పోలవరం ఎంత దూరం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవారాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీటి,విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలతోపాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్‌ చేసినా..అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో..ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం అనడంలో రెండోమాట లేదు.కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు గడువులు మారాయి.కానీ..ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. ప్రాజెక్టు పూర్తియితే తమకు నీళ్లెప్పుడొస్తాయా అని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. –సైమన్‌ గునపర్తి
పోలవరం ఎత్తుపై గందరగోళం
ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోంది. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గడచిన వారం రోజుల్లో పార్ల మెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూ చులాడగా, నిధుల విషయమై తాజాగా విత్త మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసింది. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013-14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయ లేదు. అంతకుముందు పార్లమెంట్‌లో ఇద్దరు జలశక్తి మంత్రులు ప్రాజెక్టు ఎత్తుపై తలొక మాటా మాట్లాడారు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 మీటర్లుగా చెప్పు కొచ్చారు. కొత్త డిపిఆర్‌పై దాటవేశారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరి స్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది.
పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని భీష్మిస్తోంది. ప్రాజెక్టు అంటేనే నిర్వాసితులతో కలిపే ఉంటుంది. కేంద్రం ఈ అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించడం అమానవీయం. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. కాంటూరు లెక్కల్లో శాస్త్రీయత లేదనడానికి మొన్న గోదావరికి వచ్చిన వరదలే ఉదాహరణ. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. అదీ అసం పూర్తిగానే. జాతి అభివృద్ధికి తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది నిర్వాసితుల పునరావాసాన్ని గాలికొదిలేయడం హేయం. పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడి నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులడుగుతున్నాం అని చెపుతు న్నారంతే. మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగా,కేంద్రం ఇచ్చింది రూ.828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవ సరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి ఎందుకు చేయరో తెలీదు. నిర్వాసితుల పునరా వాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యా లు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు వంత పాడటం అభ్యంతరకరం. 2017-18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భాగాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. రాష్ట్రం గమ్మునుంది. నిర్వాసి తులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎన్నికల వాగ్దానం ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్వాసి తులకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ గోదావరి నది పరీవాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై లోక్‌ సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో ఏది నమ్మాలో, ఏది నిజమో అన్న సందేహాలు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారాల ట్రి బ్యునల్‌ 1980లో ప్రకటించిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటినిలువ సామర్థం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఎత్తు 45.72మీటర్లు అని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంతో తెలపాలని రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్‌ అడిగిన ప్ర శ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూన్నట్టుగా ఎపి ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడిరచారు. అంతకుముందు ఇదే సెషన్స్‌లో పోలవరం ఎత్తుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపి సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ బదులిస్తూ పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల చేత భిన్నమైన ప్రకటనలు చేయించడం గందరగోళ పరిస్థితు లకు దారితీస్తోంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌,ఒడిశా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు సమస్యలో కేంద్రప్రభుత్వం చేసిన ఈ విధమైన ప్రకటనల్లో దేన్ని నమ్మాలో , ఏది నిజమో అన్న సందేహాలు పుటుకొస్తున్నా యంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని,దీన్ని సహించేది లేదని ఇప్పటికే ఎపిలో ప్రజాసంఘాలు కేంద్రా నికి హెచ్చరికలు చేశా యి. పోలవరం ప్రాజెక్టు లో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేప థ్యంలో ఇప్పడు కేంద్రం పోలవరం ఎత్తుపై మరింత స్పష్టత ఇచ్చేలా ప్రకటన జారీ చేయాలని గోదావరి నది పరివాహక నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పోలవరం తుది నివేదికపై సుప్రీంకు కేంద్రం లేఖ పోలవరం ముంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సు ప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. పిటిషన్ల విచారణపై వాయిదా కోరుతూ వినతిపత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుముంపు సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టువల్ల వరద ముంపు తలెత్తుతున్నందున ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని తెలంగాణ,చత్తిగఢ్‌,ఒడిశా రాష్టాల ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటీషన్ల ్ల విచారణ నేపద్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖమంత్రి సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని, ఈ పరిస్థితుల దృష్టా మరో మూడు నెలల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ,తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌ 6న సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదావరి నదీ పరివాహకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థ్ధించింది.
ఇస్తామన్న పరిహారానికి దిక్కూమొక్కు లేదు
పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం మాట మరిచారు. పెండిరగ్‌ల పరిష్కారం లేనేలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోనే ప్రస్తుతానికి ఊళ్లను ఖాళీ చేయించి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుక్కునూరు, పోలవరం, వేలేరు పాడు మండలాల్లో నిర్వాసితుల కుటుం బాలను గుర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు 13 చోట్ల పోలవరం నిర్వాసిత పునరా వాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం సమీపాన ఉన్న చల్లావారిగూడెంలో అత్యధికంగా ఆరు వేల కుటుంబాలకు సరిపడా 650 ఎకరాలను సేకరించి కాలనీకి శ్రీకారం చుట్టారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లోను ఇదే తరహాలో 2019 వరకు పునరావాస కాలనీలు కాస్తంత వేగంగానే సాగాయి. ఆ తదుపరి ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం,కామయ్యపాలెం,రాచన్న గూడెం, ఎర్రవరం,దర్పగూడెం,రౌతుగూడెం,ములగలం పల్లి, స్వర్ణవారిగూడెంలలో కాలనీల నిర్మాణాలు చేపట్టినా ఇప్పటికే ఐదు గ్రామాల్లో కాలనీలకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. తమకు చెల్లించాల్సిన పరిహారం చేతికందనిదే తాము కాలనీలకు వెళ్ళబోమని నిర్వాసితులు భీష్మించారు. ఫలితంగా రాచన్నగూడెం,ఎర్ర వరం,దర్పగూడెం,రౌతుగూడెంలలో నిర్వాసిత కుటుంబం ఒక్కటంటే ఒక్కటి రాలేదు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేటలో 400 గృహాలతో కాలనీ నిర్మించగా,అక్కడ నిర్వాసిత కుటుంబాలు అనేకం వచ్చి చేరాయి. అలాగే బుట్టాయిగూడెం మండలంలో ముప్పినవారి గూడెం,దొరమామిడి,రామన్నగూడెం, రెడ్డి గణపవరం వంటి గ్రామాల్లో దాదాపు 1500 నిర్వాసితగృహాలు నిర్మించాల్సి ఉండగా,వీటిలో పది శాతం కూడా ఇళ్ళు పూర్తికాలేదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముప్పుతిప్పలు పడినా ఫలితం దక్కలేదు. ఏకంగా వివిధ శాఖలకు లక్ష్యాలు విధించినా కాలనీలు మాత్రం పూర్తి చేయలేకపోయారు.దీంతో ఒకవైపు నిర్వాసిత కుటుం బాల్లో అసంతృప్తి గూడు కట్టుకునే ఉంది. పోలవరం నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 6లక్షల 86 వేలు,గిరిజనేతరులకైతే ఒక్కొ కుటుంబానికి 6లక్షల 36వేలు చెల్లించాల్సి ఉంది. వీటిలో చాలా కుటుంబాలకు పూర్తి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నివేదికల పేరిట అధికారులు తాత్సారం చేస్తే ఆర్థిక వైఫల్యంతో ప్రభుత్వం మరో జాప్యం చేసింది.
మూడేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పది లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికి మూడేళ్లుగా అధికారం వెరగబెడుతున్నా మాటెందుకు నిలుపుకోలేదని పోలవరం నిర్వాసితులు నేరుగానే ప్రశ్నిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిధిలోకి వచ్చే గ్రామాలన్నింటిలోనూ ఒక్కొ కుటుంబానికి 2006 నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో పరిహార ప్రకటన, అందచేత దిగుతూ వచ్చారు. 2019కు ముందే జగన్మో హన్‌ రెడ్డి అప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గిరిజన, గిరిజనేతర కుటుంబాలన్నింటికీ పది లక్షలకు తగ్గకుండా పరిహారం అందచేసి తీరుతామని ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్‌ రెడ్డి పదేపదే హామీలు ఇచ్చారు. ఈ మేరకు ఆయా నిర్వాసిత కుటుంబాల నుంచి ఒత్తిడి పెరగడంతో గతేడాది జూన్‌ 30వ తేదీన జీవోఆర్‌టి-224 జారీ చేస్తూ ఒక్కొ కుటుంబానికి పది లక్షలు చొప్పున పరిహారం అందించేందుకు 550 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు సంబరాల్లో మునిగి తేలాయి. కాని ఏడాది కావస్తున్నా జీవో 224 అమలుకే నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూ కాల యాపన చేశారు. కాని తాజాగా పోల వరం ప్రాజెక్టు పరిధిలో 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాలన్నిం టినీ పూర్తిగా ఖాళీ చేయిం చడమే కాకుండా ఏవైతే కుటుంబాలు నిర్వాసిత కాలనీలకు చేరుకుంటాయో ఆ కుటుంబాలకు మాత్రమే ఇప్పటికే ఇచ్చిన ఆర్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు మిగతా మొత్తం కలిపి పది లక్షలు చెల్లిస్తామంటూ ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. దీనిపైనే నిర్వాసితుల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేసేదేమి టంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఇప్పటికే కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో దాదాపు నిర్వాసిత కుటుంబాలన్నింటికీ ముందస్తు ప్యాకేజీ ప్రకారం వరుసగా 6 లక్షల86 వేలు,6లక్షల 36 వేలు చెల్లిస్తూ వచ్చారు. అంతేతప్ప మిగతా మొత్తాన్ని చెల్లించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తాము నిర్వాసిత కాలనీలకు వెళ్ళబోమని, తమకు చెల్లించాల్సిన మొత్తం చేతికందిన తరువాతే పిల్లాపాపలతో కాలనీలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీలు ఎక్కడికక్కడ బోసిపోయి కనిపిస్తు న్నాయి. దీనికితోడు మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా కల్పించకపోయినా కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణం సాగకపోయినా ఊరు నుంచి పదేపదే పొమ్మనడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.
ఉన్న ఇల్లు సంగతేంటి
పరిహారం మాట అటుంచి తాము ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్ళకు 2017లోనే నష్టపరి హారం అంచనా కట్టారు. ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు నుంచి పది లక్షల వరకు ఆపైబడి కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. కాని అదేమీ ఇప్పుడు మాట వరుసకైనా నోరెత్తకుండా వ్యవహరించడాన్ని నిర్వాసితులు తప్పుపడు తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కాపురం చేసిన ఇళ్ళకు లెక్కకైతే కట్టారుకాని, పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం కాపురాలు ఉంటున్న వారంతా అక్కడి నుంచి ఖాళీ చేస్తేనే తప్ప పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు.కాలనీలకు వెళ్ళాలంటే ముందుగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులు..లేదులేదు మీరు ఊరు నుంచి కాలనీలకు వెళ్తేనే పరి హారం ఇస్తామంటూ అధికారులు పట్టుపడుతున్నారు.
ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే…
పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి ఆమోదం లభించింది.అది జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో కొర్రీలు వేస్తున్నారు. పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలి. జలశక్తి శాఖ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ససేమీరా అనడంతో ఈ వ్యవహారం పెండిరగులో పడిరది. ప్రస్తుతం కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులతో పనులు సాగుతున్నాయి. కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబడు తోంది. 2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌-90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా, రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో నైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. కానీ పోలవరంలో దానికి భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే అనడం సమజసం కాదు. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు సవరించేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’’ అంటూ ఏపీ సీఎం నేరుగా ప్రధానికి విన్నవించారు.
‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’
‘‘పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు.రివర్స్‌ టెండరింగ్‌ అంటూ అన్నీ రివర్స్‌లో నడుపుతోంది. 2024లోగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు చేయడం సరికాదు. దానివల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’ అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యన్నారాయణ. మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్‌ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్‌ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్‌ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్‌ చానెల్‌ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది. మొన్నటి వరదల సమయంలో 22 లక్షల క్యూసెక్కుల పైబడిన గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజ్‌ వైపు దిగువకు వదిలారు. దానికి అనుగుణంగా అప్రోచ్‌ చానెల్‌ సహా అన్నింటినీ ఈ కాలంలో సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.

నిండైన సహచర్యంతో నేనూ సైతం

అర్థ శతాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై జీవించి వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అత్యున్నత అధికారి అనుభవాల నిధి ‘గిరిజనాభివృద్ధికి నేను సైతం’పుస్తకం రచయిత డాక్టర్‌ వి.ఎన్‌.వి.కె.శాస్త్రి రాసిన ఈ పుస్తకం బహుముఖ ప్రయోజనకారి అనడంలో అతిశ యం లేదు. బాహ్యంగా చూడటానికి ఒక అధికారి స్వీయ అనుభవాలు పొందుపరిచిన సాధారణ పుస్తకమే అన్నట్టు కనిపించిన, ఇందులోని ప్రతి విషయం భావి పరిశోధకులకు విలువైన సమాచార దిక్సూచి. అంతేకాక గిరిజనులు అభివృద్ధికి పాటుపడాలి అనుకునే వారికి మంచి మార్గదర్శి కూడా.. ప్రస్తుతం మనం చూస్తున్న పలు గిరిజన చట్టాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే విధిగా నేను సైతం చదవాల్సిందే. ఎంతో విలువైన గిరిజన సమాచారం గల ఈ పుస్తకాన్ని గిరిజన పోరాట యోధుడు ‘కుంజా బొజ్జి’ గారికి అంకి తం ఇవ్వడంలో రచయిత శాస్త్రి గారి విశాల హృదయం ఎంతటిదో అర్థమవుతుంది.
స్థానిక గిరిజనులే ఉపాధ్యాయులు,గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీలు,జీవో నంబరు 3 కొట్టివేత పర్యవ సానాలు, మొదలైన ప్రధాన వ్యాసాల సమా హారంగా ప్రచురించబడిన ఈ ‘…నేను సైతం’ పుస్తకం చదువుతుంటే ఒక మేధావి స్వీయ చరిత్ర చదువుతున్న మధురానుభూతి కలుగుతుంది. ప్రారంభం అంతా డాక్టర్‌ శాస్త్రి గారు గిరిజన సంక్షేమానికి వచ్చిన తీరే ఆసక్తిగా సాగిపోయి పాఠకుల కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడతాయి.‘మానవ శాస్త్రం’ అనబడే ‘ఆంత్రోపాలజీ’ విద్యార్థి పరిశోధక విద్యార్థిగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థలో చేరి తనకు ఇష్టమైన రంగంలో కష్టం లేకుండా మునుముందుకు దూసుకుపోయి మూలాలనుంచి విషయ సేకరణ చేయడం ఈ రచనలో మనకు అడుగడుగునా ఆగుపిస్తుంది. శాస్త్రి గారు తన అర్థ శతాబ్ది ఉద్యోగ ప్రస్థానం లో తను చూసిన క్షేత్రస్థాయి విషయాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే 9 పుస్తకాలు రాశారు, ప్రస్తుతం జరుగుతున్న గిరిజన అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంగా ‘…నేను సైతం’ వ్యాస సంపుటి రాయడం జరిగింది. 1968 70 సం: మధ్య కాలంలో ఆంథ్రో పాలజీ విభాగంలో రెండేళ్లపాటు పరిశోధక విద్యార్థిగా, అనంతరం1970-1971మధ్య పరిశోధన సహాయకుడిగా సేవలు అందించారు, అనంతరం 1971నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖలోని గిరిజన సంస్కృతి పరిశోధనా శిక్షణా సంస్థలో పని చేశారు. ఈ ఉద్యోగ ప్రస్థానంలోనే ఏటూరు నాగారం, ఉట్నూర్‌, శ్రీశైలంలో ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారిగా సేవలు అందించారు,అలా ఆయన ఆసక్తి, ఉద్యోగరీత్యా ఆదివాసులతో సహచర్యం చేసే భాగ్యం కలిగింది అలా సంగ్రహించిన అనుభవ సారంతో రాయడం వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రామాణికత, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశోధన చేయాలి అంటే అంత కష్టం కాదు..కానీ 1968 ప్రాంతంలో పరిశోధన చేయాలంటే గొప్ప సాహసంతో కూడుకున్న పనే..!! అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేసి డాక్టరేట్‌ సాధించారు శాస్త్రిగారు.వీరి అనుభవాలద్వారా వ్రాసిన ఈ వ్యాసం సంపుటి ద్వారా గిరిజనులు వారి జీవన విధానాల్లో అంచలంచెలుగా వచ్చిన మార్పులు కనిపిస్తాయి.
అడవి బిడ్డల జీవన సరళిలో వచ్చిన ఈ మార్పు కు ప్రధాన కారణం వారి చదువే అని స్పష్టం చేశారు రచయిత. నేను సైతం వ్యాస సంపుటిలో మొత్తం 11 వ్యాసాలు వేటికవే భిన్నమైన సమాచారం కలిగి ఉన్నాయి,గిరిజన సంక్షేమానికి ఎలాగ వచ్చాను మొదలు జీవో నెంబరు 3కొట్టివేత పర్యవ సానాలు, వరకు ఈ వ్యాసావళి కొనసాగింది.
1986 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన వైనం దాని నేపథ్యం. 1986 87 సంవత్సరంలో పదవ తరగతి అర్హతతో గిరిజన యువతకు స్థానికత ఆధారంగా అందించిన ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతలో వచ్చిన సామాజిక,ఆర్థిక,మార్పులు పర్యవసానాలు డాక్టర్‌ శాస్త్రి అక్షర బద్దం చేసిన వైనం ఆసక్తిగా సాగుతుంది.
ఏ ఉద్యోగైన తన ఉద్యోగ ప్రస్థానంలో విజయం సాధించాలి అంటే ముందు సమైత విషయం మీద ఆసక్తి ఆపైన తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు దానిని ఇష్టంతో విసెషష్క్ప్డతతో ప్రామాణిక బద్ధంగా పూర్తి చేయగలరు.అచ్చంగా శాస్త్రిగారి ఉద్యోగ ప్రస్థానం ఆ విధంగా సాగింది కనుక తన ఉద్యోగ జీవితంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు అయ్యేటట్టు కృషి చేయగలిగారు ఇది అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శనీయం. భారత రాజ్యాంగంలో గిరిజ అభివృద్ధికి ఎన్నో ప్రత్యేక వ్యవస్థషసౌకర్యాలు కల్పించిన, అధికార వ్యవస్థలో మాత్రం అడుగడుగున వ్యతిరేకత కనిపిస్తుంది, అందుకు అధికార ఘనంలోనే వ్యతిరేకత తదితర విషయాలు గిరిజనులకు జరుగుతున్న నష్టం గురించి కూడా శాస్త్రి గారు ఇందులో నిర్మొహమాటంగా వివరించారు . చివరిగా ‘జీవో నెంబర్‌ 3 కొట్టివేత పర్యవసనాలు’ గురించి వివరిస్తూ అది రాక ముందు గల జీవో నెంబర్‌ 275 / 1986 ఉంది దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులు స్థానిక గిరిజనులకు రిజర్వ్‌ చేయబడ్డాయి దానిని ట్రిబ్యునల్‌ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని దొడ్డి దారిన జీవో నెంబర్‌ 3/2000 జారీ చేసినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తాను భావిస్తు న్నట్టు రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు, చిత్రంగా ఈ రెండు జీవోలు వెలువడే సమయంలో అప్పటి ప్రభుత్వ సెక్రటరీలకు డాక్టర్‌ శాస్త్రి సహాయకుడిగా ఉండటం ఒక విశేషం. ఇలాంటి ప్రామాణిక స్వాను భావిక విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మనకు అడుగడుగున అగుపిస్తాయి, అచ్చంగా గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలతో పాటు గిరిజన సామాజిక వర్గాలపై పరిశోధన చేసే వారికి ఈ ‘…నేను సైతం’ పుస్తకం ఒక దారి దీపం లాంటిది.
50 సంవత్సరాల పూర్వం నాటి గిరిజన గ్రామాలు, అప్పటి గిరిజనుల వెనుకబాటు తను, అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, అధికార గణం అలసత్వం, తదితర ఎన్నో విషయాలు నిర్మొహమాటంగా నిజమైన రచయిత దృష్టి కోణంతో ఈ పుస్తకం వ్రాశారు రచయిత ‘డాక్టర్‌ వట్టిపల్లి కృష్ణశాస్త్రి’. ఈ గిరిజన సమాచార దర్శని ప్రతి విద్యావేత్త విధిగా చదవదగ్గన్న పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

అవునూ వారే స్వయంగా రోడేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఓ చిన్న చీమలపాడు పంచాయితీలో జీలుగులోవ గిరిజనగ్రామం. ఇది కొండ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ పది కుటుంబాలు. మాడుగుల నియోజకవర్గం అవురువాడ పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పశువులు బంద గ్రామంలో 7 కుటుంబాలవారు 38 మంది జనాభా కలిగిన కొందు ఆదివాసి గిరిజనులు కొండ శిఖర్‌ గ్రామం పై జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రోడ్డు మార్గం నుండి వెళితే రెండు రోజుల సమయం పడుతుంది. బైకు రాకపోకల కోసం రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మంచిదని గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, రోడ్డు పనులు చేసుకుంటామని వేడుకున్నారు. చాలాసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగి బతిమాలారు. నర్సీపట్నం ఆర్డిఓ గిరిజన గ్రామాన్ని సంద ర్శించి వారికి ఉపాధి కార్డులు ఇస్తామని చెప్పారు. కార్డులు ఇచ్చినట్టు రిపోర్టులో రాసుకున్నారే తప్ప ఇంతవరకూ ఎవ్వరికీ ఉపాధి హామీ కార్డులేవీ అందలేదు. కనీసం పాదం పని కూడా ఇవ్వలేదు. ఎంత విన్న వించుకున్నా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులంతా నడుం బిగించారు. వారే సొంతంగా గత 15 రోజుల నుండి శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసు కుంటున్నారు. అధికారులు గిరిజన ఉత్స వాల పేరు మీద, టూరిజం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప తమ గిరిజన గ్రామాలకు కనీసం నడవడానికి తోవలేని పరిస్థితి ఉందని గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోయారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గర్భిణీ స్త్రీలను డోలిలో తీసుకురావడానికి వీల్లేదని అన్నారు. మండల అధికారి బృందం వచ్చి గిరిజనుల గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు మార్గం దగ్గరగా ఉందని..కొర్ర సంధ్య (20) గర్భిణీ స్త్రీ అమ్మగారి ఊరైన ఎదురిపల్లి వెళ్ళి పోయింది. కానీ ఈ గిరిజన గ్రామంలో ఎవ రికైనా అనారోగ్యం వస్తే, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా శనివారం పెట్టే సంతనాడు మాత్రమే వెళ్ళాలి మిగతా సమ యాల్లో వెళ్లాలంటే కనీసం 15 కిలోమీటర్లు కాలి నడకన కొత్తకోటకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి తమ కోసం తామే నడుం బిగించారు. పలుగూ పారలు పట్టుకున్నారు. నిర్విరామంగా 15 రోజులు కష్టపడుతూ రోడ్డు మార్గాన్ని సరిచేసు కుంటున్నారు. 3 నెలల్లోపు ఈ రోడ్డు నిర్మా ణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ తమ గ్రామానికి ఉపాధి పథకం ద్వారా రోడ్డును మంజూరు చేయాలని ఆ గిరిజనులు కోరుతున్నారు. తమకు ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.-జిఎన్‌వి సతీష్‌

మహా విశాఖ మధ్యలో ఓ అడవి..
మహానగరం మధ్యలో

అభయారణ్యం… అందులో రహస్య గిరిజన గ్రామం…విశాఖ నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో.విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది?-
గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువా నిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం…జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది.
చెక్‌ పోస్టు పడతాది…
జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభు వానిపాలెం వెళ్లాలన్నా… వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్‌ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్‌ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్‌ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్థుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ‘‘మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మేం మన్నెందొర గిరిజనులం. ఐదు తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్లంతా ఇక్కడ పుట్టినవాళ్లమే. ఎన్నికల సమయంలో తప్ప, మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేం ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం’’ అని చెప్పారు శంభువానిపాలేనికి చెందిన సీతారాం.
‘‘మాకు ఏ అవసరమున్నా…దగ్గర్లోని హనుమంతవాక, మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం వెళ్తుంటాం. మేం గ్రామం బయలకు వెళ్లాలన్నా…తిరిగి లోపలికి రావా లన్ని చెక్‌ పోస్టులో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. అలాగే మా గ్రామంపై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. అడవిలో ఉన్నాం మేం’’ అంటూ ఆయన మాట్లాడుతుండగానే, ‘రాముడు’ అని కేక వినిపించింది. ఫోన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుందంటూ నీటి ట్యాంక్‌ వైపు పరుగు తీశారు సీతారాం.
బేసిక్‌ మోడల్‌ ఫోన్‌… వాటర్‌ ట్యాంక్‌
శంభువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ పై ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా కనిపిస్తుంటారు. చేతిలో బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ పట్టుకుని…దాని వైపు తదేకంగా చూస్తూ ఉంటారు…ఫోన్‌లో సిగ్నల్‌ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్‌ ఫోన్‌ సిగ్నలే ఉండదు. సిగ్నల్‌ రావాలంటే నీటి ట్యాంక్‌ ఎక్కాల్సిందే.
‘‘మా ఊర్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఉండదు. అడవి మధ్యలో ఉండటం…అటవీశాఖధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్‌ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ,పీఎం పాలెం, జూ పార్కు పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నలో…ఏమో…బేసిక్‌ మోడల్‌ సెల్‌ ఫోన్లకు అప్పుడప్పుడ సిగ్నల్‌ వస్తుంది. అది కూడా వాటర్‌ ట్యాంక్‌, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునే వారంతా ఈ ట్యాంకులు, మేడలపైనే కనిపి స్తారు. ఇప్పుడంతా ఆన్‌ లైన్‌ చదువులు వచ్చినా…సెల్‌ ఫోన్‌ పని చేయకపోవడంతో మా పిల్లలకు అది కూడా వీలుకావడం లేదు’’ అని ఫోన్‌ మాట్లాడేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన పరశురాం చెప్పారు.
ఇది మరో ప్రపంచం
శంభువానిపాలెం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లాంటే ఫారెస్ట్‌ సిబ్బంది అనుమతి తప్పనిసరి.‘‘మా గ్రామం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది 7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉంది. నగరంలోకి అడవి వచ్చిందా…? అడవే నగరంగా మారిందా…? తెలియదు కానీ… మేం నగరానికి చెందిన గిరిజనుల్లా జీవిస్తున్నాం. కంబాలకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్‌లుగా మాలో కొందరికి పనులు ఇచ్చారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు’’ అని కంబాల కొండలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శంభువానిపాలెం నివాసి ఒకరు చెప్పారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబం ధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కూడా ఊరి బయట సిగ్నల్‌ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటాం. మా ఊరు రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబం ధాలు కట్‌ అయిపోతాయి. ఎందుకంటే శంభు వానిపాలెం మరో ప్రపంచం’’ అని ఆయన అన్నారు.
కొండ జమీందార్లు… సేవకులు
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అయితే విశాఖ నగర పరిధిలో గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడంటే నగరం కానీ…ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా… వారు ఉండే ప్రాంతాలకు దూరంగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు. ‘‘జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలను కొండ జమీందార్లు అనేవారు. వీరు కొండల్లో దొరికే ఉత్పత్తులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లోనే తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వారు. అలా కొందరు మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు’’ అని ఆయన వివరించారు. ‘‘కొన్ని గిరిజన తెగల్లో వాళ్లు మైదాన ప్రాంతంలో ఉండే జమీందార్లకు సేవకులుగా ఉండేందుకు వచ్చేవారు. వారు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలుంటుందని స్థానిక అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకునేవారు. తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం, అలాగే ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభు వానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు’’ సూర్యనారాయణ తెలిపారు.
ప్రవేశం నిషిద్ధం
శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్‌ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి…ఊరిలోని ఎవరైనా తెలిసినవారు ‘మావాళ్లే’ అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు. థింసా బృందం కూడా అటవీ శాఖ అనుమతితో శంభువానిపాలెంలోకి ప్రవేశించింది. చెక్‌ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్‌ కనిపిస్తుంది. అది దాటు తుండగా…సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కట్‌ అయి పోతుంది. జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్‌ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు.
‘‘శంభువానిపాలెంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే ఇది కంబాలకొండ అభయా రణ్యంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. శంభువానిపాలెంలో అటవీశాఖ తరపున బేస్‌ క్యాంపు కూడా ఏర్పాటు చేశాం. అభయారణ్య ప్రాంతంలో ఇది ఉండటంతో…ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉప యోగించడం,చెట్లు తగలబెట్టడం,చెత్త వేయడం,మద్యం తాగడం,రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది’’ అని విశాఖపట్నం ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ అనంత్‌ శంకర్‌ చెప్పారు. – గునపర్తి సైమన్‌

ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాల పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోతు న్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్రజీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రా న్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఆ కాలు ష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. సముద్రాలను కాపాడుకు నేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమి కులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచా లని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008లో తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి..జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు.సాగరం బాగుంటేనే సకల జీవరాసులు బాగుంటాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలావరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు అని, సముద్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్‌ 8 న సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్త మయం చేసేస్తున్నారని, చాలా దేశాల్లో వ్యర్థాలను నౌకలో తరలించి సముద్రంలో పడేస్తున్నారని, ఇలా రోజూ వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తుందనీ,అందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ ఉంటుందని, ఈ కాలుష్య కారకం వల్ల సముద్రా ల అరుదైన జీవజాతులు అంతరించి పోతున్నాప్రజలకు సముద్రాల యొక్క ఆవశ్యకత ఉంది. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయో జనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యా వరణ ప్రేమికులు అంటున్నారు. బీచ్‌ల వంటి నీటి వనరుల చుట్టూ.. మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో సము ద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తు న్నాయి. కొన్ని కలుషితమైపోతు న్నాయి. వీట న్నింటి వల్ల ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం కూడా ఉంది.అందుకే ఈ విషయాలన్నీ ప్రజల కు వివరించి..సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా..వారికి అవగాహన కల్పిస్తారు.
ప్రాముఖ్యత
సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డేటా సూచిస్తుంది. మహాసముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని.. ఇవి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేసింది. చెత్త, మురుగు, చమురు లీకేజీల వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల.. విధ్వంసం జరిగే అవకాశముంది. ఈ విష యాలపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకో వాలి.
సముద్రాలూ కలుషితం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నా యి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలు ష్యం బారిన పడుతున్నాయి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ప్లాస్టిక్‌ సంచులు, ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తాయని అందరికీ తెలిసినా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో యావత్‌ మానవాళి ‘తాను కూ ర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కొన్నట్లు’గా వ్యవహరిస్తున్నది. మానవ శరీర నిర్మాణంలో ప్రొటీన్లది చాలా కీలక పాత్ర. అటువంటి ప్రొటీన్లను సమృద్ధిగా అందజేసే సత్తా ఒక్క సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో 5 ట్రిలి యన్‌ల మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయి. వీటిని సముద్ర జీవులు (చేపలు వంటివి) మింగడం, వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు కాన్సర్ల బారిన పడుతున్నారు. 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని అంచనా. పలు దేశాలు వ్యర్థ జలాల ను సముద్రంలోకి వి చక్షణా రహితంగా వ దులుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సముద్రం లో కలుస్తున్న డ్రైనేజ్‌ వాటర్‌లో 70 శాతం శుద్ధి చేయనందు న సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర వాతవారణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. దీనివల్ల సాలీనా 13 బిలి యన్‌ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్‌, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్‌ వినియోగం 15 మిలియన్‌ టన్నులు. ఇది 2050 నాటికి 20 మిలియన్‌ టన్నులు అవుతుందని అంచనా. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించకపోతే, సముద్రాలలో ఉండే చేపల బరుకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రీ సైక్లింగ్‌’కు పనికిరాని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల తయారీని చాలా దేశాల్లో నిషేధించారు. అయితే దాని అమలు శూన్యం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొన్ని దేశాలు రోడ్ల నిర్మాణంలోను, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగి స్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియో గిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనకన్నా అభివృద్ధిలో, ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన రువాండా, బంగ్లాదేశ్‌, కీన్యాలు ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాలలోకి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదలడం ఆపకపోతే, చేపలకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.- జిఎన్‌వి సతీష్‌

దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా?

దేశాన్ని కుల,మత జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవున్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయులంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరోమారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది. శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవాయితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవాయితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం. శృంగ వృక్షం జాతరలోనూ అదే జరి గింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా మూకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొం డంగి గ్రామానికి చెందిన నడిరపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించకపోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినవాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్‌వాష్‌ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో ! విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగారిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండనాలు చేయించడం, అత్యా చారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం. దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం.. అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడులకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్త వం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహు జనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తిం చాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్‌ కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం, ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వెంకటేశ్‌ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్‌ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమూన్‌ నామినేషన్‌ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయితీ ఒకటో వార్డుకు నామినేషన్‌ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు .. దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్‌ పై దాడి, నామి నేషన్‌ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్‌ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్‌ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు లేఖ రాశారు. వెంకటేశ్‌ ను 30 మందికి దాడికి దిగారని, ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జతచేశారు. గడిచిన 30 నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలకు మరలించడం కడు విచారం. ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్‌ భూములను లాక్కొంది.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్‌ ఓ దళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యూపీలోని లఖింపూర్‌ లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్‌ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోదయ్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్‌, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లోపం చట్టాలదా? వ్యక్తులదా?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉ న్నారు.దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్‌ దంగవాస్‌ ఘటన, 2016లో రోహిత్‌ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్‌పూర్‌ హింస, 2018లో భీమా కోరేగావ్‌ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమ్మూ-కశ్మీర్‌, మణి పూర్‌, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్‌, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్‌ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 30న కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఒక దళిత ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్‌-కింగ్‌ స్టడీ సర్కిల్‌(ఏకేఎస్‌సీ) కులవివక్షను ఎదుర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.
అండగా చట్టాలు
భారతదేశంలో దళితుల రక్షణ కోసం షెడ్యూల్డ్‌ కులాలు/తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారిస్తారు.ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి బాధితులకు సహాయం, పునరా వాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహిం చడం నేరం. అయితే చాలా కేసులు మీడి యాకు, రాజకీయ నాయకులకు కనిపించ కుండానే పోతాయని, ఫిర్యాదు దాకా కూడా రాని కేసులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి సమస్య ఎక్కడ ఉంది ? చట్టం బలహీనంగా ఉందా లేక దానిని అమలు చేసేవారికి సంకల్పం లేదా?
అవగాహన కల్పించకపోవడమే సమస్య
తమపై జరిగే హింసలో సామాజిక, రాజకీయ కారణాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయని దళితులు భావిస్తున్నారు. బాధిత వర్గంలో అవగాహన పెరగాలని దళిత మేధావి చంద్రభాన్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘అంతకు ముందు దళితులపై ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూక దాడులు చేయడం, చంపడం వంటివి ఉండేవి కాదు. గత 10-15 సంవత్సరాలలో ఇవి బాగా పెరిగాయి. దళితులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఇది చట్ట సమస్య కాదు, సామాజిక సమస్య’’ అన్నారు చంద్రభాన్‌ ప్రసాద్‌. ఒక దశలో అమెరికాలో నల్లజాతీయులపై రోడ్ల మీదనే దాడులు జరిగే వని చంద్రభాన్‌ ప్రసాద్‌ చెప్పారు.‘‘ జన వరి 1,1863న అబ్రహంలింకన్‌ బానిసత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి నల్లజాతీయులపై మూక హింసాత్మక దాడులు మొదలయ్యాయి. అంటే, నల్లజాతీయులు బానిసలుగా ఉన్నంత కాలం వారిని చంపాల్సిన అవసరం యజమానులకు రాలేదు. భారతదేశంలో గత76ఏళ్లుగా దళి తులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు’’ అని చంద్రభాన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యా నించారు.‘‘కుల వివక్ష ఇంకా కొనసాగుతుందన్న విష యాన్ని అందరూ ఒప్పుకోవాలి. విద్యావం తులు కూడా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు’’ దళిత నేత ఉదిత్‌రాజ్‌. ఆవేదన వ్యక్తం చేశారు.- (వి.నానిబాబు )

ఎస్టీ జాబితాలో బోయ,వాల్మీకులు

దళితులు క్త్రెస్తవ మతంలోకి మారినా వారికి ఎస్‌సి హోదా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని,బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానా లను శాసనసభ మార్చి 25న శుక్రవారం సభఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానా లను ఆమోదించాలని కోరుతూ కేంద్ర ప్రభు త్వానికి పంపిస్తున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌మో హన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్‌సి హోదా ఇవ్వాలను బిల్లును మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వ్యక్తులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలి పారు. సిక్కు, భౌద్ద మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని చెప్పారు. హిందూ మతానికి చెందిన షెడ్యూ ల్డు కులాల వారు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని తెలిపారు. సమా జంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని,ఒక వ్యక్తి ఏమతాన్ని ఆచరిం చాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని,కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని సిఎం పేర్కొన్నారు.
ఎస్‌టిల జాబితాలో బోయ,వాల్మీకులు
బోయ,వాల్మీకులను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చేందుకు తాము వేసిన వన్‌ మ్యాన్‌ కమిషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. అనం తపురం,కర్నూలు,వైఎస్‌ఆర్‌ కడప,చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ,వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయపదాలతోపాటు (వాల్మీకి, చుండినవాకులు, దొంగబోయ,దొరలు,గెంటు,గురికార,కళావతి బో యలను షెడ్యూల్డ్‌తెగల జాబితాలోచేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సభ తీర్మానిం చింది. ఈ బిల్లును బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. విజయవాడలో రూ.268 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125అడుగుల విగ్ర హాన్ని, ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తు నుందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపాదించిన తీర్మా నాన్ని శాస నసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు వ్యతి రేకిస్తూ నిరసనలు,ఆందోళనలు చేపట్టాయి.
బోయ,వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చవద్దు : గిరిజన సంఘం
(ఎన్‌టిఆర్‌జిల్లా) :బోయ,వాల్మీకి, బెంతు, ఒరి యాలను ఎస్టీలలో చేర్చకూడదని రెడ్డిగూడెం తహశీల్దార్‌ కార్యాలయంలో గిరిజన సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.గోపిరాజు మాట్లాడుతూ..బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేర్చెందుగాను రాష్ట్ర ప్రభుత్వం శ్యాముల్‌ ఏక సభ్య కమిషన్‌ని యమించిందని జీవో నెంబర్‌ 52ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 32లక్షల గిరిజ నులు నేటికీ నిరక్షరాస్యత, వెనుక బాటు తనం, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్యలతో ప్రతి నిత్యం సతమత అవుతుంటే ఓట్ల రాజకీయం కోసం గిరిజనులను మోసం చేయడం సరి కాదని కేంద్ర ప్రభుత్వం1965లో బిఎన్‌ లో కూర్‌ కమిటీ పేర్కొన్న ఏ5 ప్రమాణాలు వీరికి లేవని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర గిరిజన నాయకుడు బి రమేష్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యాముల్‌ ఆనంద్‌ కుమార్‌ ఏకసభ్య కమిషనర్ని రద్దు చేయా లని లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాలు అన్నిటిని ఏకతాటిపై తెచ్చి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రవి, అజ్మీర రాజు,బి.రాజా,బి.తావూరియా,బి.చిన్నబాల, బి. రంగా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబి తాలో చేర్చొద్దని విశాఖలో జరిగిన గిరిజన సదస్సు డిమాండ్‌ చేసింది. బోయ వాల్మీకి సహ పలు సామాజిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విశాఖ లోని ఎంవిపి కాలనీలోగల గిరిజనభవన్‌లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యాన గిరిజన సదస్సు జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపి మిడియం బాబూ రావు మాట్లాడుతూ గిరిజనుల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు కాకపోవడంతో ఇప్పటికీ ఆదివా సీలు కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమంలోప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. తాజాగా ఎస్‌టి జాబితాలో ఇతర సామా జిక తరగతులను చేర్చేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఏసామాజిక తరగ తినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే బిఎన్‌. లోకూర్‌ కమిటీ నిబంధనల ప్రకారమే జరగాలని తెలిపారు. ఆ తెగ జీవితం, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల పాటింపు, ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు మాత్రమే ఎస్‌టిగుర్తింపు ఇవ్వాల్సి ఉంటుం దన్నారు.కానీ, నేటి ప్రభుత్వం ఎస్‌టి జాబితా లో చేర్చాలనుకుంటున్న బోయ వాల్మీకులు అభివృద్ధి చెంది ఉన్నారని తెలిపారు. ఆదివాసీ తెగలతో వారికి ఎటువంటి సంబంధమూ, పోలికలూ లేవ న్నారు. వచ్చేఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ విధం గా చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందిన సామా జిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చితే ఆది వాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతాయని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఇతర సామాజిక తరగతు లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి గతంలో ప్రయ త్నించిన సందర్భంలో దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు తమ సంఘం వినతిపత్రం ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలకు ద్రోహం చేస్తూ బోయ వాల్మీకిలను, బెంతు ఒరియా లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ జిఒ52ని జారీ చేసింద న్నారు. తక్షణమే ఆజిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన వ్యతిరేక విధానాలను విడనాడాల న్నారు. నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయా లని డిమాండ్‌ చేశారు.- జిఎన్‌వి సతీష్‌

అమరశిల్పి..అంబేద్కర్‌

కుల,మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవిత కాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమా పేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కో కూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్ర మాలు ఇప్పటికీ చారిత్రా త్మకమైనవి. (ఏప్రిల్‌ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది. – (కత్తి పద్మారావు)

అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్‌’ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈనెల ఏఫ్రిల్‌ 14న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది.డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌..న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరా టం చేసిన యోధుడాయన. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో రామ్‌జీ,భీమా బాయి దంపతులకు జన్మించారు.తండ్రి రామ్‌ జీ బ్రిటీష్‌ భారతీయ సైన్యంలో సుబేదార్‌గా పని చేసేవారు. అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్‌ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. ఇలా అగ్రకులాల వారి ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు.అక్కడ హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు.. ఈ వివక్షలన్నిం టినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కులతో పాసయ్యారు. బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్‌..ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఏ,పీహెచ్‌డీ,న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.విదేశాలలో ఎకనామిక్స్‌లోడాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొ క్కటే మార్గమని భావించారు. తనలా అంటరాని తనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలనకు సమరశంఖం మ్రోగించారు. అణగారిని వర్గంలోని ప్రజలకు అంబేద్కర్‌ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపిం చారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని,మనుధర్మాన్ని వ్యతిరేకించారు.1927లో దళిత జాతుల మహా సభ జరిగింది..మహారాష్ట్ర,గుజరాత్‌ నుంచి కొన్ని వేలమంది వచ్చారు. మహత్‌ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్‌ ఆచెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం.
1931లో రౌండ్‌టేబుల్‌ సన్నాహాలు సంద ర్భంగా అంబేద్కర్‌ గాంధీజీని కలిశారు. తర్వా త స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు..దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్‌ నియ మించిన రాజ్యాంగ సంఘానికి ఆయణ్ని అధ్యక్షు నిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్‌ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు,బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్‌.. వారి అభ్యున్నతకి రిజర్వే షన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.అంబేద్కర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ,వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయ త్నించిన హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను పార్లమెం టులో నిలిపివేయడంతో..1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అంబేద్కర్‌ తన జీవితంలోని ముఖ్యాం శాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. హిందూ సమాజం పట్ల ఆగ్రహించారు. హిందూసమాజ వినా శనాన్ని కోరుకోలేదు: భీమ్‌రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నిం చారు. నాసిక్‌ కాలారాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను,రాజ్యాంగంలో పొందు పరిచారు.
అంబేడ్కర్‌ జీవితంలోని లోతు తాత్త్వికమైంది భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలను కున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్‌ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్‌ ఆర్థిక,తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది.
అస్పృశ్యత మూలాల నిర్మూలన
మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడిరది! మనిషిని మనిషిగా చూడ టమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక,విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్‌ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడిరది. బౌద్ధాన్ని ఆయన వ్మాయంగానే కాక, తత్త్వ శాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్య యనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చి వేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొం దించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం,అవమా నించటం,అపహాస్యం చేయటం,అణచివే యటం.మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజ మూ చేస్తుంది. ఈ మూడిరటిని ఈ ఆర్టికల్‌ నిరోధిస్తుంది.
రాజ్యాంగంపై అంబేడ్కర్‌ జీవిత ప్రభావం
బాబాసాహెబ్‌ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబే డ్కర్‌ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్‌ కీర్‌ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్‌ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్‌ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు.అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందు పరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయు లందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్‌ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి.

ఎస్టీల గుర్తింపులో తొందరపాటు సరికాదు !

బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీలు)గా గుర్తించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.బోయలు, వాల్మీకులు మరియు బెంథో ఒరియాల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని పరిశీలించడానికి ఒక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది మరియు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా,వారిని ఏపీ ఎస్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గిరిజన సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.సాధారణ కోర్సులో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏ(9) ప్రకారం అవసరమైన షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌తో ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంప్రదింపులు జరగిన దాఖలాలు కన్పించలేదు.రాష్ట్రం నియమించిన కమిషన్‌ ఈఅంశంపై తమ అభిప్రాయాలను కోరలేదని,రాష్ట్ర ప్రభుత్వం తమను ఎప్పుడూ విశ్వాసంలోకి తీసుకోలేదని గిరిజన సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ఐదవ షెడ్యూల్‌లోని పారా4కింద ఏర్పాటైన గిరిజన సలహా మండలి పరిగణలోకి తీసు కున్న అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలుస్తోంది.ఎస్సీ,ఎస్టీలజాబితాల సవరణపై జస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలోని కేంద్ర సామాజిక భద్రత విభాగం 1965లో నియమించిన అడ్వైజరీ కమిటీ,ఆదివాసీల సమూహాన్ని వర్గంగాగుర్తించాలా? వద్దా? అనే విషయాన్ని గుర్తించేందుకు అవసరమైన కొన్ని లక్షణాలను సూచించింది.కొత్త సమూహాలను షెడ్యూల్డ్‌ తెగలలో సభ్యులుగా చేర్చాలని స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడిని పరిగ ణనలోకి తీసుకున్నారు. అయితే దీనిని పరిశీలించడానికి రాష్ట్రం ఆదివాసీల సంస్కృతి గురించి తెలిసిన బయటి నిపుణులతో ఒకకమిటీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉండేది.ఈ నేపథ్యంలో,షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌టీ)ఈ విషయంలో జోక్యాన్ని కోరే స్వేచ్ఛ గిరిజన తెగలకు ఉంది.ఎన్‌సీఎస్‌టీ వన్‌ మ్యాన్‌ కమీషన్‌ నివేదికను వృత్తిపరంగా ఆదివాసీల సంస్కృతి,జీవితాల గురించి తెలిసిన బయటి ప్రముఖ నిపుణుల బృందానికి సూచించమని గిరిజనతెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోతున్నాయి.ఈ విషయంలో కనీసం గిరిజన సలహా మండలి(టీఏసీ) అభిప్రాయాలు తీసుకున్న దాఖలులేవు.
ఏదైనా తుదినిర్ణయం తీసుకునే ముందు ఏస్టీ జాబితాలో కొత్త సమూహాలను చేర్చడం వలన వారి అవకాశాలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, రాష్ట్రం స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 1965లో లోకూర్‌ కమిటీ సంప్రదించిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుత ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏస్టీల జాబితాలో ఏదైనా సమూహాన్ని చేర్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(1) (రాజ్యాంగం (మొదటి సవరణ) చట్టం,1951 ద్వారా సవరించబడిన ప్రకారం)రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడంచాలా అవసరం.దీనిపై ఎన్‌సిఎస్‌టి పరిశీలించిన అభిప్రా యాలను కోరాలని కేంధ్ర ఇంధన వనరులశాఖ విశ్రాంతి ముఖ్యకార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏలో 9వ అంశం ప్రకారం జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ను సంప్రదించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆదివాసీలుకాని వారిని ఎస్టీలుగా గుర్తించడంవల్ల తమ హక్కులకు హాని కలిగే అవకాశముందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారి ప్రతినిధులతో సంప్రదింపలు జరిపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

ఇతర కులాలను ఎస్టీలో చేర్పు వెనుక అంతర్భాగ కుట్రే

ఈ వ్యాసం తేది 30.12.2022 న పాడేరు జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివాసి జెఎసి నిర్వహించిన ‘‘ఆదివాసి గర్జన’’ బహిరంగ సభను ఉద్దేశించి తయారు చేసిన ప్రసంగ పాటవానికి చిన్నపాటి మార్పులతో ఆదివాసు లంటేనే ఇష్టపడని ఇతర కుల సమాజన్ని నేడు ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుటీల యత్నాల వెనక చాలా భయం కరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. ఆ అంతర్గత ఎజెండా గురించి పాలకులు మనకు చెప్పరు. మనమే గ్రహించాలి. అర్థం చేసుకోవాలి. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుట్రల వెనక చాలా భయంకరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. బి.రామారావుదొర

ఈగర్జనసభకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూలల నుంచి ఎన్నో ప్రయసలకు ఓర్చి విచ్చేసిన మీఅందరికీ ఉద్యమా భివందనాలు తెలుపుకుంతున్నాను.గత 12రోజులుగా (డిసెంబర్‌12 నుండి 22వరకు) నిర్వహించిన ఆదివాసి హక్కుల పరిరక్షణ యాత్రతో మీ గ్రామాలకు వఛ్చినయాత్ర బృందాలకు అన్నం పెట్టి ఆదరించిన ఆదివాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలకులు దాచిపెడుతున్న ఆ అంతర్గత ఎజెండా ఏమిటంటే! రాజ్యాంగం ద్వారా ఆదివాసులు సాధించుకున్న రక్షణ చట్టాలు, హక్కుల ప్రకారం ఏజేన్సి ప్రాంతాలలో నిక్షిప్తమై ఉన్న అపరమైన ప్రకృతి సంపాదను కొల్లగొట్టడానికి ప్రభుత్వాలకు/పాలకులకు సాధ్యం కావాడం లేదు. కావున ఆదివాసులకంటే ఎక్కువ జనాభా కలిగి,వారికి విధేయులుగా ఉండే కులాలను, ఆదివాసులకంటే అభివృద్ధి చెందిన అగ్ర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వారికి పంచిపెట్టి తద్వారా ఏజేన్సి ప్రాంతాలను చిన్నభిన్నం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు/పాలకులు పూనుకున్నారు.చరిత్రలో చూడండి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద విదేశీ పెట్టుబడుదారి కంపెనీలకు కట్టబెట్టినప్పుడు ఆదివాసి చట్టాలు మాత్రమే కాపాడిరది. ఆరక్షణ చట్టాలు నాశనం చేయాలంటే! పాలకులకు అసలైన ఆదివాసులు చేత ఆ పని చేయించడం సాధ్యం కాకావడం లేదు. ఆయా సందర్బాలలో ఎంతో కొంత మంది చైతన్య వంతులై పాలకుల కుటీల ప్రయత్నాలను అడ్డుకున్న సందర్బాలున్నాయి. అదే ఇతర కులాలను మన ఆదివాసి జాబితాలో చేర్పించి మన రాజ్యాధికారాన్ని వారికి కట్టబెట్టి అసలైన భూమి పుత్రులను అచేతనవస్తలో పెట్టి ఆదివాసిల మనుగడను దెబ్బతీయడానికి పూనుకున్నదీ ప్రభుత్వం. ఒకసారి మనం గమనించినట్లైతే ఎస్టి జాబితాలో కలపడానికి ప్రతిపాదిత కులాలవారికి 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నది. అదే మనకు (ఆదివాసులకు) 6శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలులో ఉంది. ఎవరైనా తక్కువ రిజర్వేషన్‌ నుండి ఎక్కువ రిజర్వేషన్‌ లో చేరాలనుకుంటారు. చేర్చుతారు కూడా. కానీ మన విషయంలో ఎక్కువ రిజర్వేషన్‌ ఉన్నవాళ్ళను తక్కువ రిజర్వేషన్‌ లోకి చేర్చడానికి కారణం ఏమిటి? అంటే జగన్మోహన్‌ రెడ్డి గాని, ఇతర పాల కులకుగాని ‘బోయవాల్మికి, నకిలీ బెంతు ఒరియా (వడ్డీ) కులాలపై వల్లమాలిన ప్రేమ గాని, ఆదివాసు లపై ఒర్వలేనంత ద్వేషం గాని ఎందుకు? వారి మీద ప్రేమ లేదు. వీరి మీద ద్వేషమూ లేదు. స్వతహగా జగన్మోహన్‌ రెడ్డి గారు వ్యాపారవేత! కావుననే ఈ కపట నాటకాలాడుతున్నారు. ఆదివాసుల పాదాల కింద, అడవి తల్లి గర్బంలో బాధ్రంగా ఉన్న అపారమైన ఖనిజ సంపాదనను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి చేస్తున్న కుటిల ప్రయత్నమని ఆదివాసులు మరియు ఇతర కుల సమాజం (అగ్రకులాలు) కూడా గమనించాలి.6శాతం రిజర్వేషన్లు కలిగి ఉన్న ఆదివాసులు ఇప్పటివరకు కనీసం పాఠ శాలలలు, తాగు నిరు,రోడ్లు,కరెంట్‌ లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? దానిని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ఆదివాసులు ఎంత అభివృద్ధి చెంది ఉన్నరో..2017 డిసెంబర్‌ 2నచంద్రబాబు నాయుడు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. జగన్మోహన్‌రెడ్డి తనపాదయాత్రలో బోయలకు ఇచ్చిన మాట ప్రకారం 52జీవోద్వారా శ్యామ్యూల్‌ ఆనంద్‌ ఏక సభ్య కమీషన్ను నియమించి ఆ కమిటి రిపోర్టు ఆధారంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడానికి సిద్ధపడ్డాడు. జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులను కూడా ఎస్టీలలో కలపడానికి మద్దతు ఇచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీ 1976లో వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాలు కలిగి ఉన్న లంబాడాలను తన రాజకీయ అవసరాల కోసం ఎస్టీలలో కలిపి తెలుగు రాష్ట్రాల ఆదిమతెగలను కోలుకో లేని దెబ్బతీశారు. బిజెపి ఎలాగో రిజర్వే షన్లు అమలు ఇష్టం లేక ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ ప్రైవేటుపరం చేస్తుంది.ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తే, రిజర్వేషన్లన్న సంగతే ఉండదు. ఇది ఆదివాసులు, దళితులు వంటి అణగారిన వర్గాలకు పెద్ద బ్దెబ్బ.చివరికి కమ్యూనిస్టులు సైతం ఓటు బ్యాంకు రాజకీయాలనే అనుసరి అనుసరిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కుటుంబం ఆదివాసులను వెంటాడుతూనే ఉంది.బాక్సైటు తవ్వకాలకు చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానాలతోనే జర్రెల కొండలను తవ్వి తన బావమరిది పెన్నా ప్రతాపరెడ్డికి కట్టబెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక 2009న పాడేరు పర్యటించి ఎజేన్సిలో నాన్‌ ట్రైబల్స్‌కు మూడుసెంట్లు భూమి ఇస్తున్నమని ప్రకటిం చాడు.నేడు జగన్మోహన్‌ రెడ్డి గారు ఆదివా సేతరులకు షెడ్యుల్డ్‌ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు భూమి ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశాడు.ఈ అన్ని సందర్భాలలో ఆదివాసుల సంక్షేమం ఎక్కడుంది? అదిమజాతుల వినా శము కోరే సంక్షోభం తప్ప. అదే మనలను బయపెడుతుంది. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదు.చదువుకున్న యువ తులకు ఉద్యోగాలు లేవు. యువత పక్కదారి పట్టి గంజాయి స్మగ్లర్ల చేతిలో చిక్కి సాగుదా రులుగాను, రవాణాదారులుగాను ముద్ర పడి వేలాది మంది బంధిలై జైల్లో మగ్గుతున్నారు. మొన్నటి వరకు జీవో నె.3 షెడ్యూల్‌ ప్రాం తంలో స్థానిక ఆదివాసి యువతకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పించే జీవోగా పెద్ద బరోసాగా ఉండేది. ఈ జివో రద్దు చేసారు. చట్టపరంగా మనకు వచ్చిన ఎస్టి సబ్‌ ప్లాన్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకా లకు మళ్ళించి మన కోసం ఖర్చుపెట్టవలసిన డబ్బును అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వసతి దీవెన వంటి ఇతర పథకాలకు మళ్ళించి రాష్ట్ర ప్రజలందరికి పంచిపెదితున్నారు. ఆదివాసులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌ సదుపాయం లేదు.పరిశ్రమలు లేదు. కష్టపడి పండిరచిన పంటలను అదివాసేతర దళారులు కొల్లగొడుతున్నారు. అంతర్జా తీయంగా గుర్తింపు పొందిన కాఫీని పందిం చమని ప్రోత్సహిస్తున్నరే! తప్ప మార్కెట్‌ సదుపా యాలు కల్పించడం లేదు.ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదు. ఆపంట అంత ప్రభు త్వమే (ఐటిడిఎ కాఫీ బోర్డు ద్వారా) ప్రైవేటు దళారులకు గంపగుత్తగా అప్పజేప్పు తుంది.విద్యాలయాలు కాస్త దాణా కేంద్రాలు (టవవసఱఅస్త్ర షవఅ్‌తీవం)గాను,నిరుద్యోగ ఉత్పత్తి కేంద్రాలు (బఅవఎజూశ్రీశీవఎవఅ్‌ జూతీశీసబష్‌ఱశీఅ షవఅ్‌వతీం)గా మాత్రమే పనికొస్తున్నాయి. తప్పితే! ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉపాది మార్గాలు చూపించడం లేదు.300 నుండి 500 మంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సరిపడ్డ సౌకార్యాలు ఉన్న వసతి గృహాలు/పాఠశాలలలో 700నుండి 1500 మంది వరకు బలవంతంగా కుక్కుతున్నారు. పిల్లలకు ఆలనా పాలన కూడా సరిగలేక మంచి చదు వులు సంగతి ఏమోగాని,పాఠశాలలలోనే మృత్యువాతపడుతున్నారు. ఈ మద్య కాలంలో పాడేరు ఐటిడిఎ పరిధిలో మూడు నెలల కాల వ్యవధిలో 8మంది విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడ్డారు.స్వాతంత్రం రాకముందు బ్రిటిష్‌ వారు ఆదివాసుల రక్షణ కొరకు బలమైన చట్టాలు చేసి పగడ్బందీగా అమలు చేయడం వలన కొంత వరకు న్యాయం జరిగింది. అంతేకాకుండా నేటికి ఆ చట్టాలే రక్షణగా ఉంటున్నాయి.ఉదా: 1914-17మద్య కాలంలో కారం తమ్మన్న దొర నడిపిన లాగరాయి తిరుగుబాటు ఫలితంగా అతని మరణాంతరం ఆగస్టు 4,1917నుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ ూaఅస ుతీaఅంటవతీ Aష్‌ -1917’’ను రూపొందించారు. ఆ చట్టమే ‘‘1/70 భూ బదలాంపు నియంత్రణ చట్టం’’గా రూపొందించారు. దీనిని అమలు చేయవలసిందిపోయి నిర్వీర్యం చేసి ప్రకృతి సంపదనంత అంబానీ, అధానిలకు అప్ప జెప్పడానికి సిద్ధమయ్యారు.1935 - దీతీఱ్‌ఱంష్ట్ర Iఅసఱa Aష్‌ ద్వారా212ుతీఱపaశ్రీ స్త్రతీశీబజూం ను గుర్తించి వారిని కాపాడడానికి చేసిన చట్టాలను సామాజిక న్యాయం పేరిట నిర్వీర్యం చేస్తు న్నారు. ఇతర కుల ప్రభావాలకు లోనైన తెగలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. అందులో భాగంగానే బీసీ కులాలైన బోయ,బోయ వాల్మీకి,ఒడ్డి(నకిలీ బెంతు ఒరియా) కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రెజిల్‌ దేశంలో ఆదిమజాతీ సమూ హానికి చెందిన చిట్టచివరి మనిషి మరణించిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పెసా చట్టం,అటవీకుల చట్టం ఎంత మేరకు అమలవుతుందో! ఎంత చిత్తశుద్ధితో పాలకులు అమలు చేస్తున్నారో! కళ్ళారా చూస్తున్నాము. ఆదివాసులు ఆధారపడ్డ అడవుల నుంచి వారిని గెంటివేయడానికి, ఆ అడవులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టదానికి, చట్టం చేసిన అనతి కాలంలోనే అంటే గత రెండున్నర దశబ్దాల కాలంలో కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయి.చింతపల్లి మండలం ఎర్ర వరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌, జాతియా రహదారి నిర్మాణం, టూరిజం పేరిట ఆదివాసులను భూమి లేని పేదలుగా మార్చివేస్తుంది. ఉమ్మడి విశాఖ ఎజేన్సి ప్రాంతంలో గత నాలుగు దశబ్దాలుగా (Gూఖ) (గిరిజన విద్యార్ధి సంఘం) ూూGR (ూతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ టశీతీ ూతీశ్‌ీవష్‌ఱశీఅ శీట Gఱతీఱjaఅa/ుతీఱపaశ్రీ Rఱస్త్రష్ట్ర్‌ం) చేసిన పోరాటాల ఫలితంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ఆదిమ తెగలకు ఉద్యోగాలు కల్పించే జీవోనె.3 వచ్చింది. అది ఇప్పుడు పాలకుల సహకారంతో రాద్దాయి పోయింది. ఆ జీవోను కాపాడడానికి పాలకుల ద్వారా కనీస ప్రయత్నం కూడా చేయబడి ఉండలేదు. Gూఖ, ూూGR సంస్థల పోరాట స్ఫూర్తితోనే ఆదివాసుల గొంతుగా మనం నేడు ‘‘ఆదివాసిని అనివార్యంగా ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. దీనిని కూడా లేకుండా చేయడానికి కుటీల ప్రయత్నలు జరుగుతుంది. జెఎసి అంటే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఆదివాసులు తమకు తాముగా సవరించుకున్న గొంతు. ఈ సంస్థ కొన్ని తరాల వరకు ఆదివా సులు తమ మనుగడను కొనసాగించ డానికి బరోసగా..స్తూర్తిగా ఉండాలని ఆశిస్తు న్నాను.ఆ స్పూర్తిని కొనసాగించడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం లేదా పాలకుడైన తమ రక్షణ చట్టాలు, హక్కులకు బంగం కలిగిస్తే చట్టసభల్లో ప్రశ్నించి సరి చేసుకునే అవకాసం ఉంటుందన్న గొప్ప ఆశయంతో రాజ్యాంగంలో అణగారిన కులాలకు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎంపిపిలు, చైర్మన్లులు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఆయా స్థానాలలో వారిని మాత్రమే ఎన్నుకునే అవకా శం కల్పించబడిరది. ఆయా సందర్బా లలో వారిని ప్రశ్నించే అవకాశం కల్పించాలనే ఇంగిత జ్ఞానం పాలకుడికి ఎలాగో ఉండదు. ఉన్న అవకాశం ఇవ్వరు. మన ప్రతినిదులులు కూడా కనీస బాద్యత తీసుకోవడం లేదు. అందువలనే పాలకులు ‘‘కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు’’ అల్పసంఖ్యాకులైన మన రిజర్వేషన్‌ హక్కులు మనం అనుభవించకుండా చేయడానికి ఇతర కులాలను ఎస్టిలలో కలపడానికి పూను కుంటున్నారు. ఈ అన్ని సందర్భాలలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆదివాసి ప్రజా ప్రతి నిధులు వారి యొక్క కనీస బాధ్యత నిర్వహించకపోవడం వలన ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.మీరేగాని ఈబాధ్యత తీసుకుంటే మీ అందరి జెండాలు కలిపి మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. విజ్ఞులైన మేధావులు జాగ్రత్తగా లేకపోతే నిజమైన ఆదివాసుల మనుగడకే ప్రమాదం మంచుకొస్తుందని ముగిస్తున్నాను. వ్యాసకర్త : జిల్లా కన్వినర్‌,ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జాయింట్‌ ఏక్షన్‌ కమిటి,అల్లూరి సీతారామారాజు జిల్లా

1 31 32 33 34 35 75