక్లెట్‌ తీసుకో అంటు చేతిలో చాక్లెట్‌ పెట్టి నేటిపిల్లలే రేపటిపౌరులు. వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడ వున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటూ దంపతులిద్దరినుండి సెలవు తీసుకున్నాడు బుడంకాయ. ఇంటి బయటకొస్తోంటేగార్డెన్‌లో తోటమాలి ఏకాం బరం కలుపుమొక్కలు పీకు తున్నాడు. వాడు జీవితాంతం ప్రయత్నించినా యీ కలుపు తగ్గదనుకుంటు యింటికిచేరాడు బుడంకాయ్‌ –గోమఠం రంగా చార్యులు

ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒకభాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయా లనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూ తాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నిం టిని సమూలంగా నరికివేస్తూ భూమాతను సంపదవిహీనంగా చేస్తున్నాడు, భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగా మళ్ళించి వేస్తున్నాడు. భూగర్భ జలాలను అడు గంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తు న్నాడు. తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు. ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడిరది. ప్రకృతి అనుకూల జీవన విధానంతో ప్రకృతిని కాపాడు కుంటూ వస్తోంది. దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచ భూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు. కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు. ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటి వరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటా యి. ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు. ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబ డుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నా యి కాబట్టి నదులను,వాగులు,వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచి స్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగము. అదే పాశ్చాత్య దేశాలలో సంవ త్సరంలో ఒకరోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవ త్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతి తో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించు కోవటంపై దృష్టి కేంద్రీ కరించబడిరది. 2021-2030 దశాబ్దం యుఎన్‌ లాంఛనం గా వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్‌ జాతుల నష్టాన్ని నివారించు కోవటానికి, మరియు ఆహారభద్రత, నీటి భద్రతా,జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆచరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాల పూర్వం దేశ వ్యాప్తంగా విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవ సాయం ఊపు అందుకొంది,దాని కొనసాగింపు గానే, ఈ మధ్యనే భూమిసంరక్షణ, భూమిసు పోషణ,దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మన దేశంలో అనేక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మొదలైయి నాయి. నీటి సంరక్షణపై అవగాహన పెంచటా నికి ఆ నీటి వనరులను కాపాడు కోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్‌ ‘రివర్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే మ్యూజిక్‌ వీడియో ను విడుదల చేసింది. భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా ఆ వీడియో తయారు చేయబడిరది. ఆ వీడియోలో పెరుగుతున్న జనాభాపై,నదులను కాపాడుకోవటంపై, నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాలపై, కథనం సాగుతుంది. పర్యా వరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది. ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలను చేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్‌ చేస్తుంది.
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ఈ సంవత్సరం దీనిని ‘‘పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ ‘‘(జుషశీంవర్‌వఎ Rవర్‌శీతీa్‌ఱశీఅ) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.అభివృద్ది చెందాము అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగు తున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే,దేశాల అనాలో చిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడిరది . ఇటు వంటి విషమ పరిస్థితుల్లో ‘‘విశ్వగురువు‘‘ భారత దేశమే ప్రపంచానికి దారి చూపగలదు. పర్యావరణ పరిరక్షణలో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్‌,సింగాపుర్‌ వంటి దేశా లలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి . ప్రభుత్వం ఏమి చేస్తోంది 2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధా న్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘స్వచ్చ భారత్‌ అభియాన్‌ ‘మొదటిది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూతానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్‌ అభియాన్‌ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పని చేసి దాదాపు 94%లక్ష్యం 2019లో మిగిలిన 6%తరువాతి కాలంలో సాధించ కలిగారు (ఈవెబ్‌ సైటు చూడవచ్చు ష్ట్ర్‌్‌జూం://ంషaషష్ట్రష్ట్రపష్ట్రaతీa్‌.ఎవస్త్రశీఙ.ఱఅ). అదే విధంగా ‘నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ,కాలుష్య నివారణ,శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే షaఎజూa aష్‌ ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందిం చారు. దాదాపు రూ.95వేలకోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదంగా మిగిలి పోకుండా అది ఒకవిధానంగా మారేం దుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు Gతీవవఅ ూసఱశ్రీశ్రీ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ూతీశీస్త్రతీaఎ ను ంసఱశ్రీశ్రీ ఇండియాలో ఒకభాగంగా చేశారు. ఇది ఒకమంచి కార్యక్రమం ఈ వెబ్‌ సైటు ను చూడండి ష్ట్ర్‌్‌జూ://షషష.స్త్రంసజూ-వఅఙఱం. స్త్రశీఙ.ఱఅ).ప్రభుత్వం ఈపర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను (షaతీపశీఅ వఎఱంంఱశీఅం) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (తీవఅవషaపశ్రీవ వఅవతీస్త్రవ ంశీబతీషవం) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహి స్తోంది. ఎలెక్ట్రిక్‌ వాహనాలు,భారత్‌ 6’ నిబం ధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగ స్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చనిరంగు, నీలి రంగు డబ్బాలులు ఇస్తే,నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తనుతడి,పొడి విభజన చేయడం అసాధ్యమని, దానివల్ల ఎంతో కాలు ష్యం కలుగుతోందని ఒక మునిసిపల్‌ అధికారి వెల్లడిరచారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా? భారతీయులు తమ మూల విధా నాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి,గ్రామం,జిల్లా,రాష్ట్రం, దేశం ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒకచిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ,షaర్‌వ ఎaఅaస్త్రవఎవఅ్‌ మొదలై నవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్‌,కొబ్బరి,గుడ్డలతో తయారు కాబడ్డ సంచీలు,తాళ్ళు, ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని, మన భావితరాలకి మంచి పర్యా వరణాని అందించడం కోసం మనవంతు ప్రయ త్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పా తాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయ త్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజం గా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతా వరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారు కాగలవు. మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది. వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగి నంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవుల పైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం పర్యావరణానికి చేటు
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో` వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమి లో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగు తుంది.పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచు కుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉండాల్సిన అవశ్యకత ఉంది.

లేటరైట్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లేటరైట్‌ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో పాటు…రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధార ణ’కు ఆదేశించింది.ఈవ్యవహారంపై విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడికి చెందిన దళిత ఐకయ ప్రగతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరిం చడమే కాకుండా..‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈఅభిప్రా యానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తాలక్ష్మణరావుతోపాటు పంచాయ తీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రా యపడుతున్నాయి. అడవిలోకి చొచ్చు కురా వడమే కాకుండా వేలాదిచెట్లు కొట్టి రోడ్డువేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయపరంగా ఉన్న మార్గా లపై జాతీయ పర్యా వరణవాదులతో కొంతకా లంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు.ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే.రామకృష్ణన్‌,సభ్య నిపుణుడుకే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జులై 26వ తేదీన పిటిషన్‌ను విచారించి,అదేరోజు జులై 30న ఆదేశాలుఇచ్చింది.
పిటిషన్‌లో ఏముందంటే..

అటవీ సంరక్షణచట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి(యూఎసహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌కోసం పెద్దది గా విస్తరించుకున్నారు. ఈరహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధ నలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పిం చిన గ్రామసభ తీర్మానపత్రం వట్టిబోగస్‌. ఆ విష యం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అను మతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈనేపధ్యంలో విశాఖ,తూర్పు గోదా వరి మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎఫ)తో కలిసి ఉన్నభూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలు వరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విష యంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి. సరుగుడు లోని రిజర్వ్‌ ఫారెస్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన అధికారులపై అపరాధరుసుం విధించాలి’’
ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..
ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశా లపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ లోని సీనియర్‌అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీబీ విశాఖ కలె క్టర్‌,విశాఖ జిల్లా అటవీఅధికారి(డీఎఫఓ),గనులశాఖ సీనియర్‌ అధికారి,రాష్ట్రకాలుష్య నియంత్రణమండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని,కమిటీకి అవస రమైన లాజిస్టిక్‌ సహకారం,సమన్వయం కోసం రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీ లించి,వాటిపై వాస్తవిక,కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే,మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం,రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు,పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే…మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో,అక్కడ మైనింగ్‌ చేపట్ట డానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా? ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి (హెచ్‌ఓ ఎఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఏడు అంశాల్లో విచారణ..
లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాం తాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్య యనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలిం చాలని నిర్దేశించింది.అవి..ౌ మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల (స్వాతంత్య్రానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. ౌ మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? ౌ అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది… దాని వల్ల పర్యావరణం,జీవావరణం (జంతు జాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? ౌ లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా…ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? ౌ ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టప రమైన అనుమతులు తీసుకోకుండా రహదారిని విస్తరించారా? ౌ లీజుదారు మైనింగ్‌కు అనుమతులు,క్లియ రెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబం ధనలను, కాలుష్యనియంత్రణ మండలి నియమనిబంధనలు పాటించారా? ౌ ఇంకా….ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా…వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలనచేసి ఆగస్టు31లోగాపీడీఎఫ్‌ రూపం లో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది.
ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం
ట్రైబ్యునల్‌ మరోకీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావా ల్సిందిగా ఫిర్యాదుదారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ఫిర్యా దుదారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమ యంలో పర్యావరణ,అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై కమిటీకి ఆయన తన నివేదిక అందిం చొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమ ర్పించడానికి అది(ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదుదారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రా లు,రిపోర్టులను కమిటీ సభ్యులకు అందించాలని కోరింది.
ఇదీ నేపథ్యం..
విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121హెక్టార్లలో లేటరైట్‌ మైనిం గ్‌కు గతంలో లీజులుపొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజుగనిలో లేటరైట్‌ తవ్వి, తరలిం చడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించ డానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలి బాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేరవిస్తరించిన ఫారెస్టు ను గుల్ల చేశారు.రెవెన్యూ,అటవీశాఖల అనుమతు లు లేకుండా ఆరేడు వేలవృక్షాలను నరికివేశారు.
చెట్టుకు రూ. ఐదు వేలు..
విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసు కొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓగిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘిం చారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.ఖనిజం రవాణాకు 1.5కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీ లించిన హైకోర్టు..తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి,గనులశాఖ,అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబం ధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపి వేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొం టున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు జక్కల నాగ సత్య నారాయణ(జనాస)అందించిన వివరాలు ప్రకారం
రిజర్వ్‌ ఫారెస్ట్‌ పొడవునా రహదారుల ఏర్పాటు
పేరుకే గిరిజనుల సంక్షేమం కోసం రహ దారి..కానీ, అక్కడ జరిగింది…కాకినాడ పోర్ట్‌ కు అడ్డరోడ్డులో లేటరైట్‌ను యథేచ్ఛగా తరలించుకు పోయేందుకు రోడ్డు నిర్మాణం.జాతీయ రహదారి మీదుగా తరలిస్తే ఇబ్బందులొస్తాయని తలంచి అడవి మార్గం అయితే ఖనిజరవాణాకు గోప్యంగా ఉంటుందని భావించినట్టుంది. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్లనిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరిం చవు ..అందులోనూ ప్రజలకు సంబంధం లేకుండా ఖనిజాన్ని తరలించ డానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలు పనికాదు. దీంతో క్వారీయజమానులు కొత్త ఎత్తుగడతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ ప్రజా ప్రయోజనంపేరిట అనుమతులు పొందారు. అను కున్నదే తడవుగా ఖనిజాన్ని తరలించేందుకు కాకి నాడ పోర్టుకు దగ్గరదారైన రౌతులపూడి మం డలం రాఘవపట్నం,జల్దాం,దబ్బాది,సిరిపురం మీదుగా బమిడికలొద్దుక్వారీ వరకూ దశల వారీగా 2అడుగుల కాలిబాటను 8అడుగులరోడ్డు కోసం అనుమతులు తెచ్చుకొని ఏకంగా 32 అడు గుల వెడల్పుతో19రోజుల్లో..17కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించేశారు. ఇప్పుడా రోడ్డుపై14 టైర్ల టిప్పర్లు వేగంగా దూసుకు పోతున్నాయి.నాతవరం మండలం సరుగుడుపంచాయితీ పరిధిలోని భమిడికలొద్దు రిజర్వ్‌ఫారెస్టులోని 121హెక్టార్లలోని సుమారు 5000కోట్ల లాటరైట్‌ ఎర్ర మట్టిని తవ్వుకు నేందుకు ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకున్న క్వారీ నిర్వాహకులు తొలుత రోడ్డునిర్మాణంపై దృష్టి సారించారు. రిజర్వ్‌ ఫారెస్టులోరోడ్ల నిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరించవు. అందులోనూ ప్రజలకు ఏవిధం గానూ సంబంధం లేకుండా కేవలం లాటరైట్‌ ఖనిజ సంపదను తరలించడానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలుపనికాదు. అందుకు రిజర్వ్‌ ఫారెస్టు లోని వివిధగ్రామాలను కలుపుతూ ప్రజాప్రయో జనం అనే ముసుగులో అనుమతులను పొందారు. విశాఖ జిల్లాలోని సరుగుడు,తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు,తుని మండలాల మీదుగా లాటరైటు ఖనిజాన్ని జాతీయ రహదారికి తరలించి అక్కడ నుంచి నేరుగా వివిధ దారుల్లో కాకినాడ పోర్టుకు చేర్చాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతుల పూడి మండలం రాఘవ పట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17కిలో మీటర్ల మేరకు వివిధ భాగాలుగ పక్కాగా ఒకే మట్టిరోడ్డుగా నిర్మించాలని తలంచి రంగం సిద్దంచేసారు. దాన్ని గుట్టుగా పక్కాగా అమలు చేసారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీశాఖ రేంజ్‌ పరిధి లోని రౌతులపూడి మండలం సార్లంక నుంచి విశాఖ మన్యంలోని సిరిపురం వరకు రహదారి నిర్మించాలని జూన్‌10న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌తో అటవీశాఖకు ఓదర ఖాస్తు పెట్టారు. 15న అటవీశాఖ రేంజర్‌ వెళ్లి ప్రతిపాదిత ప్రాంతా న్ని పరిశీలించి,అది 2అడు గుల కాలి బాట అని, దాన్ని 8అడుగుల రహదారిగా మార్చాల్సిన అవ సరం లేదని రిపోర్టు ఇచ్చారు. ఆ మరుసటి రోజే జిల్లా స్థాయి కమిటీ సమావేశమై సిరిపురం, సార్లంక, దబ్బాది గ్రామాల ప్రజల రాకపోకలు, వైద్య పరమైన అవసరాల కోసం ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) లో జూన్‌ 16న తీర్మానించారు. ఐతేఈరోడ్డే అడిగితే లేటరైట్‌ రహదారి విషయం బయ టకు వస్తుందని తెలివిగా ఆలోచించి, ఒకేసారి 109రోడ్లను అందులో రంప చోడవరం ఐటిడిఏ మన్యం పరిధిలో 66, కాకి నాడ పంచాయితీరాజ్‌ విభాగం పరిధిలో 43కు తీర్మానించి అదేరోజు ఈ రహదార్ల నిర్మాణానికి అనుమతిస్తూ అటవీశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అడవిలో రహదారులు నిర్మిం చాలంటే అటవీశాఖ,గ్రామపంచాయతీల తీర్మానం, ఐటీడీఏ అనుమతి తప్ప నిసరి.వాటికి ప్రభుత్వ నిధులూ ఉండాలి. అన్నిరకాల అనుమతులు వచ్చాక రహ దారి నిర్మాణం ప్రారంభంకావడానికి కనీసం ఐదా రు నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన్యంలో మాత్రం కేవలం 19 రోజులే పట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిధులతో పని లేకుండా మైనింగ్‌ సొమ్ములతో పనిపూర్తి అయ్యింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ 32అడుగుల మేర మట్టిరోడ్డు కనిపిస్తోంది. ఇప్పుడా రోడ్డులో14 టైర్ల టిప్పర్లు దూసుకుపోతున్నాయి.
పర్యావరణానికి భారీ నష్టం
దట్టమైనఅటవీ ప్రాంతంలో వేలాది గా ఎదిగిన పచ్చని వృక్షాలు,చెట్లు విచాక్షణ రహితంగా నరికేశారు.తమస్వార్ధం కోసం రిజర్వ్‌ ఫారెస్టును నాశనం చేసేశారు. అడవిని నరికే సమయంలో అడ్డోచ్చిన అటవీ జంతువు లను యంత్రాలతో నిర్ధాక్షణ్యంగా చంపేశారు. వేలాది చెట్లు నేలమట్టంచేసి పర్యావరణానికి తీవ్ర విఘా తం కల్పించారు. ఇంటి ముందు సొంతంగా పెంచుకున్నచెట్టు నరకాలంటేనే…రూల్స్‌ ఒప్పు కోవు! రిజర్వు ఫారెస్టలో చెట్టుపై గొడ్డలి వేటు వేస్తే…అదో పెద్ద నేరం! అక్కడ…కేంద్ర అను మతి లేకుండా ప్రభుత్వాలే చిన్నపని కూడా చేయలేవు. కానీ ప్రైవేటు వ్యక్తుల సారథ్యంలో కొండకోనల్లో వందలు,వేల సంఖ్యలో చెట్లను నరికేసి,రోడ్డు వేయడాన్ని ఏమనాలి? వాటి ఆన వాళ్లు లేకుండా చేశారు. దశాబ్దాల వయసున్న టేకు,నల్లమద్ది, తెల్లమద్ది వంటి వృక్షాలను కొట్టేసు కొంటూ పోయి..నెలన్నరలోనే రోడ్డు వేసేశారు. ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య నున్న అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్‌ అడవే. రిజర్వు అడవి పరిధిలో అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. రహ దారికోసం అడ్డంగా ఉన్న టేకు,దండారి,నల్ల మద్ది,తెల్లమద్ది,తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. చిన్నా పెద్దా కలిసి ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు.పైగా కేవలం 425 మీటర్ల రిజర్వు ఫారెస్టు పరిధిలో 21చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం అతిపెద్ద వింత. నిజా నికి…రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేస్థాయిలో30 అడుగులకు మించి రహదారి నిర్మించేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతో పాటు కొండలను కూడా గుల్లచేసేశారు.– కొండ్రు మ‌రిడియ్య‌, అధ్య‌క్షుడు ద‌ళిత ప్ర‌గ‌తి ఐక్య‌సంఘం
జిఎన్‌వి సతీష్‌

ఉపాధి ఊసేది?

వైసిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ నిజాయితీకి దూరంగా ఉంది. వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా మసి పూసి, మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా సంక్షోభంతో మొదలయింది. పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. గత ఆర్థిక సంవత్సరం లోనే ప్రభుత్వాల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ ఏడాది మరింత తీవ్రంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి సమయంలో బడ్జెట్‌ అంచనాలు భారీగా చూపించటం ప్రజలను పక్కదారి పట్టించటానికే.
ఆదాయాలు-ఖర్చులు
ఆదాయాలు, ఖర్చుల అంచనాలే బడ్జెట్‌. అంచనా వేసిన ఆదాయం కంటే అంచనా వేసిన ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్య లోటుగా లేదా డబ్బుల లోటుగా పిలుస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ద్రవ్యలోటును పూడుస్తుంది. అప్పుకు పర్యాయ పదమే ద్రవ్యలోటు. అప్పు తీసుకొచ్చి ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తుంది. 2019-20లో అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ సైజు రూ.2 లక్షల 27 వేల కోట్లు. ఇదే మొత్తంలో ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, పెట్టుబడి ఆదాయం ఉంటాయి. ఖర్చులో రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, అప్పు ఫాయిదాలు ఉంటాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పుతో కలిపి రూ. 2లక్షల 2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన వైసిపి ప్రభుత్వం చివరికి దాన్ని రూ. లక్షా 74 వేల కోట్లకు తగ్గించింది. రెవెన్యూ ఆదాయం రూ.68 వేల కోట్ల మేర తీవ్రంగా తగ్గింది. అంచనా వేసిన దాని కంటే మరో రూ. 15వేల కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఆదాయ లోటును రూ.53 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఖర్చును కూడా రెవెన్యూ ఖర్చులో రూ.43వేల కోట్లు, పెట్టుబడి ఖర్చులో రూ.19 వేల కోట్లు కోత వేసింది. అదే సమ యంలో అప్పు తీర్చే ఫాయిదాలను రూ.9 వేల కోట్లకు పెంచింది. వెరసి అంచనా వేసిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు రూ.53 వేల కోట్లకు తగ్గిం ది. ఆ మేరకు బడ్జెట్‌ సైజు కూడా రూ.53 వేల కోట్లకు తగ్గి, రూ.ఒక లక్షా 74 వేల కోట్లయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు, పరిశ్రమలు, రవాణా వంటి ఆర్థిక సర్వీసులకు పెట్టిన ఖర్చు భారీగా రూ.48 వేల కోట్లు తగ్గింది. సాధారణ విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర సామాజిక సర్వీసులకు రూ.9 వేల కోట్ల కోత పెట్టింది. ఈ సర్వీసులలో ఇతర రంగాలకు రూ. 23 వేల కోట్ల కోత పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.14వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. వెరసి సామాజిక సర్వీసులలో రూ.9 వేల కోట్ల కోత పడిరది. కోర్టులు, జైళ్ళు, పోలీసు, రెవెన్యూ మరియు అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల పెన్షన్లు వంటి సాధారణ సర్వీసులకు కేటాయించిన దాని కంటే రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది.
వర్తమాన బడ్జెట్‌
2019-20 బడ్జెట్‌ వాస్తవం తెలిస్తేగాని ప్రస్తుత 2020-21 బడ్జెట్‌ను అవగాహన చేసుకోలేము. ముందుగా గత 2019-20 బడ్జెట్‌ వాస్తవాలను పరిశీలించాం. కరోనా లేని సమయంలో 2019-20 బడ్జెట్‌ అంచనాలు వాస్తవంలో తలకిందులయ్యాయి. కరోనాతో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌ అంచనాలు వాస్తవం అయ్యే అవకాశం అసలు లేదు. 2019-20 బడ్జెట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరపు స్థాయికి దిగజారింది. 2020-21 బడ్జెట్‌ సైజును రూ. 2 లక్షల 25 వేల కోట్లుగా ప్రతిపాదించి నప్పటికీ వాస్తవంలో అది కూడా 2018-19 స్థాయికి కొద్దో గొప్పో తేడాతో దిగజార బోతోంది. ప్రభుత్వానికే బడ్జెట్‌ మీద నమ్మకం లేదు. ఏకంగా బడ్జెట్‌ సైజునే రూ.3 వేల కోట్ల మేర తగ్గించింది. వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, నీటిపారుదల, సాధారణ విద్య వంటి రంగాలకు కేటాయింపులోనే రూ.30 వేల కోట్లు తగ్గించింది. అదే సమయంలో సంక్షేమానికి దాదాపుగా అదే మొత్తంలో రూ. 28 వేల కోట్ల మేర పెంచింది. వివిధ రంగాలను అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే ప్రజలకు మేలు చేయదు. అభివృద్ధికి కేటాయిం పులు తగ్గకుండా అదనంగా సంక్షేమానికి కేటాయింపులు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జోడు చక్రాలుగా నడుస్తాయి.
కార్మికులకు కానరాని మేలు
ఉపాధి హామీ పథకానికి పోయిన సంవత్సరం రూ.3626 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 2021 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కరోనా వలన పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి కల్పన పెంచాల్సిన ప్రభుత్వం గతం కంటే రూ. 400 కోట్లు తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. వైయస్సార్‌ బీమా పథకం కూడా వట్టిపోయిన గొడ్డులా తయారయింది. పోయిన సారి దీనికి రూ. 400 కోట్లు కేటాయించినా… దాన్ని ఖర్చు చేయకుండా ఈ సంత్సరం రూ.262 కోట్లు మాత్రమే కేటాయించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు కూడా స్పష్టమవుతాయి. గత 9 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ చేయలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావనే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు పని లేదు. వేతనాలు లేవు. ఇటువంటి సమయంలో కార్మికుల కొనుగోలు శక్తి పెంచ టానికి అవసరమైన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రకటించ లేదు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం వారికి కానుకగా చూపిస్తు న్నది. ఇతర పెన్షన్లకు అర్హత లేని వారు కూడా తాము పని చేయగలిగిన వయసులో 30, 40 సంవత్సరాల పాటు పని చేసినవారే. వారికి ఒక యజమాని అంటూ ఉండరు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. దానిని కానుకగా చూపించి వైసిపి ప్రభుత్వం వారిని అవమానపరుస్తోంది. ఈ బడ్జెట్‌ కార్మికులకు మేలు చేయదు. పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీసు రంగాలలో ఉపాధి పెరగదు. కార్మికులు కొనుగోలు శక్తీ పెరగదు.
సంక్షోభవేళ అరకొరగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రూ.40,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. మే 17న విలేకరుల సమావేశంలో అదనపు కేటాయింపుల గురించి నొక్కి చెప్తూ ఈ పథకం కింద 2019 మే నెలలో కంటే 40-50 శాతం మంది కార్మికులు అధికంగా నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ బడ్జెట్‌కు ఈ అదనపు రూ.40,000 కోట్లు జోడిరచినప్పటికీ మంత్రిగారు వక్కాణించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు.రూ.40,000 కోట్ల కేటాయింపును గొప్పగా చెప్పుకోవడం మీదే ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పని కోరే వారి సంఖ్యకు సరిపడేంత బడ్జెట్‌ వుండాలన్నది ఆవిడ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇదొక సులభమైన మార్గం అంతే. ఇప్పటికే 14 కోట్లకు పైగా వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలన్న భారీ లక్ష్య సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో కార్మికులకు ఏడాదికి 200 పని దినాలకు గ్యారంటీ వుండాలి. అదేవిధంగా వారికి రోజువారీ వేతనం రూ.300 (లేదా ఆయా రాష్ట్రాలలో అమలులో వున్న కనీస వేతనం అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తం) ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ ఇది. పైగా, అనేకమంది ఆర్థికవేత్తలు కూడా గతంలో ఇటువంటి సూచనలే చేశారు. ఆ విధంగా చేస్తే గ్రామీణ కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అది ప్రధానమైన అడుగు అవుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కి కేటాయించింది రూ.61,500 కోట్లు. వాస్తవానికి 2019-20 సంవత్సరంలో ఆ పథకం కింద చేసిన ఖర్చు కంటే ఈ కేటాయింపులు 9,500 కోట్లు తక్కువ. పైగా గతేడాది చెల్లించవలసిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఇప్పుడు అదనంగా ప్రకటించిన రూ.40,000 కోట్లు కలిపితే ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ. 1,01,500 కోట్లు వున్నట్లు లెక్క.
ఈ ఏడాది మే 16వ తేదీన అందుబాటులో వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పోర్టల్‌ వివరాల ప్రకారం 1435.73 లక్షల మంది జాబ్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 1374.39 లక్షల మందికి కార్డులు మంజూరు అయ్యాయి. అంటే దరఖాస్తు చేసుకున్న 61,35,751 కుటుంబాలకు జాబ్‌కార్డు మంజూరు కాలేదు. ఇందులో 1166 లక్షల మంది పనిచేసేవారుండగా కార్మికులు వుండగా, అందులో 766.75 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే ఉపయోగంలో వున్నాయి. గత మూడేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజు పనిచేసినా జాబ్‌కార్డు ఉపయోగంలో వున్నట్టేనట!
సులభంగా అర్థమయ్యేందుకు ఒక చిన్న లెక్క చూద్దాం. జాబ్‌కార్డులున్న 766.75 లక్షల క్రియాశీల కార్మికులకు రూ. 200 రోజువారీ వేతనం చొప్పున 100 రోజులు పని కల్పించడానికి రూ.1,53,350 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం తన ధోరణి మార్చుకుని, జాబ్‌కార్డులున్న కుటుంబాలన్నింటికీ 100 రోజుల పని కల్పించాలని భావిస్తే అందుకుగాను రూ.2,87,146 కోట్లు అవసరమవుతాయి. అన్నిటినీ మించి, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక్కో ఇంటికి కనీసం 200 రోజుల పని కల్పించాల్సిన అవసరముంది. ఇలా చేస్తే, ఖజానా నుంచి రూ.3,06,700 కోట్లు ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. వేతనం రూ.200 అంటే చాలా తక్కువ. అయినప్పటికీ మనం దాన్నే కనీస వేతనంగా పరిగణిస్తున్నాం. పై లెక్కలన్నీ కేవలం వేతనానికి సంబంధించినవి మాత్రమే. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనికి సంబంధించి ఇతర ఖర్చులు కూడా వుంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన వికాస్‌ రావల్‌ ఒక సూచన చేశారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఒక వ్యక్తి పని చేస్తే అందుకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ఏడాది పెరిగిన వేతనం రూ.20 కూడా జోడిరచినట్లయితే అది రూ.310 అవుతుంది. ఈ లెక్కన, కార్డు వున్న వారందరికీ 100 రోజుల పాటు పని కల్పించాలంటే రూ. 4,26,975 కోట్లు అవసరమవుతాయి (13,77,33,901 జాబ్‌కార్డులకు 2019-20 ప్రకారం అయ్యే ఖర్చునకు (రోజుకు రూ.290) కొత్తగా పెరిగిన వేతనాన్ని (రోజుకు రూ.20) జోడిరచాలి).
ఈ గణాంకాలన్నీ లోగడ గ్రామాలలో వున్న శ్రామికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వేసిన అంచనాలు. ఇప్పుడు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది మంది వలస కూలీలను కూడా కలిపి అందరికీ పనులు కల్పించాల్సి వుంటుంది. తిరిగివచ్చిన వలస కూలీలను కూడా కలుపుకొని పని అడిగేవారి సంఖ్య పెరిగిన పరిస్థితిని ఈ అరకొర కేటాయింపులతో ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న నుంచి హాయిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌ కొరత ప్రభావం ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం అమలు మీద తీవ్రంగా వుంటోంది. దీనికితోడు, కేంద్రం విడుదల చేసే నిధులు చాలీచాలకుండా, ఒక పద్ధతిపాడు లేకుండా విడుదల అవుతుంటాయి. ఆర్థికంగా బలహీన స్థితి లోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇవ్వలేకపోవడం కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జాబ్‌కార్డులు-పనుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక ప్రతిబంధకాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నగదు నిల్వలు తక్కువగా వుండడం వల్ల అనేక రాష్ట్రాలు ఈ పథకం కింద పనులు కల్పించలేకపోయాయి. లాక్‌డౌన్‌ అమలులో వున్నప్పటికీ మార్చి 31 తర్వాత జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7.1 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస కూలీల సంఖ్య ఈ రాష్ట్రాలన్నిట్లోను ఎక్కువగా వుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాధాన్యత ఎంతగా వుందనేది దీనిని బట్టే అర్థమౌతోంది.
లాక్‌డౌన్‌ వేళ గ్రామీణ కార్మికులకు కొంత ఉపశమనం కల్గించడానికి, తిరిగి వచ్చిన వలస కార్మికుల కారణంగా పడిన భారాన్ని తగ్గించడానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లోనే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పని ఎక్కువగా జరుగుతుంది. పని డిమాండ్‌ కూడా అధికంగా వుంటుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ‘పూర్తయిన పని’లో సుమారు 37 శాతం ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లోనే జరుగుతుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదటి దశ సందర్భంగా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, ఆలోచన లేకుండా గుడ్డిగా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనులను నెల రోజుల పాటు రద్దు చేసేసింది. ఒక ప్రకటన ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ అవి ఏప్రిల్‌ 20 నుంచి అమలు లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ను మినహాయించినప్పటికీ ఈ పథకం కింద పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి.
ఏప్రిల్‌ మాసంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కేవలం 30 లక్షల మంది మాత్రమే పని చేశారని (మామూలుగా పనిలో వుండేవారిలో కేవలం 17 శాతమే) అందుబాటులో వున్న ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. అదే గతేడాది 1.7 కోట్ల మంది కార్మికులు పనిలో వున్నారు. అంటే ఈ ఏడాది 82 శాతం కార్మికులు తగ్గారన్నమాట. అయితే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఏప్రిల్‌ 2020లో 26.2 కోట్ల పని దినాలను సృష్టించవచ్చని గొప్పగా చెప్పారు. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పట్టణాలకే పరిమితమై వుంది. గ్రామాలలో దాని ప్రభావం తక్కువగా వుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పని దినాలను అనవసరంగా పోగొట్టుకున్నామన్నమాట.
కరోనాకు ముందు, సాధారణ పరిస్థితులు వున్నప్పుడు కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఎటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించేవారు కాదు. అయితే దేశంలో 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కార్మికులకు ఎలాంటి నిరుద్యోగ భృతిని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేతనాలను చెల్లించాల్సిందిగా ప్రయివేటు రంగానికి విజ్ఞప్తి చేయడం విస్తుగొల్పుతోంది.
అనేక పరిమితులు వున్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఆర్థిక-వ్యవసాయ విపత్తు లలో సైతం గ్రామీణ భారతంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఎంత ప్రయోజనకరమైనదో నిరూపణ అయ్యింది. గ్రామీణ నిరుపేదలు, అణచివేతకు గురవుతున్న వారు మనుగడ సాగించేందుకు ఈ పథకం తోడ్పడిరది. ఈ వాస్తవాన్ని గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అంగీకరించడమే గాక ఇలా పేర్కొంది. ‘’ఈ పథకం కింద పనిచేసే కార్మికులలో షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు 20 శాతం, షెడ్యూల్డ్‌ తెగ కార్మికులు 17 శాతం ఈ పథకం కింద స్థిరంగా వుంటున్నది’’. అదేవిధంగా పనిదొరికే మహిళా కార్మికుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగానే వుంది. వీరికి పని దొరకడం మాత్రమే కాదు, సమాన వేతనాలు గ్యారంటీ అయ్యేలా కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సహాయపడిరది.
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల ఉద్యోగాలు పోయాయని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎమ్‌ఐఆ) పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో 40 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికం, ఆకలి సమస్యను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ పరిస్థితిలో గామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం వేతన కార్మికుల మీద దృష్టి సారించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ’సాయమే’ ప్రధానం!
కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులు బాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..పాడి పరిశ్రమకు పాలు పోశారు.. దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే ‘ఫసల్‌ బీమా యోజన’ కింద ?6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ?74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ?4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే.. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం ?13,343 కోట్లు కేటాయించారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ?15 వేల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మత్స్యరంగానికి చేదోడుగా.. మత్స్య సంపద యోజనకు ?20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది. వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ?9 వేల కోట్లు కేటాయింపు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు. రైతుల కోసం మరిన్ని.. నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు. ు అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్‌ విధానం బలోపేతం చేస్తారు. లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు. – ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు. మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. – (వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి)-పి.అజయకుమార్‌/విక్రమ్‌ సింగ్‌

మేమంటే ఇంత చులకనా?

‘‘ నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా…ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలి స్తామని… గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుం బానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తు తం ఆ హామీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదిహేనేళ్లు కావస్తున్నా… నిర్వాసితుల పునరావాస కల్పన చూస్తే ఆశ్చర్యం గానూ, నిరాశాజనకంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 9 గ్రామాల్లోని 3300 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పిం చింది. ఇది కేవలం 3 శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.’’

పోలవరంప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా. ఈ క్రమం లో రెండు లక్షలమంది ప్రజలు నిర్వాసితులు కావొ చ్చు.నిర్వాసితులయ్యే వారిలో అధికశాతం మంది ఆదివాసులే. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరినిందరికీ 2010`2011లో సర్వే చేసి అప్పటి భూసేకరణచట్టం కింద పునరావాసం అర కొరగా కల్పించారు. ప్రభుత్వం కల్పించే పునరా వాసం నేటికీ ఆదివాసీలకు సంపూర్ణంగా కల్పిం చలేదు. దీంతో వారంతా ఆందోళనలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసి తులపై చూపడం లేదు.‘చంద్రబాబు ప్రభు త్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుం ద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలిస్తామని.. గతంలో ఎకరాకురూ.1.15నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుతం ఆహా మీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారం భమై పదిహేనేళ్లు కావస్తున్నా…నిర్వాసితుల పునరా వాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ,నిరాశాజన కంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవ లం 9గ్రామాల్లోని 3300కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. ఇది కేవలం 3శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరా వాసంపై లేదనే వెల్లడౌతున్నది.

Read more

విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురల వాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరా టానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

బ్రిటిష్‌ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు క్రీ.శ.1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు. 1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో 8వతరగతి, ఎ.వి.యస్‌. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.పేదరికం అనుభవించాడు. పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు, హఠయోగం వంటివి నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు. సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజ పూరితమైన వాతావరణంపెరిగాడు. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు. ఆపర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు.
మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకునేవారు. బ్రిటిష్‌ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది. దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది. వారి పరిపాలన కార ణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు రౌలత్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును. దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘటించారు. సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు. విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు. వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు. విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు, గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. కొండజాతివారిని చైతన్య వంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్‌ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్‌ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి,జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడి పించాడు. ఈకొండదళం ఆచూకీ తెలుప వలసి నదిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజ లను అనేక బాధలకు గురిచేసింది. చింతపల్లి, కృష్ణదేవి పేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పిం చిన టెలి ఫోన్‌ సౌకర్యాలను, స్తంభాలను ఈదళం ధ్వంసం చేసిం ది. పోలీసు లను ముప్పుతిప్పలు పెట్టే వారు, ఆహార ధాన్యాలను కొల్లగొట్టేవారు.విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని వీరు శిక్షించేవారు. ఈదళం వారిని పట్టి చ్చిన వారికి వెయ్యిరూ పాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది. ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది. వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు. సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపో యాడని తెలుసుకుని బ్రిటిష్‌ వారు, సీతారామరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు. వారి బాధలను చూడలేక సీతారామ రాజు, బ్రిటిష్‌ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు. తమ ఎదుట పడిన సీతారామరాజును బ్రిటిష్‌ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు. వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు, తన వంటి సీతా రామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్‌ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు. వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు. రామరాజు మరణంతో మన్యం ప్రజ లలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బ్రిటిష్‌వారు నిరంకుశంగా కొండ దళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు. సీతారామరాజు పూరించిన విప్లవశంఖం దేశ మంతటా సంచలనం కలిగించింది. కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్య టించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు. సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతా రామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొని యాడకుండా ఉండలేమని చెప్పారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శ కుడయ్యాడు.
విప్లవం రెండవదశ
డిసెంబర్‌ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్‌ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరా టం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీ సుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒకగంట పైగా సాగిన భీకరమైన పోరు లో మరొక 8మంది విప్లవకారులు మరణిం చారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపో యాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామ రాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్‌, హ్యూమ్‌ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్‌ 17నరాజు కొద్దిమంది అనుచరు లతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరు వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923ఆంధ్ర పత్రికలో ప్రచు రింపబడిరది. 10గంటలకు బయలుదేరి శంఖ వరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించి నందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరి మానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈవిషయం తెలిసి ‘‘నేను సాయం కాలం 6గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది’’ అని కలెక్టరుకు రాజు ‘‘మిరప కాయ టపా’’ పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.) క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టు కోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారు లను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షిం చడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మను షులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్‌ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూ ర్తం పెట్టి జూన్‌ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు. జూన్‌ 17నరాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యా యడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామం లోను ఆహార పదార్ధాలు సేకరించారు. 2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్‌ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్‌ లో రాజు ముఖ్య అనుచ రుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికి పోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపిం చింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతి చ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధిం చారు. తరువాత శిక్షించి అండమాన్‌ జైలుకు పంపారు(1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యు నిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక య్యాడు.1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురి చేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబరు 22న విప్లవకా రులు పాడేరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయ కత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకా యించి కాల్పులు జరిపారు. ఒకగ్రామ మునసబు ఆపోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగ లిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించు కోలేక పోయారు.17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్‌కమిషనర్‌)గా రూథర్‌ఫర్డ్‌ నియ మితు డయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపు ణుడని పేరుగలిగిన వాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక ‘‘అగ్గిరాజు’’ అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరుపొందాడు. ప్రభు త్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వాడు. ఆహారధాన్యాలు కొల్ల గొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు.1924 మే 6వతారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజుకాలికి గాయమైంది. శత్రు వులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణిం చాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పం పారు. అక్కడే మరణించాడు. ఆరాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్‌ ఫర్డ్‌ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజర య్యాడు. వారం రోజు లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్‌ ఫర్డ్‌ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివ రించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించ డానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.తరువాత,1924 మే 7న కొయ్యూ రు గ్రామ సమీపంలో ఒకఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసు లకు కబురు పంపాడట.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధిం చారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్‌ గుడాల్‌ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజు ను (ఒక చెట్టుకు కట్టివేసి) ఏవిచారణ లేకుండా గుడాల్‌ కాల్చి చంపాడు.27ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారా మరాజు అమరవీరుడయ్యాడు.- డా,దేవులపల్లి పద్మజ

కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌

వలస కార్మికుల కోసం సామాజిక వంటశాలలు

‘‘ వలస కార్మికులకు తిండిగింజలు సరఫరా చేయ డానికి అవసరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వాలు తమ సొంత పథకాలను జూలై31లోపు మొదలు పెట్టి కరోనా కొనసాగినంత కాలం అమలు చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్‌ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికులకు రెండుపూటల తిండి కోసం కార్మి కులు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సామూహిక వంటశాలలు కొన సాగించాలని జస్టీస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టీస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందు లో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31 లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాల నమోదు కోసం నేషనల్‌ డెటాబేస్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడంలో కేంద్ర కార్మికశాఖ చేసిన జాప్యాన్ని సుఫ్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్మికులు ప్రభుత్వాల నుంచి వివిధసంక్షేమ పథకాలు అందు కోవడం కోసం వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర కార్మికశాఖ ఉదాసీనంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం క్షమార్హం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇప్పటికైనా పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేసి అమల్లో కి తీసుకురావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అసం ఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివ రాల నమో దుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మేటి క్స్‌ సెంటర్‌తో కలసి ఒక పోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమ యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టిత రంగ కార్మికుల వివరాలను నేషనల్‌ డేటాబేస్‌లో నమోదు చేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

రేషన్‌ కార్డు లేదన్న సాకుతో ఏ ఒక్క వలస కార్మికునికి అందునా ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రేషన్‌ నిరాకరించడం ఎంతమాత్రమూ తగదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని సుప్రీం కోర్టు జూన్‌ 29న ఒక తీర్పులో ఘాటుగా హెచ్చరించింది.‘‘వలస కార్మికుల్లో ఎక్కువ మంది పేదరికంతో చదువుకు దూరమైనవారే.వారి వద్ద ఏ విధమైన కార్డులు ఉండవు.అంతమాత్రం చేత వారికి ఈకరోనా సమయంలో రేషన్‌ను ప్రభు త్వం ఎలా నిరాకరిస్తుంది.వీరిలో చాలామందికి ఎలాంటి స్థిరమైన ఉపాధి ఉండదు. అయినా కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటారు వీరు’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో పేర్కొం ది. దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని,దేశ పురోగా భివృద్ధికి, ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూ షన్‌ చాలా గొప్పదని అన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందేలా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్‌ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31 లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వా లకు గడవుఇచ్చింది.రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడా లని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలస కార్మికు లను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రం సరఫరా చేయాలని, కరో నా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామా జిక వంటశాలలను నడపాలని కోరింది. ఆహార హక్కు జీవించేందుకు తప్పనిసరి అని చెప్పింది. హుందాగా జీవించే హక్కులో ఇదోక భాగమని కోర్టు ప్రభుత్వానికి హితబోధ చేసింది. జూలై31 నుంచి ఒకదేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని అన్ని రాష్ట్రాలుపూర్తిగా అమలు చేయనున్నందున, అప్పటి లోగా వలస కార్మికులందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ పథకంలోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల ఆందోళనలపై కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వశాఖ ఉదాసీనవైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులు డేటాను పోర్టల్లో ఉంచడంలో ఆలస్యం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై31లోగా వలస కార్మికుల కోసం పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘‘అసం ఘటిత,వలసకార్మికుల వివరాలు నమోదు చేయ డానికి కేంద్రప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి..అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి’’ అని పేర్కోంది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్‌డౌన్‌ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పో యిన వలస కార్మికులకోసం దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలను జారీచేసింది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయదలిచిన వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మి కులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యా వసర సరుకులను అందజేయాలని సుప్రీం కోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది. జులై31వతేదీ నాటికి..ఈ వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్‌ లైన్‌ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈపథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు-వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలనిసూచిం చింది.
పోర్టల్‌ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మి కులు,వసల కూలీల వివరాలను నమోదు చేయ డానికి ప్రత్యేకంగా ఓపోర్టల్‌ను రూపొందిం చాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. జులై31వతేదీ నాటికి ఈపోర్టల్‌ను అందు బాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అను గుణంగా..ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై31వ తేదీనాటికి డ్రై రేషన్‌ను చేపట్టాలని,కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్‌లైన్‌ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొం ది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యు లేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమో దు చేయాలని సుప్రీంకోర్టురాష్ట్రాలకు సూచిం చింది.
కమ్యూనిటీ కిచెన్లు సైతం
వలసకార్మికుల సంక్షేమం కోసం కమ్మూ నిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విష యం తెలిసిందే. ఫలితంగా-వారు వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.
సుమోటోగా స్వీకరణ
దీన్ని గతఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు పథకం ఇప్పటికే జాప్య మైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యా నిం చింది.
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలసకార్మికుల డాటా బేస్‌ నిమి త్తం జాతీయ స్థాయిలో వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశిం చింది. ‘వలసకార్మికుల సమస్యలు,కష్టాలు’పై సుమో టో కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఈ మేరకు 80పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకోసం జాతీయస్థాయి డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈసందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విష యంలో కేంద్ర కార్మికశాఖ కనబరుస్తున్న ఉదాసీ నత,నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్‌ సరు కుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకా లన్నీ జూలై 31కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది.రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంట శాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగిం చాలని పేర్కొంది.వలస కార్మికు లకు రేషన్‌ సరఫరానిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకు రావాలి.ఆమేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రా లు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగినపథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది.
దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రా నికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలిం చే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వ యం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది. వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్న లను వేసింది.లాక్‌ డౌన్‌ అమల్లో ఉండగా ప్రధా నంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్‌,ఫుడ్‌, వారిట్రాన్స్‌ పోర్టేషన్‌ తదిత రాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యంకాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొం ది. కాగాకేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..
గతేడాది మే1న శ్రామిక్‌ రైళ్లను ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటి వరకు 91లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడిరచారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతిం చరాదని, అలాంటి వారు కావాలంటేఅఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. వలస జీవులకు రైల్వే శాఖ 84లక్షల ఆహార పాకె ట్లను అందించిందని తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుం దన్నారు. కాగా-తమ పేర్ల నమోదు లోను, టికెటింగ్‌ సిస్టంలోను జాప్యం జరుగు తుండ డంతో..ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనా లను ఆశ్రయి స్తున్నారు.మరికొందరు కాలి నడకనే సాగుతున్నారు. Saiman Gunaparthi

1 30 31 32 33 34 48