క‌రోనా క‌ట్ట‌డిలో ఆచార సంప్ర‌దాయాలు మేలే

భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.
మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్‌, యాంటీ బయాటిక్‌ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్‌ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్‌ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.-గుమ్మడి లక్ష్మినారాయణ

వలస కార్మికులకు సామాజిక వంటశాలలు

నేను చిన్నప్పుడు చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పేవారు. భారత దేశంవ్యవసాయరంగ దేశమని,ఇందులో80శాతం ప్రజలు గ్రామీణులు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అనేవారు. ప్రస్తుతం వ్యవసాయరంగంపై ఆధారపడేవారు మాత్రం20శాతం మంది మాత్రమే. కరోనాతొలివేవ్‌ ఉధృతమైన 2020మార్చి,ఏప్రిల్‌ నెలల్లో,2021 ఏప్రిల్‌ నుంచిసెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. ప్రస్తుతం కోవిడ్‌19వచ్చిన తర్వాత దేశమంతా వలస కార్మికులపైనే జీవనం సాగుతోంది. ముఖ్యంగా దేశంలో అభివృద్ధి జరుగుతున్నతీరు, అది అమలవుతున్న పరిస్థితులు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలసకార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందులో పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా సరిjైున విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటులేదు.భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈసమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృతస్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది.ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిమూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం వలస కార్మికులవెతలపై జోక్యం చేసుకోవడం అనివార్యమైంది. వలస కార్మికుల ఆకలి కేకలు,కష్టాలనుదృష్టిలో ఉంచుకొని ఢల్లీికి చెందిన బంధువ్‌ ముక్తి మూర్చ అనే సంస్థ 2020లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గానే జోక్యం చేసుకొని,కేంద్రప్రభుత్వానికి 26.5.2020న మొదటసారి నోటీసులు ఇచ్చింది. తర్వాత రెండువసారి 28.5.2020న మరో నోటీస్‌ పంపింది. వీటికి స్పందించక పోవడంతో ఆఖరిగా 9.6.2020న ఎనిమిది రకాల ఆదేశాలతో ఘాటుగా మూడోవసారి నోటీసు జారీ చేసింది. వలస కార్మికుల చట్టం1979,ఇంటర్‌ స్టేట్‌ మైగ్రేషన్‌ వర్కుమెన్‌ యాక్ట్‌1997, కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యాక్ట్‌1996,ఆర్గనైజడ్‌ వర్కుర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ యాక్ట్‌`2008 వంటి చట్టాలను పరిగణనలోకి వలసకార్మికులకు అను గుణంగా వారి సంరక్షణపై జూన్‌ 29న తీర్పు నిచ్చింది. Read more

పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలి

నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెం చాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగు తుంది.దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలం దరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధా నంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయ డం.వారి శారీరక,మానసిక శక్తిని ఉపయోగించు కోవడం.‘నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి’ అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి,సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆదేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కార ణం.‘నేటి భారతదేశం’అనే పుస్తకంలో రజనీ పామే దత్‌ చెప్పినట్లుగా ఒకమనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞా నాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదా రులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరు లు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్‌లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగు లుగా చేసి రోబోట్‌ వంటి యంత్రాలను ప్రోత్సహి స్తున్నారు. ఇదిపెట్టుబడిదారీ విధాన సహజ లక్ష ణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆసౌకర్యం ప్రజలకు కల్పిం చి,పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసా యన కంపెనీల్లో కూడా రోజుకు 8నుంచి12 గంట లు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటు వంటి పరిశ్రమల్లో వారానికి ఐదురోజులు, రోజుకు ఆరుగంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021జూన్‌ 26నాటికి3.94లక్షల మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మర ణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకా రం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్‌, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా ల్లో నిరుద్యోగ సమస్యను 20ఏళ్లలో పరిష్కరిం చాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసా గుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయ వచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లా ది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు.‘లియాంటివ్‌’ అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్య వస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి. సోష లిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో ‘పని హక్కు’ ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచితవిద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పి స్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటుహక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒకప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా,వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ,5శాతం కోఆపరేటివ్‌ రంగంలోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యా తో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్‌ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991తరు వాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్‌,గ్రీస్‌ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయి నా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతితక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ,వచ్చే ఏడాదిఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్‌టిసి పర్మినెంట్‌ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి నట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన6,03,756ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు3,99,791మంది వున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ ఉద్యోగుల భర్తీలో చూప డం అన్యాయం. మున్సిపల్‌, విద్యుత్‌ రంగాల్లోని కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను…ఎ.పి కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా చూపిం చడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్‌లో ప్రకటించలేదు. ఆఖాళీలు హుష్‌ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలోని లక్షలాది ఖాళీఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉద్యోగాలన్నీ పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్క రించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్‌ యూనియన్లు పోరాడుతు న్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకు లందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ,యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు
కరోనాతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయి నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థికకార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమై..ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిం చడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు-ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అంద జేస్తున్నప్పటికీ,అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరా లకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుం టున్న ఉపాధిరంగంపై-కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి తో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్‌ నిబంధనలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.నైపుణ్య శిక్షణ అవసరం అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గతఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిం చడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా సుమారు 16.5లక్షల మంది కార్మికులు లబ్ధి పొం దారు. పీఎంజీకేవై కింద38.82లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథ కం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద యెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు.‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండి యన్‌ ఎకానమీ’ అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నా లు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుం టున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిల మయ్యే ప్రమాదమూ ఉంది.ఈ సంక్షోభ సమ యంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయా ల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోవాలి.ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరు గ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్ని నేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.సరఫరా పెంచాలిగత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహా యాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహా యాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడంవల్ల లోటు పెరిగి పోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.కొవిడ్‌ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.
సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిరచిన (జవీIజు)
భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమిస్తోందని..గత నాలుగేళ్ల లో 6లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేది కలు చెబుతున్నాయి. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏచిన్న అటెండర్‌ పోస్టుకు నోటిఫి కేషన్‌ విడుదలైనా..పీజీలు,పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశం లో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(జవీIజు) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది.2016 సెప్టెం బర్‌ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే..ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలోనిరుద్యోగ రేటు 5.9 శా తం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లనుంచి సేకరించిన సమా చారం ప్రకారం.. ఈసర్వే నివేదికను తయారు చేసినట్టు (జవీIజు) తెలిపింది.ముంబైలోని థింక్‌ ట్యాంక్‌ సంస్థ ఛైర్మన్‌ మహేష్‌వ్యాస్‌ తెలిపిన వివ రాల ప్రకారం..గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండి యాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి,ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమి స్తోం దని.. గతనాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషన ల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓవార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జవనవరిలో (జవీIజు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగా లు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గతనెలలో ప్రభుత్వం ప్రక టించింది.-(సిహెచ్‌. నర్సింగరావు /డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి)

అడవిలో వెన్నెల

కథ అంటే ప్రధాన పాత్ర దృష్టి కోణం లో కొనసాగి దాని ఆలోచనల ప్రకారం ముందుకు సాగినపుడే సంబంధిత కథకు వాస్తవి కత వస్తుంది అని బలంగా నమ్మే ప్రసిద్ధ తెలుగు కథకుడు బేతి శ్రీరాములు. కథల కర్మాగారంగా యువత చేత తలవబడే అనబడే శ్రీరాములు వారి అనుభవాల ఆలోచనల నుండి 1989 ప్రాంతంలో అక్షయ్‌ హరించబడి కథ ‘‘అడవిలో వెన్నెల’’.

ఆయన జన్మస్థానం కరీంనగర్‌ ప్రాం తపు జగిత్యాల,ఆపక్కనేగల అడవుల జిల్లా అయిన ‘ఆదిలాబాదు’తో అక్కడి గోండుల జీవన పరిస్థి తులతో ఆయనకు గల అవినాభావ సంబం ధాలు, అంతకు మించి ఆయన నిర్వహించిన, పాల్గొన్న అనేక ప్రజా ఉద్యమాలు మొదలైనవి. ఆయనలో అల్లుకుపోయి ఉన్న సామాజిక స్పృహ సృజనాత్మ కతలు,కలిసి అడవిబిడ్డల జీవితాలను సంస్కృతి సంప్రదాయాలను అనేక కథల రూపం లో ఆవిష్క రించారు. ఉద్యమాల నాయకుడిగానే కాక సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగిస్తూనే.. విశాల సాహితి అకాడమీ సంస్థను స్థాపించి పలు పుస్తకాలు ప్రచు రణ చేశారు. అనేక సాహి త్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అనం త రకాలంలో తెలంగాణ రాష్ట్ర తొలిబీస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయన కలం నుంచి జాలువారిన ‘అడవిలోవెన్నెల’ కథలోని విశేషాలేమిటో విశ్లేషించు కుందాం!
ఆదిలాబాద్‌ అడవితల్లి సందిట్లో అమాయక జీవనం గడుపుతున్న గోండుల జీవన విధానం,సంస్కృతి,వారు అణచివేతకు గురవుతున్న తీరు, కళ్ల ముందు కదలాడేటట్టు తనదైన సుదీర్ఘ శైలిలో రచయిత ఆవిష్కరించారు.కథ మొత్తం ఇస్రు అతని కొడుకు ఏసు,కూతురు మోతిల కేంద్రంగా నడుస్తుంది. అతి నిరుపేద అయిన ఇస్రు భార్య జ్వరం బారినపడి,అదే సమయంలో వచ్చిన నెలసరి కారణంగా వారి కులాచారం ప్రకారం ఊరి బయ ట ఉండే మైలపాకలో మూడు రోజులుఉండే క్రమంలో చలి గాలులు భరించలేక అక్కడే చనిపో తుంది.తల్లిలేని ఇద్దరు బిడ్డలను తనే పెంచు తూ ఉన్న కొద్ది జొన్న చేను పంట పండిరచుకుం టూ అయిన అప్పులు చెల్లించుకుంటు, తనశక్తికి మించిన శారీరక శ్రమ చేస్తుంటాడు ఇస్రు. యుక్తవయసుకు చేరిన కొడుకు బిడ్డల భవిష్యత్తు కోసం తనసుఖాన్ని వదులు కొని కష్టపడుతూఉంటాడు అతను. ఆరుగాలం కష్టపడుతూ వచ్చిన ఆదాయంతో షావుకారుల అప్పులకుగాను పండిరచిన పంట ధాన్యం, కొలవడం దానితో కూడా అప్పు తీరక పోతే అడవికి వెదురు బొంగులు నరికే కూలికి పోవడం, అక్కడి గోండుల నిత్యకృత్యం.అదే ఆన వాయితీ అయింది ఇస్రుకు అబ్బింది. ఇది చాలదు అన్నట్టు అడవిలో కలపనరికి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే నెపంతో అటవీ అధికారులు పోలీసుల సాయంతో చేసే దాడులతో కూడా అక్కడి గోండ్లుగోస పడుతుంటారు. అవి వారికితరతరాలుగావస్తున్న తిప్పలు. బాధల నుండి బయటపడే మార్గం లేక అధికారులు షావుకార్లకు ఎదురు చెప్పలేక,నానా అగచాట్లు పడుతూ పేదరి కాన్ని కూడా భరిస్తూ.. తమ ఆచార సాంప్ర దాయా లు,కట్టుబాట్లు,ఎట్టిపరిస్థితుల్లోనూ తప్ప కుండా కాలానికి ఎదురీదుతుంటారు. అక్కడి గిరిజ నులు,అచ్చంగా అదే జీవితం మన కథాకర్త ఇస్రుది కూడా….!!
పేదరికానికి తోడు కాలికి తగిలిన దెబ్బ కు సంబంధించిన అనారోగ్యంతో మరింత ఇబ్బం దులు పడుతున్న ఇస్రు వేదనను రచయిత ఇందులో తనదైన కోణంలో ఆవిష్కరించారు.వాస్తవం ఎలా ఉందో చెప్పడంతో పాటు,ఎలా ఉంటే బాగుం టుందో అని చెప్పడం కూడా సోషలిస్టు వాస్తవి కత అన్నది రచయిత ప్రగాఢ విశ్వాసం. అందుకే అడవిలో వెన్నెల వృధాకాదు అది అడవి బిడ్డలకు ఉపయోగపడుతుంది అక్కడ ఉద్యమ మార్గంలో చైతన్యం వెల్లివిరిసి గోండు బిడ్డలకు ధైర్యంవచ్చి, వారు అందరిలా హాయిగా స్వేచ్ఛాగ జీవనం గడిపే రోజులు వస్తాయనే ఆశయం, ఆశతో కథ ముగించే నేపథ్యంలో భాగంగా తుపాకీ ఉద్యమ సంఘాన్ని వారికి పరిచయం చేసి కథ ముగిస్తూ… ఆలోచనాత్మక ముగింపును అందిస్తారు. కథలో రచయిత స్వీయ శైలి అయిన సుదీర్ఘత కనిపించిన, ఎక్కడ విసుగు రాకుండా గోండుల జీవనంలోని ఆచారవ్యవహారాలు అడుగడుగునా ఆసక్తిని కలిగిస్తూ పాఠకులను చేయిపట్టుకుని నడిపిస్తాయి. రచయితకు అడవిబిడ్డల సంస్కృతి,అలవాట్లపై అపారమైన గౌర వం,సమర్థింపు ధోరణి కనిపిస్తాయి. ఒకానొక సంద ర్భంలో వనవాసుల అలవాట్లుఅయిన లైంగిక స్వేచ్ఛ తదితరాలు,ఆధునిక దేశపు నాగరికుల అల వాట్లతో సరిపోల్చి చెప్పడం ఆశ్చర్యానికి లోనైన అది అసత్యంకాదు అనిపిస్తుంది.గిరిజనులకు సహజ సిద్ధంగా అలవాటైన చేపలవేట,వాటి రుచిపట్ల గల ఆపేక్ష గురించి ఇస్రుపాత్రద్వారా రచయిత అత్య ద్భుతంగా ఆవిష్కరిస్తారు, ఒకపక్క కాలిదెబ్బ పెడు తున్న భరించలేనిబాధను పడుతూనే చేపల వేటకు వెళ్లి తన లక్ష్యాన్ని అందుకోవడంతో ఇస్రుకుగల చేపలవేట ఇష్టత తెలుస్తుంది, ఎన్నో బాధలు భరిం చి ఇల్లు చేరిన తనకు ఇంటి వాతావరణం ఆందో ళన కలిగిస్తుంది. అడవిలో గిరిజనుల జీవాలు మేత మేసినందుకు,వారు ఇంటి అవసరాలకు అడవి నుంచి కర్రలు,కట్టెలు, తెచ్చుకున్నందుకు, వేర్వేరు కారణాలకు గాను ప్రతి కుటుంబం ఫారెస్ట్‌ వాళ్లకు ఏటా 50రూపాయలు చెల్లించాలి, డబ్బులు లేక పోతే అడవికి వెదురు బొంగు నరకడానికి వెళ్లాలి. ఆకూలీ డబ్బులతో వారి బాకీలు తీర్చుకుంటారు. అలా చేయడం ఆలస్యమైతే ఫారెస్టు అధికారులు ఇలా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, బెదిరిం చడం,కొట్టడం,ఇంట్లో వస్తువుల కు నష్టం కలిగిం చడం విప్పసారా,కోళ్లు, కనిపించినవి కనిపించినట్టు ఎత్తుకుపోవడం, గోండు గూడేల్లో నిత్యం జరిగే తంతులే !! ఇస్రు ఇంట్లో ఆరోజు అదే జరిగింది, అది గతం నుంచి అలవాటైనతను, వారిని బ్రతి మాలి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేస్తాడు.కానీ యువకుడైన కొడుకు ఏసుకు ఇదేమీ అర్థం కాదు, అంతకు ముందు ఫారెస్ట్‌ వాళ్ళుతనను కొట్టిన దెబ్బల బాధబరిస్తు తండ్రి నుంచి సరైన సమాధా నం రాక మౌనంగా రోదిస్తాడు. ఆదిలాబాద్‌ ప్రాం తంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గోండుల ఆచారాలన్నీ కాస్త విభిన్నంగానే అగుపిస్తాయి. దగ్గరి లోని అహిరి మహారాజును వారి కష్టనష్టాలను కాపాడే పెద్దదిక్కుగా ఆరాధిస్తారు. ముఖ్యంగా దసరా పండుగకు గూడేల నుండి ఇంటికి ఒకరు చొప్పున మహారాజు వద్దకు విధిగా వెళ్లాలి. ఆడ వాళ్లు తప్పకుండా వెళ్లి అక్కడ నాట్యాలు చేయాలి. పేరుకు తమ కష్టనష్టాల గురించి మహారాజుకు చెప్పుకోవడం కోసం వెళ్లడమే కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఏదోఒక వస్తువు,జంతువు,కానుకగా తీసుకు వెళ్లాలి. అక్కడ ఉండే రెండు రోజులకు సరిపడా తిండి కూడ ఎవరికి వారే తీసుకుపోవాలి. అయినా అక్కడి దసరా ఉత్సవాలకు పోవడానికి అందరూ ఇష్టపడతారు. కారణం వెళ్లకపోతే మనిషిని పది రూపాయల చొప్పున దండుగ పటేలుకు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆరోజు అక్కడ దొరికే లైంగిక స్వేచ్ఛకోసం గూడేలలోని యువత వెళ్లడానికి ఆరాట పడతారు. ఇస్రుకు ఈదసరా ఖర్చు ఒకటి గుర్తుకు వస్తుంది. తన కొడుకు ఏసు,పక్క గ్రామంలోని ధనికుడైన బాబురావు కూతురు లకింబాయి, ఒకరి కొకరు ఇష్టపడతారు.సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలంటే కన్యాశుల్కం తదితర ఖర్చులతో అబ్బా యి తండ్రికి అధికఖర్చు అవుతుంది.అమ్మాయి తన ఇష్ట ప్రకారం ఇంట్లోకి వస్తే కాస్త ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి కొత్త జంటలు ఏకం కావడానికి దసరా పండుగ,పంటకోతపండుగ,లాంటివి వారికి అను కూలంగా ఉంటాయి. అందుకే ఖర్చుకు భయపడ్డ ఇస్రు కొడుకు పెళ్లి ముందుగా చేయడానికి ఇష్టం చూపడు. ఎదిగిన తన కూతుర్ని తీసుకుని దసరా పండుగకు వెళ్లడానికి సిద్ధపడతాడు. అక్కడ కూతు రు మోతికి కావాల్సిన పూసల దండలు, పొడిపిం చాల్సిన పచ్చబొట్ల ఖర్చులకు డబ్బులు జమ చేసు కుంటాడు.ఏసు దసరాకు వెళ్ళలేకపోయినా.. తండ్రి లేనివేళ తన లకింబాయిని జొన్న చేనుకు రప్పించు కుని పండగలో పొందే ఆనందం ఇద్దరూ పొందు తారు. ఫారెస్ట్‌వారి దౌర్జన్యాలు జరిగిన ప్రతి రోజు రాత్రి గూడెం వాళ్ళు అంతా ఒక చోటచేరి మహారా జుకు ప్రజలకు మధ్యవర్తిగా ఉండే కుర్దుపటేలుకు తమ గోడువిన్నవించుకోవడం తను అంతా పరిష్కరి స్తానని సర్ది చెప్పడం ఎప్పుడూ పరిపాటే ! ఇలా ఉండగా దసరా ముగిసి పంట కోతల పండుగ వచ్చింది.రాత్రిగూడెం ప్రజలంతా పూజారి సమ క్షంలో పండుగలో పాల్గొంటారు. ముందే పథకం వేసుకున్న లకింబాయి జాకెట్‌ విడిచి ఆరాత్రి యేసు తో కలిసి ఆటపాటల్లో పాల్గొంటుంది, వారి ఆచా రం ప్రకారం అలాచేసి ఆఅబ్బాయి ఇంటికి వెళితే దాన్ని ఇష్టపూర్వకంగా ‘‘ఇల్లుజొచ్చు’’డుగా భావించి ఆఇద్దరికీ పెళ్లి చేస్తారు,పెళ్లి అయిన తరువాత ఛాతి మీద వేరే ఆచ్ఛాదన లేకుండా ఉండటం గోండు స్త్రీలకు ఆచారం. చాలా కొద్ది ఖర్చులతో ఏసు,లకింబాయి ఒక ఇంటివారు అవుతారు. కుల పెద్దలకు ఇచ్చిన బాపతులో భాగంగా ఇస్రు విప్ప సారా తాగి ఆనందం తెచ్చుకునే ప్రయత్నం చేస్తు న్నాడు కానీ కళ్ళముందు కనిపిస్తున్న అప్పులు,ఆడ బిడ్డపెళ్లి,బాధ్యతపట్టని కొడుకు, గురించి ఆలోచి స్తాడు ఆందోళనగ ఆనందానికి దూరమై… కొన్నాళ్లు గడిచాక అనుకున్నట్టే అప్పు పెట్టిన షావు కారు రాజారావు తన మందబలంతో ఇస్రు గుడి సెలమీద పడి దౌర్జన్యం చేసి పండిన జొన్నపంట మొత్తం ఎత్తుకు పోతాడు. కథ అచేతనంగా ముగిసి పోయింది అనుకుంటుండగానే ఊహించని మలుపుతో రచయిత సరికొత్త ముగింపును కలిపి స్తాడు. తుపాకీ దళంను కథలో ప్రవేశపెట్టడమే కాక,ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అడవులను వేదికలుగ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వారి బాధలు,కష్టాలు,తదితరాలు కూడా సవివరంగా చూపిస్తారు. చివరకు ఒకరాత్రి గూడెం చేరిన దళం కు గోండ్లు భోజనాలు పెట్టడం, తమ మధ్యవర్తి కుర్దు పటేల్‌ ద్వారా తమ గోడు వెళ్లబోసుకోవడం, దానికి వారి సహకారపు హామీ లభించడం, భవి ష్యత్తు మీద ఆశలు పెరగడం, ముఖ్యంగా ఏసు కు కమాండర్‌ తుపాకీ చూపించి ‘‘మనలను చంప వచ్చు మనుషులను కూడా దీనితో చంపవచ్చు’’ అని చెప్పిన మాటల ద్వారా అతని ఆలోచనల్లో మార్పు రావడం. ‘‘అడవి కాచిన వెన్నెల ఆకాశాన్ని కప్పేసిన వృక్షాల్ని చీల్చుకొని అడవినంతా పరుచు కుంటుంది, ఆ వెన్నెల్లో గూడెంలోని గుడిసెలన్ని తడుస్తాయి’’ అన్న వాక్యాలతో కథ ముగించడం, ఇవన్నీ రచయితలోని కట్టుబాట్లకు అర్థం చెబు తాయి, ఒక ప్రాంతపు గిరిజన ఆచారాలను ‘‘అక్షర నిక్షిప్తం’’ చేయడంతోపాటు, సంఘ చైతన్యాన్ని పురికొల్పడం వంటి ప్రయత్నాల ద్వారా రచయిత సఫలీకృతుడయ్యారు.
(వచ్చేమాసం మీకోసం వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథ ‘‘కొండ ఫలం’’) – డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

ఏజెన్సీ స్వరాజ్య సింహం` చింతల చెరువు వెంకటాద్రి

‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.

గిరిజన ప్రజలకు నెలవైన గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం ఏజెన్సీలో ఒకసాధారణ గ్రామం చర్ల. మన దేశంలో ఒకేపేరుతో అనేక గ్రామాలు ఉన్నాయి కానీ ‘‘చర్ల’’ అనే రెండు అక్షరాల పేరుతో మరెక్కడ ఒక్కగ్రామం లేకపోవడం ఒక విశేషం!! అలా ఎన్నో విశేషాలకు సాక్షి భూతమైన చర్ల ప్రాంతంలో తొలిసారిగా స్వరాజ్య ఉద్యమస్ఫూర్తిని అందించడానికి గిరిజనగ్రామాలలో కాలి నడకన,సైకిళ్లు,ఎడ్లబండ్ల, సాయంతోతిరిగి స్వరాజ్య స్ఫూర్తిని ఉద్యమ చైతన్యం నింపిన నాటి ఏజన్సీ‘‘స్వరాజ్య సింహం చింతలచెరువు వెంకటాద్రి’’.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా మృత్యుంజయ పురంలో ‘‘చింతలచెరువు వెంకట్రామయ్య – లక్ష్మమ్మ’’ దంపతులకు 5వ సంతానంగా 1889 నవంబరు20న వెంకటాద్రి జన్మించారు. పన్నెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన ఆలనాపాలనా అన్న గార్ల మీదేపడిరది, బ్రతుకుతెరువు కోసం మిత్రుల సహాయ సలహాలతో వీరి పెదనాన్న వెంకటప్పయ్య గారు భద్రాచలం డివిజన్లోని వెంకటాపురంలో 1896సంవత్సరం పట్వారి ఉద్యోగంలో చేరారు, దానితో మిగతా కుటుంబ సభ్యులంతా వెంకటాపురం చేరుకొని ఆనాటి సాధారణ ఉద్యోగాలైన పట్వారి పనులు చేస్తూ కొందరు, మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. పట్వారి ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో నిషేధం.
వెంకటాపురం సమీపంలోని ఆలుబాకలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వెంకటాద్రిగారు, సోదరుని వద్ద సాధారణ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వయంకృషితో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్చుకొని చక్కని సాహిత్య పరిజ్ఞానం కూడా పెంచుకున్నారు. అన్నగారి సాయంతో 1908 సంవత్సరం లో కొత్తగా ఏర్పడ్డ ‘‘పడిగాపురం’’(వాజేడు సమీపంలో ప్రస్తుతం అంత రించిన గ్రామం) సర్కిల్లో ‘‘పట్వారి’’ కొలువులో చేరారు.
గుంటూరుకు చెందిన మహాలక్ష్మమ్మని పెళ్లి చేసుకున్నారు వెంకటాద్రి,ఆమె అక్క గారు ఏలూరులోని ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్‌ కంపెనీ యజమాని ‘‘ఈదర వెంకట్రావు’’ గారి భార్య, దరిమిలా వెంకటాద్రిగారి తోడల్లుడు ద్వారా సాహితీవేత్తలతో పరిచయం. సాహిత్యంపై మక్కువ పెరిగాయి. దాని ద్వారా అందిన సామాజిక స్పృహ ఆయనను జాతీయోద్యమం వైపు నడిపించింది. 1908 సంవత్సరంలో భద్రాచలం డివిజన్‌ మద్రాసు రాజధాని పరిధిలో ఉండేది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా అక్షర పరిజ్ఞానం లేక పూర్తి స్తబ్ధతతో ఉన్న ఈగిరిజన ప్రాం తంలో వెంకటాద్రి వారిని చైతన్య పరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉదర పోషణ కోసం ఉద్యోగం చేస్తున్న ఆయన ఆలోచనంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉండేది.
ఆ రోజుల్లో వెలువడుతున్న ఒకేఒక తెలుగు దిన పత్రిక ‘‘ఆంధ్రపత్రిక’’దానిని ఈ ప్రాంతంలో పోస్టు ద్వారా తెప్పించుకున్న ఏకైక వ్యక్తి వెంకటాద్రి, నాటి స్వరాజ్య ఉద్యమ వార్తలు నాయకుల ప్రసంగాలు, ప్రకటనలు, చదివి తాను స్ఫూర్తి పొందడం కాక గాంధీజీ పట్ల ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంపట్ల మక్కువ పెంచుకున్నారు. గ్రామగ్రామాన తిరిగి గిరిజనులకు నాటి దేశ పరిస్థితులు,బ్రిటిష్‌ వారి అరాచకాలు వివరించేవారు. కాలక్రమేణా ఆయనకు ఉద్యోగం కన్నా సమాజ సేవే ముఖ్య మని దేశ స్వరాజ్యమే ప్రధానం అనే భావన కలిగింది, ఈయన చర్యలు ఎప్పటికప్పుడు గమని స్తుండే పైఅధికారులు అతని పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 1921 డిసెంబరులో అహ్మదాబాదులో భారత జాతీయ కాంగ్రెస్‌ ‘‘పన్నుల నిరాకరణ ఉద్యమా నికి’’ పిలుపునివ్వడంతో వెంకటాద్రి తన గ్రామ కర్నికానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో ప్రవేశించారు. నాటి ప్రముఖ స్వరాజ్య ఉద్యమ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ తన ‘‘ఉద్యమ స్నేహరాజ్యం’’ విస్తరించుకున్నారు. ఆయనలోని స్వరాజ్య కాంక్ష పట్టుదల మాట తీరు తదితర లక్షణాలు తెలిసిన దేశభక్త కొండా వెంకటప్ప య్య గారి పిలుపు మేరకు అష్టకష్టాలు పడి కాలినడకన ఇల్లందు చేరి అక్కడ నుంచి రైల్లో గుంటూరు వెళ్లి వెంకటప్పయ్య గారి నాయక త్వంలో ‘‘సహాయ నిరాకరణోద్యమంలో’’ పాల్గొన్నారు. అక్కడ టంగుటూరి ప్రకాశం, కళావెంకట్రావు,భోగరాజు పట్టాభి సీతారా మయ్య, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలో వారితో కలిసి వెంకటాద్రి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పది నెలల పాటు అక్కడే స్వరాజ్య ఉద్యమంలో గడిపి తిరిగి వెంకటాపురంచేరి తాను గుంటూరులో పొందిన ఉద్యమస్ఫూర్తితో గిరిజన గ్రామాలు తిరుగుతూ జాతీయోద్యమ అవసరాన్ని తనదైన వాక్చాతుర్యంతో ప్రచారం చేశారు.వెంకటాపురం నుంచి వి.ఆర్‌.పురం (వరరామచంద్రపురం) వరకు వెంకటాద్రి గారికి స్వరాజ్య ఉద్యమ అనుచరగణం ఉండేది. ఆ రోజుల్లో గోదావరి రేవు ప్రాంతం ‘‘దుమ్ముగూడెం’’ పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వరాజ్య ఉద్యమకారులకు అదే కేంద్రంనిలయం. ఆప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత రంగూన్‌ రౌడీ నాటకకర్త ‘‘సోమరాజు రామానుజరావు’’ భద్రాచలంకు చెందిన కురిచేటి శ్రీరామ్మూర్తి,ఆర్‌.కొత్తగూడెం చెందిన భూపతిరాజు బుచ్చి వెంకటపతిరాజు, మొదలైన వారంతా ఆయన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే వారు. ఈ క్రమంలో వెంకటాద్రి గారి కుటుంబాలకు అనివార్య కారణాలతో చర్లకు చెందిన భూస్వామి ‘‘ముత్యాల వెంకట స్వామి’’ స్నేహం లభించింది. ఆయన సలహా మేరకు చర్లకు చేరి వ్యవసాయ భూములు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ద్వారా జీవనం సాగించేవారు, దీనితో వెంకటాద్రి గారి స్వరాజ్య పోరాట కేంద్రం చర్లకు మారింది. ఆయన కార్య దీక్షను తెలుసుకున్న విప్లవం వీరుడు’’అల్లూరి సీతారామరాజు’’తన అజ్ఞాత పర్యటనలో భాగంగా ఒకరాత్రి చర్లకు వచ్చి తన పోరాటానికి సహకరించమని వెంకటాద్రి గారిని కోరారు, కానీతాను మొదటి నుంచి గాంధేయవాదానికి అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పి రామరాజు అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారు.1926 సంవత్సరములో మన్యం ప్రాంతపు పోలవరం గ్రామంలో ‘‘పునులూరు కోదండరామయ్య’’ నేతృత్వంలో ‘‘స్వరాజ్య ఆశ్రమం’’నెలకొల్పారు 1929 మే 9న గాంధీజీ ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వెంకటాద్రి తన అనుచరగణంతో పోలవరం వెళ్లి మహాత్ముని తొలిసారి దర్శనభాగ్యం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆ స్ఫూర్తితో ఆశ్రమం చేపట్టే ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. 1929 డిసెంబర్‌లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళిన వెంకటాద్రి అక్కడి నాయకుల ప్రసంగాలతో తనలో అచంచలమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంకు పిలుపునిచ్చి దండి యాత్ర ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల ఉద్యమకర్తలు తమ ప్రాంతాల్లో ఉద్యమానికి మద్దతుగా ‘‘ఉప్పుతయారీలు’’ మొదలుపెట్టారు సముద్రానికి దూరంగా మన్యం ప్రాంతంలో ఉన్న వెంకటాద్రి గారికి ఏం చేయాలో అర్థంకాక చివరికి చౌడు మట్టి నుంచి ఉప్పు తీయవచ్చని ఆలోచనతో పాత చర్లలోని చెరువు దగ్గర ఆయన ఉప్పు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఈ ఉద్యమం పెను సవాలుగా నిలిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాద్రి గారి దీక్షను భగ్నం చేసి లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేసి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అనంతరం 1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర పోషించారు.రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం 1938 సంవత్సరంలో ‘‘జమిందారి రిపోర్ట్‌’’ తయారు చేయడానికి చర్ల వచ్చినప్పుడు ఆయన లోని కర్తవ్య దీక్షను వెంకటాద్రి ప్రత్యక్షంగా గమనించి ప్రభావితం చెందారు.
1939 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకటాద్రి హాజరయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ను ప్రత్యక్షంగా అక్కడే దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీకి, తూర్పుగోదావరి జిల్లా కమిటీ, సభ్యులుగా ఎన్నికయ్యారు.
1942 వ సంవత్సరంలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన మన్యం ప్రాంతానికి నాయకత్వం వహించి తన సహచరులతో కలిసి అనేక చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వరాజ్యఉద్యమ శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
స్వాతంత్రానంతరం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నమ్మిన పార్టీలోనే కొనసాగి తన కార్య క్షేత్రమైన చర్ల అభివృద్ధికి తన సొంత ఆస్తులు సైతం అందించిన త్యాగశీలి, 1951 ఫిబ్రవరి 14న చర్లలో ప్రాథమిక సహకార సంఘం, స్థాపించడం శాఖ గ్రంథాలయానికి సొంత స్థలం ఇల్లు వితరణ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన త్యాగమూర్తి వెంకటాద్రి,
తన సహచరులు ‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది.
ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.- డా.అమ్మిన శ్రీనివాసరాజు

గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్‌ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్‌ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్‌ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్‌ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్‌ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్‌ సింఫ్న్‌ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్‌.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్‌ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్‌’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్‌ అయిన శ్రీ హట్టన్‌, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్‌ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్‌ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్‌ అనిపిలిస్తే, హైదరాబాద్‌ ప్రభుత్వం నోటిఫైడ్‌ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్‌ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్‌ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్‌ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

ఖరీఫ్‌ సాగు`మెలకవలు

రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 48 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు. వర్యావరణం అతలాకుతలమై భూతాపం ఏ స్థాయికి చేరిందో మనం అనుభవించాం. అంతలోనే ప్రతీ చినుకు ముత్యంగా మెరుస్తూ కొంగొత్త ఆశల ఊసులను మోసుకొచ్చింది. ప్రకృతి మాత పచ్చని పచ్చిక బయళ్ళ చీరలో సింగారించుకొని రైతుల ముగింట్లో దర్శనమిచ్చింది. వేసవి ముగిసీ ముగియగానే కాస్త కునుకుపాటు తీస్తున్న రైతన్న ఒక్కసారి మళ్ళీ భూమాతకు భూరి దండాలు పెట్టుకొని వానాకాలం పంటల సాగుకు సర్వసన్నద్దమయ్యాడు. వేసవి దుక్కుల వలన చేలల్లో, చెలకల్లో నీరు ఇంకి తేమ నిలువ ఉండి విత్తనం విత్తడానికి, మొలకెత్తడానికి అనువుగా మారింది.

నాణ్యమైన విత్తనం విత్తి,నమ్మకమైన దిగుబడి సాధించే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వరి,మొక్కజొన్న జొన్న పెసర, కంది,సోయాచిక్కుడు విత్తనాలను సుమారు 6 లక్షల క్వింటాళ్ళు రాయితీపై పంపిణీ చేసింది.
సేంద్రీయ ఎరువులు
నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారు మడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎంపిక చేసుకోవాలి.ఎ0పిక చేసుకున్న పొలానికి 5-10 సె0.మీ.నీళ్ళు పెట్టిబాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం నుండి కలుపు మొక్కలు లేకుందా జాగ్రత్త పడాలి.
విత్తన మోతాదు
నాటే పద్ధతికి 20-25 కిలోలు,వెదజల్లటానికి (గరువు) భూముల్లో) 24-30 కిలోలు, వెద జల్లటానికి (గోదావరి జిల్లాల్లో) 16-20 కిలోలు,గొర్రుతో విత్తటావికి (వర్షాధారపు వరి) 30-36 కిలోలు, శ్రి పద్ధతిలో 2 కిలోలు సరి పోతుంది.
విత్తన శుద్ది
కిలో విత్తనానికి 2.5గ్రాముల కార్చండజిమ్‌ కలిపి 24గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళ కైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్‌ కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గ0టలు నానబెట్టీ ,24 గంటలు మ0డెకట్టీ మొలకలను ద0ప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్త నాలు నానబెట్టడానికి లిటరు మందు నీరు సరిపోతుంది. పది లిటర్ల నీటికి 1.5 కిలోల ఉప్పు కలుపగా వచ్చిన ద్రావంలో ఎ0పిక చేసు కున్న విత్తనాన్ని పోసి పైకి తేలిన తాలు విత్తనా లను తీసివేయాలి. ఉప్పునీటిలో మునిగిన గట్టీ విత్తనాలను నారు పోయడానికి వాడుకోవాలి. మడిలో చల్లే ము0దు 24గంటల పాటు మంచి నీటిలో విత్తనాలను నానబెట్ఠాలి. విత్తనాల ద్వారా సంక్రమి0చే లెగుళ్ళ నివారణ కోస0 కిలో విత్తనానికి 3 గ్రా. దైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తన శుద్ది చేయాలి. నారు మడిలో చల్లేము0దు మొలకెత్తిన విత్తనాన్ని 0.2 శాత0 క్లోరిప్రేరిఫాస్‌ ద్రావణంలో నాసబెట్టీ చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకు తినే పురుగులు,ఉల్లికోడు,మొవ్వపురుగు ఆశించకుండా ఉంటాయి.
నారుమడి
దమ్ము చేసిన నేలను 10మీ.పోడవు ఒకమీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారు మడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్ట్లును సమంగాను గట్టిగాను పోయాలి.మడిలో చెతాచెదారం లేకుండా జాగ్రత్తపడాలి. నారుమడి బురద పదునులో ఉండాలి.నారుమడులు ఎత్తుగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెండు మడుల మధ్యలో 20సెం.మీ వెడల్పులో కాలువ తీయాలి.కాలువలోని మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి.
సస్యరక్షణ
విత్తిన 10రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళి కలు సెంటు నారుమడికి 160గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6మి.లి లేక క్లోరిఫైరిఫాన్‌ 2.0మి.లి.లీటరు నీటికి కలిపి విత్తిన 10రోజులకు మరియు 17రోజులకు పిచి కారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజు ల ముందు సెంటు నారుమడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్‌ గుళికలు తక్కువ నీటిలో వేయా లి జింకు లోపాన్ని గమని లీటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలిఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకులోప లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
నాటు
నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరుఆకులున్ను నారును ఉపమోగిం చాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గు తుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది. నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్‌లోచ/మీ/కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ.బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు,కలుపు మందులు వెయ టానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి. వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టిన పుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి,దగ్గర దగ్గరగా,కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటి నాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా-అంటే 70శాతం దమ్ము లోను మిగితా30 శాతం అంకురం దశలోనూవాడాలి.
పచ్చిరోట్టి పైర్లు
వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జను ము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25శాతం నత్రజని, భాస్వీ రం,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు.
సేంద్రియ ఎరువులు
పశువుల ఎరువు,కంపోషు,కోళ్ళు ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని అదా చేయవచ్చు.
రసాయనిక ఎరువులు
భూసారాన్ని బట్టీ రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయంచి నత్రజని, భాస్వరం, ఫొటాష్‌, జి0కు నిచ్చే ఎరువులను సమతు ల్యంగా వాడాలి. నత్రజనిని కాంప్లేక్సు ఎరువుల రూపలలోగాని, యూరియా రూపలలో గాని వాడపచ్చు. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుటకు ముందు దమ్మలోను దుబ్బుచేసే దశలోను, అంకురం దశలోను, బురదపదనులో మాత్రమే సమాన0గా వెదజలల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్ఠాలి. 50 కిలోల యూరియాకి 10కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లీతే సత్రజని విని యోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరు వును దమ్ములోనే వేయాలి. పొటొష్‌ ఎరువులను రేగడి నేల్లలో ఆఖరి దమ్ములో పూర్తీగా ఒకేసారి వేయాలి-చల్క (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం. అకురం ఏరఎడు దశలో మిగతా సగాన్ని వేయాలి.కాంప్లేక్స ఎరువులను ఫైపాటుగా దుబ్బు చేసే సమయంలలో గాని, అంకురం ఏర్చడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.
వేప పిండి
50కిలోల యూరియాకి10 కిలోల వేపపిండి లేక 250కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి,2రోజులు నిల్వ ఉంచివెదజల్లితే నత్రజ నిన వినియోగం పెరుగుతుంది.
నీలి ఆకుపచ్చ శైవలాలు – నాచు
వీటిని వరి పొలంలో వేసి ఎకరాకు 10కిలోల నత్రజని పైరుకురు అందుతుంది. నాచు నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరినాట్లు వేసిన 10-20 రోజుల మధ్య మడిలో పలుచగా నీరు నిలువ గట్టీ ఎకరాకు 4కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమాసంగా పడేటట్టు చల్లాలి.
సామగ్ర పోషక యాజమాన్యం
భూసార వరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమమించటానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, ప్తెరుకు సమతుల్యంగా పోషక పదార్దాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోషు. కోళ్ళ ఎరువులను,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. వరి మాగాణురల్లో అపరాలు,జీలుగు,జనుము, పిల్లెపెసర లాంటి పచ్చిరొట్ట ప్తెర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక షుమారు 20-25శాతం నత్రజని, భాస్వర,పొటొష్‌లను కూడా ఆదా చేయ వచ్చు.
-గునపర్తి సైమన్‌

వాక్సిన్‌పై అవగాహన

కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే,వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు, సందేహాలు రాజ్యమేలుతున్నాయి. కొంత మంది ఫేక్‌ప్రచారం వల్ల ప్రజలు వాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో కరోనా కట్టడికి, ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారింది. అందువల్ల, గ్రామీణ ప్రాంతప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. తాజాగా,తమిళనాడుకు చెందిన ఒకయువకుడు తన గ్రామప్రజలకు వాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు నడుం బిగించాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఒక బహుమతి ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. కల్లకూరిచి జిల్లాలోని ఉలుందూర్పేట గ్రామానికి చెందిన ఆర్‌. తంబిదురై అనే స్టూడియో ఫోటోగ్రాఫర్‌,సామాజిక కార్యకర్త ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు తన గ్రామానికి రాగా.. ప్రజల్లో అవగాహన లేక ఎవరూ వాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీన్ని గ్రహించిన తంబిదురై తన గ్రామ ప్రజలను వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రోత్సహించాలనుకున్నాడు. వెంటనే తంబిదురైకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఫ్రీగిఫ్ట్‌ స్కీమ్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫ్రీ గిఫ్ట్‌లు కొనుగోలు చేసేందుకు తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసుకున్న చొరవ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది.

ఈకార్యక్రమంపై తంబిదురై మాట్లాడుతూ‘‘కోవిడ్‌-19సెకండ్‌ వేవ్‌ విజృంభనతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మా గ్రామానికి సమీపంలో టీకా డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కానీ గ్రామస్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల వాక్సిన్‌ తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు నా సొంత ఖర్చులతో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. టీకాలు తీసుకున్న వారికి వంట పాత్రలు వంటి బహుమతులను అందజేస్తున్నా. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్‌? తీసుకునేందుకు ముందుకొస్తున్నారు’’ అని అన్నాడు. ఫ్రీగిఫ్ట్‌లు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు టీకా తీసుకొని నా నుండి బహుమతి వస్తువులను అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

యువకున్ని ప్రశంసిస్తున్న గ్రామస్థులు..
కాగా,మొదటి రోజుటీకా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, రెండో రోజు మాత్రం తంబిదురై చొరవతో 94మందికి టీకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.తంబిదురై అవిశ్రాంతంగా పనిచేస్తున్నందున గ్రామస్థులు,వైద్యులు, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌, స్వచ్చంద సంస్థలు ఆయన్ను ప్రశంసించారు.కోవిడ్‌-19పై పోరాటంలో యువతది చాలా కీలక పాత్ర. ప్రజల్లో ఉన్న అపోహలు,అనుమానాలు తొలగించి వారిని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

గిరిజనుల కాలికింద కాజేసే ప్రయత్నం?

గిరిజనులు తమ హక్కుల కోసం నినా దించిన మహత్తరమైన రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. గిరిజన స్వయం నిర్ణయక హక్కు వివక్ష నుండి స్వేచ్ఛ భూమి ఇతర వనరులపై హక్కులు, గిరిజనుల సాంప్రదాయ,భాషాసంస్కృతి, విశిష్టత, విద్యా, వైద్యం, సమాచార, శ్రమ హక్కులు, అభివృద్ధి ఇతర ఆర్థిక సాంఘిక హక్కులతో పాటు గిరిజనులకు ఎదురవ్ఞతున్న ముప్పుల నుండి రక్షిం చాలనే అంశాలపై అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పేర్కొన్నది. వీటిని గుర్తించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్ఞన్న హక్కులను కాలరా యడానికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల మూలంగా గిరిజనులు అడవ్ఞల నుండి బలవం తగా గెంటివేయబడుతున్నారు. లక్షలాది ఎకరాల గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవ్ఞతున్నాయి.
అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో నిర్మి స్తున్న భారీ ప్రాజె క్టులు,పోలవరం వలన వేలాది గిరిజన గ్రామాలు లక్షలాది మంది గిరిజ నులు భూమితో పాటు సర్వ స్వం కోల్పతున్నారు. గిరిజనులకు విద్యా,వైద్యం,విద్యుత్‌,రోడ్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్ఞ తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గిరిజనుల జీవిత విధానంలో సారుప్యత కనిపిస్తుంది. ఏ ప్రాంతం లోను కలవిడిలేని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం గిరిజనులది. భూమి అటవి వనరులపైనే గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయం తమ చుట్టూ ఉన్న అడవి వనరులతోనే పెనవేసుకోని ఉంటాయి ప్రపం చంలోని 90శాతం వరకు గిరిజను లు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం,వేట,అటవీ ఉత్పత్తు లపైనే ఆధారపడి జీవిసున్నారు. ప్రపంచంలోని గిరిజనుల సాధక,బాధకాలు తెలుసుకొనుటకు ఐక్యరాజ్య సమితి 1982లో ఒకకమిషన్‌ ఏర్పాటు చేసారు. గిరిజనులస్వయం,పరిపాలన హక్కు సంస్కృ తి,సాంప్రదాయాలు,భాష కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకునే హక్కు, సంఘనిర్మాణం చేసుకొనే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా సర్మించు కునే హక్కును, భూమిపై గిరిజన తెగల యాజ మాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసి నదిగా ప్రభుత్వాలను కోరేహక్కు,చట్టాల రూపకల్ప నలో గిరిజన తెగలకు కూడా తగు ప్రాతినిధ్యం కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయతీలు పొందే హక్కు, ఐక్య రాజ్యసమితిలో గిరిజన తెగ లకు సభ్యత్వం కలిగివ్ఞండే హక్కు వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపి వేయటం వంటి హక్కులను రాజ్యాంగం కల్పిం చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మనుగడే ప్రశ్నారక్ధంగా మారుతుంది. షెడ్యూల్డు ప్రాంతా లలో స్వయం పాలన లేకుండా అభివృద్ధి పేరుతో గిరిజనుల ను అడవ్ఞలనుండి తరిమివేసే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయి. అటవీ ప్రాంతా లలో ఖనిజ నిక్షేపాలే గిరిజనుల పాలిట శాపాలౌ తున్నాయి. గిరిజనులను బలి పశువులను చేసి అటవి సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులు చట్టా లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవి,ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు గిరిజన చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటేవారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. గిరిజనుల సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయ కుండా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి.గిరిజనుల ఆర్ధిక,సామాజిక పునాదు లపైవారి అభివృద్ధిసాగాలి.గిరిజనుల ప్రాం తానికి సంబంధించిన ఏనిర్ణయాలు తీసుకున్న వారి ప్రత్యేక గిరిజన సలహామండళ్ల అంగీకారం తప్పని సరిగా ఉండాలి. గిరిజనుల చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీ నులు, నిస్సహాయలగా ముద్రపడిన వర్గం గిరి జనులు, గిరిజన జాతి తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవ్ఞతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.
ఒకప్రక్క అభివృద్ధి పథంలో నడిపిస్తాం అం టూనే గిరిజనుల కాలికింది నేలను కూడా లాగేసుకునే దురాఘాతాలు (టి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం లోనే తీవ్రమౌతున్నాయి. సంస్కరణల పేరుతో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయం,భాష,ఆచార వ్యవహారలు అంతరించిపోతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని అత్యంత వెనుకబాటుకు గురౌతున్న గిరిజనుల సమగ్రాభివృద్ధికి నేటికీ ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. మనదేశంలోని 9 రాష్ట్రాలు గిరిజన ప్రాంతల పరిపాలనలో గవర్నర్లకు, గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విచక్షిణాధి కారాలున్నాయి. రాజ్యంగంలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా దఖ లు పడ్డ సదరు అధికారాలను ఏ గవర్నర్‌ వినియోగించుటలేదు. గిరిజన ప్రాం తాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్రాలలో గిరిజన సలహామండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుం డాలి. గవర్నర్‌లు గిరిజన సలహా మం డళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరుతెన్నులు, సిఫారుసులతో కూడిన నివేదికలను ప్రతి ఏటా రాష్ట్రపతి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందజే యాలి. గిరిజన సలహా మండలిని మన రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం నేటివరకు ఏర్పాటు చేయ లేదు.
గిరిజనులు అంటే ఎవరు?
వాడుక భాషలో గిరిజనులు అని పిలిచే వారినిరాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మనదేశానికిస్వాతం త్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు వన వాసి,గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయో గించే వారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనులు,ముఖ్యంగా దండకారణ్యం వివరాలు ఉన్నాయి.గిరిజనుల నాగరికత చాలా పురాతన మైనది. వారికి రాజ్యాలుఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం,మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహి త్యం,సంగీతం,వాయి ద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలాగిరిజన సంస్కృతిలో కనిపి స్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ సాధనకై ప్రజాపోరాటాలు తప్పనిసరైన పరిస్థితులు నెలకొ న్నాయి. గిరిజనులు అందరి పౌరులు లాగానే రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులకు అర్హులు. అదే కాకుండా రాష్ట్రపతిచే ప్రత్యే కంగా ‘షెడ్యూలు తెగలుగా గుర్తింపు వల్ల కొన్ని హక్కులు, రక్షణలు పొందుతారు. షెడ్యూలు ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మరిన్ని రక్షణలు, సౌకర్యాలు కల్పిం చేందుకు రాజ్యాంగంలో నిర్ధేశికాలు ఉన్నాయి. ఒకపక్క రక్షణ కల్పిస్తూ,మరో పక్కన మిగిలిన ప్రజల/ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందేం దుకు అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం సూచి స్తోంది. అయితే ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అంతరాలు పెరిగి పోయి,పురోగతికి బదులు తిరోగతిని చూస్తున్నాం.-తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమంలో‘సూపర్‌ సైకిల్‌’ సిద్ధం చేయండి!

దశాబ్దాలుగా గనుల తవ్వకందారులు కార్పొరేట్‌ వ్యతిరేక కార్యకర్తలకు లక్ష్యంగా ఉన్నారు. ఖనిజాల వెలికితీత కలిగించే పర్యావరణ, సామాజిక ప్రభావాలపై ఉద్యమిస్తున్న వారి దృష్టిని ఆకట్టుకొంటుండగా, ఆతిథ్య దేశాలకు పెద్ద ప్రయోజనాలను చేకూర్చే పరిశ్రమ వాదనలలో వాస్తవం ఏమైనప్పటికీ, సందే హాలకు దారితీస్తున్నాయి.

ఇప్పుడు,వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ రంగం పునరుజ్జీవింప బడుతున్నం దున, మరింత బలమైన దాడికి సామాజిక శక్తులు సిద్ధపడితే పర్యావరణ,సామాజిక,పాలన ఆధారాల పరంగా పరిశ్రమను మెరుగైన స్థితికి మార్చవచ్చు. మొదటిది వాతావరణ అనుకూల పదార్థాల గురిం చిన పరిశ్రమ కథనానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ఎదురుదెబ్బ.ఇంధన ప్రాధాన్యతలు మారుతు న్నందున రాగి,కోబాల్ట్‌,లిథియం వంటి పరిశుభ్రమైన ఖనిజాలు డిమాండ్‌ పెరుగుతుంది. దాని తో చాలామంది ఖనిజ త్రవ్వకందారులు తమ హరిత ఆధారాలను చెప్పుకోవలసి వస్తున్నది. కానీ ఇది పరిశ్రమ దీర్ఘకాల విమర్శకులను వెనక్కి నెట్ట డానికి ప్రేరేపిస్తున్నది. ఉదాహరణకు,గత మార్చి లో,అటువంటి ఖనిజాలను వెలికి తీయడం ‘‘విస్తృతమైన విధ్వంస, మానవహక్కుల ఉల్లంఘనకు అపరిమిత అవకాశాలు కల్పించడం’’గావార్‌ ఆన్‌ వాంట్‌’ఒకవిశ్లేషణనుప్రచురించింది. ఏప్రిల్‌లో,ఎర్త్‌వర్క్స్‌’ మద్దతుతో జరిగిన ఒక అధ్యయనం అటువంటి పదార్థాలను వెలికితీసే అవసరాన్ని తగ్గించ డానికి రీసైక్లింగ్‌ కోసం పిలుపునిచ్చింది. ఇంధన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న వాతావరణ కార్యకర్తలు, ఇప్పుడు ఎక్కువ ఇంధనం వినియో గించే పరిశ్రమల వైపు, ముఖ్యంగా మైనింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలలో అవి 4నుండి 7 శాతం వరకు బాధ్యత వహిస్తున్నాయి. రెండవది, కార్యకర్తలు వివిధ పరిశ్రమల ఖనిజాల వినియో గంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌, ఇతర పరికరాల్లో ఉపయోగించే లోహాలను త్రవ్వడంవల్ల పర్యావరణ ప్రభావాలు సాంకేతిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని చర్చనీ యాంశం గా మారాయి. మరింత విస్తృతంగా, ప్రపంచం పెట్టుబడిదారీ ‘‘అతిగా వినియోగం’’ ట్రెడ్‌మిల్‌లోకి లాక్‌ చేయబడిరదనే ఆందోళనల మధ్య, మైనర్లు, ఎప్పటికీ అంతం కాని వనరుల వెలికితీతపై తమ దృష్టితో, మృగానికి ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తారు. మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మూడవ సవాలు విస్తృత సాంఘిక ఆందోళనలు. ఇక్కడ మహమ్మా రికి ఆజ్యం పోసిన సమాజ స్థితి గురించి ఆందోళన లు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది అసమా నత అయినా,పర్యావరణాన్ని దెబ్బతీసినా, మైనారిటీ లేదా కార్మిక హక్కులను ఉల్లంఘించినా, శక్తివంత మైన కంపెనీలు తప్పు చేసినట్లు కనిపించినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పెద్ద మైనింగ్‌ గ్రూపులకు అయితే మరేమీ కాదు. వారికార్యకలాపాలు తరచు గా విస్తారంగా ఉంటాయి. మారు మూల, కోల్పో యిన, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలలో ఉంటాయి. తరచుగా మైనారిటీ సమూహాల జనాభా కలిగి ఉంటాయి. గని విస్తరణకు మార్గం చూపడా నికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 46,000 సంవత్సరాల పురాతన పవిత్ర అబోరిజినల్‌ ఆశ్రయాన్ని కంపెనీ ధ్వంసం చేసిన తరువాత రియో టింటో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత సంవత్సరం చివర్లో తనఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దానితో ఇప్పుడు ప్రపం చవ్యాప్తంగా మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, అంతర్లీనంగా సామజిక పరిస్థితులు సున్ని తంగా ఉంటూ ఉండడంతో తాము భారీ మూల్యం చెలింపవలసి వస్తుందని భావిస్తు న్నారు. అయితే ఈమైనింగ్‌ వ్యతిరేక క్రియాశీలత వెనుక ఉన్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి ఇదిఏదీ అవస రం లేదు. కొన్ని ఉద్యమాలు స్పష్టమైన ఆధారాల ఆధారంగా ఉండగా,మరికొన్ని. యధాలా పంగా, సైద్ధాంతికంగా ఉంటున్నాయి. సాంఘిక క్రియాశీ లత మునుపటి పరిస్థితులకంటే, ఈ ధోరణి ఖనిజ వ్యాపార నమూనాలను తిరిగి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. గతంలో, క్రియాశీ లత ప్రభావం చాలా పరిమితం ఉద్యమాలు సంస్థలకు కొన్ని ప్రతికూల పరిస్థితులను సృష్టించ వచ్చు,స్థానిక వ్యతిరేకతను రేకకెత్తింప వచ్చు. కానీ చాలా పరిమితంగా ఉంటూ ఉండెడిది. ఇప్పుడు, ఇటీవలి రెండు మార్పుల కారణంగా ఖనిజాల త్రవ్వకంవాణిజ్య ఫలితాలను ప్రభావితం చేయ డానికి ఉద్యమ కారులకు ఎక్కువ అవకాశం కలిగి స్తున్నది. పెద్ద పెట్టుబడిదారుల విస్తరించే కట్టు బాట్లు,కార్యకర్తల ప్రచారాలకు తరచుగా సున్ని తంగా ఉంటాయి, మంచి ఇ ఎస్‌ జి పనితీరు ఉన్న సంస్థలకు మాత్రమే మద్దతు ఇస్తాయిబీ టెక్నాలజీ,కార్‌ కంపెనీల వంటి లోహాల పారిశ్రా మిక కొనుగోలుదారులలో పెరుగుతున్న సున్నిత త్వం,వారి సరఫరాదారుల పరపతికి కలిగే నష్టం. ఇప్పటికే, కొంతమంది గనుల తవ్వకందారులు తమ వ్యాపార నమూనాలను సర్దుబాటు చేయడం ప్రారంభించారు. కొందరు, ఉదాహరణకు, తక్కువ ప్రత్యక్ష గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలు లేదా నీటి వాడకంతో ఆస్తులను కొనాలని కోరుతూ, తమా దస్త్రాలను పున రూపకల్పన చేసే మార్గాలను చూస్తున్నారు.ఇతరులు తమ ఖనిజాలను ‘‘బాధ్యతా యుతంగా తవ్వినవి’’ అని ధృవీకరించడానికి లేదా తాము ఉపయోగించే లోహాలను రీసైకిల్‌ చేయ డంలో సహాయపడటానికి ఉమ్మడి పథకాలను రూపొందించడానికి తమ వినియోగదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
విమర్శలను తగ్గించే మార్గం కాకుండా కస్టమర్లు, పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే మార్గంగా సాధారణ థ్రెడ్‌ ఇ ఎస్‌ జి పరిశ్రమ గురించి ఆలోచించడంలో ఇది ఒక పరిణామం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి – కాని ఆ కార్యకర్తలు దుర్వినియోగానికి పాల్పడుతున్నంత కాలం నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(డేనియల్‌ లిట్విన్‌, సంస్థలకు స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం గురించి సలహా ఇచ్చే క్రిటికల్‌ రిసోర్స్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ భాగస్వామి. ‘ఎంపైర్స్‌ ఆఫ్‌ ప్రాఎస్ఫిట్‌: కామర్స్‌,కాంక్వెస్ట్‌, కార్పొరేట్‌ బాధ్యత’ రచయిత)-డేనియల్‌ లిట్విన్‌
1 31 32 33 34 35 48