చరిత్ర పాఠాల తొలగింపు

జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థు లను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతిలక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నం గా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్‌, డిజిటలైజేషన్‌, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబం ధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
భావి పౌరులకు దేశచరిత్ర తెలియ కూడదనే సరిగ్గా కోవిడ్‌ విపత్తు సమయంలో, వ్యవస్థ లేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టు కుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచిం చింది. ‘వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయా లు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు.2021లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యా ర్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు.కోవిడ్‌ విపత్తును అవకాశంగా మలు చుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగి పోతున్నాయి.
నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం,హక్కు లు,పౌరసత్వం,ఉద్యమాలు,జాతీయవాదం,ప్రాంతీ య అవసరాలు,స్థానిక సంస్థలు,ప్రభుత్వాలు,ఆహార భద్రత,పర్యావరణం,పంచవర్ష ప్రణాళికలు ఇతర దేశాలతో సంబంధాలు,అలీన విధానం,పర్యావ రణం,సహజవనరులు,భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొల గించారు.ఇవన్నీ మనదేశచరిత్ర,వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానా లు,లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు …
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇ ఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశా లివి.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2 (16వ,17వ శతాబ్దాలకు సంబంధించినది)

  1. పదకొండవ తరగతిలో సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, సంస్కృతుల ఘర్షణ
  2. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీ యాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు
  3. పన్నెండవ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించిన నిషేధానికి సంబంధిం చిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు.
  4. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్త కాలతో ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించారు.
  5. సంఘసం స్కర్తలు పెరియార్‌, నారాయణ గురు,బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు.
  6. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ‘గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?’ వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
    జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
    జాతీయోద్యమ కాలంలోలౌకిక, ప్రజా స్వామ్యం,సార్వత్రిక విద్యకు డిమాండ్‌ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్య ను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతి రేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి.ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సం ఘాలు,వ్యక్తులు,సంస్కర్తలు ఏకమై బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవస రం లేదా?
    ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్‌ చేసిన అద్భుతమైన పోరాటం,త్యాగం దేశ ప్రజ లను కదిలించింది.క్విట్‌ ఇండియా, సహాయ నిరా కరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువ తను,లాయర్లను,ప్రజలను, విద్యార్థులను జాతీయో ద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతసంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే…మహాత్ముడిని హత్య చేశాడు.
    మత రాజ్యం కోసం అవసరమైన ప్రయ త్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీ కరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది.ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.- (కె.విజయ గౌరీ/కె.శేషగిరి)